లండన్ లో బ్యాంక్సీ స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ (2008) -పునర్ముద్రణ

ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ , 2008 లో స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. వాటర్ లూ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో వినియోగంలో లేని టన్నెల్ లో ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. బ్రిటన్, ఫ్రాన్సు, బెల్జియం లను కలిపే ‘యూరో స్టార్’ హై స్పీడ్ రైల్వే కంపెనీ ఈ టనెల్ ని వాడి వదిలేయగా, ఆ తర్వాత టాక్సీ డ్రైవర్లు ఉపయోగించారు. ఎగ్జిబిషన్ కి ‘కేన్స్ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు.…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ

జర్మనీ ఛాన్సలర్ సెల్ ఫోన్ సంభాషణలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలపై అమెరికా – జర్మనీల మధ్య వాదోపావాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, జర్మనీ ప్రభుత్వానికి తెలిపాడు. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలన్న షరతు మీద స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇచ్చినప్పటికీ అమెరికా – జర్మనీల మధ్య మరింత దూరం పెంచే అవకాశాన్ని…

ఇంటర్నెట్ గూఢచర్యం: నిజమే, అతిగా చేశాం -అమెరికా

అన్ని వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అమెరికా తన తప్పును పరిమితంగానే అయినా అంగీకరించింది. కొన్ని కేసుల్లో అతిగా గూఢచర్యం నిర్వహించామని, వాటిని సవరించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ ఒప్పుకున్నాడు. కానీ తాము అమాయకులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. జర్మనీ ఛాన్సలర్, భారత ప్రధాన మంత్రిలతో సహా 35 దేశాల అధిపతుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసినందుకు అన్నివైపుల నుండి దాడి, ఒత్తిడి తీవ్రం ఐన నేపధ్యంలో ఈ…

బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29, 2012 తేదీన ప్రచురించినది. అప్పటికీ ఇప్పటికీ పాఠకులు చాలామంది మారారు. చాలామంది కొత్త పాఠకులు వచ్చి చేరారు. అద్భుతమైన వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీని కొత్త పాఠకులకు పరిచయం చేద్దామన్న ఉద్దేశ్యంతో -బ్యాంక్సీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం మరి!- దీనిని పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) — — — ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలివి. బ్యాంక్సీ చిత్రాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది ‘అధారిటేరియనిజం’…

‘దేవతా స్త్రీలు’ ఎస్.సి, ఎస్.టి ల్లోనే ఎక్కువ -సెన్సస్

“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” తాము స్త్రీలను దేవతలుగా కొలుస్తామని చెప్పుకోడానికి హిందువులు చెప్పుకునే మాట ఇది. కానీ ఈ సూత్రాన్ని వాస్తవంగా ఆచరిస్తున్నది నాలుగు హిందూ వర్ణాలలో లెక్కకు రాని అవర్ణాల జనమే అని తాజా జనాభా లెక్కల ద్వారా తేలింది. హిందువుల్లో ‘ఇతరుల’ కంటే ఎస్.సి, ఎస్.టి ల్లోనే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. పిల్లల్లో చూసినా, పెద్దల్లో చూసినా, మొత్తంగా చూసినా సవర్ణ హిందూ…

పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు? గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ…

తెలంగాణపై త్వరలో అఖిలపక్షం -కేంద్రం

తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కరే ప్రతినిధిగా పిలవాలని కూడా చెప్పామని సి.పి.ఐ నాయకులు నారాయణ గారు విలేఖరులకు ఈ రోజే…

44 మందిని మసి చేసిన దారుణ బస్సు ప్రమాదం

బుధవారం తెల్లవారు ఝామున ఘోరమైన రోడ్డు ప్రమాదం సభవించింది. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఒకటి డివైడర్ ని ఢీకొట్టి ఉన్నపళంగా అగ్నికి ఆహుతయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఏం జరిగిందో తెలుసుకుని తప్పించుకునే లోపు బస్సు నిండా దట్టమైన పొగలు అల్లుకుపోవడంతో ఎటు పోవాలో తెలియక మంటల్లో మాడి మసై పోయారు. రిజర్వేషన్ బుకింగ్ జాబితా తప్ప ప్రయాణీకులను గుర్తించడానికి మరే మార్గమూ లేకుండా పోయింది. డ్రైవర్, క్లీనర్ తో సహా…

పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు. తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క…

వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

అగ్రరాజ్యాన్ని వణికించిన శాండి: ఏడాది తర్వాత… -ఫోటోలు

మిన్ను మన్ను ఏకం చేసే పెను తుఫాను ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసి పోయాక భారత దేశంలో పరిస్ధితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం నుండి సాయం అందే దారి లేక జనం ఎప్పటిలాగా కష్టాలను ఈదడం ప్రారంభిస్తారు. వారికి తుఫాను తర్వాత ఏ పరిస్ధితి ఉంటుందో దానికి ముందు కూడా దాదాపు అదే పరిస్ధితి కనుక ఒక ఎదురు దెబ్బ తగిలిందని సమాధానం చెప్పుకుని జీవన పయనంలో సాగిపోతారు. వారి నష్టాన్ని రెండింతలు చేసి చెప్పుకునే పాలక…

ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!

భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…

విభజన గీతా మకరందం

-రచన: పైడి తెరేష్ బాబు (పైడి శ్రీ) మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి అపార్థా! గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము…

నిర్బంధ ఓటింగు–అద్వానీ మరియు మోడి -కార్టూన్

సుప్రీం తీర్పు ప్రకారం ఓటింగ్ మిషన్ లో ‘None Of The Above’ (NOTA) బటన్ ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చకపోతే NOTA మీట నొక్కాల్సి ఉంటుంది. కానీ NOTA ఓట్లు లెక్కించరాదని తీర్పులో పేర్కొన్న దృష్ట్యా ఈ మీటకు విలువ లేకుండా పోయింది, అది వేరే సంగతి! NOTA మీట ప్రవేశ పెడుతున్నారు కాబట్టి నిర్బంధ ఓటింగ్ ని అమలు చేయాలని నరేంద్ర మోడి ఒక ప్రతిపాదన…

బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు

పాత మిత్రుడి రాష్ట్రాన్ని పలకరించడానికి వెళ్ళిన నరేంద్ర మోడిని బాంబు పేలుళ్లు ఆహ్వానించాయి. పాట్నాలో మోడి ప్రసంగించవలసిన వేదిక వద్దనే వరుసగా 6 బాంబు పేలడంతో ఐదుగురు చనిపోగా అరవై మందికి పైగా గాయపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. పేలుళ్ళ పట్ల మోడి విచారం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆయనకు ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాలక జనతా దళ్ (యు)…