ఢిల్లీ పాప అత్యాచారం: రెండో నిందితుడి అరెస్టు

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ లో ఐదేళ్ల పాపపై అత్యాచారం జరిగిన కేసులో రెండో వ్యక్తి పాత్రను నిరాకరిస్తూ వచ్చిన పోలీసులు సోమవారం అందుకు విరుద్ధమైన పరిణామాన్ని దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. రెండో నిందితుడుగా భావిస్తున్న ప్రదీప్ ను బీహార్ లోని లఖిసారాయ్ జిల్లా నుండి అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. తాను పాపపై ఏ అఘాయిత్యానికి తలపెట్టలేదని, అత్యాచారం చేసింది ప్రదీప్ అని మనోజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పాపపై అత్యాచారం…

టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? -ఫోటోలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వాకో నగరం వద్ద ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ భారీ స్ధాయిలో పేలిపోయింది. 5 నుండి 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా పత్రికలు డజన్ల మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నాయి. 70 మందికి పైనే మరణించారని స్ధానిక పత్రికలు చెప్పినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారని బి.బి.సి తెలిపింది. ఎరువుల ఫ్యాక్టరీ కావడంతో మంటల వలన వ్యాపిస్తున్న దట్టమైన పొగ విషపూరితంగా ఉన్నదని, దానితో వివిధ విభాగాల భద్రతా…

మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ

మణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ…

అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…

ఆమె ఒక మహిళా సంఘం కార్యకర్త. అవినీతిని నిలదీయడం ఆమె చేసిన నేరం. ఆ మాత్రానికే అత్యంత ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేసి, వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో హింసించి చంపేశారు. ఫిర్యాదు చేయబోయిన తండ్రి, కుమారుల పైనే నేరం బనాయించడానికి సిద్ధపడడం పోలీసుల వికృత లీలకు తాజా రూపం. భూస్వామ్య కుల దురహంకారం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించే బీహార్ సీమ ఈ ఘోరానికి వేదిక. దేశం మొత్తం అభివృద్ధి పధంలో సాగడానికి తమ…

విషవాయువు విడుదల, స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆర్డర్

మార్చి 23 తేదీన విషపూరితమైన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేసి పరిసర గ్రామాల ప్రజలను అనారోగ్యానికి గురిచేసిన ‘స్టెరిలైట్ కాపర్’ కంపెనీని మూసివేయాల్సిందిగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. చుట్టుపక్కల గ్రామాల పొలాలను పనికి రాకుండా చేసిన ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామీణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయాలు కాల్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.…

శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా…

నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు

భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం…

మహిళా బ్యాంకు బ్రాంచీలు ఆరు

– 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని…

ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్

“ఈ విప్లవాగ్నులు ఎచటివి అని అడిగితే నగ్జల్బరి వసంత మేఘ గర్జనవైపు వేలు చూపండి” ప్రముఖ విప్లవ కవి చెరబండరాజు రాసిన ఒక కవితలోని పాదాలివి. ఒక కాలంలో కాలేజీలు, యూనివర్శిటీలను ఒక్క ఊపు ఊపి బహుళ ప్రసిద్ధి చెందిన పాదాలివి. భారత ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అన్న నిజానికి సంకేతంగా 1960ల చివర్లో పశ్చిమ బెంగాల్ లో నగ్జల్బరి గ్రామంలో పుట్టిన రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ చెరబండరాజు ఈ మాటలు రాశాడు. నగ్జల్బరిలో వసంత…

జలియన్‌వాలా బాగ్: క్షమాపణకు బ్రిటిష్ ప్రధాని నిరాకరణ

అమృత్ సర్ లోని జలియన్‌వాలా బాగ్ ను సందర్శించిన బ్రిటిష్ ప్రధాని కామెరూన్ నాటి మారణకాండకు క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. మాజీ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లే మొక్కుబడిగా విచారం ప్రకటించి ఊరుకున్నాడు. కుంటిసాకులు చెప్పి క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. తాను బ్రిటన్ దేశ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి అన్న విషయం మరిచి ‘జలియన్‌వాలా బాగ్ దుర్మార్గం’ జరిగినప్పటికి తాను అసలు పుట్టనే లేదని అసందర్భ వ్యాఖ్యలు చేసి తప్పించుకున్నాడు. హిల్స్ బరో ఫుట్…

కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్‌లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో…

అఫ్జల్ గురు ఉరి: మన బద్ధ శత్రువు కూడా మెరుగుగా చేసి ఉండడు

భారత దేశంలోనే ప్రముఖ న్యాయ నిపుణుడుగా (జ్యూరిస్టుగా) పేరు ప్రఖ్యాతులు పొందిన ఫాలి నారిమన్ కాశ్మీరు జాతీయుడు అఫ్జల్ గురు ఉరితీత పైన స్పందించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో కరణ్ ధాపర్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని కడిగేశాడు. అఫ్జల్ కుటుంబానికి సరైన సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉరితీసి పాతిపెట్టడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. మానవతకు భారత దేశ సాంప్రదాయంలో అత్యున్నత స్ధానం ఉన్నదని, ఫోన్ చేసి చెప్పగల సమాచారాన్ని స్పీడ్…

ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

అవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన…

అఫ్జల్ గురు ఉరితీత, ఢిల్లీలో కాశ్మీరీల ఆందోళనలు -ఫొటోలు

2001 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిపిన కేసులో అరెస్టు అయి అప్పటినుండి జైలులో మగ్గుతున్న అఫ్జల్ గురుకి కోర్టు విధించిన మరణ శిక్షను శనివారం ఉదయం అమలు చేసారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఆయనకు విధించిన ఉరి శిక్షను అమలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ లబ్ది పొందడానికే ఈ సమయంలో ఆయనని ఎన్నికలముందు ఉరి తీసారన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉరి శిక్ష అమలుపై…

గిరిజనాల పరిస్ధితికి దర్పణం ఈ పాట -వీడియో

భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ దేశ సహజ మౌలిక ఖనిజ వనరులను దేశ ప్రజలకు వినియోగ పెట్టడం మాని తవ్వి విదేశీ కంపెనీలకు ముడి పదార్ధాలుగా దేశం దాటిస్తున్నారు. ఆ క్రమంలో తరాల తరబడి అడవులు, కొండలను నమ్ముకుని బతుకుతున్న పేద గిరిజన రైతు కూలీలు కొంపా, గోడు దోపిడీదారులకు అప్పజెప్పి తమకు పరిచయం లేని మైదాన ప్రాంతాల్లో పని…