ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?

హరీష్: ఇవాళ ప్రభాత్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఈనాడులో ప్రచురించారు. సరళీకరణ వల్ల  ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన వివరించారు. కాని ఆ సరళీకరణ విదానాల వల్లనే మనం ఆర్థికంగా మెరుగయ్యామని చెప్తుంటారు కదా. మేమూ అలానే అనుకుంటున్నాం. చాలా  మంది కొత్తవాళ్ళకి అవకాశాలు అందించాయి  కదండి. దాని గురుంచి కాస్త విపులంగా వివరించగలరు. సమాధానం: ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది నిజమే. సరళీకరణ విధానాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినవి కావు. భారత దేశ మార్కెట్ ను…

ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు

అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్)  గాలింపు జరుపుతున్నాయి.…

శవ పేటికలే ఆంటోని క్రెడిట్? -కార్టూన్

రక్షణ మంత్రి అరక్కపరంబిల్ కురియన్ ఆంటోని 2014 ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. స్వయంగా చెప్పలేదు గానీ ఒక కేరళ కాంగ్రెస్ నాయకునితో చెప్పించారు. రాజ్యసభ సభ్యులయిన ఎ.కె.ఆంటోని గతంలో కూడా ఎప్పుడూ లోక్ సభకు పోటీ చేసిన రికార్డు లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా ఆంటోని కొద్ది సేపు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కానీ అంతకు మునుపు ఆయన వేరే కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. భారత నావికా బలగాలకు చెందిన…

మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు

మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా…

ప్రశ్న: భారత్ విదేశాలపై దాడి ఎందుకు చేయలేదు?

కె.బ్రహ్మయ్య: 1) ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ESPECIALLY FOR MUSLIMS INVADERS. 2) గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు? IS THERE NOT ENOUGH STRENTH FOR INDIA? సమాధానం: ప్రాచీన క్షాత్ర పరంపర…

విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు! తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.…

ఆచూకీ లేని విమానం, టెర్రరిజం అనుమానం

దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, చైనా దేశాలకు చెందిన విమానాలు, నౌకలు ఉమ్మడిగా గాలిస్తున్నప్పటికీ వారి గాలింపు ఫలవంతం కాలేదు. అమెరికా, ఐరోపాల సాయం తీసుకోవడానికి నిర్ణయించినట్లు మలేషియా మంత్రులు ప్రకటించారు. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ఇద్దరు ప్రయాణీకులు విమానంలో ఉన్నందున టెర్రరిస్టు చర్యకు గురై ఉండొచ్చన్న అవకాశాన్ని ఎవరూ నిరాకరించడం లేదు. విమానం ప్రయాణించిన తీరును బట్టి అది…

239 మందితో సముద్రంలో కూలిన మలేషియా విమానం?

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరిన బోయింగ్-777 విమానం ఒకటి సముద్రంలో కూలిపోయినట్లు భయపడుతున్నారు. బయలుదేరిన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయిన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దక్షిణ చైనా సముద్రంలో 10 నుండి 15 కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఇంధనం చూసి అనుమానించిన వియత్నాం నావికా దళాల ద్వారా మొదట సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం…

హిందు పండగలతో పోలిన కేధలిక్ కార్నివాల్ -ఫోటోలు

భారత దేశంలో పండగలు సాంస్కృతిక కలయికలకు వేదికలుగా నిలుస్తాయి. శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం, వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం, దీపావళి రోజున బాణసంచా పేలుళ్లు, సంక్రాంతి సంబరాల్లో పంటలు, అల్లుళ్ళ సందడి మొదలయినవన్నీ భారత దేశంలో సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండగలు కాకుండా వివిధ నదుల వద్ద జరిగే పుష్కరాలు, కుంభమేళాల సంగతి చెప్పనే అవసరం లేదు. రోజువారీ శ్రామిక జీవితం నుండి ఆటవిడుపుగానూ, పూర్వీకులు సాధించిన విజయాలను సెలెబ్రేట్ చేసుకునే రోజులుగానూ…

ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… ఏది ధర్డ్ ఫ్రంట్?

దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది. ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో…

మోడి నన్నెందుకు కలవరు, నేను టెర్రరిస్టునా? -ఎ.కె

అరవింద్ కేజ్రీవాల్ నుండి దూరంగా పారిపోతున్న నరేంద్ర మోడి మరోసారి తన పరికితనం చాటుకున్నారు. రిలయన్స్ గ్యాస్ ధరల పెంపు విషయమై గుచ్చి గుచ్చి అడిగినా బదులు ఇవ్వని మోడి చివరికి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా గుజరాత్ వచ్చి ఇంటర్వ్యూ కోరినా మొఖం చాటేశారు. తనను కలవడానికి వస్తున్న అరవింద్ బృందాన్ని తన నివాసానికి 5 కి.మీ దూరంలోనే అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కలవకపోతే పోయే, కలవలేకపోతున్నానని కనీసం ఫోన్ కాల్…

ఉక్రెయిన్: సిగ్గులేని ద్వంద్వ నీతి నీది, అమెరికాతో రష్యా

ఉక్రెయిన్ విషయంలో పరమ అబద్ధాలను ప్రచారంలో పెట్టిన అమెరికాను రష్యా ఎడా పెడా కడిగిపారేసింది. ద్వంద్వ నీతిని అనుసరించే అమెరికా, సిగ్గు లేకుండా తనకు నీతులు చెప్పడం ఏమిటని జాడించింది. స్వతంత్ర దేశాల మీదికి దండెత్తి ఆక్రమించుకునే నీచ చరిత్ర అమెరికాదే తప్ప తనది కాదని గుర్తు చేసింది. తప్పుడు కారణాలతో అమెరికా సాగించిన దండయాత్రలు, మానవ హననాల జాబితా చదివింది. ఉక్రెయిన్ లో కృత్రిమ ఆందోళనలను రెచ్చగొట్టింది చాలక తనపై తప్పుడు ప్రచారానికి లంకించుకోవడం ఏమిటని…

ఉక్రెయిన్ పై మొదటి వేటు వేసిన ‘పడమటి గాలి’

‘పడమటి గాలి’ ఆరోగ్యానికి మంచిది కాదని వింటుంటాం. ‘అబ్బ! పడమటిగాలి మొదలయిందిరా’ అని పెద్దవాళ్ళు అనుకుంటుండగా చిన్నప్పుడు విని ఉన్నాం. అది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. సాంస్కృతికంగా పశ్చిమ దేశాల సంస్కృతి ఎంతటి కల్లోలాలను సృష్టిస్తున్నదో ‘పడమటి గాలి’ నాటకం ద్వారా రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు శక్తివంతంగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇ.యు వైపుకి ఉక్రెయిన్ జరిగిన ఫలితంగా ఇప్పుడు అదే పడమటి గాలి, ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ప్రజల ఆర్ధిక ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో…

రష్యాలో విలీనానికి క్రిమియా పార్లమెంటు ఆమోదం

పశ్చిమ రాజ్యాల తెరవెనుక మంతనాలను వెక్కిరిస్తూ క్రిమియా పార్లమెంటు రష్యాలో విలీనం చెందడానికి ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత (Teritorial Integrity) ను రష్యా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, ఇ.యులు ఒకవైపు రష్యాపై ఆంక్షల బెదిరింపులు కొనసాగిస్తుండగానే క్రిమియా పార్లమెంటు తన పని తాను చేసుకుపోయింది. 1954లో సోవియట్ హయాంలో ఉక్రెయిన్ కు కానుకగా ఇవ్వబడిన క్రిమియా ఇప్పుడు మళ్ళీ స్వస్ధలం చేరడానికి రంగం సిద్ధం అయింది. మార్చి 16 తేదీన జరగబోయే రిఫరెండంలో ప్రజలు…

సంచలన లీక్: కీవ్ హత్యలకు బాధ్యులు పశ్చిమ దేశాలేనా?

ఉక్రెయిన్ ఆందోళనలకు సంబంధించి ఓ సంచలన నిజం వెలుగు చూసింది. ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం కీవ్ వీధుల్లో చెలరేగిన హత్యాకాండ అనంతరం బలవంతంగా కూల్చివేయబడిన సంగతి తెలిసిందే. రష్యా అనుకూల అధ్యక్షుడుగా పశ్చిమ దేశాలు చెప్పే విక్టర్ యనుకోవిచ్ ఈ హత్యాకాండ జరిపించాడని పశ్చిమ దేశాలు, పత్రికలు ఆరోపించాయి. భవనాలపైన ఉన్న స్నైపర్లు ఆందోళనకారులపై కాల్పులు జరిపారని స్నైపర్లను నియోగించింది అధ్యక్షుడే అని అవి ఆరోపించాయి. అయితే 90 మందికి పైగా చనిపోయిన హత్యాకాండకు…