ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఏపాటిది? -కార్టూన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోర్టీ మొదటిసారిగా తన బలాన్ని నిరూపించుకోబోతోంది. బడా భూస్వామ్య – బడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలయిన బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలతో అది పోటీపడుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పరిస్ధితి కాంగ్రెస్, బి.జె.పిలతో పోలిస్తే ఎలా ఉంటుందో కార్టూనిస్టు ఈ కార్టూన్ లో చెబుతున్నారు. జన, ధన బలాలూ, బలగాలూ దండిగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి లతో ఆమ్ ఆద్మీ పార్టీ…

ప్రశ్న: జి.డి.పి, ప్రపంచీకరణ వగైరా…

కె.బ్రహ్మం: జి.డి.పి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, వృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: బ్రహ్మం గారు ప్రశ్న వేసి దాదాపు రెండు వారాల పైనే అయింది. ఇంకా ఐదారుగురు మిత్రులకు నేను సమాధానం బాకీ ఉన్నాను. ఆలస్యానికి విచారిస్తున్నాను. బ్రహ్మం గారి ప్రశ్నకు మొదట సమాధానం ఇస్తున్నాను. జి.డి.పి: Gross Domestic Product అనే పదబంధానికి జి.డి.పి పొట్టిరూపం. తెలుగులో స్ధూల జాతీయోత్పత్తి అని అంటారు. స్ధూల దేశీయోత్పత్తి అన్నా…

మోడీకి పటేల్ ఆమోదం ఉండేది కాదు -పటేల్ బయోగ్రాఫర్

బి.జె.పి ప్రధాని పదవి అభ్యర్ధి నరేంద్ర మోడీని సర్దార్ పటేల్ తన వారసుడిగా ఆమోదించి ఉండేవారు కాదని పటేల్ జీవిత చరిత్ర రచయిత రాజ్ మోహన్ గాంధీ వ్యాఖ్యానించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ మోహన్ గాంధీ మోడిని తన సైద్ధాంతిక వారసునిగా ఆమోదించకపోగా ముస్లింల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపట్ల ఎంతో ఆవేదన చెందేవారని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీకి మనవడు కూడా అయిన రాజ్ మోహన్ గాంధీ భారత దేశ…

న్యూయార్క్ లో బ్యాంక్సీ వీధి చిత్రాల జాతర

చాలా కాలంగా బ్యాంక్సీ వీధి చిత్రాల సందడి కళా ప్రియులకు కరువైపోయింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనం అధిష్టించి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బాల కార్మికుడు బ్రిటిష్ పతాకాన్ని మిషన్ పై కుడుతున్న బొమ్మను గీసిన తర్వాత మళ్ళీ బ్యాంక్సీ జాడ లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు “Better Out Than In” శీర్షికతో అక్టోబర్ నెల అంతా న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల వీధి చిత్రాలు గీసి పలువురు కళా ప్రియులకు విస్మయానందాలను పంచి…

బంగారం తవ్వకాలు: స్వామీజీ కల కలే -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ స్వామీజీ శోభన్ సర్కార్ వారి 1000 టన్నుల బంగారం కల చివరికి ‘కలే’ అని తేలిపోయింది. ఉన్నావ్ తవ్వకాల్లో మట్టి తప్ప మరొకటి లేదని చెబుతూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ) వారు తవ్వకాలు నిలిపివేసి వెళ్ళిపోయారు. కొన్ని చారిత్రక పదార్ధాలు బైటపడినప్పటికి అవన్నీ 18 వ శతాబ్దం నాటివేననీ, అంతకు ముందువి ఏమీ లేవనీ ఎ.ఎస్.ఐ తేల్చేసింది. ఆ విధంగా ఎ.ఎస్.ఐ తన ఒకటిన్నర శతాబ్దాల ఘన చరిత్రను ఒక స్వామీజీ…

కేరళ సినీ నటి పట్ల కాంగ్రెస్ ఎం.పి అసభ్య వర్తన

ఆయన పేరు ఎన్ పీతాంబర కురుప్. వయసు 73 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మనిషి. మళయాళంలో కురుప్ అంటే అర్ధం ఏమిటో తెలియదు గానీ తెలుగు అర్ధానికి తగినట్లుగా వ్యవహరించి వార్తలకెక్కాడు. అవడానికి పార్లమెంటు సభ్యుడే అయినా తాను నైతికంగా కురూపినే అని ఆయన నిరూపించుకున్నాడు. సినీ నటి శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అసభ్య కూతలు కూసి భారత పార్లమెంటు సభ్యులు కొందరు ఏ…

సంచలనం: అమెరికా సముద్ర జలాల్లో చైనా గూఢచార నౌక

హవాయ్ ద్వీపకల్పానికి సమీపంలో తన గూఢచార నౌకను ప్రవేశ పెట్టి చైనా సంచలనానికి తెర తీసింది. తూర్పు చైనా సముద్ర జలాల్లో దశాబ్దాల తరబడి అమెరికా సాగించిన చొరబాటు చర్యలకు ప్రతీకారంగా చైనా చర్యను అంచనా వేయవచ్చు. గోల్డ్ సీ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పెద్దగా పట్టించుకోనట్లు నటిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం మాత్రం మింగలేక అలాగని కక్కనూ లేక మౌనం పాటిస్తోంది. ఫోర్బ్స్, ఫైనాన్షియల్…

అగ్రరాజ్య హోదా అంటే లిబర్టీ విగ్రహాన్ని అనుకరించడమా? -కార్టూన్

– “అవి మన మన్ హట్టన్…. ఆకాశహర్మ్య విగ్రహాలు” – అక్టోబర్ 29 తేదీన కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మ్యూజియం ప్రారంభం అయితే, అక్టోబర్ 31 తేదీన గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే నరేంద్ర మోడి ఆధ్వర్యంలో అనుకోవాలి. ఆయన నిర్మించబోయే పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అవుతుందట. న్యూయార్క్ నగరంలోని మన్ హటన్…

లండన్ లో బ్యాంక్సీ స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ (2008) -పునర్ముద్రణ

ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ , 2008 లో స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. వాటర్ లూ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో వినియోగంలో లేని టన్నెల్ లో ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. బ్రిటన్, ఫ్రాన్సు, బెల్జియం లను కలిపే ‘యూరో స్టార్’ హై స్పీడ్ రైల్వే కంపెనీ ఈ టనెల్ ని వాడి వదిలేయగా, ఆ తర్వాత టాక్సీ డ్రైవర్లు ఉపయోగించారు. ఎగ్జిబిషన్ కి ‘కేన్స్ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు.…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ

జర్మనీ ఛాన్సలర్ సెల్ ఫోన్ సంభాషణలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలపై అమెరికా – జర్మనీల మధ్య వాదోపావాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, జర్మనీ ప్రభుత్వానికి తెలిపాడు. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలన్న షరతు మీద స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇచ్చినప్పటికీ అమెరికా – జర్మనీల మధ్య మరింత దూరం పెంచే అవకాశాన్ని…

ఇంటర్నెట్ గూఢచర్యం: నిజమే, అతిగా చేశాం -అమెరికా

అన్ని వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అమెరికా తన తప్పును పరిమితంగానే అయినా అంగీకరించింది. కొన్ని కేసుల్లో అతిగా గూఢచర్యం నిర్వహించామని, వాటిని సవరించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ ఒప్పుకున్నాడు. కానీ తాము అమాయకులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. జర్మనీ ఛాన్సలర్, భారత ప్రధాన మంత్రిలతో సహా 35 దేశాల అధిపతుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసినందుకు అన్నివైపుల నుండి దాడి, ఒత్తిడి తీవ్రం ఐన నేపధ్యంలో ఈ…

బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29, 2012 తేదీన ప్రచురించినది. అప్పటికీ ఇప్పటికీ పాఠకులు చాలామంది మారారు. చాలామంది కొత్త పాఠకులు వచ్చి చేరారు. అద్భుతమైన వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీని కొత్త పాఠకులకు పరిచయం చేద్దామన్న ఉద్దేశ్యంతో -బ్యాంక్సీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం మరి!- దీనిని పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) — — — ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలివి. బ్యాంక్సీ చిత్రాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది ‘అధారిటేరియనిజం’…

‘దేవతా స్త్రీలు’ ఎస్.సి, ఎస్.టి ల్లోనే ఎక్కువ -సెన్సస్

“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” తాము స్త్రీలను దేవతలుగా కొలుస్తామని చెప్పుకోడానికి హిందువులు చెప్పుకునే మాట ఇది. కానీ ఈ సూత్రాన్ని వాస్తవంగా ఆచరిస్తున్నది నాలుగు హిందూ వర్ణాలలో లెక్కకు రాని అవర్ణాల జనమే అని తాజా జనాభా లెక్కల ద్వారా తేలింది. హిందువుల్లో ‘ఇతరుల’ కంటే ఎస్.సి, ఎస్.టి ల్లోనే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. పిల్లల్లో చూసినా, పెద్దల్లో చూసినా, మొత్తంగా చూసినా సవర్ణ హిందూ…

పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు? గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ…

తెలంగాణపై త్వరలో అఖిలపక్షం -కేంద్రం

తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కరే ప్రతినిధిగా పిలవాలని కూడా చెప్పామని సి.పి.ఐ నాయకులు నారాయణ గారు విలేఖరులకు ఈ రోజే…