జింబాబ్వే సిరీస్: రసూల్ బెంచికే పరిమితం, కాశ్మీర్ గరం గరం

కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి…

ఆఫ్ఘన్ యుద్ధం మిగిల్చిన బాల్యం -ఫోటోలు

ఎడతెగని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో ప్రధానంగా బలవుతోంది అక్కడి స్త్రీలు, పిల్లలు. ఈ యుద్ధం అనివార్యం ఏమీ కాదు. అమెరికా స్వయంగా పెంచి పోషించిన ‘ఒసామా బిన్ లాడెన్’ ను పట్టుకోవడం కోసం అంటూ ఆఫ్ఘనిస్ధాన్ పైన అమెరికా బలవంతంగా రుద్దిన దురాక్రమణ యుద్ధం ఇది. పన్నెండేళ్ళ సుదీర్ఘ యుద్ధంలో అమెరికా బావుకున్నది 2007-08 నాటి మహా ఆర్ధిక మాంద్యం మాత్రమే. అమెరికా, ఐరోపాలు రుద్దిన దురాక్రమణ యుద్ధం పుణ్యాన ఆఫ్ఘనిస్ధాన్ లో మరో యుద్ధ తరం…

సి.ఐ.సి వేటగాడొస్తే పార్టీల పక్షులన్నీ ఐక్యమౌతాయ్ -కార్టూన్

రాజకీయ పార్టీలు తమకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నది సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పడంతో పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయింది. పారదర్శకత గురించి ప్రబోధించే ఈ పార్టీలకు అకస్మాత్తుగా పారదర్శకత రాజకీయ పార్టీల హక్కులకు భంగకరంగా కనిపించడం ప్రారంభం అయింది. అది ఎంతవరకూ వచ్చిందంటే పార్టీలన్నీ ఐక్యమై ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్.టి.ఐ చట్టం) సవరించేంతవరకూ. రాజకీయ పార్టీలు సి.ఐ.సి చెప్పినట్లుగా పబ్లిక్…

ఎడ్వర్డ్ స్నోడెన్: రష్యాపై అమెరికా తీవ్ర అసంతృప్తి

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. సెప్టెంబర్ లో రష్యా వెళ్లనున్న ఒబామా సందర్శనను తాము పునఃసమీక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ విలేఖరులకు తెలిపాడని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. రష్యాతో అమెరికాకు గల సంబంధాలు బహుముఖమైనవని, అయినప్పటికీ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో పుతిన్ తో ఒబామా జరపనున్న శిఖరాగ్ర సమావేశం సంభావ్యతను తాము పునర్మూల్యాంకనం చేస్తున్నామని కార్నీ…

ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్

అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.…

దుర్గా నాగపాల్: 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించా

ఉత్తర ప్రదేశ్ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ను తాను 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు వాగుతుండగా రికార్డు చేసిన వీడియో బైటకొచ్చింది. దీనితో శాంతిభద్రతలను నియంత్రించడంలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేశామన్న యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఫలితంగా అఖిలేష్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందిలో పడినట్లయింది. మింగలేక, కక్కలేక సమాధానాలు వెతుక్కోవలసిన పనిలో రాష్ట్ర ప్రభూత్వం పడిపోయింది. నిజాయితీ అధికారుల కంటే ఇసుక మాఫియాయే…

రష్యా ఆశ్రయం మంజూరు, స్నోడెన్ కు బంధ విముక్తి

ఎట్టకేలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం (temporary asylum) మంజూరు చేసింది. దానితో స్నోడెన్ బంధ విముక్తుడయ్యాడు. గత ఐదు వారాలుగా మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ గురువారం తట్టా బుట్టా సర్దుకుని విమానాశ్రయం నుండి బైటకి వచ్చేశాడు. తద్వారా రష్యా భూభాగం పైకి అడుగు పెట్టాడు. స్నోడెన్ వీసా రద్దు చేయడం ద్వారా అతన్ని ఎలాగైనా రప్పించుకోవాలని పధకం వేసిన అమెరికాకు ఇది చావుదెబ్బ! అంతర్జాతీయ వేదికపై అమెరికా రాజకీయ…

భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు, ఒక పరిశీలన

(ఈ వ్యాసం e-సాహిత్య పత్రిక ‘వాకిలి’ ఆగస్టు సంచికలో ప్రచురించబడింది. రచయిత్రి రమా సుందరి గారు. స్త్రీల వస్త్రధారణ గురించి తరచుగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో బ్లాగ్ పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో రచయిత్రి అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను.  -విశేఖర్) ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి…

టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వారి దృష్టిలో తెలంగాణకు కారకులు కాదు. తెలుగుదేశం, వైకాపాలు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించింది తప్ప వారికి ఇవ్వాలని ఏ కోశానా లేదు. టి.డి.పి, వైకాపాల లేఖలకు, రాష్ట్ర విభజనకు నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ మంత్రులు,…

అది ఆంధ్ర, ఇది తెలంగాణ -కార్టూన్

“శుభ వార్త! హై కమాండ్ నిర్ణయం తీసేసుకుంది. అదేమో ఆంధ్ర, ఇదేమో తెలంగాణ…”  — కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరం, తెలంగాణ ఏర్పాటును ఎలా తరుముకొచ్చిందో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. తెలంగాణ అనుకూల నిర్ణయం ద్వారా తెలంగాణలో గణనీయ సంఖ్యలో పంచాయితీలను ఇప్పటికే కాంగ్రెస్ గెలుచుకుంది. విచిత్రంగా సీమాంధ్ర ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ గెలుచుకున్న పంచాయితీలు తక్కువేమీ కాదు. చూడబోతే 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారబోతున్నట్లే ఉంది.

తెలంగాణ: ఆం.ప్ర ఉభయ సభల అభిప్రాయం తప్పనిసరి -నిపుణులు

తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభ మరియు విధాన సభలు రెండు తమ తమ అభిప్రాయాలు చెప్పడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అభిప్రాయాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం పార్లమెంటుకు లేదని కూడా వారు చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ లాంటివారు ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధిష్టానం మనసు మార్చొచ్చు’ అని వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో నిపుణుల అభిప్రాయాలను పరిశీలించడం ఉపయుక్తం కాగలదు. లోక్ సభకు సెక్రటరీ జనరల్ గా పని…

తెలంగాణ: కాంగ్రెస్ ఫుడ్ సెక్యూరిటీ? -కార్టూన్

రాజకీయ పార్టీలకు ఏది ఆహారం? ఇంకేది, ఓట్లు, సీట్లు. ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. సీట్లు పెరిగేకొందీ అధికారం దగ్గరవుతుంది. వర్షాకాలం సమావేశాల్లో ‘ఆహార భద్రతా బిల్లు’ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం’ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల వరప్రదాయని అయినట్లుగా 2014 ఎన్నికల్లో ‘ఆహార భద్రతా చట్టం’ ఆ తరహా పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఆశ. అందుకే బి.జె.పి, తృణమూల్ కాంగ్రెస్ తదితరులు…

తెలంగాణ ప్రజకు అభినందన వందనం!

యు.పి.ఎ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించాయి. ఎల్లుండి (ఆగస్టు 1) సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతున్నది. అందులో కూడా ఏకగ్రీవ తీర్మానమే ఆమోదం పొందుతుంది. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంఛనప్రాయమే. గత 56 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం అనేకానేక రక్త తర్పణలు కావించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా అభినందన వందనం! సాయంత్రం 4 గంటలకు ప్రారంభం…

దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…

మేడం-తెలంగాణ -కార్టూన్

“మేడం గారు నిర్ణయం తీసేసుకున్నారు. సరైన సమయంలో దాన్ని బైటపెడతారు.” – భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని పాలకులు చెబుతుంటారు. మామూలు ప్రజాస్వామ్య దేశం కూడా కాదు, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అని వారు తరచుగా చెప్పే మాట! అంటే ఇక్కడ జరిగే నిర్ణయాలన్నీ ప్రజల అభీష్టం మేరకే జరగాలి. ఎన్నికలు జరిగాక, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి వివిధ నిర్ణయాలు చేస్తుంది కనుక ఏ…