ఏంజెలా ఫోన్ ట్యాపింగ్, అమెరికా రాయబారికి సమన్లు

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ ను ట్యాప్ చేసి సంభాషణలను వింటోందని జర్మనీ ఆరోపించింది. ఎన్.ఎస్.ఏ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ జర్మనీ ప్రభుత్వం తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు పంపామని తెలిపింది. గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారి జాన్ బి.ఎమర్శన్ ను కోరామణి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జర్మనీ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి అమెరికా ఎంబసీ నిరాకరించిందని…

చిదంబరం దగ్గర ఉల్లి ఘాటు తగ్గించే చిట్కా -కార్టూన్

చిదంబరం: “పెరిగిపోతున్న కూరగాయల ధరలకు నేను బ్రహ్మాండమైన పరిష్కారం కనిపెట్టాను – 1000 టన్నుల ఉల్లిపాయలను ఎక్కడ పాతిపెట్టారో ఈయన గారు కలగన్నారట.” ***               ***                *** ఉల్లి పాయల రేట్లు మళ్ళీ ఊపిగొట్టేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలు దాటిపోయిందని ఆంగ్ల, హిందీ ఛానెళ్ళు అదే పనిగా మొట్టుకుంటున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మాత్రం ఉల్లిపాయలకు వాస్తవంగా కొరత లేదని చెబుతున్నారు. వాస్తవంగా కొరత లేకుండా…

విభజన ‘గీత’ -తమాషా శ్లోకం

ఇది ఫేస్ బుక్ లో లభించింది. చాలా తమాషాగా ఉంది. కొంత అరాచకం అనిపిస్తున్నప్పటికీ ఇందులో వ్యక్తమయిన సృజనాత్మకత మాత్రం బాగుంది. మీరే చదవండి! పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే! ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!! అపార్థా! పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము,…

ఇండియా చైనాల మధ్య 9 ఒప్పందాలు

చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాతో ఏకంగా 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాణిజ్య పరమైన ఒప్పందాలు మాత్రం ఏదీ కుదిరినట్లుగా పత్రికల్లో సమాచారం లేదు. అయితే తన చైనా పర్యటన గొప్పగా విజయవంతం అయినట్లు ప్రధాని ప్రకటించిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారని, ఆయనను సంతోష పెట్టడానికి చైనా పెద్దలు వివిధ రకాలుగా ప్రయత్నించారని పత్రికలు రాశాయి. సరిహద్దు తగాదాల విషయంలో ఇరు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలట్రీ…

పురచ్చి తలైవి రెండాకులు ఎక్కడ పూసేను? -కార్టూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది…

డ్రోన్ హత్యలు చట్టబద్ధమే -అమెరికా

డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్…

వాయు బంధంతో రష్యా చైనాలు ఇంకా దగ్గరికి

బ్రిక్స్ కూటమిలో భాగస్వాములయిన రష్యా చైనా దేశాల మధ్య స్నేహ సంబంధాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. అతి పెద్ద ఎనర్జీ మార్కెట్ గా చైనా శరవేగంగా అవతరిస్తున్న నేపధ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారయిన రష్యాకు భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ మార్కెట్ ను సొమ్ము చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇరు దేశాల మధ్యా భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. రానున్న 7 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల (10 వేల కోట్లు) చమురు, సహజవాయువును…

అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా…

అంగారుకుడిపై బంగారం తవ్వకాలు ట్రై చేస్తే! -కార్టూన్

రాజకీయ నాయకుడు: ప్రొఫెసర్, ఈ ఉపగ్రహ ప్రయోగంలో కొద్ది మార్పులు చేసి అంగారకుడి పైన బంగారం నిల్వలు ఉన్నాయో లేదో కనిపెట్టేలా చెయ్యగలమా? ప్రొఫెసర్ గారు నోరు తెరిచారు. ***          ***          *** భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) అంగారక గ్రహాన్ని చుట్టి రావడానికి PSL-XL ఉపగ్రహాన్ని పంపే ఏర్పాట్లలో చురుగ్గా ఉంది. వాస్తవానికి అక్టోబర్ 28 తేదీన ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రయోగం కోసం పసిఫిక్ మహా సముద్రంలో టెర్మినల్…

కేంద్ర ప్రభుత్వాన్ని పరుగెత్తిస్తున్న స్వామీజీ బంగారం కల

‘ఎద్దు ఈనింది అంటే దూడను కట్టెయ్యి’ అన్నాట్ట. మన జియోలాజికల్ సర్వే, ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ తీరు చూడబోతే అలాగే ఉంది. ఒక ఆలయ పూజారి తనకు రాజు కలలో కనిపించి ఫలానా చోట బంగారం దాచి పెట్టానని చెప్పాడని చెప్పడంతోటే పలుగూ, పారా పట్టుకుని బయలుదేరిన జి.ఎస్.ఐ, ఎ.ఎస్.ఐ శాస్త్రవేత్తలను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాకుండా ఉంది. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ కు దాదాపు 150 యేళ్ళ ఘన చరిత్ర ఉన్నది. చరిత్ర…

ఎలాగైతేనేం, ప్రధానీ నెంబర్ 1 అయ్యారు! -కార్టూన్

భారత దేశంలో అత్యున్నత అధికార పీఠం ప్రధాన మంత్రి పదవి. రాష్ట్రపతిని ప్రధమ పౌరుడిగా చెప్పినా రాజ్యాంగం ఆయన చేతుల్లో అధికారాలు ఏమీ ఉంచలేదు. ఉన్న అధికారాలు అలంకార ప్రాయం మాత్రమే. కేబినెట్ సలహాను పాటించడమే ఆయనకి ఉన్న అధికారం. ప్రతి చట్టం పైనా ఆయన సంతకం అయితే ఉండాలి గానీ, నిర్ణయం మాత్రం కేబినెట్, దాని అధినేత అయిన ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆచరణ, అధికారాల రీత్యా ప్రధాన మంత్రే నెంబర్ 1. కానీ…

ముస్లిం ప్రార్ధనల్లో క్రమ శిక్షణే వేరు -ఫోటోలు

ముస్లిం మతావలంబకుల ప్రార్ధనలో క్రమ శిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒంటరిగా ప్రార్ధించినా / నమాజు చేసినా లేదా వందలు, వేలు, లక్షల మంది ప్రార్ధనల్లో పాల్గొన్నా వారు క్రమ శిక్షణ తప్పరు. బహుశా క్రైస్తవ మత ప్రార్ధనల్లో కూడా క్రమ శిక్షణ ఉంటుందనుకుంటాను. క్రమ శిక్షణ అంటే నా ఉద్దేశ్యం హంగూ, ఆర్భాటాలు, శబ్దం, హడావుడి ఇత్యాదులు ఉండవని. ఇవే కాకుండా ఒక వరుస వెనుక మరొక వరుసలో ఎవరూ చెప్పనవసరం లేకుండానే, నిర్వాహకులు అనేవారి అవసరం…

డబ్బు పరుపు కల తీర్చుకున్న మార్క్సిస్టు కాంట్రాక్టర్

అవటానికి ఆయన మార్క్సిస్టు పార్టీ నాయకుడు. ఆయన కలలు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతాయి. బాగా డబ్బు సంపాదించాలని, సుఖంగా బతకాలనీ దాదాపు అందరూ కనే కలే కావచ్చు. కానీ సమాజాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నవారు ఎలాంటి కలలు కనాలి? విప్లవం వచ్చేసిందన్న కల కాకపోయినా కనీసం విప్లవోద్యమం పురోగమిస్తోందన్న కల లేదా కోరిక కలిగి ఉండాలి. కానీ త్రిపుర సి.పి.ఏం పార్టీ నాయకుడు మాత్రం ఏనాటికయినా డబ్బు పడక పై పడుకోవాలన్న కాలతో ఎన్నాళ్లుగానో వేగిపోతున్నాడట.…

అమెరికా: ఒక్క రోజులో 328 బిలియన్ల అప్పు

ఋణ పరిమితి పెంపుకు అంగీకరిస్తూ అమెరికా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందం చట్టంగా మార్చుతూ ఒబామా సంతకం చేసిన అనంతరం ఒక్క రోజులోనే అమెరికా 328 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ఇది దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అనగా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి మన వార్షిక బడ్జెట్ అయిన 16.65 లక్షల కోట్ల రూపాయల కంటే 3.35 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ. ఒబామా కేర్ పధకానికి నిధుల కేటాయింపు…

అమెరికా డ్రోన్ దాడుల్లో వందల పౌరులు బలి -ఐరాస

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల…