తప్పు లేదని నిర్ధారించినా సస్పెన్షన్ ఎందుకు?

ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాతే…

దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!

ది హిందు సంపాదకీయం చివరలో పేర్కొన్న ‘నిరాకరణ నేరం’ అప్పుడే జరిగిపోయింది కూడా. విద్యార్ధుల ఆత్మహత్యకు తన లేఖలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా నిరాకరణ జారీ చేసేశారు.  ఒక్క బండారు మాత్రమే కాదు, బి‌జే‌పి జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ యూనివర్సిటీ సందర్శనను ఖండిస్తూ పనిలో పనిగా “రోహిత్ దళితుడు కావడానికీ, అతనిని సస్పెండ్ చేయడానికి ఎలాంటి సంబంధమూ లేదు”…

దళిత స్కాలర్ మరణం -ది హిందు

[Death of a Dalit scholar శీర్షికన జనవరి 19 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య, ప్రతిభా సంపన్నులతో నిండినవన్న భ్రాంతిని కలుగజేయడంలో పేరెన్నిక గన్న భారతీయ ఉన్నత విద్యా సంస్ధలు భూస్వామ్య దురహంకార గుణాల చేత వేధింపులకు గురవుతున్నాయనడానికి మరో విషాదకర సాక్షం.  (యూనివర్సిటీ) పాలకులు సస్పెండ్ చేసిన…

UoH విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య లేఖ!

ఒక నక్షత్రం రాలిపడలేదు; నేరుగా దివికే ఏగి వెళ్లింది. చుక్కల చెంతకు వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్లింది. ఆత్మలపై, దైవాలపై, దెయ్యాలపై నమ్మకంతో కాదు సుమా! తనను తాను ‘అచ్చంగా ఒక THING ని’ మాత్రమే అని తెలుసుకుని మరీ వెళ్లిపోయింది. ఈ విశ్వం అంతా నక్షత్ర ధూళితో నిర్మితమై ఉన్నదన్న సర్వజ్ఞాన్య ఎరికతో ఆ పదార్ధం జీవాన్ని చాలించుకుని నక్షత్ర ధూళితో తిరిగి కలిసేందుకు సెలవంటూ వెళ్లింది. ఆత్మహత్య పాపం కాకపోవచ్చు గానీ పరికితనం. నిజంగా…

బేసి-సరి అమలు: ఒక పరిశీలన

కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకం వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా లేదా అన్నది కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే. కావాలంటే దానికీ సమాధానం చెప్పుకుందాం, ఉందో లేదో అని! ఢిల్లీ ప్రభుత్వం స్వల్పంగా కాలుష్యం తగ్గింది అని చెబుతోంది. కాదు.., స్వల్పంగా కూడా తగ్గలేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం భావిస్తున్నంతగా తగ్గలేదు కావచ్చు కూడా. ఎందుకంటే… 2013లో కాన్పూర్ ఐ‌ఐ‌టి వారు ఢిల్లీలో సర్వే మరియు పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ గాలిలో…

బేసి-సరి: పిటిషనర్లకు సుప్రీం పెనాల్టీ మందలింపు

ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకానికి భారత దేశ అత్యున్నత న్యాయస్ధానం నుండి మద్దతు లభించింది. పధకానికి వ్యతిరేకంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పిటిషన్ దారులను తీవ్రంగా మందలించింది. ప్రచారం కోసం పిచ్చి వేషాలు వేస్తే భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. “కాలుష్యంతో జనం చచ్చిపోతున్నారు. మేము కూడా కార్-పూలింగ్ పాటిస్తున్నాం. మీరేమో ఆ పధకాన్ని సవాలు చేస్తారా?” అని చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్ పిటిషనర్లను సూటిగా ప్రశ్నించారు. పిటిషనర్లు అప్పటికే…

ఢిల్లీ కాలుష్యం: బేసి-సరి పధకం విజయవంతం! -ఫోటోలు

బి.జె.పి నేతల శాపనార్ధాలను వమ్ము చేస్తూ ఢిల్లీలో బేసి-సరి పధకం విజయవంతం అయింది. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన రీతిలో తమ పధకానికి స్పందించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు ఢిల్లీ దారి చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాదని ప్రజలే దానిని సొంతం చేసుకున్నారని ప్రభుత్వం వారికి కేవలం సహాయం మాత్రమే చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కలుషిత గాలి కలిగిన నగరంగా…

పునరావాసం కల్పించగల న్యాయం (తీర్పు)! -ది హిందు

[డిసెంబర్ 21, 2015 తేదీన ది హిందు “Justice that is rehabilitative” శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ******* పరిపక్వ సమాజం జనం పెడబొబ్బలకు లొంగి తన న్యాయ వ్యవస్ధకు ఆధారభూతమైన పటుతర న్యాయ సూత్రాలను, సామాజిక నియమాలను తలకిందులు చేయదు. ప్రత్యేక శిక్షణా గృహంలో 3 సంవత్సరాల పాటు గడపాలని విధించిన శిక్ష ముగిశాక డిసెంబర్ 2012 నాటి ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులోని బాల నేరస్ధుడిని విడుదల చేసిన విషయంలో పెల్లుబుకిన…

దేశం దృష్టికి రాని ఆరేళ్ళ నిర్భయ

నిర్భయపై అత్యాచారం చేసిన ఆరుగురిలో ఒకరైన బాల నేరస్ధుడిని విడుదల చేసినందుకు ప్రస్తుతం దేశ్యవ్యాపితంగా అనేకమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిలో నిర్భయ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది బాల నేరస్ధుడే అన్న అభిప్రాయం మొదటి నుండీ వ్యాపించి ఉండడంతో అతన్ని వదిలిపెట్టడం పట్ల ఆగ్రహం తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు బాల నేరస్ధుడు విడుదల కానున్నాడన్న నిజాన్ని తట్టుకోలేక నిద్ర లేని రాత్రులు గడుపుతూ తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని…

మెనూ స్మృతి -కత్తిరింపు

అక్టోబర్ 29 తేదీన ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం ఇది. భారత దేశ పేద ప్రజల ఆహారపు అలవాట్లపై హిందూత్వ ప్రారంభించి సాగిస్తున్న సాంస్కృతిక దాడిని సమర్ధవంతంగా ససాక్షారంగా తిప్పి కొట్టిన ఈ వ్యాసం మల్లంపల్లి సాంబశివరావుగారి విరచితం. ఇలాంటి ప్రజాస్వామిక భావజాలంతో కూడిన వ్యాసాలను ప్రచురించడం ఆంధ్ర జ్యోతి పత్రికకు మాత్రమే సాధ్యం అనుకుంటాను. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరప తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను కోర్టులే నిషేధించడం అప్రజాస్వామిక పరిణామం. బీఫ్ మాంసాన్ని…

చూడు చూడు నీడలు.. మూసాహార్ వాడలు -ఫోటోలు

వీళ్ళు మూసాహార్ అనబడే ఎలుకాహారులు. భోజ్ పురిలో ముసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన కులం పేరు. బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్దాలు దాటిపోయింది. ఆధునిక భారతావని, సర్వ స్వతంత్ర గణతంత్ర సామ్యవాద లౌకికవాద రాజ్యంగా అవతరించాక  వారు షెడ్యూల్డ్ కులంగా గుర్తించ బడ్డారు. కానీ ఎన్ని పేర్లు పెట్టినా, ఓటు చట్టాలు చేసి…

జైట్లీ రక్షణకే సి.బి.ఐని ఉసిగొల్పారు -ఢిల్లీ సి.ఎం

కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి…

ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ…

సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…