రసాయన దాడి మా పనే -సిరియా తిరుగుబాటుదారులు

నిజానికి ఇది సంచలనవార్త! ఆగస్టు 21 తేదీన సిరియాలో రసాయన ఆయుధాలతో జరిగిన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, అధ్యక్షుడు బషర్ అస్సాద్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఒక పక్క చెవి కోసిన మేకల్లా అరుస్తూనే ఉన్నారు. మరో పక్క సదరు రసాయన దాడికి తామే బాధ్యులమని సిరియా తిరుగుబాటుదారులు అంగీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి ఒకరు తిరుగుబాటులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా…

ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా

సిరియాపై పరిమిత దాడి చేసి రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను శిక్షిస్తానని ప్రకటించిన అమెరికా ఒంటరిగా మిగిలింది. సిరియా దాడిలో భాగస్వామ్యం వహించడానికి వీలు లేదని బ్రిటన్ పార్లమెంటు తేల్చి చెప్పింది. ‘దాడికి సై’ అన్న ఫ్రాన్సు వెనక్కి తగ్గి ‘ఐరాస అనుమతితో చేద్దాము, చర్చలు కూడా చేద్దాము’ అంటూ యుద్ధ పిపాసను తగ్గించుకుంది. దాడికి సహకరించేది లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఐరాస పరిశీలకుల నివేదిక అందకుండా దాడి వద్దే వద్దు…

బారక్ ఒబామా సర్కస్ ఫీట్లు -కార్టూన్

దాడి పరిమితంగా ఉండేందుకే ఇదంతా… – అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ సిరియాపై దాడి చేయడానికే అమెరికా కట్టుబడి ఉన్నదని ఆ దేశ రక్షణ కార్యదర్శి చక్ హేగెల్ మరోసారి ప్రకటించాడు. ప్రపంచ పోలీసు పెత్తనం చెలాయించడంలో అమెరికా లాఠీని మోసే అనుంగు మిత్రుడు బ్రిటన్ లో సిరియా పై దాడి చేసే ప్రయత్నాలను పార్లమెంటు తిరస్కరించినా వెనకడుగు వేసేది లేదని చక్ ప్రకటించాడు. అమెరికా జాతీయ భద్రతకు కట్టుబడి ఉండడానికే ఒబామాను ప్రజలు ఎన్నుకున్నారని కాబట్టి…

పశ్చిమ యుద్ధోన్మాదులకు లొంగేది లేదు -సిరియా

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యుద్ధ నగారాలు మోగిస్తుండగా సిరియా ప్రభుత్వం మాత్రం బెదిరేది లేదని స్పష్టం చేస్తోంది. కిరాయి తిరుగుబాటుదారులకు రసాయన ఆయుధాలు సరఫరా చేసి వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చింది ఈ మూడు దేశాలేననీ సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ స్పష్టం చేశాడు. సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించడానికి శిక్షణ ఇచ్చిన దేశాలే తిరిగి తమపై ఆరోపణలు చేయడం పిచ్చివాడి ప్రేలాపనలను పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. సాక్ష్యాలు ఉంటే ఎందుకు…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…

సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాల వరుసలో సిరియాను చేర్చడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ (మన మంత్రితో సమానం) చెబుతున్న మాటలు నిజమే అయితే సిరియాపై దాడి చేయడానికి అమెరికా తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా జలాలకు సమీపంలోకి తరలిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను…

చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన

చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న…

వేగంగా పెరుగుతున్న నగరం షాంఘై నాడు, నేడు -యానిమేషన్

ఇండియాకు ముంబై ఎలాగో చైనాకు షాంఘై నగరం అలాగ! ఇండియాకి ముంబై వాణిజ్య నగరంగా పేరొందితే, షాంఘై చైనాకి వాణిజ్య నగరంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం ఇదేనట! అలాగని ది అట్లాంటిక్ పత్రిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదేనని సదరు పత్రిక తెలిపింది. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ బర్రియా ఇటీవల షాంఘై నగరాన్ని సందర్శించి కొన్ని ఫోటోలు తీశాడు. 1987 నాటి ఫోటో ఒకటి…

ఈజిప్టు: మరో రక్తం ఓడుతున్న గాయమా? -ఫోటోలు

ఆఫ్ఘనిస్ధాన్ ని ‘రక్తం ఓడుతున్న గాయం’ గా అభివర్ణించాడు చివరి సోవియట్ రష్యా నేత మిఖాయిల్ గోర్బచెవ్. ఈ భూమండలం పైన రక్తం ఓడుతున్న గాయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాశ్మీరు, పాలస్తీనా, సిరియా, సోమాలియా…. ఇప్పుడు ఈజిప్టు. రెండేళ్ల క్రితం ముబారక్ ను పదవీచ్యుతుడ్ని చేసినప్పటి నుండి ఈజిప్టు వీధులు రక్తంతో తడవని రోజంటూ లేదు. ముబారక్ ఏలిన 30 సంవత్సరాలు ఈజిప్టులో నిరవధిక ఎమర్జెన్సీ అమలు చేశారు. కమ్యూనిస్టులను, ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలను……

అమెరికాకు తలొగ్గిన అలీన నెహ్రూ -కత్తిరింపు

భారత పత్రికల్లో చాలా అరుదుగా కనిపించే వార్త ఇది. తెలుగు పత్రికల్లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. నిజానికి దీనిని వార్త అనడం కంటే చరిత్ర అనడం సముచితం. ఇంకా చెప్పాలంటే వాస్తవ చరిత్ర అనడం ఇంకా సముచితం. అలీన దేశాల కూటమి ఏర్పాటు చేయడంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి మామూలుది కాదు. అలాంటి నెహ్రూ చైనా దాడితో ఎటూ పాలుపోక అమెరికా శరణు జొచ్చాడని ఈ ‘వాస్తవ చరిత్ర’…

జలాంతర్గామి పేలుడు: గుర్తుపట్టలేని స్ధితిలో శవాలు

ముంబై డాక్ యార్డ్ లో అనూహ్య కారణాలతో పేలిపోయి మునిగిపోయిన ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ జలాంతర్గామి నుండి నాలుగు శవాలను వెలికి తీశారు. ఈ శవాలు గుర్తు పట్టలేని స్ధితిలో ఉన్నాయని తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో డి.ఎన్.ఏ శాంపిల్ సహాయంతో గుర్తుపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాంతర్గామిలో సజీవులుగా ఎవరైనా మిగిలి ఉండే అవకాశాలు పూర్తిగా అడుగుంటాయని అధికారులు చెబుతున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి మాత్రం అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదని జలాంతర్గామి లోపల గాలి గదుల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ

ఈజిప్టు మళ్ళీ రక్తం ఓడుతోంది. వదిలిందనుకున్న మిలట్రీ పిశాచం మళ్ళీ ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రెండేళ్ల క్రితం 2011లో సంభవించిన ప్రజా తిరుగుబాటులో హోస్ని ముబారక్ పదవీచ్యుతుడయిన సంగతి తెలిసిందే. దరిమిలా అధికార పగ్గాలను తాత్కాలికంగా కోల్పోయిన ఈజిప్టు మిలట్రీ, ప్రజాస్వామిక ఎన్నికల్లో అధ్యక్ష పదవి చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహమ్మద్ మోర్శి ని గత జులై మొదటివారంలో కుట్ర చేసి కూల్చివేసింది. మోర్శికి మళ్ళీ అధికారం అప్పజెప్పాలని దేశవ్యాపితంగా బైఠాయింపులు, ప్రదర్శనలతో…

ముంబై: జలాంతర్గామి పేలుడు, మునక -18 మంది మరణం?

భారత నౌకాదళం బుధవారం తెల్లవారు ఝాము భారీ మూల్యం చెల్లించింది. సంప్రదాయక సబ్ మెరైన్ లో పేలుడు సంభవించి ముంబై డాక్ యార్డ్ లో మునిగిపోవడంతో 18 మంది నావికాదళ సభ్యులు చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సింధూరక్షక్’ అనే పేరుగల ఈ జలాంతర్గామును రష్యా సరఫరా చేసింది. కిలో క్లాస్ యుద్ధనౌకగా భావించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళంలో ఒక ముఖ్య భాగం అని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…