ఉక్రెయిన్: రష్యాపై ఇ.యు కక్ష సాధింపు

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేసుకోవడంతో ఇ.యు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ద్వైవార్షిక ఇ.యు-రష్యా సమావేశాలను ముక్తసరిగా ముగించడం ద్వారా తన ఆగ్రహాన్ని చాటుకుంది. రష్యా ఒత్తిడితోనే ఇ.యు లో చేరడం ఉక్రెయిన్ వాయిదా వేసుకుందని ఇ.యు ఆరోపణ. అమెరికా, ఇ.యు దేశాల పత్రికలు సైతం ఈ ఆగ్రహాన్ని దాచుకోవడం లేదు. ఉక్రెయిన్ సహజవనరులను, మార్కెట్ ను చేజిక్కించుకునే అవకాశం జారిపోయిందన్న అక్కసునంతా రష్యాపై వెళ్లగక్కుతున్నాయి. ఇ.యు, రష్యాల శిఖరాగ్ర సమావేశాలు రెండేళ్లకొకసారి…

రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం…

ఇండియాలో అమెరికా రాయబారుల వీసా ఫ్రాడ్

తమ పని మనిషి విషయంలో దేవయాని వీసా ఫ్రాడ్ కి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అమెరికన్ అయినా-ఇండియన్ అయినా, ధనికులైనా-పేదలైనా, యజమాని ఐనా-పని మనిషి ఐనా ఇలాంటి నేరాలు సహించేది లేదని హుంకరించింది. అయితే దేవయాని చేసిందంటున్న నేరంలో భారత ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అనగా ఫలానా పద్ధతుల ద్వారా పని మనుషుల్ని అమెరికా తీసుకెళ్లవచ్చని భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇండియాలో ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండడానికి, తమతో పాటు…

అమెరికా ఎంబసీ: పన్ను ఎగేస్తుంది, స్పైలను పోషిస్తుంది…

దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో భారత పాలకులు కాస్త తల ఎత్తిన ఫలితంగా ఇండియాలో అమెరికా ఎంబసీ సాగించిన చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొద్దిగా ఐనా వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో అమెరికా దౌత్యాధికారులు, రాయబార ఉద్యోగులు, వారి అనుబంధ సంస్ధలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సౌకర్యాలకు తోడు దేశ ఆదాయానికి కూడా గండి కొట్టే కార్యాలు వాళ్ళు చాలానే చక్కబెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా నిర్వహించే క్లబ్ కార్యకలాపాలకు చెక్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ‘అమెరికన్ ఎంబసీ స్కూల్’…

ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?

ప్రశ్న (నరేంద్ర): గూఢచర్యం అన్ని దేశాలు చేసే పనే కదా? ఒక్క అమెరికానే తప్పు పట్టడం అన్యాయం కదా? జవాబు: ఈ ప్రశ్న వేసి చాలా రోజులు అయింది. సమాధానం బాగా ఆలస్యం అయింది. ఇలా సమాధానం ఆలస్యం అయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇచ్చే సమాధానం వివరంగా సంతృప్తికరంగా ఉండాలన్న ఆలోచన చేస్తాను. ఈ ఆలోచన సమాధానాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. అందుకు చింతిస్తూ… నిజమే. గూఢచర్యం అన్ని దేశాలూ చేస్తాయి. ఇండియా కూడా గూఢచర్యం…

క్వాంటమ్: ఆఫ్-లైన్ కంప్యూటర్లపైనా అమెరికా నిఘా

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ ఆన్-లైన్ కంప్యూటర్ల పైనే కాకుండా ఆఫ్-లైన్ కంప్యూటర్లపైన కూడా నిఘా పెట్టే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడి అయింది. ఇంటర్నెట్ తో కనెక్షన్ లేకపోయినా నిఘా పెట్టగల పరికరాలను తయారు చేసుకున్న ఎన్.ఎస్.ఏ ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలకు చెందిన అత్యంత ముఖ్యమైన లక్షకుపైగా కంప్యూటర్లపై వాటి సాయంతో గూఢచర్యం నిర్వహించిందని తెలిసింది. లక్ష్యిత కంప్యూటర్లలో రేడియో తరంగాలను వెలువరించే పరికరాలను, తగిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను ఇన్ స్టాల్ చెయ్యడం…

రష్యా టెర్రర్ దాడులకు కారణం సౌదీ?!

మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి. చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను…

చలికి చివికిపోతున్న అమెరికా దౌత్యం -కార్టూన్

తాజా రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాలను ఉనికిలో ఉన్న వాతావరణంతో పోలిక పెట్టి పాఠకులకు గిలిగింతలు పెట్టడం కార్టూనిస్టులకు ఇష్టమైన విద్య. ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కూడా ఈ కార్టూన్ లో ఈ విద్యనే ప్రదర్శించారు. పోలార్ వొర్టెక్స్ ప్రభావంతో గత వారం అంతా అమెరికా చలితో గజ గజ వణికిపోయింది. కొన్ని చోట్ల -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయేంతగా చలి గాలులు అమెరికాను పీడించాయి. ఆర్కిటిక్ చలి వాతావరణాన్ని సహజసిద్ధంగా పట్టి బంధించే…

దేవయాని: అమెరికా ఆఫర్ తిరస్కరించిన ఇండియా

దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని…

నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’లో నిండా మునిగిన అమెరికా సైనికులు 4 సంవత్సరాల వయసుగల టెర్రరిస్టును కాల్చి చంపి కాలరెగరేశారు. ఆనక ప్రమాదవశాత్తూ చంపామని ప్రకటించారు. దుమ్ము దట్టంగా ఉండడంతో 4 యేళ్ళ పిల్లాడు తమ మీదికి దాడికి వస్తున్నాడని భావించి కాల్చి చంపామని సైనికులు చెప్పారని స్ధానిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలకు హామీ ఇస్తే తప్ప అమెరికాతో ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాని’కి ఒప్పుకునేది లేదని చెబుతున్న అధ్యక్షుడు కర్జాయ్ తాజా ఘటనతో స్వరం…

మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవయాని…

పూర్తయిన నేరారోపణ, ఇండియా వస్తున్న దేవయాని

దేవయాని సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతోంది. గురువారం వరుసగా, వేగంగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ వైపు న్యూయార్క్ ప్రాసిక్యూషన్ కోర్టులో దేవయానిపై అభియోగాలను మోపడం పూర్తి అవుతుండగానే ఆమెకు పూర్తి స్ధాయి రాయబార రక్షణ కల్పించే ఐరాస భారత శాశ్వత కార్యాలయం బదిలీని ఆమోదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది. దానితో రాయబార రక్షణ ఆసరాతో దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి మార్గం సుగమం…

ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం

అమెరికా, ఐరోపాలు నెలకొల్పిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇరాక్ లో మూడు పేలుళ్లు, అరవై చావులుగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దేశాల నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్… ఇత్యాది దేశాల సైనిక మూకలు మోసుకొచ్చిన ఆధునిక విలువలు ఇరాక్ ను ఆధునిక నరకంగా మార్చివేశాయి. 8 యేళ్ళ పాటు తిష్ట వేసిన నాటో కూటమి సైన్యాలు నాటిన సెక్టేరియన్ విద్వేషాలు ఇప్పుడక్కడ ఆత్మాహుతి దాడులుగా, బాంబు పేలుళ్లుగా, వేలాది హత్యలుగా పుష్పించి విరాజిల్లుతున్నాయి. 2008 తర్వాత అత్యంత…