ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల పండగ -ఫోటోలు

అతి పెద్ద ఒంటెల పండగే కాదు, అతి పెద్ద పశువుల పండగ కూడా కావచ్చిది. రాజస్ధాన్ లో కార్తీక మాసంలో పుష్కర్ సరస్సు ఒడ్డున జరిగే ఈ పండగ/సంతలో దాదాపు 2 లక్షలకు పైగా పాల్గొంటారని అంచనా. 50,000కు పైగా ఒంటెలు ఇందులో పాల్గొంటాయి. భక్తులు పౌర్ణమి సమీపించే కొందీ పుష్కర్ ను సందర్శించే యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. పౌర్ణమి రోజు పుష్కర్ లో స్నానం ఆచరిస్తే మంచిదని భక్తుల నమ్మిక. జనమూ, వారితో…

పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం

(2000 సం.ము మార్చి 24-25 తేదీల మధ్య రాత్రి దినాన కాశ్మీర్ కు చెందిన 5గురు అమాయక యువకులు సైనికుల కరకు గుళ్ళకు బలై చనిపోయారు. వారు సీమాంతర ఉగ్రవాదులని సైన్యం దేశానికి చెప్పింది. కాదు వారు అనంత్ నాగ్ ఏరియా నివాసులని సి.బి.ఐ నిర్ధారించింది. సైన్యం AFSPA చట్టాన్ని కవచంగా తెచ్చుకోగా సుప్రీం కోర్టు సరేనంది. కోర్టు మార్షల్ అయినా చెయ్యాలంది. ఆ కోర్టు మార్షల్ మొన్న ముగిసింది. తమవాళ్లు తప్పు చేయలేదని నిర్ధారించి కేసు…

ఫ్రాన్స్ లో హింసాత్మక ఆందోళనలు

ఉక్రెయిన్ లో ఆందోళనలను అణచివేస్తున్నారంటూ ఆరోపిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండేకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం ప్యారిస్ వీధుల్లో కదం తొక్కారు. ఒలాండే అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ‘ఆగ్రహ దినం’ పాటిస్తున్నామని ప్రకటించారు. పోలీసులతో వీధి యుద్ధాలకు తలపడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారని, 250 మంది వరకు అరెస్టు చేశారని పత్రికలు తెలిపాయి. ఆందోళనకారులు కొందరు ఇ.యు నుండి ఫ్రాన్స్ బైటికి రావాలని డిమాండ్ చేయడం…

మోడి ఇమేజ్: కమలమా? టీ కప్పా? -కార్టూన్

“ఇదయితే మీ ఇమేజ్ కి బాగా సరిపోతుంది కదా, సార్?” పార్టీలోని వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని అందరూ అంగీకరించే సూత్రం. ఈ సూత్రం పార్టీలోని సామాన్య కార్యకర్తల నుండి అత్యున్నత నాయకులకు అందరికీ వర్తిస్తుందని ప్రతి పార్టీ చెప్పుకుంటుంది. తద్వారా పార్టీ సిద్ధాంతాలకు, నిర్మాణానికి పెద్ద పీట వేయడానికి పార్టీలు ప్రయత్నిస్తాయి. వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకుని పార్టీకి నష్టం కలిగించకుండా జాగ్రత్త పాటిస్తాయి. కానీ బి.జె.పి వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. “నరేంద్ర మోడి…

మీజీ పునరుద్ధరణ: జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి నాంది

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ –పార్ట్ 6 (భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది ఆరవ భాగం. మొదటి 5 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్) చాప్టర్ III మీజీ పునరుద్ధరణ మరియు జపాన్ పెట్టుబడిదారీ మార్గం      1850ల వరకూ జపాన్ రాజకీయంగా మూసివేయబడ్డ సమాజం. యూరప్ లో…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ వీరాలాపాలు వల్లిస్తూ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఒంటరి యోధుడిలా జనం ముందు నిలబడ్డ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన అప్పజెప్పడానికి సిద్ధపడుతున్న వైనం ఇది. ముఖ్యమంత్రి చర్యలను ఆర్ధిక శాఖ అభ్యంతరం చెబుతున్నా వినకుండా 15 నుండి 20 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసే సమావేశం సోమవారం…

బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని…

పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. పాత నోట్ల ఉపసంహరణ…

ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి

ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వ పాలనలో మరో రెండు అసాధారణ అంశాలు నమోదయ్యాయి. నిజానికి అసాధారణం కాదు. మన ప్రభుత్వాల విధానాల ప్రజా వ్యతిరేక స్వభావంలోని సాధారణత్వం వలన ఎఎపి తీసుకుంటున్న సాధారణ చర్యలు కూడా అసాధారణంగా కనిపిస్తున్నాయి. వాహనదారుల పర్సు లాక్కొని డబ్బు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిన పరిస్ధితికి కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టడం ఒక అంశం. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న లక్షకు పైగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విధాన నిర్ణయం తీసుకోవడం…

టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్

టామ్ & జెర్రీ కార్టూన్ సీరియల్/సినిమాను ఇష్టపడని వారెవరుంటారు? 1940ల్లో ఉనికిలోకి వచ్చింది లగాయితు అనేక తరాల పాటు ఆబాలగోపాలన్నీ అలరిస్తోంది. బలం పెద్దగా లేని చిట్టెలుక తన తెలివితేటలతో బలవంతురాలైనన పిల్లిని ఎలా బురిడీ కొట్టించేదీ ఈ షో చూపిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఎపి, కాంగ్రెస్ పార్టీల వ్యవహారం కూడా టామ్ & జెర్రీ ఆటను తలపిస్తోందని కార్టూనిస్టు కేశవ్ ఈ కార్టూన్ లో చెబుతున్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి మహా…

రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…

పత్రికల ఆక్రమణదారు కేజ్రీవాల్ -కార్టూన్

“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.” – తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం…

ఎవడు లాగితే లగడపాటి కిందపడతాడో…

“… వాడే నిజమైన తెలంగాణ వాది” అని అంటోంది డెక్కన్ టి.వి. జనవరి 22 తేదీ హైద్రాబాద్ లో జరిగిన సీమాంధ్ర ధర్నాలో లగడపాటి రాజగోపాల్ కు అవమానం జరిగింది. వేదికపై ప్రసంగిస్తున్న లగడపాటిని తెలంగాణకు చెందిన యువకుడు ఒకరు కిందకు లాగేయడంతో ఆయన కింద పడిపోయారు. ఈ సంఘటన పట్ల తెలంగాణ వాదులు సంతోషంతో హర్షం ప్రకటిస్తుంటే సీమాంధ్ర లేదా సమైక్య ఉద్యమకారులు విమర్శలు కురిపిస్తున్నారు. మొదట ఛలో అసెంబ్లీ అని ప్రకటించిన ఏ.పి.ఎన్.జి.ఓ సంస్ధ…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

ఎఎపి ధర్నా: ఢిల్లీ వాసుల సంతృప్తి, కోర్టులో కేసులు

ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల తాము చాన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లయిందని ఢిల్లీ లోని ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసులు సంతృప్తి ప్రకటిస్తున్నారు. విదేశీయుల కార్యకలాపాల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదని, ఢిల్లీ మంత్రి సోమ్ నాధ్ భారతి తనిఖీ, ముఖ్యమంత్రి ధర్నా వలన తమ ఏరియాలో పోలీసుల నిఘా పెరిగిందని వారు తెలిపారు. కాగా ధర్నా నిర్వహించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్…