ప్రశ్న: వోట్-ఆన్-అకౌంట్ అంటే?

ప్రశ్న (మల్లిఖార్జున్): సాధారణ బడ్జెట్ కీ, వోట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ కీ తేడా చెప్పండి? సమాధానం: క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఖర్చులు గడుపుకోవడానికి ప్రతిపాదించే బడ్జెట్ నే వోట్-ఆన్-అకౌంట్ అంటారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అవసరం వస్తుంది. పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ ఆమోదించాలంటే సభల్లో సంతృప్తికరంగా చర్చలు జరగాలి. ఈ చర్చలన్నీ ముగియాలంటే సమయం తీసుకుంటుంది. కొత్త బడ్జెట్ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. పాత ప్రభుత్వం పూర్తి…

అగ్ని కొండల దేశంలో మరో బూడిద కాలం -ఫొటోలు

ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం తరహాలో ఇండోనేషియా దేశస్ధులు బూడిద కాలం కూడా ఒకటుందని చదువుకోవాల్సిన రోజులు. అగ్ని పర్వతాలకు నిలయం అయిన ఇండోనేషియా ప్రజలకు అగ్ని కొండలు బద్దలు కావడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం వరుస పేలుళ్లతో భయోత్పాతం సృష్టిస్తున్నాయి. సినబాంగ్ అగ్ని పర్వతం ఆరు నెలల కాలంలో మూడోసారి బద్దలై నిప్పులు చెరుగుతుండగా దానికి కెలుద్ అగ్ని పర్వతం కూడా జత కావడంతో అనేక మంది మరణించారు. ఫిబ్రవరి 14 తేదీన జావా ద్వీపంలోని…

పెప్పర్ స్ప్రే కాదు, నిషేదిత రసాయనం

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ ను లోక్ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోడానికి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే జల్లారని అందరూ భావిస్తున్నారు. పత్రికలు కూడా అదే చెప్పాయి. లగడపాటి కూడా తాను పెప్పర్ స్ప్రే చల్లానని చెప్పారు. అయితే ఆయన జల్లింది పెప్పర్ స్ప్రే కాదని మరింత ప్రమాదకరమైన నిషేధిత రసాయనం అని తెలుస్తోంది. లగడపాటి తెచ్చిన కేనిస్టర్ లో ఉన్నది యుద్ధాల్లో సైతం నిషేధించిన కేప్సాయ్సిన్ అని ది హిందు తెలిపింది. కాప్సికమ్ మొక్కల…

పార్లమెంటు గొంగట్లో అప్రజాస్వామిక వెంట్రుకలు ఏరగలమా?

(పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! ఆర్టికల్ కింద మిత్రుల వ్యాఖ్యలకు రాసిన సమాధానంలో కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) ********* పార్లమెంటులో సభ్యులు ప్రజాస్వామికంగా వ్యవహరించడం అంటే ఏమిటి? ఎవరి సీట్లలో వారు కూర్చొని ఆయా బిల్లులపై తమ పార్టీల వైఖరికి కట్టుబడి అభిప్రాయాలు చెప్పడం. ఓటింగ్ జరిగినప్పుడు ఓటు వేయడం. సభాపతి అవకాశం ఇచ్చినపుడు మాట్లాడడం. సభా కార్యకలాపాలు దాదాపు అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఎవరు ఎప్పుడు మాట్లాడాలీ, ఏ అంశం…

లగడపాటిపై దాడి జరగలేదు -ఐ.బి.ఎన్ విలేఖరి (వీడియో)

ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే జల్లానని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ చెప్పడం అబద్ధం అని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ విలేఖరి ఈ వీడియోలో చెబుతున్నారు. తాను ప్రెస్ గ్యాలరీలో ఉన్నానని సభలో మాత్రం లగడపాటిపై ఎవరూ దాడి చేయలేదని విలేఖరి చెప్పారు. మొత్తం వ్యవహారం 5 నిమిషాల్లో ముగిసిపోయిందని, ఈ సమయంలో లగడపాటి తనంతట తానే పెప్పర్ స్ప్రే జల్లారు గాని, ఆత్మరక్షణ చేసుకుని పరిస్ధితులు ఆయన ఎదుర్కోలేదని ఈమె చెబుతున్నారు. (వీడియో అందజేసినవారు: టి.జి.టాకీస్)

పార్లమెంటులో ఆంధ్ర ప్రదేశ్ -కార్టూన్

మేధావి: ఫిషనా లేక ఫ్యూషనా? సామాన్యుడు: ఏదీ కాదు పెప్పర్ స్ప్రే *** భారత దేశానికి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం.  సభలో కూర్చునేవారు ఈ సంగతి చెబుతారు. సభ బయట ఉన్న మనం అది నిజమే కాబోలని నమ్ముతున్నాం. ప్రజాస్వామ్య దేవాలయం ప్రాశస్త్యం గురించి అనేక పుస్తకాలు, పాఠ్య గ్రంధాలు, పరిశోధనా పత్రాలు చెప్పే సూత్రాలకు ఇక కొదవే లేదు. కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం ఇందుకు విరుద్ధం. పార్లమెంటులో సజావుగా చర్చలు జరిగిన సందర్భాలు చాలా…

జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్

దేశ రాజకీయ చిత్రపటంపై తమను తాము ఉప్పు-నిప్పుగా చెప్పుకునే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తాటి మీదికి రావడంతో ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ దశలోనే ఓటమిని ఎదుర్కొంది. దానితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసే దిశలో ప్రయాణిస్తోంది. ముఖేష్ అంబానీపై రాష్ట్ర ఎ.సి.బి చేత అవినీతి కేసు నమోదు చేయించినందుకే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటయ్యాయని అరవింద్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎంత దూరం అయినా…

పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! -వీడియో

‘ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే చల్లాను’ అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్యానికి తీరని కళంకం అనీ, దుర్దినం అనీ, మాయని మచ్చ అనీ, సభ్యుడిని ఎన్నికల నుండి డీబార్ చేయాలని, దేశానికి చెడ్డపేరు తెచ్చారని దాదాపు అందరూ విమర్శిస్తున్నప్పటికీ లగడపాటి పాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నారు. టి.డి.పి ఎం.పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాపాడడానికి పరుగెత్తానని, తమపై గూండాల్లాంటి ఎం.పిలు దాడికి వచ్చారనీ, అందుకే ఆత్మ రక్షణ…

నూతన దిగజారుడుతో వేగడం ఎలా -ది హిందు సంపాదకీయం

(లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో పెప్పర్ స్ప్రే జల్లి తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఈ రోజు -ఫిబ్రవరి 14- ది హిందూ పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) సుదీర్ఘమైన, నిష్ప్రయోజనకరమైన పార్లమెంటరీ గలాటా చరిత్ర కలిగిన దేశానికి కూడా సభ ముందుకు సాగకుండా అడ్డుకోవడం కోసం ఒక సభ్యుడు తన తోటి సభ్యుల పైన పెప్పర్ స్ప్రే జల్లడానికి తెగించడం కంటే మించిన సిగ్గుమాలినతనం, గౌరవ హీనం మరొకటి ఉండబోదు. సభలో…

బ్రిటన్ ను మళ్ళీ ఊపేసిన తుఫాను, మరొకటి తయారు -ఫోటోలు

రెండు నెలలుగా ఎడతెరిపి లేని మంచు తుఫానులతో, వర్షాలతో, వరదలతో తడిసి ముద్దయిన ఇంగ్లండ్ ను బుధవారం నుండి శుక్రవారం వరకు మరో తుఫాను ఊపేసింది. 108 కి.మీ వేగంతో వీచిన గాలులకి పశ్చిమ, నైరుతి ఇంగ్లండ్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కురుస్తున్న వర్షాన్ని ఇముడ్చుకోవడానికి భూగర్భంలో ఇక ఖాళీ లేదనీ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా అనేక కాలనీలు, నగరాలు, పల్లెలు, రోడ్లు జలమయమై విశాలమైన తటాకాలను తలపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలోనే అత్యధిక వరదలు…

కేజ్రీవాల్ పని: ఆజియన్ స్టేబుల్స్ శుభ్రపరచడం -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్ పని తీరు (వర్కింగ్ స్టైల్) పైన సున్నితమైన విమర్శ ఈ కార్టూన్. CLEANING OF AUGEAN STABLES అనే ఆంగ్ల వాడుకను కార్టూనిస్టు ఇందులో వినియోగించారు. ఆజియన్ అనే ఆయన గ్రీకు పురాణాల్లో ఒక రాజు. ఆయన వద్ద స్వర్గం నుండి ప్రసాదించబడిన పశు సంపద భారీగా ఉండేదిట. భారీ సంఖ్యలో ఉన్నందున వాటి విసర్జనాలు కూడా పెద్ద మొత్తంలో ఉండేవి. అందువలన ఆయనగారి పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం ఎవరికైనా అసాధ్యం. హెర్క్యూలియస్ అనే…

2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

లోక్ సభలో తెలంగాణ బిల్లు, లగడపాటి పెప్పర్ స్ప్రేతో కల్లోలం

తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగానే లగడపాటి బరితెగించి పాల్పడిన చర్య తీవ్ర అల్లకల్లోలానికి దారి తీసింది. లోక్ సభ వెల్ లోకి ప్రవేశించిన రాజగోపాల్ జేబులో నుంచి పెప్పర్ స్ప్రే (మిరియాల పొడి కలిపిన ద్రావకం) బైటికి తీసి సభ నలువైపులా జల్లడంతో స్పీకర్ తో సహా పలువురు సభ్యులు అశ్వస్ధతకు గురయ్యారు. రాజగోపాల్ సృష్టించిన గందరగోళం పలువురి ఖండన మండనలతో పాటు 17…

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు! సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా? అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్…

ఇండియాపై ఐరాసకు ఇటలీ ఫిర్యాదు

ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ…