కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి -కార్టూన్

భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చేప్పలేదు. తాము ఇంకా నిర్ణయించుకోలేదని బి.జె.పి అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ ఇతర నాయకులు మాత్రం నరేంద్ర మోడియే ప్రధాని అభ్యర్ధి అని బహిరంగంగానే చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడి అని చెప్పని నాయకుడు బి.జె.పిలో లేరు. హైద్రాబాద్ లో న.మో సభ పెట్టి దానికి రు. 5/- టికెట్ పెట్టే వరకూ బి.జె.పి నాయకులు వెళ్లారు. అదేమంటే ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం…

నల్లజాతి యువకుడి హత్య తీర్పు, అట్టుడుకుతున్న అమెరికా

అమెరికాలో జాతి విద్వేషం మళ్ళీ ప్రముఖంగా చర్చకు వచ్చింది. గత సంవత్సరం తెల్లజాతి పోలీసు చేతిలో హత్యకు గురయిన ట్రేవాన్ మార్టిన్ కేసులో నిందితుడు నిర్దోషి అని శనివారం కోర్టు తీర్పు చెప్పడంతో అమెరికా వ్యాపితంగా నిరసనలు చెలరేగాయి. అనేక చోట్ల నిరసనకారులు విధ్వంసాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. జాతి బేధం లేకుండా అన్ని జాతుల వారు నిరసనల్లో పాల్గొంటున్నారు. ట్రేవాన్ మార్టిన్ నల్లజాతికి చెందినవాడు కనకనే పోలీసు సహాయకుడు జిమ్మర్ మేన్ అతని నుండి ఎటువంటి ప్రమాదం…

22 బ్యాంకులకు 50 కోట్ల జరిమానా విధించిన ఆర్.బి.ఐ

సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా…

ఇళవరసన్ ది ఆత్మహత్యే!

ఇళవరసన్ ఆత్మహత్య చేసుకున్నారని దాదాపు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్ధలంలో ఆత్మహత్య లేక లాంటిదేదీ దొరకలేదని మొదట రైల్వే పోలీసులు చెప్పినప్పటికీ వాస్తవానికి ఆయన లేఖ రాసినట్లు ఆ తర్వాత తెలిసింది. ఇళవరసన్ తన ఆత్మహత్యకు కారణాలు తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖ రాశారని, దానిని తన జీన్ ఫ్యాంట్ జేబులో ఉంచారని తెలుస్తోంది. కానీ రైల్వే పోలీసులు వచ్చే లోపలే ఆ లేఖను సమీప బంధువులు తీసుకోవడంతో లేఖ రాయలేదని పోలీసులు పత్రికలకు తెలిపారు.…

సాలీడు బుడతలు (స్పైడర్ కిడ్స్) -వీడియో

ఇదెలా సాధ్యం? ‘స్పైడర్ మేన్’ సినిమా కాబట్టి అందులో హీరో గోడల మీద వేగంగా ఎగబాకడం సాధ్యం అయింది. కానీ ఇది నిజం. ఈ బాలుడు ఎవరో తెలియదు. ఫేస్ బుక్ లో కనపడిన ఈ వీడియో కింద వివరణ పదాల ప్రకారం టర్కీ బాలుడని మాత్రం అర్ధం అయింది.   – విచిత్రం ఏమిటంటే దాదాపు అదే టర్కీ టైటిల్ తో (Düz Duvara Tırmanan Örümcek Bebekler) మరో రెండు వీడియోలు దొరికాయి. ఇందులో…

పెట్రోల్ ట్యాంకర్లు పట్టాలు తప్పి పేలిపోతే… -ఫోటోలు

కెనడా రాష్ట్రం క్వెబెక్ లో జులై 6 తేదీన పెట్రోలియం (క్రూడ్ ఆయిల్) తెస్తున్న రవాణా రైలు పట్టాలు తప్పి పెను విధ్వంసం సృష్టించింది. 72 ట్యాంకర్ల నిండా క్రూడాయిల్ తెస్తున్న గూడ్స్ రైలు అనూహ్య పరిస్ధితుల్లో తనంతట తాను కదిలి వేగం పుంజుకుని ఒక మలుపు దగ్గర పట్టాలు తప్పడంతో లాక్-మెగాంటిక్ అనే పట్టణం పాక్షికంగా ధ్వంసం అయింది. ట్యాంకర్లు ఒకదానిపై ఒకటి దొర్లిపడి పేలిపోవడంతో సమీపంలోని అనేక ఇళ్ళు తగలబడి పోయాయి. ఆరు వేల…

తెలంగాణ అంటే జనం కాదా? -కార్టూన్

కాదన్నట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే. తెలంగాణ ఉద్యమం అంటే ప్రజలు, వారి ఆకాంక్షలు, వారి అవసరాలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే కాంగ్రెస్ దృష్టిలో 2014 ఎన్నికల్లో కురిసే ఓట్లు, సీట్లు మాత్రమే. ఆ మాటకొస్తే ఏ పార్టీకి మాత్రం కాదు? తెలంగాణ వాగ్దానం చేసిన బి.జె.పి కూడా 1999 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం సీట్ల కోసం దాన్ని పక్కన పెట్టింది. అవే సీట్ల కోసం రేపు తెలంగాణ ఇవ్వడానికి సోనియా…

ఇండియన్లూ, ధ్యాంక్స్! -ఒబామా (వ్యంగ్యం)

రూపాయి విలువ దయనీయమైన పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. రూపాయి విలువ తగ్గడం అంటే మన కొనుగోలు శక్తి తగ్గిపోవడం. అనగా మనం సంపాదించే ఆ నాలుగు రూకలకు ఇంకా ఇంకా తక్కువ సరుకులు రావడం. బెత్తెడు వేతనాల మధ్యతరగతి జీవులకు మరిన్ని కష్టాలు, మరిన్ని మానసిక (సామాజిక) వేదనలు, మరిన్ని అప్పులు, మరిన్ని…. కూలి జనం పరిస్ధితి ఇంకా ఘోరం. తాగుబోతు భర్తలు, తాగుబోతు తండ్రులను కలిగి ఉన్నవారి పరిస్ధితి చెప్పనే అవసరం లేదు. రూపాయి విలువను కాపాడడానికి…

గుజరాత్ హత్యాకాండ: నేను తప్పు చేయలేదు -మోడి

గుజరాత్ మారణకాండను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి పరోక్షంగా సమర్ధించుకున్నారు. తాను ఏది సరైంది అనుకున్నానో అదే చేశానని నరేంద్ర మోడి రాయిటర్స్ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధులు ఆయన మాటలకు దురుద్దేశాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నప్పటికీ ఆ మాట నరేంద్ర మోడియే ఎందుకు చెప్పరో అర్ధం కాని విషయం. మోడి తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడం, దానికి అసలు అర్ధాలేవీటో ఆ తర్వాత పార్టీ ప్రతినిధులు వివరణలకు పూనుకోవడం దేశాన్ని పాలించదలుచుకున్న వ్యక్తులకు,…

ఎన్.ఎస్.ఎ తో కుమ్మక్కై యూజర్లను మోసం చేస్తున్న మైక్రోసాఫ్ట్

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ -నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ- తో పేరు పొందిన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సంస్ధ మైక్రోసాఫ్ట్ కుమ్మక్కయింది. “Your privacy is our priority” అన్న తన మోటోకు తానే స్వయంగా తూట్లు పొడుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్, ఈ మెయిల్ సంస్ధ ఔట్ లుక్ డాట్ కామ్ లకు తాను రూపొందించిన పటిష్టమైన ఎన్ క్రిప్షన్ ను ఛేదించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగల తాళాన్ని తానే…

భారత్ పై అతి కేంద్రీకరణే లాడెన్ హత్యకు అవకాశం -పాక్ రిపోర్ట్

భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది. మే 2, 2011 తేదీన…

గౌరవ మర్యాదలకు విఘాతం -ది హిందు సంపాదకీయం

(బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నాడన్న అనుమానంతో అమెరికా పనుపున ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అనుమతి నిరాకరించి, ఆస్ట్రియాలో బలవంతంగా కిందకి దించిన ఉదంతం గురించి ది హిందు పత్రిక బుధవారం -జులై 10- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం -విశేఖర్) “తన ఇష్టం లేకుండా ఒక పావుగా ఉండవలసిన అవసరం గానీ, అందుకు తగిన కారణం గానీ లాటిన్ అమెరికాకు లేదు,”…

ప్రజాస్వామ్య అమెరికాలో 30,000 ఖైదీల నిరాహార దీక్ష

వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ప్రతి సంవత్సరం గొంతు చించుకునే అమెరికా తన పౌరులకు మాత్రం మానవ హక్కులు నిరాకరిస్తుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జైళ్లలోని అమానవీయ పరిస్ధితులను, చిత్రహింసలను, పోలీసుల అణచివేత పద్ధతులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా వివిధ జైళ్లలోని 30,000 మంది ఖైదీలు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ఈ సంగతిని మరోసారి తేటతెల్లం చేస్తోంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ఇదే మొదటిసారి కావచ్చు. గ్వాంటనామో…

స్నోడెన్: బొలీవియాకు సారీ చెప్పడానికి రెడీ -స్పెయిన్

బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న జెట్ విమానానికి తమ గగనతలంలోకి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించినందుకు సారీ చెప్పడానికి స్పెయిన్ సిద్ధపడింది. తాము తప్పు చేయలేదని కాబట్టి బొలీవియాకు ఆపాలజీ చెప్పాల్సిన అవసరం లేదని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన స్పెయిన్ ఇంతలోనే తమ అవగాహన మార్చుకోవడం విశేషం. అయితే ఇవా మొరేల్స్ విమానానికి అనుమతి నిరాకరించామని చెప్పడంలో నిజం లేదని స్పెయిన్ విదేశాంగ మంత్రి ఇప్పటికీ చెబుతున్నారు. సంఘటనలో అపార్ధం దొర్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల దానికి…