2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

లోక్ సభలో తెలంగాణ బిల్లు, లగడపాటి పెప్పర్ స్ప్రేతో కల్లోలం

తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగానే లగడపాటి బరితెగించి పాల్పడిన చర్య తీవ్ర అల్లకల్లోలానికి దారి తీసింది. లోక్ సభ వెల్ లోకి ప్రవేశించిన రాజగోపాల్ జేబులో నుంచి పెప్పర్ స్ప్రే (మిరియాల పొడి కలిపిన ద్రావకం) బైటికి తీసి సభ నలువైపులా జల్లడంతో స్పీకర్ తో సహా పలువురు సభ్యులు అశ్వస్ధతకు గురయ్యారు. రాజగోపాల్ సృష్టించిన గందరగోళం పలువురి ఖండన మండనలతో పాటు 17…

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు! సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా? అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్…

ఇండియాపై ఐరాసకు ఇటలీ ఫిర్యాదు

ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ…

వీసా ఇస్తామని అనుకోవద్దు, అమెరికా వివరణ

అమెరికా రాయబారి నరేంద్ర మోడిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరినంత మాత్రాన తమ వీసా విధానంలో మార్పు ఉంటుందని భావించనవసరం లేదని అమెరికా విదేశాంగ శాఖ వివరణలాంటి సవరణ ప్రకటించింది. అమెరికా వీసా విధానంలో గానీ, ప్రపంచవ్యాపితంగా మానవహక్కులకు మద్దతుగా నిలవడంలో గానీ అమెరికా ఎలాంటి మార్పు చేసుకోలేదని గొప్పలు పోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి విలేఖరులకు వివరణ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలుసుకోవడానికి అమెరికా రాయబారి…

ఏర్లు వూళ్ళు ఏకమయ్యేనూ… ఇంగ్లండ్ వరదలు -ఫొటోలు

నైరుతి ఇంగ్లండ్ లోని పల్లపు మైదానాలను వరదలు ముంచెత్తి ఇప్పటికీ నెల పైనే అవుతోంది. అయినా ఆ ప్రాంతం ఇంకా వరద నీటి నుండి బైట పడలేదు. ఈ ప్రాంతం మొత్తం దాదాపు నీటి కింద కాలం వెళ్ళబుచ్చుతోంది. అనేక గ్రామాలను వరద నీరు చుట్టు ముట్టడంతో కాస్త మెరక మీద ఉన్న గ్రామాలు చిన్నపాటి ద్వీపాల్లా కనిపిస్తున్నాయి. గ్రామాల నివాసులు ఒకరి నుండి మరొకరికి సంబంధాలు లేకుండా పోయాయి. సోమర్ సెట్ నివాసులు తమ దుస్ధితికి…

వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని…

‘మోడి బహిష్కరణ’కు అమెరికా చెల్లు చీటి

‘మోడి బహిష్కరణ’ విధానానికి ఇక ముంగింపు పలకాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీకి వీసా నిరాకరించే విధానాన్ని విడనాడాలని ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ప్రత్యేకంగా అమెరికా వెళ్ళి మరీ చేసుకున్న విన్నపం ఫలితం ఇచ్చిందనేందుకు సూచనగా అమెరికా రాయబారి నాన్సీ పావెల్ మరో రెండు రోజుల్లో మోడిని కలవనున్నారు. నాన్సీ పావెల్ కోరిక మేరకు గాంధీ నగర్ లో ఆమెను కలవడానికి మోడి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోడి అపాయింట్…

చాయ్, మోడిలతో బి.జె.పి రెడీ -కార్టూన్

– పదేళ్ళ నుండి తెలంగాణ బిల్లును నానబెట్టిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల కోసం మాత్రమే అలా చేసిందని, బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోవడంతో టి.బిల్లుపై హడావుడి పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది. ***                    ***                    *** బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పుడేం ఖర్మ! ఎప్పుడో మొదలైపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను కూడా ప్రచార సామాగ్రిగా మార్చుకుని మరీ అది ఎన్నడో రంగంలోకి దిగింది. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా వెనకబడి ఏమీ లేదు. రాహుల్…

6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా,…

ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?…

ఔషధాలపై అమెరికా ఆంక్షలు, భారత్ ఆందోళన

భారత ఔషధ కంపెనీలపై అమెరికా అలవిమాలిన ఆంక్షలు విధిస్తోంది. తనను తాను స్వేచ్ఛా వాణిజ్యానికి ఛాంపియన్ గా చెప్పుకుంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రపంచానికి స్వేచ్ఛా వాణిజ్య సూత్రాల గొప్పతనం గురించి లెక్చర్లు దంచే అమెరికా ఆచరణలో అవలంబించేది మాత్రం అందుకు విరుద్ధమైన సూత్రాలు. భారత ఔషధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ, భారతీయ కంపెనీలకు ఇటీవల కాలంలో వరుసగా భారీ జరిమానాలు విధించడం పట్ల ప్రభుత్వం ఆందోళన ప్రకటించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కమిషనర్…

పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి

కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ మెరైన్లను పైరసీ వ్యతిరేక చట్టం కింద విచారించడానికి భారత హోమ్ శాఖ అనుమతి ఇవ్వడంపై ఇటలీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఇటలీ విదేశీ మంత్రి ఆదివారం ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించగా సోమవారం ఇ.యు కూడా దాదాపు అదే తరహాలో హెచ్చరించింది. ఇటలీ మెరైన్లను అన్యాయంగా విచారిస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ఇటలీ, ఇ.యులు అల్టిమేటం జారీ చేశాయి. “మా మెరైన్లకు వ్యతిరేకంగా జరగబోయే లీగల్…

ఎ.పి పొలిటికల్ ఆటో ఎక్స్ పో -కార్టూన్

కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ లో ఆటో ఎగ్జిబిషన్ జరిగింది. ఆటో ఎగ్జిబిషన్ నూ రాష్ట్ర విభజన కేంద్రంగా వివిధ పార్టీల్లో సాగుతున్న రాజకీయాలను పోల్చుతూ గీసిన కార్టూన్ ఇది. కాంగ్రెస్: రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా విభజన రాజకీయాలకు సంబంధించి సోనియా ఒకవైపు వెళ్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. విభజనపై తమ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కిరణ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఆటో ఎక్స్ పో. తెలుగు దేశం:…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లించేస్తున్నారు -కత్తిరింపు

జనాన్ని విభజన రందిలో ముంచేసిన రాష్ట్ర పాలకులు తమ కార్యాల్ని నిర్విఘ్నంగా చక్కబెట్టుకుంటున్నారు. ఇ.పి.సి ఒప్పందాలకు విరుద్ధంగా జలయజ్ఞం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని పెరిగిన ధరల పేరుతో అదనంగా చెల్లించడానికి సి.ఎం, ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసేశారు. కనీసం 20,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గుత్తేదారుల పరం చేసే ఈ బృహత్కార్యాన్ని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ప్రచురించింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జనవరి 27 తేదీన సమావేశం జరగనుందని పత్రిక…