సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని…

కంగనా రనౌత్ తెలిసి మాట్లాడతారా లేక…!?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మరో వివాదంలో కేంద్ర బిందువుగా నిలిచారు. ఏకంగా భారత దేశ స్వాతత్ర్య దినం పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఆర్ణబ్ గోస్వామి కేకలకు, పెడబొబ్బలకు గతంలో అవకాశం ఇచ్చిన టైమ్స్ నౌ చానెల్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.కొందరు బి‌జే‌పి నేతలు కూడా ఆమె అవగాహనా రాహిత్యాన్ని తిట్టిపోస్తున్నారు. గురువారం జరిగిన ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం…

మోడి క్లీన్ చిట్: మనస్సాక్షి ఉన్న జడ్జి ఈ సాక్షాన్ని విస్మరించరు!-2

పిటిషనర్ జకీయా జాఫ్రీ తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్ వినిపిస్తున్న వాదనలు: జైదీప్ పటేల్ మొబైల్ అసలు స్వాధీనమే చేసుకోలేదు. ఆయన అనేక ఫోన్ కాల్స్ చేసి ఉంటాడు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకపోతే మీరు (సిట్) ఏమి పరిశోధన చేసినట్లు? 27 ఫిబ్రవరి, 2021 (గోధ్రా రైలు దహనం జరిగిన రోజు) తేదీకి ముందే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ఆయుధాలు, మందుగుండు నిలవ చేసుకున్నారని చెప్పే…

విచారణ చెయ్యకుండానే మోడికి క్లీన్ చిట్ -జకీయా జాఫ్రీ వాదన

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే…

రాఫేల్: బి‌జే‌పి నేతలారా, అధికారం మీదేగా విచారణ చెయ్యరేం?

భారతీయ జనతా పార్టీ (బి‌జే‌పి) నేతల ధోరణి మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాధికారం ఉన్నది బి‌జే‌పి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని అత్యంత శక్తివంతమైన విచారణ సంస్ధలన్నీ బి‌జే‌పి ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కమీషన్ చేతులు మారినట్లు వచ్చినట్లు ఆరోపణలపై విచారణ చేయవలసిన బాధ్యత బి‌జే‌పి పైనే ఉన్నది, అధికారం కూడా వారి చేతుల్లోనే ఉన్నది. అలాంటిది ఫ్రెంచి పరిశోధనా వార్తల పోర్టల్ మీడియా పార్ట్ తాజాగా…

రాఫెల్ డీల్: లంచం సాక్ష్యాలున్నా సి‌బి‌ఐ దర్యాప్తు చేయలేదు!

ఫ్రాన్స్ యుద్ధ విమానాల కంపెనీ దాసో ఏవియేషన్ (Dassault Aviation), భారత దేశానికి రాఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. యూ‌పి‌ఏ హయాంలోనే 125 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరినా అంతిమ ఒప్పందం సాగుతూ పోయింది. నరేంద్ర మోడి అధికారం చేపట్టిన వెంటనే ఈ ఒప్పందాన్ని పరుగులు పెట్టించాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంగా మార్చి 36 రాఫేల్ జెట్ విమానాలు సరఫరాకు ఒప్పందం పూర్తి చేశాడు. ఈ ఒప్పందంలో లంచం చేతులు మారాయని ఫ్రెంచి…

రష్యన్ పి‌ఎం‌సిలు: సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో తిష్ట -3

సబ్-సహారా ఆఫ్రికా సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు సంపద్వంతమైన ఖనిజ వనరులకు నిలయం. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాలను సబ్-సహారా ఆఫ్రికా గా పరిగణిస్తారు. ఉత్తరాన సహారా ఎడారి దేశాలు, దక్షిణాన అడవులతో నిండిన ఇతర ఆఫ్రికా దేశాలకు మధ్య అటు పూర్తిగా ఎడారి కాకుండా, ఇటు పూర్తిగా పంటలు సమృద్ధిగా పండేందుకు వీలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని సహేలి ప్రాంతం అంటారు. పశ్చిమాన సెనెగల్ నుండి తూర్పున సోమాలియా వరకు ఒక బెల్ట్ లాగా…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు -2

అనధికారికంగానే అయినా రష్యన్ పి‌ఎం‌సి లు రష్యాకు చెందిన పలు వ్యూహాత్మక, ఆర్ధిక, రాజకీయ లక్ష్యాలను నెరవేరుస్తున్న సంగతి కాదనలేనిది. ఈ ప్రయోజనాలు: 1. విదేశీ విధానం:. పి‌ఎం‌సిల ద్వారా రష్యా ప్రభావం విస్తరిస్తోంది. ముఖ్యంగా భద్రతా రంగంలో. దానితో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర శక్తులతోనూ స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి. 2. మిలట్రీ ప్రయోజనాలు: ప్రత్యేక బలగాల (స్పెషల్ ఫోర్సెస్) ద్వారా శిక్షణ పొందిన ప్రైవేటు బలగాలు ప్రత్యేకమైన నైపుణ్యం, సామర్ధ్యం కలిగి…

విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు

“నువ్వు రాళ్ళు విసిరితే చుట్టూ గోడ కట్టుకుంటా…” అంటూ సాగుతుంది ఒక కొటేషన్. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా, అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో రష్యా ఈ సూత్రాన్నే పాటించింది. అమెరికా విసిరిన వ్యూహాన్ని ప్రయోగించి తన వరకు గోడ కట్టుకోవడంతో పరిమితం కాకుండా తన సహాయం అర్ధించిన ఇతర దేశాలకు కూడా గోడలు కట్టి ఇస్తోంది రష్యా. పనిలో పనిగా తన ప్రభావాన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో సాపేక్షికంగా గణనీయంగా విస్తరించుకుంటోంది. 2014 వరకు…

కరోనా వైరస్ బయోవెపన్ కాదు -అమెరికా ఇంటలిజెన్స్

కరోనా వైరస్ ను చైనా ఉద్దేశ్యపూర్వకంగా తయారు చేసిన జీవాయుధం అని చెప్పడం పూర్తిగా అశాస్త్రీయం (unscientific) అని అమెరికాకు చెందిన 17 గూఢచార సంస్ధలు నిర్ధారించాయి. కరోనా వైరస్ జీవాయుధం అని చెప్పేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని, అటువంటి వాదనలు శాస్త్రీయ పరీక్షలకు నిలబడవని అమెరికా ఇంటలిజెన్స్ ఏజన్సీలు స్పష్టం చేశాయి. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా గూఢచార ఏజన్సీలు పరిశోధన చేసి నివేదిక సమర్పించాయి. సదరు నివేదిక సారాంశాన్ని గత…

ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య తీవ్రమైన చేపల తగాదా: ఆకస్ పుణ్యం?

ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా ‘ఆకస్’ కూటమి ఏర్పడిన నేపధ్యంలో ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల మధ్య చేపల వేట తగాదా మరింత తీవ్రం అయింది. డిసెంబర్ 31, 2020 నాటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి అడపా దడపా ఇరు దేశాల ఫిషింగ్ బోట్లు చేపల వేట హక్కుల విషయమై తగాదా పడుతూ వచ్చాయి. నేడు ఆ తగాదా ఫ్రెంచి ప్రభుత్వమే ప్రత్యక్ష చర్య తీసుకునే వరకూ వెళ్లింది. ఆకస్ ఏర్పాటు ఫలితంగా…

మీ దాష్టీకం యూ‌పిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూ‌పి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూ‌పి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది. “ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని…

ఉత్తరఖండ్ వరదలు: పాఠాలు నేర్చేదే లేదు!

ఉత్తర ఖండ్ లో 4 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పోర్లాయి. ఎప్పటిలాగే పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నీట మునిగాయి. వంతెనలు తెగిపోయాయి. కొన్ని చోట్ల అవి కూలిపోయి కొట్టుకుపోయాయి. కడపటి వార్తలు అందేసరికి  52 మంది మరణించారు. కొండల మీద నుండి రాళ్ళు, భారీ మట్టి పెళ్ళలు జారిపడి రోడ్లను కప్పేసాయి. కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలను తెంపేశాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరదల…

గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!

(రెండవ భాగం తర్వాత….) సైప్రస్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలకూ టర్కీతో విభేదాలు ఉన్నాయి. యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో ఇరాన్ గురించి తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో టర్కీ విస్తరణ వాదంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇవి టర్కీతో మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇక టర్కీ దూకుడు అమెరికాకు అసలే గిట్టదు. సైనిక కుట్ర ద్వారా ఎర్దోగన్ ను పదవీచ్యుతుడిని చేసేందుకు జులై 2016లో విఫలయత్నం చేసింది. రష్యా గూఢచార సమాచారంతో ఎర్డోగన్…

అబ్రహాం ఎకార్డ్స్: పశ్చిమాసియాలో నూతన భాగస్వామ్యాలకు తెరతీసిన అమెరికా -2

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిధ్యంలో సెప్టెంబర్ 15, 2020 తేదీన నూతన అరబ్-యూదు శాంతి ఒప్పందానికి వైట్ హౌస్ వేదిక అయింది. అరబ్బు దేశాలు యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు యూదు దేశం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో పిలవబడుతోంది. ఇది దాదాపు 26 సంవత్సరాల తర్వాత కుదిరిన మొట్టమొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం. ఇది ఎకార్డ్ (అంగీకారం), అగ్రిమెంట్ (ఒప్పందం) కాదు. దీని ప్రకారం యూ‌ఏ‌ఈ,…