భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

బొగ్గు కుంభకోణం, మరో చీకటి అధ్యాయం

భారత పాలకవర్గాల అవినీతి చరిత్రలో మరో రసవత్తర అధ్యాయానికి తెర లేస్తోంది. 2జి కుంభకోణం దరిమిలా 122 లైసెన్సులను రద్దు చేసి కాంగ్రెస్ పాలకుల అవినీతి మాలిన్యాన్ని ధృవపరిచిన సుప్రీం కోర్టే తాజా అధ్యాయానికి నాందీ వాచకం పలుకుతోంది. ప్రాధమిక సాక్ష్యాల ప్రకారం బొగ్గు గనుల కేటాయింపులు ఒక పద్ధతి లేకుండా జరిగినట్లు స్పష్టం అవుతోందని, అవసరమైతే కేటాయింపులన్నింటిని రద్దు చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అసలు బొగ్గు గనుల కేటాయింపుల రాష్ట్రాల…

హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

సెల్ ఫోన్ ప్రమాదమే, కేంద్ర ఆరోగ్యమంత్రి -కత్తిరింపు

సెల్ ఫోన్ల వాడకం నిస్సందేహంగా ప్రమాదకరమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ సాక్ష్యాత్తూ లోక్ సభలోనే ధృవపరిచారు. ఆ విషయం 1800 కు పైగా జరిగిన పరిశోధనల్లో తేలిందని మంత్రి గారు చెప్పిన సంగతిని ఆంధ్ర జ్యోతి పేపర్ తెలియజేసింది. పేపర్ వార్తను కింద చూడవచ్చు. ఆజాద్ ప్రకటనను బట్టి సెల్ ఫోన్లతోనే కాక సెల్ టవర్లతో కూడా ముప్పే అని తెలుస్తోంది. సెల్ టవర్ల వల్ల పిచ్చుకల జాతి అంతరించుకుపోతోందని వచ్చిన వార్తలు…

కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు

ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం…

సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే

ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడిదారీ కంపెనీలు దోచుకుని జల్సా చేస్తాయన్న సంగతి చరిత్రలో అనేక కంపెనీలు అనేక సార్లు రుజువు చేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చిన వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, ఇన్వెస్టర్ల సొమ్ము కాజేసి తాము మేపే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల చేత కూడా గడ్డి పెట్టించుకున్న గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ప్రామాణిక ఫైనాన్స్ వడ్డీ రేటు అయిన లిబర్ (Libor – London Interbank Offered…

బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు

“డబ్బులు చెట్లకు కాయవు” ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇష్టమైన నీతి సూత్రం. కానీ సాటి మనుషుల జబ్బులనే డబ్బు చెట్లుగా మార్చుకోగల బహుళజాతి కంపెనీల యజమానులు, వారికి యధాశక్తి తోడ్పడే డబ్బు జబ్బుల డాక్టర్లు మసలే పాడు లోకంలో డబ్బులు కుప్పలుగా కాసే కేన్సర్ తోటలు విరివిగా వర్ధిల్లుతున్నాయి. కేన్సర్ ఇప్పుడొక బడా వ్యాపారం అంటే తప్పేం లేదు. అటు ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి ఇటు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా…

‘వన్ డే’ లనుండి సచిన్ రిటైర్మెంట్, ఒక పరిశీలన -కార్టూన్

(కార్టూన్: ది హిందూ నుండి) – 50 ఓవర్ల పరిమిత క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా విరమించుకుంటున్నట్లు భారతీయుల ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో ఆయన 50 సెంచరీలు పూర్తి చేసుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరకుండానే వన్ డే ఆట నుండి తప్పుకుంటున్నట్లు సచిన్ ప్రకటించడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించినా శ్రేయోభిలాషులైన క్రికెట్ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భారతదేశ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించాక సచిన్…

తలతిక్కవాదంతో ఎఫ్.డి.ఐ బిల్లుని గెలిపించిన ఎస్.పి, బి.ఎస్.పి

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా బి.జె.పి ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో ఓడిపోయింది. బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో బిల్లు 253-218 ఓట్లతో నెగ్గింది. వాకౌట్ చెయ్యడం ద్వారా తాము కూడా ఆ తానులోని ముక్కలమేనని ఎస్.పి, బి.ఎస్.పిలు నిర్ద్వంద్వంగా చాటుకున్నాయి. బి.సిలను ఉద్దరించడానికి ఉద్భవించామని ఎస్.పి, దళితుల ఉద్ధరణే ఏకైక లక్ష్యమని…

ఇరాన్ మందులు అమెరికాకి రక్ష, అమెరికా ఆంక్షలు ఇరాన్ కి శిక్ష

ఇరాన్ తయారు చేసిన ఔషధాలు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను కాపాడుతుంటే, అమెరికా ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు లక్షలాది ఇరానియన్ రోగులను చంపేస్తున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో పాము కాటుకి గురయిన అమెరికా సైనికులకి ఇరాన్ తయారు చేసిన విరుగుడు ఔషధాలు తప్ప మరో గతి లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఆదివారం ప్రచురించిన ఒక రిపోర్ట్ లో పత్రిక ఈ సంగతి తెలిపింది. నైరుతి ఆసియా ప్రాంతానికి ప్రత్యేకమైన పాముల కాట్లకు గురవుతున్న అమెరికా…

చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, మమత బెనర్జీ వంచనా శిల్పం

చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇంతకాలం చెబుతూ వచ్చిన మమత బెనర్జీ తన ఉద్దేశాలు వేరే ఉన్నాయని వెల్లడి చేసుకుంది. పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే, సాధ్యంకాని అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించి భంగపాటుకు గురయినట్లు దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక సమయంలో వెన్ను చూపుతోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించే బిల్లుపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, ఓటింగ్ అవసరం లేకుండా చేసే కుట్రలో కాంగ్రెస్ కు సహకారం…

బియ్యం బదులు తూకం రాళ్ళు మింగించేదే ‘నగదు బదిలీ పధకం’ -కార్టూన్

నగదు బదిలీ పధకం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా ఊదగరగొడుతూ వచ్చాయి. ఈ పధకాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కూడా ప్రకటించాడు. పేదలకు సబ్సిడీ ధరలకు సరుకులను అందించే బదులు సదరు సబ్సిడీని నగదు రూపంలో నేరుగా పేదల ఖాతాల్లోకి తరలించడమే ఈ పధకం లక్ష్యం. అంటే గ్యాస్ సిలిండర్, బియ్యం, రేషన్ సరుకులు తదితర సరుకలకీ ఇచ్చే సబ్సిడీని ఆయా సరుకులు కొనే సమయంలో ఇవ్వకుండా, సదరు…

గూగుల్ ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచిన డేటా సెంటర్స్ ఇవే -ఫోటోలు

వేలాది ఫైబర్ మైళ్ళు, మరిన్ని వేల సర్వర్లతో ఇంటర్నెట్ వినియోగదారుల సర్చింగ్, సర్ఫింగ్ దాహాల్ని తీరుస్తున్న గూగుల్, తన డేటా సెంటర్లను ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచింది. పారదర్శకత గురించి తాను చెప్పే నీతులని ప్రదర్శన కోసమైనా పాటించదలిచిందో ఏమో తెలియదు గానీ తన డేటా సెంటర్ల ఫోటోలని గూగుల్ విడుదల చేసింది. వైర్డ్ డాట్ కామ్ ప్రకారం తన అత్యాధునిక ఇన్ఫ్రా స్ట్రక్చర్ సాయంతో రోజుకి 20 బిలియన్ల వెబ్ పేజీ లను గూగుల్ ఇండెక్స్ చేయగలుగుతోంది.…

‘రివర్స్ స్టింగ్’ లో దొరికిపోయిన జీ న్యూస్ బ్లాక్ మెయిలింగ్

స్టింగ్ ఆపరేషన్లతో ఠారెత్తిస్తున్న మీడియా రివర్స్ స్టింగ్ ఆపరేషన్ లో బైటపడిపోయి నీళ్ళు నములుతోంది. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జె.ఎస్.పి.ఎల్) ఛైర్మన్ నవీన్ జిందాల్ ను బొగ్గు కుంభకోణం స్టోరీతో బ్లాక్ మెయిల్ చెయ్యబోయిన జీ న్యూస్ ఎడిటర్లు రహస్య కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. కుంభకోణం స్టోరీని ప్రసారం చెయ్యకుండా ఆపడానికి మొదట 20 కోట్లు ఆ తర్వాత 100 కోట్లు కెమెరా ముందు డిమాండ్ చేసిన జీ న్యూస్ ఎడిటర్లు తాము స్టింగ్ ఆపరేషన్…

2జి ఫీజు 36,000 కోట్లు ఉండాలని చెప్పా, ప్రధాని పట్టించుకోలేదు -కేబినెట్ కార్యదర్శి

2జి కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిత అమాయకత్వం ఒట్టి నటనే అన్న సంగతి అనూహ్య రీతిలో వెల్లడయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణలో సి.పి.ఐ సభ్యుడు గురుదాస్ దాస్ దాస్ గుప్తా తరచి తరచి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన మాజీ కేబినెట్ కార్యదర్శి అసలు సంగతి కక్కడంతో ప్రధాని దాపరికం గుట్టు రట్టయ్యింది. 2జి స్పెక్ట్రమ్ ఎంట్రీ ఫీజు అప్పటి మార్కెట్ ధరల ప్రకారం 36,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించాలని తాను…