ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!

ఫేస్ బుక్ ఖాతాదారుల్లో కనీసం నూటికి పది మంది తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం ఫేస్ బుక్ వినియోగదారుల్లో పది శాతం మంది తమ ‘వాల్‘ పైన అభ్యంతరకరమైన, అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేయబడిన అనుభవాలు ఎదుర్కొన్నారు. తమకు నచ్చని యూజర్‌లను తిట్టడం, అవమానించడం, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం బూతురాయుళ్ళ పనిగా ఉంటోంది. బెదిరిస్తూ ప్రైవేటు సందేశాలు ఇవ్వడం కూడా వీరి పనుల్లో ఒకటని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఇంకా ఘోరం…

నీరుగారిన అత్యాచార వ్యతిరేక చట్టం?

సోమవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం అత్యాచార వ్యతిరేక చట్టం మరింత నీరుగారినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్లో మెరుగుగానే ఉన్నప్పటికీ ఇతర అంశాలలో రాజకీయ పార్టీల ఒత్తిడితో చట్టాన్ని బలహీనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ బిల్లును అడ్డుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో బిల్లు చట్టంగా రూపొందడం పైన సందిగ్ధత ఏర్పడింది. అంగీకార వయసు…

హిందూయిజం అసలు మతమే కాదు -ఆదాయపన్ను శాఖ

ఆదాయపన్ను ఎగవేయడం కోసం మత విశ్వాసాలను కూడా కాలదన్నుకుంటున్న విచిత్ర పరిస్ధితి! ఆ ట్రస్టు కార్యక్రమాలన్నీ మతపరమైనవే. కానీ ఆదాయపన్ను మినహాయింపు కోసం హిందూమతాన్ని మతం కాదనీ, హిందువులు మతావలంబకులు కాదని వాదిస్తోంది. శివుడు అసలు దేవుడే కాదని, ఆ మాటకొస్తే దేవుడి శిల్పాలు ఉన్నంత మాత్రాన అది దేవాలయం కాదని కూడా ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ వాదనను అంగీకరించి ఆదాయపన్ను శాఖ…

ఇంకో అత్యాచారం, ఈసారి స్విస్ మహిళ పైన

జర్మనీ మహిళ పైన ఒడిషా మాజీ డి.జి.పి పుత్ర రత్నం ఏడేళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో నిందితుడి గుర్తింపు గురించి నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు మల్లగుల్లాలు పడుతుండగానే మధ్య ప్రదేశ్ లో ఒక స్విస్ మహిళ పైన అత్యంత దారుణంగా ఎనిమిది మంది భారతీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ బస్సులో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దరిమిలా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇప్పటికే మారుమోగుతున్నాయి. స్విస్ బాధితురాలి పైన జరిగిన…

సిక్సర్ సిద్దూయిజం: అది ఆల్టిట్యూడ్ కాదు, యాటిట్యూడ్

క్రికెట్ ఆటలోనే కాక క్రికెట్ కామెంటరీలో కూడా తనదైన బాణీ సృష్టించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దు శనివారం కలకాలం గుర్తుంచుకోదగ్గ మాటలు చెప్పాడు. టెస్ట్ మ్యాచుల్లో సైతం సిక్సర్లతో విరుచుకుపడి ‘సిక్సర్ సిద్దు’గా పేరుగాంచిన నవజ్యోత్ సింగ్ సిద్దు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో కామెంటరీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యాక ఇండియా కొత్త ఓపెనింగ్ జంటతో ఆట ప్రారంభించింది. శిఖర్ ధావన్ ఈ మ్యాచ్…

స్టింగ్ ఆపరేషన్: తలలు తెగి పడుతున్నాయ్

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఫలితాలు చూపిస్తోంది. బలి పశువుల తలలు తెగిపడుతున్నాయి. సమస్య మూలాలను కదిలించడానికి బదులు జీతగాళ్లను బలి తీసుకునే కార్యక్రమం మొదలయింది. అందులో భాగంగా మనీ లాండరింగ్ కి అంగీకరిస్తున్నట్లు రహస్య కెమెరాల సాక్షిగా దొరికిపోయిన అధికారులను ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సస్పెండ్ చేసింది. బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయ్యేవరకు వారు సస్పెన్షన్ లో ఉంటారని సదరు బ్యాంకు తెలియజేసింది. రెండు వారాల లోపు విచారణ పూర్తవుతుందని బ్యాంకు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ తెలియజేసింది.…

వీడు మామూలోడు కాదు!

తవ్వే కొద్దీ తవ్వుకున్నంత! అక్రమాలు పుట్టలే పుట్టలు!! ఒకే ఒక్కడు; ఐనా ఒంటి చేతితో పుట్టించిన అక్రమ సర్టిఫెట్లకు కొదవ లేదు!! ఒక పేరుతో బి.టెక్ చదివి మరో పేరుతో చదివినట్లు సర్టిఫికేట్ పుట్టించిన బెట్టి మొహంతి అదే సర్టిఫికేట్ తో ఏకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులోనే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు కొట్టేశాడు. జర్మనీ యువతిపై అత్యాచారం జరిపిన కేసులో దోషిగా తేలిన యువకుడు పెరోలుపై బయటికొచ్చి పరారీలో ఉండగానే ఇవన్నీ ఎలా అమరుతాయి? ఉన్నత స్థాయిలోని…

ఢిల్లీ అత్యాచారం నిందితుడు రాంసింగ్ హత్య?

ఫిజియో ధెరపీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతుండగా అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులోని ఇతర ఖైదీలు రామ్ సింగ్ ని హత్య చేశారని, హత్య చేశాక సెల్ గేటు ఊచలకు వేలాడగట్టారని వారు ఆరోపిస్తున్నారు. రామ్ సింగ్ ను చంపుతామని ఖైదీలలో కొందరు మొదటి నుండి చెబుతున్నారని, ఆ మేరకు…

‘సెక్యులరిజం అంటే ‘ఇండియా ఫస్ట్’, మోడి కొత్త నిర్వచనం

గుజరాత్ స్త్రీల పోషకాహార లోపానికి ఎవరూ ఊహించలేని కారణం కనిపెట్టి అటు సామాన్యులను, ఇటు శాస్త్ర పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నరేంద్ర మోడి ఈసారి ‘సెక్యులరిజం‘ కు కొత్త నిర్వచనం కనిపెట్టారు. సెక్యులరిజం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియాను మొదటి స్ధానంలో నిలబెట్టడం అనీ, అన్ని మతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తే అదే సెక్యులరిజం అనీ ఆయన నిర్వచించారు. బిజెపి విదేశీ మిత్రులు (Overseas Friends of BJP) ఏర్పాటు చేసిన వీడియో…

ఆడ శిశువుల పీక నులుముతున్న ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆడ శిశువుల పాలిట వధ్య ప్రదేశ్ గా మారుతోంది. కడుపులో ప్రాణం పోసుకున్న వెంటనే పుట్టబోయేది ఆడపిల్లలేనని చెప్పడానికి కార్పొరేట్ ఆసుపత్రులు సైతం క్యూ కట్టడంతో ఆడ పిండాలు ఎదగకుండానే పీక నులమడానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఆడ పిల్లల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి స్వయంగా తెలియజేశారు. ఆడ శిశువులను గర్భంలోను, పురిటిలోను చంపడాన్ని నివారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో…

కొంత బుద్ధి, కొంత జ్ఞానం

బొమ్మలు, సంభాషణల రూపంలో ఉన్న కింది కొటేషన్లను నాకొక మిత్రుడు ఈ మెయిల్ చేశాడు. వీటిని చదివిన వెంటనే నలుగురితో పంచుకోవాలన్న కొరిక బలంగా కలిగింది. “ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విచారం పంచుకుంటే తరుగుతుంది” అంటారు గదా! బహుశా ఆనందం కోవలోకి జ్ఞానం కూడా వస్తుందనుకుంటాను. ఈ బొమ్మలలో వ్యక్తం అవుతున్నది అనుభవజ్ఞులు సమకూర్చిన జ్ఞానం కనుక పంచుకుంటే మరింత ఉపయోగమే కదా! 1)  ఏది నిజం? నిజం అని భావించేవి చాలా వరకు సాపేక్షికమే. ముఖ్యంగా…

పాప పుట్టిందా? ఐతే తండ్రిని అడగండి!

(ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయిన ఎం.వి.రమణ మూర్తి ‘ది హిందు‘ పత్రిక రాసిన వ్యాసానికి యధాతధ అనువాదం ఇది. చాలా మంది విస్మరించే ఒక శాస్త్రీయ వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఒక సామూహిక విస్మరణను సవరించుకుంటే ఆడపిల్లల బతుకులకు కాస్తయినా గ్యారంటీ లభిస్తుందని ఆశిస్తూ ఆయన ఈ వ్యాసం రాసినట్లు కనిపిస్తోంది. మహిళా లోకం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేతకు రచయిత సూచించిన పరిష్కారానికి పరిమితులు ఉన్నప్పటికీ…

మదర్ థెరిసా దయ, నిస్వార్ధం ఒట్టి మిథ్య -పరిశోధకులు

మదర్ థెరిసా గురించి ప్రచారంలో ఉన్న సుగుణాలు ఒట్టి మిథ్య అని ముగ్గురు కెనడా పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవాలను విశ్లేషిస్తే దయామయి, నిస్వార్ధపరురాలు అన్న సుగుణాలు ఆమెకు నప్పవని తమ పరిశోధనలో తేలినట్లు మాంట్రియల్ యూనివర్సిటీ, ఒట్టావా యూనివర్శిటీల పరిశోధకులు తెలిపారని ఎ.ఎన్.ఐ వార్తా సంస్థ తెలియజేసింది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేకమంది దాతలనుండి వందల మిలియన్ల డాలర్లు విరాళాలుగా సేకరించిన థెరిసా ఆ డబ్బుని తాను చెప్పిన లక్ష్యాలకు వినియోగించలేదని, ఆమె రాజకీయ సంబంధాలు…

హిందువుల కంటే నాస్తికులే ఎక్కువ!

నాస్తికులంటే … అదో తిట్టు పదంగా భావించినకాలముంది. దేవుడూ, భక్తీ, పూజలూ, మొక్కుబడులూ, స్తోత్రాలూ… వీటినిమారుమాటాడకుండా ఆమోదించాలనేమీ లేదనీ; వాటి ఉనికినీ, ప్రయోజనాన్నీ ప్రశ్నించొచ్చనీ, అలా చేసే నాస్తికులు అనేవారు కూడా ఉంటారనీ- ఇదేమీతెలియని తరం ప్రస్తుతం ఉంది! ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ‘ఈనాడు’లో వచ్చిన ఒక వార్త విశేషంగా అనిపించింది! దీన్ని ఎంతమంది గమనించారో గానీ, దాని ముఖ్య విషయాలను ఇక్కడ ఇస్తున్నాను. ”ప్రపంచంలో ఏ మతాన్నీ ఆచరించని వారు ఉన్నారు. ఏ మతాన్నీ ఆచరించనివారు…

పాలుగారే పసికూనలు వాళ్ళు; అత్యాచారం చేసి చంపేశారు

ఆకలితో ఉన్న తండ్రి లేని ముగ్గురు పేద పసి బాలికలను ఆకర్షించి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన దారుణం మహారాష్ట్ర, భండారా జిల్లాలో జరిగింది. ఇళ్ళలో పాచి పని చేసుకుని బతికే తల్లికి పుట్టినవారు కావడంతో వారి ఊరి వాళ్లని తప్ప దేశ ప్రజలని పెద్దగా కదిలించలేకపోయింది. ఫలితంగా ఘటన జరిగి పది రోజులు కావస్తున్నప్పటికీ దోషులు ఇంతవరకు కనీసం అరెస్టు కాలేదు. స్టేషన్ ఎస్.ఐ ని సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోగా, బాధిత…