ఎం.ఎన్.ఎస్: పోలిటికల్ టోల్ గేట్ -కార్టూన్

టోల్ గేట్ అంటేనే బాదుడుకి ప్రతిరూపం. ప్రజల కోసం అని చెప్పి రోడ్లు వేసి, ఆ రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి జనాన్ని బాదే అధికారాన్ని సైతం వారికి ఇవ్వడం పచ్చి ప్రజా వ్యతిరేక చర్య. వాహనాలు కొన్నపుడు రోడ్ టాక్స్ వేస్తారు. బస్సుల్లో తిరిగితే టిక్కెట్ డబ్బులు వసూలు చేస్తారు. పెట్రోల్ కొన్నప్పుడు కూడా దానిపైన సవాలక్షా పన్నులు వేసి సామాన్యులకు అందకుండా చేస్తారు. ఇవన్నీ పోను మళ్ళీ టోల్ గేట్ రుసుము వసూలు చేయడం,…

ఢిల్లీ విద్యుత్: కాగ్ ఆడిట్ పితలాటకం

ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.…

విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ…

సబ్సిడీ సిలిండర్ల పెంపు, విషం కక్కుతున్న పరిశ్రమ వర్గాలు

సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంచడం తిరోగామి చర్య అని ఫిక్కి అధ్యక్షుడు సిద్ధార్ధ్ బిర్లా జారీ చేసిన ప్రకటనలో అభివర్ణించాడు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా ఈ చర్య భారం అవుతుందని ఆయన చాలా బాధపడిపోయాడు. ఆధార్ కార్డు తో ఎల్.పి.జి సిలిండర్ కు పెట్టిన సంబంధం తెంచడం వలనా, సబ్సీడీ సిలిండర్లు పెంచడం వలనా దేశానికి ఆర్ధిక కష్టాలు పెరుగుతాయని, కోశాగార క్రమశిక్షణ (Fiscal descipline) మరియు కోశాగార సమతూకం (Fiscal balance) పాటించాల్సి ఉండగా…

కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్, తిన్నది 300 పూటలు

ఓ చైనీయుడి తెలివితేటలివి. ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్ కొని, అదే టికెట్ పైన 300 రోజులు ఫస్ట్ క్లాస్ ఉచిత భోజనం ఆరగించాడా పెద్ద మనిషి. కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ టికెటే. కానీ ఆయన తిన్నది మాత్రం 300 భోజనాలు! అదెలాగో తెలిస్తే ఈర్ష్య కలగడం ఖాయం! ఎకానమీ క్లాస్ టికెట్ కొన్నవారికి ఉచిత భోజనం పెడతారో లేదో తెలియదు గానీ ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నవారికి మాత్రం ఒక మృష్టాన్నభోజనాన్ని…

ఎఎపి చేతిలో అవినీతి నాయకుల చిట్టా

అవినీతిపరులయిన రాజకీయ నాయకుల జాబితాను తయారు చేశామని ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహా నాయకులని భావిస్తున్నవారి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకుల పేర్లతో కూడిన ఈ చిట్టాలో స్ధానం సంపాదించినవారికి వ్యతిరేకంగా ఎఎపి తన అభ్యర్ధులను నిలుపుతుందని కేజ్రీవాల్ తెలిపారు. తమ జాబితాలో రాహుల్ గాంధీ ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడని ఆయనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం…

టఫ్ గై: ఆడా మగా, ముసలి ముతక తేడాయే లేదు -ఫోటోలు

ఇంగ్లండ్ లోని పెర్టన్ లో జరిగే పోటీలివి. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పోటీ అని కూడా దీన్ని చెబుతారట. అత్యంత కఠినమైన పరీక్షల్ని పెట్టే ఈ పోటీ ప్రతి సంవత్సరం జరుపుతారని తెలుస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రతేడూ వేలాది మంది ఇందులో పాల్గొనడం. ఆడా, మగా; ముసలి, ముతకా అన్న తేడా లేకుండా ఈ పోటీల్లో పాల్గొనడం నిజంగా అబ్బురమే. అబ్బురం ఎందుకో ఈ ఫోటోల్ని చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ పోటీల నుండి బైటపడ్డవారు ఖచ్చితంగా…

రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్

“తప్పు! పూర్తిగా తప్పు! మేము ఇదంతా చేయడానికి ఈ వ్యవస్ధ ఎలా అనుమతిస్తుందసలు?” ఎఎపి పుణ్యమాని రాజకీయ పార్టీలు అవినీతి వ్యతిరేక ఫోజు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిన దగ్గర్నుండే ఈ ఫోజులు మొదలయినప్పటికీ ఎఎపి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచడంతో ఈ ఫోజులు బాగా పెరిగాయి. ‘అవినీతి వ్యతిరేకత’కు ఓట్లు రాల్చే గుణం కూడా ఉందని తెలిసాక ఇక రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా?…

అమెరికా ఆహార సబ్సిడీ: పెద్దలే కాదు యువతకీ కావాలి

భారత దేశంలో ఆహార సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారని అమెరికా ఒకటే ఇబ్బంది పడుతుంది. ఆహార సబ్సిడీ పధకాన్ని ‘ఫ్రీ మీల్స్’ అని అమెరికా, ఐరోపా తదితర పశ్చిమ రాజ్యాల మేధావులు ఎకసక్కెం చేస్తారు. తద్వారా తమ దేశంలో అందరూ పని చేస్తేనే భోజనం చేస్తారన్న సందేశం ఇస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే అమెరికా, ఐరోపా దేశాల్లో ఇండియా కంటే అనేక రెట్లు ఎక్కువ సబ్సిడీ తమ కంపెనీలకు, జనానికి ఇస్తారు. అమెరికాలో ప్రాధమిక విద్య, ఉన్నత పాఠశాల…

తెలంగాణ బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ను తిరస్కరించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ గత బి.ఎ.సి సమావేశంలోనే చెప్పడంతో తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయం అయింది. అయితే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు సభా కార్యక్రమాలకు అడ్డు పడడంతో తీర్మానం ఎలా ప్రవేశపెడతారన్న ప్రశ్న ఉదయించింది. ఈ సమస్యను అధిగమించడానికి…

‘పాపులిస్టు అనార్కి పాలనకు ప్రత్యామ్నాయం కాదు’ అంటే?

రాకేష్: Hi Sir, ”Populist anarchy no substitute for governance”, “rising trend of hypocrisy in public life” ఈ రెండు స్టేట్ మెంట్స్ ని స్పష్టంగా వివరించగలరా? సమాధానం: (ఇది వాస్తవానికి రాకేష్ అనే పాఠకుడికి, నాకూ జరిగిన సంభాషణ. ఈ ప్రశ్నలో మోదటి భాగం వరకు మా మధ్య చర్చ జరిగింది. అందులో నా సమాధానం వరకూ కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) “POPULIST ANARCHY IS NO SUSTITUTE…

ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా? సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా…

ఉక్రెయిన్: రష్యాపై ఇ.యు కక్ష సాధింపు

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేసుకోవడంతో ఇ.యు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ద్వైవార్షిక ఇ.యు-రష్యా సమావేశాలను ముక్తసరిగా ముగించడం ద్వారా తన ఆగ్రహాన్ని చాటుకుంది. రష్యా ఒత్తిడితోనే ఇ.యు లో చేరడం ఉక్రెయిన్ వాయిదా వేసుకుందని ఇ.యు ఆరోపణ. అమెరికా, ఇ.యు దేశాల పత్రికలు సైతం ఈ ఆగ్రహాన్ని దాచుకోవడం లేదు. ఉక్రెయిన్ సహజవనరులను, మార్కెట్ ను చేజిక్కించుకునే అవకాశం జారిపోయిందన్న అక్కసునంతా రష్యాపై వెళ్లగక్కుతున్నాయి. ఇ.యు, రష్యాల శిఖరాగ్ర సమావేశాలు రెండేళ్లకొకసారి…

బీహార్: జె.డి(యు)కు కాంగ్రెస్ మొండి చెయ్యి -కార్టూన్

మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది. ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు…

ద్రవ్య సమీక్ష: వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ

ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మార్కెట్ పరిశీలకులను ఆశ్చర్యపరిచారు. పరిశ్రమ వర్గాలను నిరాశపరిచారు. తాను మాత్రం ‘వినాశకర ద్రవ్యోల్బణం’ పగ్గాలు బిగించే పనిలో ఉన్నానని చెప్పారు. ద్రవ్య సమీక్షలో భాగంగా ఆయన స్వల్పకాలిక వడ్డీ రేటు ‘రెపో రేటు’ ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతం నుండి 8 శాతానికి చేర్చారు. 2013-14 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువే ఉంటుందని చెప్పి ఆర్.బి.ఐ గవర్నర్ మరో…