సిరియా: అంతులేని విధ్వంసం, శాంతిలేని మధ్యప్రాచ్యం

సిరియా ప్రభుత్వం తన రసాయన ఆయుధాలను విధ్వంసం చేయడానికి ఐరాసకూ, పశ్చిమ దేశాలకూ పూర్తిగా సహకరించినా అక్కడ విధ్వంసం ఆగలేదు. అమెరికా, ఐరోపాలు అందిస్తున్న ఆయుధ సహకారంతో తిరుగుబాటు మూకలు చెలరేగిపోతూనే ఉన్నాయి. అంతులేని మహా విధ్వంసాన్ని అనుభవిస్తున్న సిరియా ప్రజ శాంతిలేని మధ్యప్రాచ్యానికి సాక్షీ భూతంగా భగభగ మండుతూనే ఉంది. వందలు దాటి, వేలు గెంతి లక్షకు ఎగిసిన విగతులను తలచుకుంటూ సిరియా శిధిలాల మధ్య ఇంకా రోదిస్తూనే ఉంది. మూడేళ్ళ మైలు రాయిని చేరుకోవడానికి…

దెబ్బకు దెబ్బ: అమెరికా రాయబారుల హోదా కుదించిన ఇండియా

భారత ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి దేవయాని అరెస్టుకు ఇండియా లేటుగా అయినా ఘాటుగా స్పందిస్తోంది. న్యూయార్క్ లోని ఇండియా కాన్సల్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న దేవయానిని అరెస్టు చేయడమే గాక దురహంకార పూరిత పద్ధతుల్లో ఆమెను బట్టలు విప్పించి వెతికారని, పెట్టీ దొంగలు, వ్యభిచారుణులు, హంతకులతో కలిపి పోలీసుల సెల్ లో నిర్బంధించారని వార్తలు వెలువడిన నేపధ్యంలో ఇండియాలోని అమెరికా రాయబారుల పట్ల తాము వ్యవహరిస్తున్న తీరును…

తెలంగాణ: పామూ నిచ్చెనల ఆటకు వేదిక -కార్టూన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సంగతేమో గానీ ఆ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు పరమ జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రజల దైనందిన సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోని ప్రబుద్ధులు కొందరు ఇప్పుడు సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి కొందరు తెలంగాణ వస్తే చాలు ఇక స్వర్గమే అన్నట్లుగా ‘అరచేతిలో వైకుంఠం’ చూపుతున్నారు. ఇద్దరూ కలిసి అటూ, ఇటూ జనాన్ని ఎంతగా వంచించగలరో అంతా వంచిస్తున్నారు. కాకపోతే అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా…

తెలంగాణ ముసాయిదాకు రాష్ట్రపతి కవరింగ్ లెటర్

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తయారు చేయగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ బిల్లు 2013’ ముసాయిదాను రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిశీలన నిమిత్తం పంపారు. బిల్లు మొత్తంగానూ, అంశాలవారీగానూ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ముసాయిదాపై ఏమి అభిప్రాయపడుతున్నదీ రాష్ట్రపతికి తెలియజేయాలని చెబుతూ అందుకు జనవరి 23ను తుది గడువుగా రాష్ట్రపతి నిర్దేశించారు. సదరు బిల్లు ముసాయిదాకు రాష్ట్రపతి రాసిన కవరింగ్ లెటర్ లోని అంశాలు ఇలా…

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభం, గొడవ, వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే. శాసనసభ…

చంద్రుడిని తాకిన మూడో దేశం చైనా

‘చాంగ్-ఎ 3’ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో చైనా అరుదైన రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని దింపిన మూడో దేశంగా చైనా అంతరిక్ష ప్రయోగాల రికార్డు పుటలకు ఎక్కింది. అమెరికా, (పాత) సోవియట్ రష్యా దేశాలు గతంలో ఈ ఫీట్ సాధించాయి. 1970ల తర్వాత చంద్రుడిపై ఒక మానవ నిర్మిత ఉపగ్రహం సాఫ్ట్-ల్యాండింగ్ లో సఫలీకృతం కావడం ఇదే మొదటిసారి. చంద్రుడిపైన ఇంద్రధనుస్సుల అఖాతం (Bay of Rainbows) గా పిలిచే చోట చాంగ్-ఎ 3 ఉపగ్రహం…

బ్రిటిష్ ఇండియా ఆదాయం రెండొంతులు దోపిడికే

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ – పార్ట్ 5 – గ్రామీణ సమాజంలో పై పొరలో ఉన్నవారు తమ యాజమాన్యంలో ఉన్న భూములను, శ్రమ సాధనాలను గ్రామాల్లోని భూమిలేని పేదల శ్రమశక్తితో కలిపి ఉత్పత్తి తీస్తున్నారనేది నిజమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛా శ్రమ శక్తితో కూడిన స్ధానిక మార్కెట్లు రూపొందుతున్నాయని చెప్పేందుకు ఆధారం లేదు. కూలీలకు సాంప్రదాయ రేట్ల ప్రకారమే వస్తు రూపేణా కూడా కూలి చెల్లిస్తున్నారు. గ్రామీణ భారతంలో ఆర్ధిక-పారిశ్రామికవేత్త…

బాల్యం లేని పాకిస్తాన్ బాల్యం -ఫోటోలు

పాకిస్తాన్ బాల్యం అనగానే మనకి ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మలాలా యూసఫ్జాయ్. తాలిబాన్ ఆదేశాలను ధిక్కరించి బాలికా విద్యకోసం పోరాడుతున్న బాలికగా ఆమె పేరు ప్రపంచం అంతా మారుమోగేలా చేయడంలో పశ్చిమ పత్రికలు రాత్రనకా పగలనక శ్రమించాయి. నోబెల్ శాంతి బహుమతికి కూడా ఆమె పేరు ప్రతిపాదించి కొందరు సంతోషించారు. కానీ ప్రపంచం విస్మరించిన పాకిస్తాన్ బాల్యం మలాలాకు మించినది. పాకిస్తాన్ లోని అసలు బాల్యం అనేక సమస్యలకు ఎదురీదుతూ గ్యారంటీ లేని భవిత…

దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా

న్యూయార్క్ లో భారత కాన్సల్ కార్యాలయంలోని డిప్యూటీ కాన్సల్ జనరల్ దేవయాని అరెస్టుపై ఇండియా తీవ్రంగా స్పందించింది. వియన్నా సదస్సు ఒప్పందాలను గౌరవించకుండా తమ రాయబారి పట్ల అనుచితంగా వ్యవహరించడం తమకు ససేమిరా ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇండియాలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ను పిలిపించుకుని వివరణ కోరారు. కాగా అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవయాని…

పనిమనిషిని మోసం చేసి అరెస్టయిన భారత రాయబారి

న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యుటి కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న అధికారి ‘వీసా మోసం’ కేసులో అరెస్టయ్యారు. వీసా మోసం, తప్పుడు సమాచారం కేసుల్లో సదరు రాయబారి అరెస్టయినప్పటికి అసలు విషయం పని మనిషికి వేతన చెల్లింపులో మోసం చేయడం. పని మనిషికి అమెరికా వీసా సంపాదించడానికి అమెరికా చట్టాల ప్రకారం నెలకు వేతనం 4,500 డాలర్లు చెల్లిస్తానని చెప్పిన రాయబార అధికారి వాస్తవంలో రు. 30,000/- (500 డాలర్ల కంటే తక్కువ)…

మండేలా అంతిమ క్రియల్లో ఒబామా ఫోటో సంబరం

ఒక వ్యక్తి చనిపోయినపుడు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారికి జరిగిన నష్టం వలన తాము ఎంత భాధగా ఉన్నది తెలిసేట్లుగా ప్రవర్తిస్తారు. వేరే ఎన్ని పనులున్నా వాటి జోలికి పోకుండా సంయమనం పాటిస్తారు. నెల్సన్ మండేలా లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాట యోధుడు చనిపోయినప్పుడయితే ఎంత క్రమశిక్షణ పాటించాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అమెరికా, డెన్మార్క్, బ్రిటన్ దేశాల అధినేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తలకెక్కారు.…

విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం

సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…

స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు

స్వలింగ సంపర్కాన్ని నేర సమానం చేసే చట్టాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తిరస్కరించింది. అసహజమైన స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఐ.పి.సి లోని సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తుంది. దీనికి పాల్పడినవారిని నేరస్ధులుగా పేర్కొంటూ గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ఇది ప్రతిపాదిస్తుంది. పౌరుల ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తోందని చెబుతూ ఈ సెక్షన్ ను రద్దు చేస్తున్నట్లుగా 2009లో ఢిల్లీ హై…

సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతాల్లోని ఇతర పార్టీల ఎం.పిల మద్దతు కూడగట్టినప్పటికీ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితి ఏ పార్టీకి లేకపోవడమే దీనిని ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా అవిశ్వాసం తెలపడానికి నిరాకరించారని ది హిందు పత్రిక తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల పరువు…