రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…

యుద్ధోన్మాది మెక్ కెయిన్ ఇండియా పర్యటన

కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.…

గోదావరి ‘గుండె మంట’కు బాధ్యులెవరు? -ఫోటోలు

సహజ వాయువును అమ్మే కంపెనీయేమో ‘గ్యాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)’. ఆ గ్యాస్ ని కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నదేమో లగడపాటి రాజగోపాల్ కి చెందిన లాంకో కంపెనీ. ఆ గ్యాస్ వెళ్ళేది మాత్రం కోన సీమ గుండెలపై నుండి. ఫలితంగా ప్రమాదం జరిగిన ఫలితాన్ని అనుభవిస్తోంది కోన సీమ ప్రజలు, వారి పొలాలు, వారి ఇళ్లూ, వారి సమస్త ఆస్తులు కాగా బాధ్యతని నిస్సంకోచంగా మళ్ళీ ఆ ప్రజలపైకే నెట్టివేస్తున్న గెయిల్, లాంకోలను ఏమనాలి?…

రష్యా: మానవ రహిత డ్రోన్ లో పిజ్జా డెలివరీ

మనిషి స్వయంగా నడపకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపే విమానాలను డ్రోన్ విమానాలు అంటున్న సంగతి విదితమే. ఇలాంటి డ్రోన్ విమానం ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఓ వినియోగదారుడికి పిజ్జా అందజేశామని రష్యా పిజ్జా కంపెనీ డోడో పిజ్జా ప్రకటించింది. గత నెలలో ముంబైలో ‘ఫ్రాన్సెస్కో పిజ్జరియా’ అనే కంపెనీ డ్రోన్ ద్వారా పిజ్జా అందజేసినట్లు వార్త వచ్చినందున ‘మేమే ఫస్ట్’ అన్న రష్యా కంపెనీ వాదనపై అనుమానం కలుగుతోంది. కాగా, వ్యాపార నిర్వహణలో మానవ శ్రమ…

విదేశీ మందులోడికి మోడీ షాక్?!

“నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే ఒరే” అని విదేశీ మందులోడు పాడుకుంటాడేమో ఇక! లేకపోతే నమ్మి, బ్రాండ్ ఇమేజి పెంచి, అధికారంలోకి రావడానికి సహకరిస్తే మరిన్ని మందులని ‘నియంత్రిత ధరల’ జాబితాలోకి మోడి ప్రభుత్వం తేవడాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలు ఎలా అర్ధం చేసుకోగలవు? భారత దేశంలో అమ్ముడయ్యే ఔషధాలలో మరిన్ని ‘ధరల నియంత్రిత జాబితా’ (price control) లోకి చేర్చాలని నరేంద్ర మోడి ప్రభుత్వం యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు కొన్ని పత్రికలకు ఉప్పందించాయి.…

అమెరికన్ ఉబర్ ఆప్ పై ఐరోపా టాక్సీ డ్రైవర్ల సమ్మె పోరు

అమెరికాకు చెందిన ‘ఉబర్’ కంపెనీ తయారు చేసిన మొబైల్ ఫోన్ అప్లికేషన్ పై యూరోపియన్ దేశాల టాక్సీ డ్రైవర్లు యుద్ధం ప్రకటించారు. ఈ అప్లికేషన్ తమ పొట్ట కొడుతోందని వారు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఎంతగా మొరపెట్టుకున్నా తమ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఉబర్ మొబైల్ అప్లికేషన్ కు వ్యతిరేకంగా బుధవారం (జూన్ 11) సమ్మె పాటించారు. ఈ సమ్మెతో ఐరోపా దేశాల ప్రధాన నగరాల్లో వీధులు స్తంభించిపోయాయని రాయిటర్స్, బి.బి.సి, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు తెలియజేశాయి.…

రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన

బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను పరోక్షంగా ప్రవేశపెట్టనున్న మోడి ప్రభుత్వం అదే ఊపుతో రైతులకు నేరుగానే వాత పెట్టేందుకు యోచిస్తోంది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు తగిన విధంగా రుణం తీర్చుకోవడానికి మోడి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మేలు చేయడం కోసం గ్యాస్ ధరలను రెట్టింపు చేసినందున పెరగనున్న సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి యూరియా ఎరువు ధరను కనీసం 10 శాతం పెంచేందుకు యోచిస్తోంది. ఈ…

దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…

యాండ్రాయిడ్ కాపీరైట్ కేసు: గూగుల్ పై ఒరకిల్ గెలుపు

ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఒకరిపై మరొకరు కాపీ రైట్ ఉల్లంఘన కేసులు పెట్టుకోవడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. మొబైల్ ఫోన్ డిజైన్, టెక్నాలజీల విషయంలో సామ్ సంగ్, యాపిల్ కంపెనీల మధ్య సాగిన సుదీర్ఘ కోర్టు పోరాటంలో ఒక భాగం కొద్ది రోజుల క్రితమే ముగిసింది. ఇప్పుడు గూగుల్, ఒరకిల్ కంపెనీల మధ్య నడిచిన పోరు ఒక కొలిక్కి వచ్చింది. యాపిల్ ఆశించిన నష్టపరిహారంలో కేవలం 10వ వంతుకంటే తక్కువ మాత్రమే సామ్ సంగ్ చెల్లించాలని…

బంగాళాఖాతంలో మలేషియా విమానం?

హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా పౌర విమానం MH370 గురించి మరో కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సదరు విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందని భావించేందుకు తగిన ఆధారాలు తమకు లభ్యం అయ్యాయని ప్రకటించింది. అప్పుడే నిర్ధారించలేము గానీ తమకు దొరికిన శిధిలాలన్నీ బోయింగ్ 777 కి సంబంధించిన శిధిలాలే అనీ కాబట్టి మలేషియా విమానం బంగాళాఖాతంలో కూలిందనేందుకు ఇది గట్టి సాక్ష్యం కావచ్చని తెలిపింది. గత కొద్ది…

కెవిపి ని అరెస్ట్ చేయండి -అమెరికా

టైటానియం మైనింగ్ కుంభకోణం విషయంలో నిందితుడుగా అమెరికా కోర్టులు పేర్కొన్న కె.వి.పి రామచంద్ర రావును వెంటనే అరెస్టు చేయాలని అమెరికా కోరింది. రాజ్య సభ సభ్యుడు అయిన కెవిపి ఆంధ్ర ప్రదేశ్ లో టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు ఇప్పించినందుకు గాను అమెరికా కంపెనీ నుండి లంచం వసూలు చేశారని అమెరికా ఆరోపించింది. ఆరోపణలను కెవిపి ఖండించినప్పటికీ ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్ధితి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే లేదు. టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు…

హృదయస్రావం: ఇంటర్నెట్ ని వణికిస్తున్న తాజా క్రిమి

తట్టుకోలేని దృశ్యం చూసినప్పుడు హృదయం ద్రవించిపోయింది అంటాం కదా! మొన్నామధ్య తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎం.పి లు తీవ్ర గలాభా సృష్టిస్తున్నప్పుడు కూడా మన ప్రధాని ‘నా హృదయం ద్రవించిపోతోంది’ (My heart bleeds) అంటూ వాపోయారు. సరిగ్గా ఆ పేరుతోనే ఉన్న ఒక సాఫ్ట్ వేర్ క్రిమి (బగ్) అనేక పేరు పొందిన ఇంటర్నెట్ కంపెనీలను వణికిస్తోంది. ఇంటర్నెట్ రక్షణ కోసం ఏర్పరుచుకున్న ఎన్ క్రిప్షన్ వ్యవస్ధ లోనే ఈ క్రిమి…

MH370: బ్లాక్ బాక్స్ సంకేతాలు రికార్డు చేసిన చైనా

విమానాల్లో అత్యంత ముఖ్యమైన భాగం బ్లాక్ బాక్స్, విమానాలు ప్రమాదానికి గురయినపుడు ఆ ప్రమాదం గురించిన వివరాలను బ్లాక్ బాక్స్ నుండి సేకరిస్తారు. విమానం కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను కూడా ఇది రికార్డు చేస్తుంది. విమానానికి ఎదురయిన వివిధ సాంకేతిక ఇబ్బందుల సమాచారాన్ని కూడా ఇది పట్టిస్తుంది. మలేషియా విమానం MH370 బ్లాక్ బాక్స్ కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది. బ్లాక్ బాక్స్ సంకేతాలు అనదగ్గ సిగ్నల్స్ ను చైనా నౌక రికార్డు చేసిందన్న…

అమెరికాలో ఆంధ్ర మైనింగ్ స్కామ్

ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ కుంభకోణం వీరులు అమెరికా కోర్టులో కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన ఐదేళ్ల తర్వాత ఆయన ఆత్మ బంధువుగా పేరుగాంచిన కె.వి.పి.రామచంద్ర రావు తెలుగు నేల ఖ్యాతిని ఈ విధంగా దిగంతాలను దాటించారు. మరో ముద్దాయిపై కూడా నేరాభియోగం నమోదు చేసిన అమెరికా కోర్టు ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఆయన వై.ఎస్ పుత్రుడు వై.ఎస్.జగన్ అని ఆరోపిస్తున్నారు. కాగా అమెరికా కోర్టులు విచారణ…

ఐ.పి.ఎల్ vis-a-vis సుప్రీం కోర్టు -కార్టూన్

బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాసన్ పుణ్యమాని సుప్రీం కోర్టు కూడా ఐ.పి.ఎల్ పాలకవర్గంలో ఒక పాత్ర పోషిస్తోంది. ధర్డ్ అంపైర్ ధాటికి గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపైర్ల నిర్ణయ శక్తి దాదాపు నామమాత్రంగా మారిపోయినట్లే సుప్రీం కోర్టు ఇటీవల చూపుతున్న చొరవ వల్ల మొత్తం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రతకు ప్రమాదం వచ్చినపడినట్లు కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ గుర్రం ఎవరు? బహుశా క్రికెట్ ఆటగాళ్లకు, అంపైర్లకు, ఆటను చూసే ప్రేక్షక దేవుళ్ళకి ఎవరికీ కనపడకుండా…