ఇప్పుడు అమెరికాకి నెం.1 టార్గెట్, వెనిజులా -హాలీవుడ్ దర్శకుడు

అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మీడియాకి ఇపుడు వెనిజులా నెంబర్ 1 టార్గెట్ అని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలివర్ స్టోన్ వ్యాఖ్యానించాడు. 2009లో హ్యూగో ఛావెజ్ పై ‘సౌత్ ఆఫ్ ద బోర్డర్’ అనే డాక్యుమెంటరి నిర్మించి ఛావెజ్ గురించిన వాస్తవాలను/అవాస్తవాలను అమెరికా ప్రజలకు తెలియజేసేందుకు ఆలివర్ స్టోన్  ప్రయత్నం చేశాడు. తన సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా చనిపోయిన ఛావెజ్ పశ్చిమ వార్తా పత్రికలు, ప్రభుత్వాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టాడు. వెనిజులా ప్రజలు అత్యధిక మెజారిటీతో…

అమెరికా ‘మేగ్నిట్ స్కీ జాబితా’కు యాకోవ్లెవ్ జాబితా’తో బదులిచ్చిన రష్యా

నాలుగు దశాబ్దాల పాటు సాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (కోల్డ్ వార్) లో రెండు అంతర్జాతీయ వైరి శిబిరాలకు నాయకత్వం వహించిన అమెరికా, రష్యాలు మళ్ళీ ఒక్కసారి ఆ రోజులను గుర్తుకు తెచ్చాయి. ‘మేగ్నిట్ స్కీ చట్టం’ కింద అనేకమంది రష్యా ప్రముఖుల పైన ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రకటించిన ‘మేగ్నిట్ స్కీ జాబితా’ కు ప్రతీకారంగా పలువురు అమెరికన్ ప్రముఖులపై ఆంక్షలు ప్రకటిస్తూ రష్యా మరొక జాబితా విడుదల చేసింది. ఇరు దేశాలు తమ చర్యలకు మానవ…

ఉ.కొరియా అణు సామర్ధ్యంపై అమెరికాలో విభేదాలు

ఉత్తర కొరియా అణు క్షిపణులు అమెరికా భూభాగాన్ని చేరగలవా లేదా? చేరగలిగితే ఎక్కడి వరకు రాగలవు? పశ్చిమ తీర ప్రాంతం అయిన అలాస్కా వరకేనా లేక ప్రధాన భూభాగాన్ని కూడా చేరగలవా? అసలు ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగల తక్కువ సైజు అణు బాంబులను ఉత్తర కొరియా అభివృద్ధి చేసుకున్నదా? ఇవి అమెరికా ప్రభుత్వాన్ని తొలుస్తున్న ప్రశ్నలు. అణ్వస్త్ర సామర్ధ్యాన్ని ఉత్తర కొరియా రుజువు చేసుకున్నప్పటికీ వాటిని మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులు ఎంత దూరం వెళ్లగలవనేది అంతర్జాతీయ పరిశీలకులు…

ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల…

ఇండియా అణు పరీక్షను ముందే ఊహించిన అమెరికా -వికీలీక్స్

ఇందిరా గాంధీ హయాంలో భారత దేశం 1974 మే 18 తేదీన జరిపిన అణు పరీక్ష అప్పట్లో ఒక సంచలనం. రాజస్ధాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద జరిపిన ఈ అణు పరీక్ష ఫలితంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇండియాపై ఆంక్షలు విధించాయి. ఇండియా పట్ల అణు అంటరానితనాన్ని పాటించాయి. తాము ఒక పక్క అణ్వస్త్రాలను గుట్టలుగా పేర్చుకుంటూనే ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చుకోవడానికి వీలు లేదని శాసించాయి. అందుకోసం ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ…

అమెరికా విమాన దాడుల్లో 11 మంది ఆఫ్ఘన్ పిల్లల దుర్మరణం

అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో మరో మారణకాండను సృష్టించాయి. మిలిటెంట్లను చంపే పేరుతో పదకొండు మంది పసి పిల్లలను, ఒక మహిళను విమాన దాడుల్లో చంపేసింది. జరిగిన ఘోరానికి విచారం వ్యక్తం చేయకపోగా ‘పౌరులు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ ధృవపరచలేం’ అని నాటో ప్రతినిధి డాన్ ఈనెర్క్ వ్యాఖ్యానించినట్లు రష్యా టుడే, ది హిందు పత్రికలు తెలిపాయి. అమెరికా దళాలు అమాయక ఆఫ్ఘన్ పౌరులను “ఇబ్బంధుల పాలు చేస్తున్నాయి, హింసిస్తున్నాయి, చంపేస్తున్నాయి” అని…

కోలేటరల్ మర్డర్: ఓ అమెరికా సైనికుడి పశ్చాత్తాపం

2010 ఏప్రిల్ 5 తేదీన ‘కోలేటరల్ మర్డర్’ శీర్షికతో వికీ లీక్స్ విడుదల చేసిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో ఆ దేశ పౌరులపైన అమెరికా సైనికులు సాగిస్తున్న దారుణ మారణ కాండను ‘కోలేటరల్ మర్డర్’ వీడియో కళ్లకు కట్టింది. ఒక గ్రూపుగా వీధిలో నిలబడి ఉన్న సాధారణ పౌరులను మైలున్నర దూరంలో ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ గన్ తో అమెరికా సైనికులు కాల్చి చంపిన దృశ్యాన్ని, దారినే పోతున్న…

యుద్ధం రీత్యా ఎంబసీలు ఖాళీ చేయాల్సి రావచ్చు -ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, అమెరికాలు పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో గువామ్ లో ఉన్న తమ సైనిక స్ధావారానికి అదనంగా రెండు క్షిపణి విచ్ఛేదక వ్యవస్ధలను అమెరికా గురువారం నాడు చేరవేసింది. దక్షిణ కొరియా ఆధునిక డిస్ట్రాయర్ యుద్ధ పరికరాలను ఉత్తర కొరియా సరిహద్దుకు శుక్రవారం తరలించింది. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియాలోని విదేశీ రాయబారులు తమ తమ ఎంబసీలను ఖాళీ చేయాల్సి రావచ్చని ఏప్రిల్ 10 తర్వాత వారికి రక్షణ ఇవ్వడం తమకు…

ఉభయ కొరియాల వద్ద యుద్ధ పరిస్ధితులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం…

ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం

ఆఫ్రికాలో సాగుతున్న సామ్రాజ్యవాద ప్రచ్ఛన్న యుద్ధం ఇద్దరు భారతీయులను బలి తీసుకుంది. ఆఫ్రికా ఖండంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రత్యక్షంగా తీసుకుంటున్న మిలట్రీ చర్యలకు భారతీయులు మూల్యం చెల్లించవలసి వచ్చింది. ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‘ దేశంలో విమానాశ్రయాన్ని సమీపిస్తున్న మూడు వాహనాల పైకి ఫ్రెంచి సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయులు, ఒక  దేశీయుడు చనిపోగా మరొక భారతీయుడు, ఛాద్ పౌరుడు గాయపడ్డారు.…

తెరచాప కడితే హెలికాప్టర్ ఎగురుతుందా? -కార్టూన్

దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను. ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ…

పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా

ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‘ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఎన్.ఎస్.జి…

చైనాలో కోకాకోలా గూఢచర్యం?

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ‘సైబర్ గూఢచర్యం‘ ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి. చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే…

చైనా 2016కల్లా అమెరికాను దాటిపోతుంది -ఒఇసిడి

2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక…

చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు

– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…