ఉక్రెయిన్: మరో 2 ప్రాంతాలు స్వయం పాలనకు నిర్ణయం

ఉక్రెయిన్ సంక్షోభం కొండవీటి చాంతాడు లాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు స్వయం పాలన ప్రకటించుకున్నాయి. తాము నిర్వహించిన రిఫరెండంలో ఉక్రెయిన్ నుండి విడిపోయి స్వతంత్రంగా ఉండడానికే ప్రజలు నిర్ణయించారని దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల తిరుగుబాటు నేతలు ప్రకటించారు. రిఫరెండంను రష్యా కుట్రగా ఉక్రెయిన్ పాలకులు తిట్టి పోశారు. రిఫరెండంను వాయిదా వేయాలని రష్యా అధ్యక్షుడు కోరినప్పటికీ దానికి తిరుగుబాటుదారులు అంగీకరించలేదు. రిఫరెండం ఫలితాల నేపధ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు…

రష్యా గ్యాస్ కు ప్రత్యామ్నాయం కోసం జి7 వెతుకులాట!

అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేసినట్లే జరుగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా యూరప్ గ్యాస్ మార్కెట్ ను అమెరికా చేజిక్కించుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. రష్యా నుండి ఇన్నాళ్లూ భారీ మొత్తంలో సహజవాయువు సరఫరా పొందుతున్న ఐరోపా దేశాలకు రష్యాకు ప్రత్యామ్నాయంగా అమెరికా షేల్ గ్యాస్ ను ఉపయోగపెట్టుకోవడానికి నిర్ణయించే వైపుగా అడుగులు పడుతున్నాయి. రోమ్ లో మూడు రోజుల క్రితం ముగిసిన జి7 శక్తి వనరుల మంత్రుల సమావేశం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత…

సిరియా: అస్సాద్ జైత్రయాత్ర, హోమ్స్ పునఃస్వాధీనం

సిరియాలో పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన ఆల్-ఖైదా టెర్రరిస్టు మూకలు చావు దెబ్బలు తింటున్నాయి. తిరుగుబాటు పేరుతో వివిధ ముస్లిం టెర్రరిస్టు గ్రూపులు మొట్టమొదటిసారిగా విధ్వంసం ప్రారంభించిన హోమ్స్ నగరం ఇప్పుడు దాదాపు అస్సాద్ ప్రభుత్వం చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హోమ్స్ లోని వివిధ ఉగ్రవాద శిబిరాలపై ప్రభుత్వ బలగాలు తీవ్ర స్ధాయిలో దాడులు చేయడంతో ఉగ్రవాదులు కాళ్ళ బేరానికి వచ్చి ప్రభుత్వంతో తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు. “ఇది మేము కోరుకున్నది కాదు. కానీ…

ప్రొ-రష్యా అలజడులతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్ -ఫోటోలు

నిన్నటి వరకు పశ్చిమ దేశాల అనుకూల ఆందోళనలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ కంటికి నిద్ర లేకుండా గడిపింది. రైట్ సెక్టార్, స్వోబోడా లాంటి మితవాద, నయా నాజీ సంస్ధలు హింసాత్మక ఆందోళనలతో యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. అంతటితో ఉక్రెయిన్ చల్లబడలేదు. ఈసారి ఆందోళనలు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఈ సారి ఆందోళనలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగానూ, ఇ.యు, అమెరికాల మద్దతు ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎక్కుపెట్టబడ్డాయి. కీవ్ ఆందోళనలకు పశ్చిమ దేశాలు…

ఉక్రెయిన్: అమెరికాకు తా చేసింది ప్రజాస్వామ్యం

‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అని మూర్ఖుల ధోరణిని వర్ణిస్తుంది ఒక సామెత. మనం చెప్పుకునేది మూర్ఖుల గురించి కాదు. ‘ఉంటే నాతో ఉండు. లేదంటే శత్రువుతో ఉన్నట్లే’ అని ప్రపంచ దేశాల్ని శాసించే అమెరికా గురించి. తాను చెప్పిందే నీతి. తన మాటే శాసనంగా చెలాయించుకునే అమెరికా ఏక నీతికి తాజా తార్కాణం ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో విక్టోరియా నూలంద్ వదరిన వాక్కులు! విక్టోరియా నూలంద్ అమెరికాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్.…

ఉక్రెయిన్ సంక్షోభం: స్వీడన్ మిలట్రీ వ్యయం పెంపు

ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం పడవేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు భారత పాలకులు మద్దతు ఇవ్వగా రష్యా అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. రష్యాతో శక్తి వనరుల వాణిజ్యాన్ని 2018 నాటికి మూడు రెట్లు పెంచే ఒప్పందాన్ని చైనా చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ రోజు (ఏప్రిల్ 22) ఉక్రెయిన్ సందర్శించి నాజీ పాలకులకు మద్దతు ప్రకటించాడు. సోవియట్ రష్యా పతనం తర్వాత తన మిలట్రీ ఖర్చును బాగా తగ్గించుకున్న స్వీడన్ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా…

ఉక్రెయిన్ సంక్షోభం: మరింత దగ్గరవుతున్న రష్యా, చైనా

ఉక్రెయిన్ సంక్షోభం పలు భౌగోళిక రాజకీయాలకే కాకుండా ఆర్ధిక పరిణామాలకు కూడా బాటలు వేస్తోంది. ఐరోపా, రష్యాల మధ్య కీలక స్ధానంలో ఉన్న ఉక్రెయిన్ ను నిస్పక్ష ప్రాంతంగా నిలిపి ఉంచడం ద్వారా నాటో దూకుడుని రష్యా పాక్షికంగానైనా నిరోధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ నాటో చేతుల్లోకి వెళ్లిపోవడంతో తన విదేశాంగ విధానాన్ని సవరించుకోవలసిన తక్షణ అవసరం రష్యాకు ఏర్పడింది. రష్యా శక్తి వనరులకు పెద్ద వినియోగదారుగా ఉన్న ఐరోపాకు బదులు ఆ స్ధానాన్ని భర్తీ…

ఉక్రెయిన్ లో మళ్ళీ రష్యా పై చేయి?

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్…

చైనా నౌకా విన్యాసాలు: ఇండియా ఇన్, అమెరికా ఔట్

చైనా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకా విన్యాసాల సమీక్షలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఎన్నాళ్లనుండో పాల్గొంటుందని భావిస్తున్న జపాన్ కు చైనా ‘నో’ చెప్పడంతో అమెరికా కూడా తప్పుకుంది. ఆసియాలో తన అనుంగు మిత్రుడు జపాన్ కు ప్రవేశం లేని చోటకు నేనూ రాను అని చెప్పేసింది. కాగా చైనా కోరిక మేరకు విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇండియా తన సంసిద్ధతను ప్రకటించడంతో విన్యాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. చైనాకు కౌంటర్-వెయిట్ గా నిలపాలని అమెరికా భావిస్తున్న ఇండియా, చైనా…

ఉక్రెయిన్: త్వరలో జెనీవా సమావేశం, పరిష్కారం అనుమానం

ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇరు పక్షాలు చర్చలకు మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. ఉక్రెయిన్ లో తమ తమ ప్రయోజనాలను ఘర్షణలు లేకుండా సంరక్షించుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇ.యు, ఉక్రెయిన్, రష్యాలు సమావేశం అవుతున్నాయి. ఇందులో ఉక్రెయిన్ పాత్ర నామమాత్రం. ఉక్రెయిన్ పాలనను ప్రస్తుతం అదుపులో ఉంచుకున్నది ఇ.యు, అమెరికాలే కనుక ఆ మేరకు పశ్చిమ సామ్రాజ్యవాదులకు సానుకూలత ఏర్పడి ఉంది. అయితే ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో రష్యా భాష మాట్లాడే…

అమెరికన్లు: ఉక్రెయిన్ ఎక్కడో తెలియదు, దాడికి రెడీ

ఉక్రెయిన్ ఎక్కడ ఉంది అనడిగితే అమెరికన్లకు తెలియదు. కానీ అమెరికా జాతీయ భద్రత పేరుతో మిలట్రీ దాడి చేయడానికి మాత్రం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అమెరికాకే చెందిన యూనివర్శిటీల ప్రొఫెసర్ల బృందం ఒకటి జరిపిన సర్వేలో ఈ సంగతి తెలిసింది. యువకుల దగ్గర్నుండి పెద్దవారి దాకా ప్రపంచంలో ఉక్రెయిన్ ఎక్కడుందో గుర్తించమంటే సరిగ్గా గుర్తించినవారు నూటికి 16 మంది మాత్రమే. ఉక్రెయిన్ ని సరిగ్గా గుర్తించినవారు మిలట్రీ దాడికి వ్యతిరేకత వ్యక్తం చేయగా అసలు చోటుకు…

ఉక్రెయిన్ నుండి స్వతంత్రం ప్రకటించుకున్న దోనెట్స్క్

ఉక్రెయిన్ సంక్షోభం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వంలో తమ అనుకూలురను ప్రతిష్టించడం ద్వారా కుంభస్తలాన్ని కొట్టామని అమెరికా, ఐరోపాలు సంతోషపడుతుండవచ్చు. కానీ రష్యా పెద్దగా ఆర్భాటం లేకుండా, ఖర్చు లేకుండా తనపని తాను చేసుకుపోతోంది. ఒక్క గుండు కూడా పేల్చకుండా క్రిమియా ప్రజలే తమ ప్రాంతాన్ని రష్యాలో కలిపేలా పావులు కదిపింది, ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోని తూర్పు రాష్ట్రం దోనెట్స్క్ ప్రజలు కూడా తమ రాష్ట్రాన్ని ఉక్రెయిన్ నుండి విడివడిన స్వతంత్రం దేశంగా…

అణ్వస్త్రాలు: బి.జె.పిది నో-ఫస్ట్-యూజ్ సిద్ధాంతం కాదా?

రేపు సాధారణ ఎన్నికలు ప్రారంభం అవుతాయనగా బి.జె.పి ఈ రోజు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడి ప్రచారాస్త్రాలకు, మేనిఫెస్టో రచయితల అభిప్రాయాలకు వైరుధ్యం తలెత్తడం వల్లనే మేనిఫెస్టో విడుదల ఆలస్యం అయిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ మోడి ప్రచారం చేస్తుండగా సంఘ్ పరివార్ పెట్టీ డిమాండ్లయిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, రాముడి గుడి నిర్మాణం, యూనిఫాం సివిల్ కోడ్ లాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచడంతో…

అమెరికా దురాక్రమణలో విరగబూసిన ఆఫ్ఘన్ హెరాయిన్

ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ దాడికి అమెరికా చెప్పిన కారణాల్లో ఒకటి ఓపియం సాగుని అరికట్టడం. అమెరికా తన ఆక్రమణను  పూర్తిగా డిసెంబర్ తో ముగిస్తానని చెబుతోంది. అప్పటికి ఓపియం సాగుని అరికట్టకపోయినా కనీసం కొంత భాగం అరికట్టినా ఏదో ప్రయత్నం చేశారని సంతృప్తి పడొచ్చు. కానీ 13 సం.ల అమెరికా ఆక్రమణలో  ఆఫ్ఘనిస్ధాన్ లో ఓపియం సాగు అరికట్టడం అటుంచి 40 రెట్లు పెరిగితే ఏమిటని అర్ధం చేసుకోవాలి. అమెరికా ఓపియం సాగుని అరికట్టడానికి ప్రయత్నించిందనా లేక…

1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్

1962 నాటి ఇండియా-చైనా యుద్ధంలో మొదట దాడి చేసింది ఇండియాయేనని చైనా కాదని  సీనియర్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు నెవిల్లే ప్రకటించారు. ఆనాటి యుద్ధానికి సంబంధించి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న పత్రాలను తాను త్వరలో ప్రచురిస్తానని మాక్స్ వెల్ తెలిపారు. పత్రాలను ప్రచురించడం ద్వారా తాను “భ్రాంతిజనకమైన భారతీయ అభిప్రాయాలను పారద్రోలతానని” మాక్స్ వెల్ చెప్పడం విశేషం. 1962 నాటి యుద్ధం చైనా వల్లనే సంభవించిందని భారత దేశంలోని పాఠ్య పుస్తకాలు చెబుతాయి. హిందూ మతోన్మాద సంస్ధలు కూడా…