తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభం, గొడవ, వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే. శాసనసభ…

చంద్రుడిని తాకిన మూడో దేశం చైనా

‘చాంగ్-ఎ 3’ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో చైనా అరుదైన రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని దింపిన మూడో దేశంగా చైనా అంతరిక్ష ప్రయోగాల రికార్డు పుటలకు ఎక్కింది. అమెరికా, (పాత) సోవియట్ రష్యా దేశాలు గతంలో ఈ ఫీట్ సాధించాయి. 1970ల తర్వాత చంద్రుడిపై ఒక మానవ నిర్మిత ఉపగ్రహం సాఫ్ట్-ల్యాండింగ్ లో సఫలీకృతం కావడం ఇదే మొదటిసారి. చంద్రుడిపైన ఇంద్రధనుస్సుల అఖాతం (Bay of Rainbows) గా పిలిచే చోట చాంగ్-ఎ 3 ఉపగ్రహం…

బ్రిటిష్ ఇండియా ఆదాయం రెండొంతులు దోపిడికే

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ – పార్ట్ 5 – గ్రామీణ సమాజంలో పై పొరలో ఉన్నవారు తమ యాజమాన్యంలో ఉన్న భూములను, శ్రమ సాధనాలను గ్రామాల్లోని భూమిలేని పేదల శ్రమశక్తితో కలిపి ఉత్పత్తి తీస్తున్నారనేది నిజమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛా శ్రమ శక్తితో కూడిన స్ధానిక మార్కెట్లు రూపొందుతున్నాయని చెప్పేందుకు ఆధారం లేదు. కూలీలకు సాంప్రదాయ రేట్ల ప్రకారమే వస్తు రూపేణా కూడా కూలి చెల్లిస్తున్నారు. గ్రామీణ భారతంలో ఆర్ధిక-పారిశ్రామికవేత్త…

బాల్యం లేని పాకిస్తాన్ బాల్యం -ఫోటోలు

పాకిస్తాన్ బాల్యం అనగానే మనకి ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మలాలా యూసఫ్జాయ్. తాలిబాన్ ఆదేశాలను ధిక్కరించి బాలికా విద్యకోసం పోరాడుతున్న బాలికగా ఆమె పేరు ప్రపంచం అంతా మారుమోగేలా చేయడంలో పశ్చిమ పత్రికలు రాత్రనకా పగలనక శ్రమించాయి. నోబెల్ శాంతి బహుమతికి కూడా ఆమె పేరు ప్రతిపాదించి కొందరు సంతోషించారు. కానీ ప్రపంచం విస్మరించిన పాకిస్తాన్ బాల్యం మలాలాకు మించినది. పాకిస్తాన్ లోని అసలు బాల్యం అనేక సమస్యలకు ఎదురీదుతూ గ్యారంటీ లేని భవిత…

దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా

న్యూయార్క్ లో భారత కాన్సల్ కార్యాలయంలోని డిప్యూటీ కాన్సల్ జనరల్ దేవయాని అరెస్టుపై ఇండియా తీవ్రంగా స్పందించింది. వియన్నా సదస్సు ఒప్పందాలను గౌరవించకుండా తమ రాయబారి పట్ల అనుచితంగా వ్యవహరించడం తమకు ససేమిరా ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇండియాలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ను పిలిపించుకుని వివరణ కోరారు. కాగా అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవయాని…

పనిమనిషిని మోసం చేసి అరెస్టయిన భారత రాయబారి

న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యుటి కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న అధికారి ‘వీసా మోసం’ కేసులో అరెస్టయ్యారు. వీసా మోసం, తప్పుడు సమాచారం కేసుల్లో సదరు రాయబారి అరెస్టయినప్పటికి అసలు విషయం పని మనిషికి వేతన చెల్లింపులో మోసం చేయడం. పని మనిషికి అమెరికా వీసా సంపాదించడానికి అమెరికా చట్టాల ప్రకారం నెలకు వేతనం 4,500 డాలర్లు చెల్లిస్తానని చెప్పిన రాయబార అధికారి వాస్తవంలో రు. 30,000/- (500 డాలర్ల కంటే తక్కువ)…

మండేలా అంతిమ క్రియల్లో ఒబామా ఫోటో సంబరం

ఒక వ్యక్తి చనిపోయినపుడు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారికి జరిగిన నష్టం వలన తాము ఎంత భాధగా ఉన్నది తెలిసేట్లుగా ప్రవర్తిస్తారు. వేరే ఎన్ని పనులున్నా వాటి జోలికి పోకుండా సంయమనం పాటిస్తారు. నెల్సన్ మండేలా లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాట యోధుడు చనిపోయినప్పుడయితే ఎంత క్రమశిక్షణ పాటించాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అమెరికా, డెన్మార్క్, బ్రిటన్ దేశాల అధినేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తలకెక్కారు.…

విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం

సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…

స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు

స్వలింగ సంపర్కాన్ని నేర సమానం చేసే చట్టాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తిరస్కరించింది. అసహజమైన స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఐ.పి.సి లోని సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తుంది. దీనికి పాల్పడినవారిని నేరస్ధులుగా పేర్కొంటూ గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ఇది ప్రతిపాదిస్తుంది. పౌరుల ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తోందని చెబుతూ ఈ సెక్షన్ ను రద్దు చేస్తున్నట్లుగా 2009లో ఢిల్లీ హై…

సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతాల్లోని ఇతర పార్టీల ఎం.పిల మద్దతు కూడగట్టినప్పటికీ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితి ఏ పార్టీకి లేకపోవడమే దీనిని ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా అవిశ్వాసం తెలపడానికి నిరాకరించారని ది హిందు పత్రిక తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల పరువు…

ఆఫ్ఘనిస్తాన్: అమెరికాను కాదని ఇరాన్ తో స్నేహ ఒప్పందం

‘లోయ జిర్గా’ ఆమోదించిన తర్వాత కూడా అమెరికాతో ‘భద్రతా ఒప్పందం’ పై సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇరాన్ కు వెళ్ళి మరీ స్నేహ-సహకార ఒప్పందంపై సంతకం చేసేశారు. ఆఫ్ఘన్ ప్రజలకు భద్రత ఇవ్వడంపై హామీ ఇవ్వకుండా, 2014 తర్వాత కూడా అమెరికా, నాటో సేనలు ఆఫ్ఘన్ లో కొనసాగింపజేసే ఒప్పందంపై సంతకం చేసేది లేదని కర్జాయ్ రెండు వారాల క్రితం తిరస్కరించారు. కానీ ‘ప్రాంతీయ భద్రత’ కోసం ఇరాన్ తో…

సింగపూర్ హింస, 24 మంది భారతీయుల అరెస్టు

ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశాల్లో ఒకటిగా పరిగణించే సింగపూర్ ఆదివారం దాడులు, దహనాలతో వార్తల్లో నిలిచింది. అల్లర్లకు కారకులంటూ సింగపూర్ ప్రభుత్వం 27 మందిని అరెస్టు చేయగా వారిలో 24 మంది భారతీయులే. నగర రాజ్యం (city state) గా పిలిచే సింగపూర్ ప్రధానంగా వలస కార్మికుల శ్రమ పైనే ఆధారపడే దేశం. భారత దేశం నుండి వలస వెళ్ళిన కార్మికుడు ఒకరిని బస్సు ఢీ కొట్టి చంపడంతో అల్లర్లు చెలరేగినట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే అల్లర్లకు…

మండేలా: చరితలో చిరకాలం నీ పేరు నిలుచుననీ… -ఫోటోలు

పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ఐనా మనిషి దుఃఖించక మానడు. చావు, పుట్టుకలకు అతీతంగా జీవితాన్ని సార్ధకం చేసుకునేవారు చరిత్రలో అనేకులు ఉన్నారు. వారిలో మానవజాతి తలచుకునేది కొందరినే. ఎవరైతే జాతి పురోగతికి మార్గ నిర్దేశకులుగా నిలుస్తారో, ఎవరైతే జాతి మొత్తాన్ని ఏక తాటిపై నడిపిస్తారో వారిని మానవ జాతి చరిత్ర జాతి నేతలుగా రికార్డు చేస్తుంది. అలాంటి గొప్ప నాయకుల్లో నెల్సన్ మండేలా ముందు పీఠిన నిలుస్తారు. జులై 18, 1918 తేదీన ఒక…

తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట!

1990 దశాబ్దం అంతా ఈ పాట తెలుగు నేలపై మోగుతూ ఉండేది. ముఖ్యంగా పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘంతో పాటు ఇతర విప్లవ విద్యార్ధి సంఘాల్లో పని చేసిన, అనుసరించిన విద్యార్ధులకు ఈ పాట చిరపరిచితం. నల్లజాతి ప్రజల సాయుధ తిరుగుబాటుకు తలఒగ్గుతూ దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం 1990లో నెల్సన్ మండేలాను విడుదల చేసినపుడు అప్పటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు శక్తి ఉరఫ్ జె.కనకరాజు గారు ఈ పాట రాసి పాడారు. తెలంగాణ ప్రజా కళాకారులు జయరాజ్…