ఫిర్యాదు: అమెరికా యుద్ధ నౌక చర్య ప్రమాదకరం! -వీడియో

అమెరికా యుద్ధ నౌక ఒకటి తమ పెట్రోలింగ్ నౌకను ప్రమాదకరంగా ఆటంకపరిచిందని రష్యా ఆరోపించింది. మధ్యదరా సముద్రంలో ప్రయాణిస్తున్న తమ నౌకను అమెరికన్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక దాటి వెళుతూ అంతర్జాతీయ నావికా చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించిందని, ఇతర దేశాలకు నీతులు చెప్పేందుకు ముందుండే అమెరికా తన ప్రవర్తనను చక్క దిద్దు కోవాలని రష్యా కోరింది. అమెరికా నౌకా బలగం లోని డిస్ట్రాయర్ నౌక గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగల శక్తి కలిగినది. ‘యూ‌ఎస్‌ఎస్ గ్రేవ్ లీ’ అనే…

త్వరగా దయచేయండి! -ఈయు

‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది. “యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.…

బ్రెగ్జిట్ తర్వాత… -కార్టూన్ లలో

అందరిలాగే కార్టూనిస్టులూ బ్రెగ్జిట్ కు స్పందించారు. వారి వారి ప్రయోజనాలకు తగినట్లుగానే ఆయా పత్రికలు, కార్టూనిస్టులు స్పందించారు. బహుళజాతి కంపెనీల పోషణలోని పశ్చిమ పత్రికలు బ్రెగ్జిట్ ఓటును దూషిస్తూనో, ఎకసక్కెం చేస్తూనో కార్టూన్ లు ప్రచురించగా బ్రెగ్జిట్ సానుకూలుర స్పందన కాస్త వాస్తవాలకు దగ్గరగా తమ గీతల్లో స్పందించారు. ఈ రెండో రకం కార్టూన్ లు వ్యక్తిగతంగా ట్విట్టర్ ద్వారా మాత్రమే పబ్లిష్ చేసుకునే అవకాశం లభించింది. మొదటి రకం కార్టూన్ లకు ప్రధాన స్రవంతి పత్రికలలో…

పుట్టిన ఊర్ల యూరప్ కోసం…!

[బల్గేరియా పత్రిక “A-specto” లో బల్గేరియా రచయిత ఏంజెల్ జంబాజ్కి చేసిన రచన ఇది. బల్గేరియన్ భాషలో చేసిన రచనను వలెంతినా జోనేవా ఆంగ్లంలోకి అనువదించగా సౌత్ ఫ్రంట్ ప్రచురించింది. దానిని తెలుగులోకి మార్చి ఇక్కడ ప్రచురిస్తున్నాను. యూరోపియన్ యూనియన్ ను సభ్య దేశాలపై ముఖ్యంగా సభ్య దేశాల శ్రామిక ప్రజలపై, వారి సంస్కృతిపై, వారి జీవనంపై, వారి కుటుంబాలపై ఏ విధంగా రుద్దారో ఈ రచన తెలియజేస్తుంది. -విశేఖర్] ********* సందేహం లేదు, ఇది చరిత్రాత్మకమే.…

బ్రెగ్జిట్ అద్భుతం: ఈ‌యూతో విడాకులకే బ్రిటిష్ ఓటు (విశ్లేషణ)

బ్రిటన్ ప్రజలు అనూహ్య ఫలితాన్ని ప్రపంచం ముందు ఉంచారు. యూరోపియన్ యూనియన్ తో విడిపోవటానికే మా ఓటు అని చాటి చెప్పారు. జూన్ 23 తేదీన గురువారం జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్ కే ఓటు వేశారు. 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (లీవ్ ఈ‌యూ) కు ఓటు వేయగా 48.1 శాతం మంది ఈ‌యూలో కొనసాగాలని (రిమైన్) ఓటు వేశారు. 3.8 శాతం మెజారిటీతో బ్రెగ్జిట్ పక్షాన నిలిచారు. తద్వారా దశాబ్దాలుగా అమెరికా తమపై…

కోర్టు ఆజ్ఞలు ఉల్లంఘిస్తే ఊరుకోం -చైనాతో అమెరికా

ఏదో ఒక వంక పెట్టుకుని కాలు దువ్వక పోతే అమెరికాకు రోజు గడవదు. చైనా లక్ష్యంగా తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో భారీ మిలటరీ బలగాలను మోహరించిన అమెరికా అడపాదడపా చైనాకు వ్యతిరేకంగా యుద్ధ సవాళ్లు విసురుతోంది. త్వరలో వెలువడే అంతర్జాతీయ కోర్టు తీర్పును పాటించకుండా విస్మరిస్తే చైనా తగిన ఫలితం అనుభవించ వలసి ఉంటుందని అమెరికా తాజాగా బహిరంగ వివాదానికి అంకురార్పణ చేసింది. అంతర్జాతీయ కోర్టుగా పరిగణించబడే ‘పర్మినెంటు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ లో…

రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు మలుపు, కుదుపు కాగల మార్పులకు దారి తీసే అవకాశం ఉన్న ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఉరఫ్ రిఫరెండం రేపు, జూన్ 23 తేదీన, బ్రిటన్ లో జరగనున్నది. “యూ‌కే, యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా లేక బైటికి రావాలా?” అన్న ఏక వాక్య తీర్మానంపై జరిగనున్న రిఫరెండంలో విజేతగా నిలవటానికి ఇరు పక్షాలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు ఇరువురు మధ్యా దొబూచులాడుతోందని సర్వేలు చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. యూ‌కే రిఫరెండంలో యూ‌కే…

అమెరికా కొత్త ఉగ్ర వాస్తవికత -ది హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 14- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “America’s new terror reality” కు యధాతధ అనువాదం] –o0o– గ్లోబల్ జిహాదీ ఉగ్రవాదం, విచ్చలవిడి తుపాకీ నియంత్రణ చట్టాలు, వినాశకర హోమో ఫోబియా… ఈ మూడు విష శక్తులు ఆదివారం రాత్రి మూకుమ్మడిగా ఒర్లాండో, ఫ్లోరిడా లోని నైట్ క్లబ్ పైన విరుచుకుపడ్డాయి. ఫలితంగా, అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ సామూహిక హత్యాకాండ చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ వలస దంపతులకు అమెరికాలో జన్మించిన ఒమర్…

క్లుప్తంగా… -10/06/2016

ఏప్రిల్ లో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెలలో ఫ్యాక్టరీ/పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది. 2015 ఏప్రిల్ తో పోల్చితే 2016 ఏప్రిల్ నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి 0.8 శాతం తగ్గిపోయిందని కేంద్ర గణాంక కార్యాలయం (CSO – Central Statistics Office) ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి సాధించిందని అట్టహాసంగా ప్రకటించి రోజులు గడవక ముందే ఈ ప్రతికూల వార్త వెలువడటం…

క్లుప్తంగా …8/6/2016

తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! పోరాటం కొనసాగుతుంది -శాండర్స్ సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు కేరళను తాకిన నైరుతి ఋతుపవనం రాజన్ భారతీయుడే -ఆర్‌బి‌ఐ తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ…

పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4

(3వ భాగం తరువాత………..) అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది. అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట…

అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3

– (2వ భాగం తరువాత………….) అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా! 2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి).…

పనామా పేపర్స్: పుతిన్ ఎందుకు కేంద్రం అయ్యాడు? -2

(మొదటి భాగం తరువాత……….) అసలు ఐ‌సి‌ఐ‌జే ఎక్కడిది? సంవత్సరం క్రితం వరకూ దీనిని గురించి తలచుకున్నవారు లేరు. 1997లో స్థాపించినట్లు చెబుతున్న దీని మాతృ సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటీ (సి‌పి‌ఐ). సి‌పి‌ఐకి నిధులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మొత్తం విషయంలో సగం అర్ధం అయిపోతుంది. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) మాజీ రాయబారి క్రెయిగ్ ముర్రే తన వెబ్ సైట్ లో ఇలా తెలిపాడు. “మొస్సాక్ ఫన్సెకా సమాచారాన్ని వడ కట్టిన…

ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…

ఆర్మీ మందుగుండు డిపోలో పేలుడు, 17గురు సైనికులు ఆహుతి

మహారాష్ట్రలో భారత రక్షణ బలగాల ఆయుధాలకు మందుగుండు సరఫరా చేసే అతి పెద్ద మందుగుండు డిపోలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంగా చెబుతున్న దుర్ఘటనలో 17 మంది సైనికులు దుర్మరణం చెందారని పత్రికలు తెలిపాయి. మరణాల సంఖ్య 20 కి పెరిగిందని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రధాన మంత్రి యధావిధిగా ‘ట్విట్టర్’ ద్వారా తన ఆందోళన ప్రకటించారు. తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని తెలిపారు. మృతులలో ఇద్దరు అధికారులు కాగా 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీ…