పెట్టుబడి వాతావరణం సరిగా లేదు -జపాన్

ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా లేదని జపాన్ ఆరోపిస్తోంది. భారత ప్రధాని మోడి ఇటీవల జపాన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 3.5 ట్రిలియన్ యెన్ లు లేదా 35 బిలియన్ డాలర్లు లేదా 2.1 లక్షల కోట్ల రూపాయల మేర ఎఫ్.డి.ఐ లు (జపాన్ కంపెనీలు) ఇండియాకు తరలి వస్తాయని జపాన్ ఆర్భాటంగా ప్రకటించింది. ఆ ప్రకటని కార్యరూపం దాల్చాలంటే తమకున్న గొంతెమ్మ కోర్కెలు ఏమిటో జపాన్ ఇప్పుడు చెబుతోంది. పెట్టుబడి వాతావరణ…

రష్యాపై ఆంక్షలు: ఫ్రెంచి రైతుల సమరభేరి -ఫోటోలు

రష్యాపై తాము విధించిన  వాణిజ్య, రాజకీయ ఆంక్షలు రష్యాను కుంగ దీస్తున్నాయని పశ్చిమ దేశాలు, వాటి పత్రికలు సందర్భం వచ్చినప్పుడల్లా చంకలు గుద్దుకుంతుంటాయి. ‘అబ్బ, భలే పీడిస్తున్నాం లే’ అంటూ సంతోషం ప్రకటిస్తాయి. ‘తిక్క కుదిరింది, మనతోనా పెట్టుకునేది’ అన్నట్లుగా రాక్షసానందం పొందుతాయి. కానీ రష్యాపై ఆంక్షలు పశ్చిమ దేశాల ప్రజలను, రైతులను ఎంతగా బాధిస్తున్నాయో నవంబర్ 5 తేదీన ఫ్రాన్స్ వ్యాపితంగా చెలరేగిన రైతుల ఆందోళనలు స్పష్టం చేస్తాయి. రష్యాపై విధించిన ఆంక్షలు తమకే ఎదురు…

ఫ్లోరిడా: అక్కడ అన్నదానం చేస్తే జైల్లో తోస్తారు

పెట్టుబడిదారీ వ్యవస్ధ కనిపించే ప్రతి వస్తువునీ వ్యాపారమయం చేస్తుందని కారల్ మార్క్స్ 19వ శతాబ్దంలో చెప్పారు. ఆ మాటలు ఎంతటి ప్రత్యక్షర సత్యమో అప్పటి నుండి రుజువు కాని చోటంటూ లేదు. చివరికి ఆకలిని కూడా వ్యాపారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఫ్లోరిడా రాష్ట్రం లోని ఫోర్ట్ లాడర్ డేల్ పట్టణ ప్రభుత్వం మరింత ముందుకెళ్లింది. వ్యాపారాలు చల్లగా ఉండాలన్న ఏకైక దృష్టితో అది అన్నదానాన్ని చట్ట విరుద్ధం చేసిపారేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 90…

రహస్య చట్టంతో నల్ల డబ్బు ఖాతాలను దాయొద్దు! -సుప్రీం

మంగళవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. నల్ల డబ్బు ఖాతాల వివరాలను దాచి పెట్టడానికి గోప్యతా నిబంధనలను (confidentiality clause) అడ్డం పెట్టవద్దని ఘాటుగా సూచించింది. నల్ల డబ్బు యాజమానుల వివరాలను వెల్లడించకుండా ఉండడానికి గోప్యతా నిబంధనలను శరణు వేడడం తగదని, ఎన్ని రహస్య నిబంధనలు ఉన్నప్పటికీ నల్ల డబ్బు ఖాతాల పేర్లన్నీ తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారిని ఏంచేయాలో తాము చూసుకుంటామని ప్రభుత్వానికి హైరానా అవసరం లేదని స్పష్టం చేసింది.…

అమెరికాలో మన ఐ.టి ఉద్యోగులకు 6 రెట్లు తక్కువ జీతం

ప్రపంచ ఐ.టి ఉత్పత్తులకు కేంద్రంగా పేరు పొందిన సిలికాన్ వాలీ (అమెరికా) లో ఓ కంపెనీ, ఇండియా నుండి వచ్చిన ఐ.టి ఉద్యోగులకు అమెరికా ఉద్యోగుల కంటే 6 రెట్లు తక్కువ వేతనం చెల్లిస్తోంది. బెంగుళూరు నుండి తెచ్చుకున్న భారతీయ ఐ.టి ఉద్యోగుల పట్ల చూపుతున్న ఈ వివక్ష గురించి అజ్ఞాత వ్యక్తుల ద్వారా ఫిర్యాదు అందుకున్న లేబర్ డిపార్టుమెంటు వారు తనిఖీ చేసి ఫిర్యాదు నిజమే అని తెలుసుకున్నారు. భారీ తేడాతో తక్కువ వేతనం చెల్లించడమే…

మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం…

ప్రశంసనీయమైన ప్రయత్నం -ది హిందు ఎడిట్

(స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ సాధనాలలో వినియోగించే నేవిగేషన్ సంకేతాల ప్రసారం కోసం ఇండియా సొంతగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అందిస్తున్న జి.పి.ఎస్ సేవల తరహాలో సొంత వ్యవస్ధను ఏర్పరుచుకునే క్రమంలో మూడవ ఉపగ్రహాన్ని ఇండియా గురువారం ప్రయోగించింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత ప్రజలకు స్వయంగా వివిధ ప్రయాణ నేవిగేషన్ సేవలను అందించే తాజా ఉపగ్రహ ప్రయోగంపై ది హిందూ అందించిన ఎడిటోరియల్.) అత్యంత సులభంగా రాకెట్లను ప్రయోగించడం భారత దేశానికి చెందిన పోలార్…

హుద్ హుద్: లెక్కించ అలవికాని నష్టం -ఫోటోలు

హుద్ హుద్ పెను తుఫాను వల్ల మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడం సాధ్యం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నష్టం 60 వేల కోట్లా లేక 70 వేల కోట్లా అన్నది తేల్చలేమని, అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యే వ్యవహారం కాదని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరిశీలకులు, విశ్లేషకులు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. “నష్టం 60,000 కోట్లా లేక 70,000 కోట్లా అన్నది చెప్పడం చాలా కష్టం. సీనియర్ అధికారులు జరిగిన…

చమురు ధరల యుద్ధంలో సౌదీ అరేబియా, అమెరికా?

అమెరికాలో షేల్ చమురు ఉత్పత్తి పెరిగేకొద్దీ ప్రపంచ చమురు మార్కెట్ లో సౌదీ అరేబియా, అమెరికాల మధ్య చమురు యుద్ధం తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో సిరియా కిరాయి తిరుగుబాటు, సో కాల్డ్ ఇస్లామిక్ స్టేట్ విస్తరణల ఫలితంగా చమురు ధరలు నానాటికీ పడిపోతున్నాయి. చమురు ధరలను తిరిగి యధాస్ధితికి తేవడానికి సౌదీ అరేబియా తన ఉత్పత్తుల్లో కోత పెట్టవచ్చనీ తద్వారా సరఫరా తగ్గించి ధరలు పెరగడానికి దోహదం చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా…

అద్దాల నేల: కొత్త సొబగుల ఈఫిల్ టవర్ -ఫోటోలు

ఈఫిల్ టవర్ కు కొత్త సొబగులను సమకూర్చిపెట్టారని పత్రికలు ఘోష పెడుతున్నాయి. ‘టూరిజమే నా యిజం’ అన్న మన తెలుగు రాజకీయ నాయకుడి నడమంత్రిజాన్ని ఒంట పట్టించుకున్నారో యేమో తెలియదు గానీ పారిస్ నగర ప్రభుత్వం ఈఫిల్ టవర్ కు 200 అడుగుల ఎత్తులో అద్దాల నేలను అమర్చి మరింత మంది టూరిస్టులను ఆకర్షించే పధకం వేసింది. అంత ఎత్తున అద్దాలను అమర్చడం వలన సందర్శకులకు గాలిలో నిలబడిన భ్రాంతి కలుగుతోందిట. పారిస్ ప్రభుత్వం కోరుకున్నట్లుగానే కొత్త…

అమెరికా వ్యాపారులకు మోడి మీద అనుమానాలు!

తాను చెబుతున్నట్లుగా ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడికి గల నిబద్ధతపై తమకు అనుమానాలు ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు తమ అధ్యక్షుడు బారక్ ఒబామాకు మొర పెట్టుకున్నారు. మోడి ప్రభుత్వం పైకి తాము వ్యాపార వర్గాలకి అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఆచరణలో భిన్న చర్యలు తీసుకుంటోందని యు.ఎస్.ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు మరో 15 వ్యాపార సంఘాలు ఒబామాకు ఫిర్యాదు చేశాయి. మోడి వస్తున్నారు గనుక ఒత్తిడి…

(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్…

మంగళయానం: చైనా ప్రశంసల జల్లు

అంగారక ప్రయాణాన్ని విజయవంతం చేసినందుకు ఇండియాపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. రష్యా కూడా ఇండియాను అభినందించింది. మంగళయానం విజయవంతం కావడం ఒక్క ఇండియాకు మాత్రమే గర్వకారణం కాదని ఆసియా ఖండానికి అంతటికీ గర్వకారణం అనీ చైనా ప్రశంసించడం విశేషం. మంగళయానం విజయం ద్వారా ఇండియా, చైనాకు అంతరిక్ష యానాంలో గట్టి పోటీదారుగా అవతరించిందని భారత పత్రికలు వ్యాఖ్యానించాయి. అయితే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ఇండియా విజయం తన ఆసియా సహోదరుడి విజయం కనుక…

చెక్ చేసుకోండి! 5 మిలి. జీమెయిల్ పాస్ వర్డ్ లు లీక్

యాపిల్ అయింది, ఇప్పుడు జీ మెయిల్ వంతు వచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐ క్లౌడ్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు పలువురు సెలబ్రిటీల (పశ్చిమ దేశాలకు చెందినవారు) నగ్న చిత్రాలను దొంగిలించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఉదంతం మరువక ముందే, జీ మెయిల్ కు చెందిన 5 మిలియన్ల వినియోగదారుల యూజర్ నేమ్ లు, పాస్ వర్డ్ లను హ్యాకర్లు సంపాదించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. బిట్ కాయిన్ సంస్ధ నిర్వహించే ఒక…

సి.బి.ఐ పరిశోధనపై పరిశోధన -కార్టూన్

దేశంలో అత్యున్నత స్ధాయి పరిశోధన సంస్ధ సి.బి.ఐ. ప్రభుత్వంలోనూ, బ్యూరోక్రసీలోనూ ఉన్నత స్ధానాలను ఆక్రమించి ఉన్న స్వార్ధపర ఆశపోతులను, దొంగలను పట్టుకుని విచారించి శిక్షపడేలా చూడవలసిన సి.బి.ఐ అధికారులు సదరు ఉన్నత స్ధాయి నేరస్ధులతోనే కుమ్మక్కు అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో అవినీతిని ప్రముఖంగా చర్చలోకి తెచ్చిన కుంభకోణం 2జి కుంభకోణం. ఈ కుంభకోణంలో నిందితులైన సీనియర్ బ్యూరోక్రాట్ అధికారులు క్రమం తప్పకుండా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారని ఎఎపి నేత, సుప్రీం…