కంపల్సరీ లైసెన్స్ ఫలితం, 2.8 లక్షల కేన్సర్ ఔషధం ఇప్పుడు 9 వేలే

ప్రపంచ మార్కెట్ లో 2.8 లక్షల రూపాయల ఖరీదు చేసే ఔషధాన్ని కేవలం 9 వేల రూపాయలకే భారత దేశ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లో భాగమైన ట్రిప్స్ (Trade Related Intellectual Property Rights) ఒప్పందం ప్రకారం ఒక కంపెనీ పేటెంటు పొందిన ఔషధాన్ని మరొక కంపెనీ తయారు చేయరాదు. ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ఖరీదుకు మందులు తయారు చేయగలిగినా ట్రిప్స్ ఒప్పందం దానిని నిషేధిస్తుంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి…

విధాన నిర్ణయాలు మా సార్వభౌమ హక్కు, ఒబామాకు ఇండియా సమాధానం

రిటైల్ అమ్మకాలు లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత దేశం అడ్డుపడుతోందన్న ఒబామా ఆరోపణను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలు చేసే బదులు ‘ప్రొటెక్షనిజం’ ను అరికట్టడంలో ఒబామా తన నాయకత్వ ప్రతిభ కనబరచాలని కోరింది. భారత దేశంలో విదేశీ రిటైల్ పెట్టుబడులు వాస్తవంగా పెరుగుతున్నాయనీ రిటైల్ పెట్టుబడులకు ఇండియాలో ఆటంకాలు లేవనడానికి అదే సాక్ష్యమని భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వివరించాడు. సంస్కరణలు అమలు చేయడంలో, సరళీకరణ విధానాలు చేపట్టడంలో ఇండియా వాస్తవానికి వేగంగా…

కుకీలు వ్యాపార కంపెనీల గూఢచారులు, తస్మాత్ జాగ్రత్త!

  కష్టమర్ కి తెలియకుండానే యునీక్ ఐ.డి కేటాయింపు ఇంటర్నెట్ నిఘా ఇక బాగా తేలిక కుకీలతో జాగ్రత్త! ఫ్లాష్ కుకీలతో మరింత జాగ్రత్త!! వివిధ వ్యాపార వెబ్ సైట్లు వ్యక్తిగత కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేసిన కుకీలు వ్యాపార కంపెనీల తరపున గూఢచర్యం చేస్తున్న సంగతిని నిపుణులు వెల్లడి చేశారు. మార్కెట్ల కోసం ప్రపంచ ప్రజలపై యుద్ధాల్ని రుద్దుతున్న కంపెనీలే ఇంటర్నెట్ వినియోగదారుల కంప్యూటర్ల ద్వారా నట్టింటిలోకి జొరబడి ప్రైవసీని దొంగిలిస్తున్న దారుణంపై వినియోగదారులు అప్రమత్తంగా…

ఇంటర్నెట్ రేట్లు: కంపెనీలను వదిలి వినియోగదారులపై బాదుడు -కార్టూన్

కంపెనీలను ఏమీ చేయలేక సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్ ఛార్జీలు పెంచిన వైనం ఇది. బడా ఐ.ఎస్.పి (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) కంపెనీలకు అనేక లైసెన్సులు ఉంటాయి. ప్రభుత్వం, ఐ.ఎస్.పి ల ఒప్పందం ప్రకారం రెవిన్యూను పరస్పరం పంచుకోవాలి. డిఫరెన్షియల్ రెవిన్యూ షేరింగ్ గా పిలిచే ఈ పద్ధతి ప్రకారం పిండి కొద్దీ రొట్టె ముక్కను ప్రభుత్వానికి కంపెనీలు ఇవ్వాలి. ప్రభుత్వ వాటా వివిధ స్ధాయిల లైసెన్సులను బట్టి ఉంటుంది. కొన్ని లైసెన్సుల కింద వచ్చే ఆదాయంలో 6…

బ్యాంకులు కంపెనీల కోసం ఇ.సి.బి ఉదారం, వడ్డీ రేటు 0.75% కి తగ్గింపు

ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారకులయిన బహుళ జాతి వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల కోసం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరోసారి యధా శక్తి ఉదారతను ప్రదర్శించింది. ఇప్పటికే హీన స్ధాయిలో 1 శాతం వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 0.75 శాతానికి చేర్చింది. 2007 ఆర్ధిక సంక్షోభం నుండి అత్యంత తక్కువ స్ధాయి 0.25 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ కంటే ఇది కేవలం అర…

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ,…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

వాల్-మార్ట్ కంపెనీ విస్తరణకి వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది. “(వాల్-మార్ట్ వల్ల)…

లాభాల్లో షేర్లు, ప్రణబ్ సవరణపై వివరణ ఫలితం?

శుక్రవారం భారత షేర్ మార్కెట్లు అత్యధిక లాభాలతో ముగియగా, రూపాయి బాగా కోలుకుంది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ రికార్డు స్ధాయిలో 2.59 శాతం (439 పాయింట్లు) లాభ పడగా డాలరుతో రూపాయి మారకం విలువ దశాబ్ధంలోనే రికార్డు స్ధాయిలో 119 పైసలు పెరిగింది. ఇటలీ, స్పెయిన్ దేశాలకు ఋణాల రేట్లు తగ్గించడానికి యూరోపియన్ దేశాల సమావేశం నిర్ణయాత్మక చర్యలు ప్రకటించడమే భారత మార్కెట్ల ఉత్సాహానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించగా, ప్రణబ్ సవరణపై (GAAR) ఆర్ధిక శాఖ…

ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నందున ఆర్ధిక మంత్రిత్వ శాఖను చేపట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం సవరణలను వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు పత్రికల వార్తలను బట్టి అర్ధం అవుతోంది. వోడా ఫోన్ లాంటి కంపెనీలు యాభై వేల కోట్లకు పైగా పన్నులు ఎగవేయడానికి ఆస్కారం కలిగించిన లూప్ హోల్ ను పూడ్చడానికి ప్రణబ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గత యాభై యేళ్లకు వర్తించేలా సవరణలను ప్రణబ్ ప్రతిపాదించడంతో జాతీయ,…

అణు విద్యుత్తుని పక్కకు నెట్టి, సోలార్ విద్యుత్ తో రికార్డులు సృష్టిస్తున్న జర్మనీ

ఆధునిక శాస్త్ర సాంకేతిక ఉత్పత్తులలో పేరెన్నిక గన్న జర్మనీ, దేశానికి అవసరమైన విద్యుత్తులో మూడు వంతులు సూర్య శక్తి నుండే ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. మరో పదేళ్ళలో అణు విద్యుత్ ను పూర్తిగా త్యజించడానికి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్న జర్మనీ, అణు విద్యుత్తు కంటే శుభ్రమైన ఇంధనం లేదన్న కంపెనీల ప్రచారాన్ని తిప్పికొడుతూ సూర్య శక్తి వినియోగంలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. 20 న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సామర్ధ్యానికి సమానంగా గంటకు 22 గిగావాట్ల విద్యుత్…

ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్…

టెర్రరిస్టు వ్యతిరేక పోరాట సహకారానికి అమెరికా మొండి చేయి

భారత దేశం ఎదుర్కొంటున్న టెర్రరిస్టు సమస్య పై పోరాటంలో సహకారం ఇవ్వవలసిన అమెరికా అందుకు నిరాకరిస్తున్నదని భారత పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. టెర్రరిజం పై పోరాడేందుకు ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉన్నప్పటికి అది ఆచరణలో ఒక వైపు మాత్రమే అమలవుతోందని చెబుతున్నాయి. భారత దేశం వైపు నుండి అమెరికాకి ఎంతగా సహకారం అందజేస్తున్నప్పటికీ భారత దేశానికి సహకారం ఇవ్వవలసిన పరిస్ధితిలో అమెరికా మొండి చేయి చూపుతోందని ఆరోపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఇరు దేశాల విదేశాంగ…

ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

ఇండియా, చైనా: తమలపాకుతో నువ్వొకటి, తలుపు చెక్కతో నేనొకటి

దౌత్య రంగంలో ఇండియా, చైనాలు తలపడిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ‘తమలపాకుతో నేనొకటి’ అన్నట్లుగా ఇండియా ఒకటి చేస్తే, ‘తలుపు చెక్కతో నేనూ ఒకటి’ అని చైనా మరొకటి చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద కమోడిటీ వ్యాపార కేంద్రం అయిన ‘యివు’ కి ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఇండియా తన వ్యాపారులకు ‘ట్రావెల్ అడ్వైజరీ’ జారీ చేయగా, ఇండియా వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నందున అక్కడికి ప్రయాణం పెట్టుకునే ముందు పదిసార్లు ఆలోచించాలని చైనా ఏకంగా…