ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…

ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

సల్లీ డీల్స్ కేసులో మొదటి అరెస్టు

బాధితులు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ కేసులో మొదటి అరెస్టు జరిగింది. ఈ అరెస్టును ఆదివారం ఢిల్లీ పోలీసులు చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం నుండి ‘ఓంకారేశ్వర్ ఠాకూర్’ ని అరెస్ట్ చేశామనీ, అతనే సల్లీ డీల్స్ ఆప్ సృష్టికర్త అనీ ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ముంబై పోలీసులు ‘బుల్లీ బాయ్’ కేసులో వరుసగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. జులై…

బుల్లి బాయ్: ఢిల్లీ పోలీసుల చేతుల్లో ప్రధాన కుట్రదారు

బుల్లి బాయ్ ఆప్ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారు ఎవరో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అస్సాంలో అతని జాడ కనుగొన్నామని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసు బృందం అస్సాం వెల్లిందని ఈ రోజు సాయంత్రం 3 లేదా 4 గంటల సమయానికి నిందితుడిని ఢిల్లీకి తెస్తారని ఢిల్లీ సైబర్ సెల్ డి‌సి‌పి కే‌పి‌ఎస్ మల్హోత్రా చెప్పారు (ఇండియన్ ఎక్స్^ప్రెస్, 06/01/2022). “ప్రధాన కుట్రదారుని మేము అరెస్ట్ చేశాము. అతనే వెబ్ సైట్ తయారీలో ప్రధాన ముద్దాయి.…

Bulli Bai ఆప్: నిర్ఘాంతపోయే నిజాలు!

ముంబై పోలీసుల పుణ్యమాని బుల్లి బాయ్ ఆప్ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సల్లీ డీల్స్ ఆప్ కేసులో గత జులై నెలలో బాధితులు, ఢిల్లీ వుమెన్ కమిషన్, విలేఖరులు వెంటపడి వేడుకున్నా నిందితులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది చొరవతో ముంబై పోలీసులు కేసును వేగంగా ఛేదిస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే కేసు వివరాలు కొన్నింటిని విలేఖరులకు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు…

అమ్మాయి 18, అబ్బాయి 21 బుల్లి బాయ్ ఆప్ ముద్దాయిలు!

యువత ఎటు ప్రయాణిస్తోంది? ఇప్పుడే ఇంటర్ దాటిన ఓ టీనేజి అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్న ఓ నూనూగు యువకుడు ఇంతటి ద్వేషాన్ని తమ మెదళ్లలోకి ఎలా ఎక్కించుకున్నారు? ఎలాంటి వ్యక్తిగత కారణం లేకుండా, ఎలాంటి సంఘటన జరగకుండా, ఏ విధంగానూ సంబంధం లేకుండా అంత చిన్న వయసులో ముస్లిం స్త్రీలను ఆన్ లైన్ లో వేలానికి పెట్టే టంతటి విద్వేషం వారికి ఎందుకు పుట్టింది? ఇది ఆట అనుకున్నారా? ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల నుండి ఆయా…

క్లైమెట్ ఛేంజ్: పశ్చిమ దేశాల హిపోక్రసీ (గొప్ప వీడియో)

వాతావరణ మార్పులపై పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మూడో ప్రపంచ దేశాలకు తెగ బోధనలు చేస్తుంటాయి. ముఖ్యంగా ఇండియా, చైనాలు బొగ్గు వినియోగంతో అత్యంత అధికంగా భూమండలాన్ని కాలుష్యం లో ముంచుతున్నాయని అవి తరచుగా లెక్కలు చెబుతాయి. ఈ లెక్కలు ఎంత వాస్తవమో ఈ వీడియో చక్కగా వివరిస్తుంది. తప్పకుండా చూడండి. (ఫేస్ బుక్ నుండి) https://www.facebook.com/1439656221/videos/224755656490178/

అణు యుద్ధానికి పాల్పడం! -P5 దేశాలు

P5 అంటే ‘పర్మినెంట్ 5’ అని అర్ధం. ఐరాస భద్రతా సమితి (Security Council) లో 5 శాశ్వత సభ్య దేశాలను షార్ట్ కట్ లో P5 అని సంభోధిస్తారు. రష్యా, బ్రిటన్, చైనా, అమెరికా, ఫ్రాన్స్… ఈ 5 దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు. ఈ దేశాలకు భద్రతా సమితిలో ఏ నిర్ణయాన్నైనా వీటో చేసే హక్కు ఉంటుంది. అనగా ఏ నిర్ణయమైనా ఈ 5 దేశాలు ఆమోదిస్తేనే జరుగుతుంది.…

ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ‘IHU’

ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐ‌హెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది. దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ రకాన్ని B.1.640.2 వేరియంట్ గా…

హిందూత్వ ముఠాలు ఉపరాష్ట్రపతి మాటలు వినాలి!

ఇటీవల కాలంలో క్రైస్తవ మతం అనుసరిస్తున్న ప్రజలపై దాడులు పెరిగాయి. హిందూ మతం పేరు చెప్పుకుని వివిధ రౌడీ మూకలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. తమ దాడులకు న్యాయ బద్ధత, నైతిక సమర్థత కల్పించుకునేందుకు మత మార్పిడి జరుగుతోందని, దాన్ని అడ్డుకుంటున్నామని సాకు చెబుతున్నారు. కొన్నిసార్లయితే బహిరంగంగానే పర మత విద్వేషం చాటుకుంటున్నారు. మధ్య యుగాల నాటి శైవ, వైష్ణవ ఊచకోతలు, ఆసియా-ఐరోపాల్లోని క్రైస్తవ క్రూసేడ్లను తలపిస్తూ ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. కర్ణాటక బి‌జే‌పి ఎం‌పి…

మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

యేడాదిలో అణు విద్యుత్ కు జర్మనీ ముగింపు! మరి ఇండియా!?

జర్మనీ సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం. యూరోపియన్ యూనియన్ కు నాయక దేశం. ఐరోపాలో జర్మనీ తర్వాతే ఏ దేశమైనా. ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు జర్మనీ తర్వాతే. జర్మనీని ఐరోపా ఆర్ధిక వ్యవస్ధకు ఇంజన్ లాంటిది అని కూడా అంటారు. అలాంటి జర్మనీ మరో యేడాదిలో తన దేశంలో ఉన్న అణు విద్యుత్ ని ఉత్పత్తి చేసే కేంద్రాలు అన్నింటినీ మూసివేయబోతోంది. జర్మనీలో ప్రస్తుతం ఆరు మాత్రమే అటు విద్యుత్ ప్లాంట్ లు మిగిలి ఉన్నాయి.…

చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…

జనం చస్తే మాకేం? నాగాలాండ్ లో AFSPA పొడిగింపు

నాగాలాండ్ ప్రజలు ఏమి కోరుకున్నా తాము మాత్రం తాము అనుకున్నదే అమలు చేస్తామని మోడి ప్రభుత్వం చాటి చెప్పింది. రాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వ విచక్షణపై నాగాలాండ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం పటాపంచలైంది. నాగాలాండ్ రాష్ట్రంలో AFSPA చట్టం అమలు చేయాల్సిన అవసరం…

శ్రీలంక సంక్షోభం, సాయం చేసేందుకు ఇండియా చైనా పోటీ

శ్రీలంక ఇటీవల కాలంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. సంక్షోభం నుండి గట్టెక్కేందుకు శ్రీలంక బహిరంగంగానే ఇండియా సహాయం కోరింది. ఆ మేరకు ఇండియా కూడా గత నవంబరులో కొన్ని హామీలు ఇచ్చింది. ప్రమాదం గ్రహించిన చైనా తానూ సహాయం చేస్తానంటూ ముందుకు వస్తోంది. జనవరి మొదటి వారంలో చైనా విదేశీ మంత్రి శ్రీలంక పర్యటించనున్నారు. జనవరి 7 తేదీ గానీ లేదా 9 తేదీ గానీ ఈ పర్యటన జరగనున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యటనలో శ్రీలంకకు నోరూరించే…