వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని…

‘మోడి బహిష్కరణ’కు అమెరికా చెల్లు చీటి

‘మోడి బహిష్కరణ’ విధానానికి ఇక ముంగింపు పలకాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీకి వీసా నిరాకరించే విధానాన్ని విడనాడాలని ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ప్రత్యేకంగా అమెరికా వెళ్ళి మరీ చేసుకున్న విన్నపం ఫలితం ఇచ్చిందనేందుకు సూచనగా అమెరికా రాయబారి నాన్సీ పావెల్ మరో రెండు రోజుల్లో మోడిని కలవనున్నారు. నాన్సీ పావెల్ కోరిక మేరకు గాంధీ నగర్ లో ఆమెను కలవడానికి మోడి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోడి అపాయింట్…

చాయ్, మోడిలతో బి.జె.పి రెడీ -కార్టూన్

– పదేళ్ళ నుండి తెలంగాణ బిల్లును నానబెట్టిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల కోసం మాత్రమే అలా చేసిందని, బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోవడంతో టి.బిల్లుపై హడావుడి పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది. ***                    ***                    *** బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పుడేం ఖర్మ! ఎప్పుడో మొదలైపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను కూడా ప్రచార సామాగ్రిగా మార్చుకుని మరీ అది ఎన్నడో రంగంలోకి దిగింది. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా వెనకబడి ఏమీ లేదు. రాహుల్…

6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా,…

ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?…

ఔషధాలపై అమెరికా ఆంక్షలు, భారత్ ఆందోళన

భారత ఔషధ కంపెనీలపై అమెరికా అలవిమాలిన ఆంక్షలు విధిస్తోంది. తనను తాను స్వేచ్ఛా వాణిజ్యానికి ఛాంపియన్ గా చెప్పుకుంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రపంచానికి స్వేచ్ఛా వాణిజ్య సూత్రాల గొప్పతనం గురించి లెక్చర్లు దంచే అమెరికా ఆచరణలో అవలంబించేది మాత్రం అందుకు విరుద్ధమైన సూత్రాలు. భారత ఔషధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ, భారతీయ కంపెనీలకు ఇటీవల కాలంలో వరుసగా భారీ జరిమానాలు విధించడం పట్ల ప్రభుత్వం ఆందోళన ప్రకటించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కమిషనర్…

పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి

కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ మెరైన్లను పైరసీ వ్యతిరేక చట్టం కింద విచారించడానికి భారత హోమ్ శాఖ అనుమతి ఇవ్వడంపై ఇటలీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఇటలీ విదేశీ మంత్రి ఆదివారం ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించగా సోమవారం ఇ.యు కూడా దాదాపు అదే తరహాలో హెచ్చరించింది. ఇటలీ మెరైన్లను అన్యాయంగా విచారిస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ఇటలీ, ఇ.యులు అల్టిమేటం జారీ చేశాయి. “మా మెరైన్లకు వ్యతిరేకంగా జరగబోయే లీగల్…

ఎ.పి పొలిటికల్ ఆటో ఎక్స్ పో -కార్టూన్

కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ లో ఆటో ఎగ్జిబిషన్ జరిగింది. ఆటో ఎగ్జిబిషన్ నూ రాష్ట్ర విభజన కేంద్రంగా వివిధ పార్టీల్లో సాగుతున్న రాజకీయాలను పోల్చుతూ గీసిన కార్టూన్ ఇది. కాంగ్రెస్: రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా విభజన రాజకీయాలకు సంబంధించి సోనియా ఒకవైపు వెళ్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. విభజనపై తమ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కిరణ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఆటో ఎక్స్ పో. తెలుగు దేశం:…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లించేస్తున్నారు -కత్తిరింపు

జనాన్ని విభజన రందిలో ముంచేసిన రాష్ట్ర పాలకులు తమ కార్యాల్ని నిర్విఘ్నంగా చక్కబెట్టుకుంటున్నారు. ఇ.పి.సి ఒప్పందాలకు విరుద్ధంగా జలయజ్ఞం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని పెరిగిన ధరల పేరుతో అదనంగా చెల్లించడానికి సి.ఎం, ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసేశారు. కనీసం 20,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గుత్తేదారుల పరం చేసే ఈ బృహత్కార్యాన్ని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ప్రచురించింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జనవరి 27 తేదీన సమావేశం జరగనుందని పత్రిక…

కోస్తాంధ్ర, హైద్రాబాద్ లది మిగులు బడ్జెట్

  బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ను హైద్రాబాద్, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ.. అన్న నాలుగు యూనిట్ లుగా విడదీస్తే అందులో హైద్రాబాద్, కోస్తాంధ్రలు మిగులు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు మాత్రం లోటు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. కోస్తాంధ్ర (7 జిల్లాలు) ప్రాంతం 684 కోట్ల మిగులు బడ్జెట్ కలిగి ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. హైద్రాబాద్ ఏకంగా 12,854 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్…

సోచి వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ విన్యాసాలు అద్భుతం! -ఫోటోలు

22వ శీతాకాల ఒలింపిక్స్ రష్యా నగరం సోచి లో ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అధ్యక్షుడు బషర్ కి మద్దతు ఇవ్వడం మానుకుంటే టెర్రరిస్టు దాడులకు గురికాకుండా సజావుగా సాగేలా చూస్తామని సౌదీ రాచరిక ప్రభుత్వంలో గూఢచార విభాగ నేత ప్రిన్స్ బందర్ బేరం పెట్టిన వింటర్ ఒలింపిక్స్ ఇవే. విఫలం అయినా, ఆటంకాలు ఎదురైనా విరుచుకుపడి దాడి చేద్దామని పశ్చిమ పత్రికలు ఆత్రంగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ కూడా ఇవే. ఒలింపిక్స్ కు…

లైంగిక వల, సైబర్ దాడులు… బ్రిటన్ గూఢచర్యం కళలివి

ప్రత్యర్ధి దేశాల ఏజెంట్లను వలలో వేసుకోవడానికీ, టార్గెట్ లను లొంగదీసుకోవడానికి బ్రిటిష్ గూఢచారులు అనేక ‘డర్టీ ట్రిక్స్’ ప్రయోగిస్తారని ఎడ్వర్డ్ స్నోడెన్ పత్రాలు వెల్లడించాయి. అందమైన యువతులను ప్రయోగించి లైంగికంగా ఆకర్షించి వలలో వేసుకోవడం, సైబర్ దాడులతో ప్రత్యర్ధుల ఇంటర్నెట్ కార్యకలాపాలను రికార్డు చేసి బహిర్గతం చేయడం ద్వారా అప్రతిష్టపాలు చేస్తామని బెదిరించడం… ఈ డర్టీ ట్రిక్స్ లో కొన్ని. ప్రత్యర్ధి ఏజంట్లు, హ్యాకర్లు, అనుమానిత టెర్రరిస్టులు, ఆయుధ వ్యాపార డీలర్లు, ఇంకా అనేక ఇతర నేరస్ధులను…

ఇంద్రధనుస్సు పారిపోయి నీటి మడుగున దాగిందా?

పుడమి వేడికి తల్లడిల్లిన ఇంధ్ర ధనుస్సు ఓజోన్ గొడుగు లేక నీటి మడుగున దాగిందా? నీటి మడుగున దాగిన ఇంద్రచాపం రంగుల వేళ్ళు చాచి ఊపిరి కోసం ఉపరితలాన్ని చేరుతోందా? నీటి గర్భం చీల్చుకున్న రంగుల ఉమ్మనీరు కొత్త ఊపిరి రాకను చాటుతోందా? హ్రదయ జలధిని వీడిన భావ తరంగం ఆనంద నాట్యంతో అంచులు దాటి పొర్లుతోందా? గుండె గుండం పేలిపోయి విలయ గండం ప్రకటిస్తోందా? జ్ఞానం కూరిన మెదడు మందుగుండు హాఛ్ మని తుమ్మిందా? దీర్ఘ…

తెలంగాణ: లైన్ క్లియర్, రాజీనామా యోచనలో కిరణ్

రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా పార్లమెంటులో ప్రవేశించనున్న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎమ్మేల్యేలు తదితరులు ప్రతిపాదించిన సవరణలలో కొన్నింటిని బిల్లులో చేర్చడానికి కేబినెట్ ఆమోదించింది. అయితే సీమాంధ్ర నాయకుల డిమాండ్లను ఏ మేరకు అంగీకరించారు అన్న అంశంలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు వివరాలను ముందే పత్రికలకు చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కావడంతో హోమ్ మంత్రి బిల్లు, సవరణల వివరాలను పత్రికలకు చెప్పలేదు.…

కరుగుతున్న కాలానికి ప్రతీక 15వ లోక్ సభ -కార్టూన్

కార్టూనిస్టుల ఊహలు ఒక్కోసారి ఎంత అందంగా ఉంటాయో వివరించే కార్టూన్ ఇది! 15వ లోక్ సభ, 16వ లోక్ సభల మధ్య సంధి కాలాన్ని ఈ కార్టూన్ లో దర్శించవచ్చు. లేదా 16వ లోక్ సభలోకి జారుతున్న 15వ లోక్ సభ స్వరూపాన్ని కూడా ఇందులో చూడవచ్చు. కాలాన్నీ, రాజకీయాలను, కాలంతో పాటు మారుతున్న రాజకీయాల స్వరూపాన్నీ కూడా ఇందులో చిత్రించే ప్రయత్నాన్ని కార్టూనిస్టు చేశారు. 15వ లోక్ సభ చివరి సెషన్ కు అనేక బిల్లుల్ని…