దురన్ ఆదం: టర్కీలో వినూత్న నిరసన

టర్కీ ప్రధాని రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నియంతృత్వ విధానాలకు, ఆయన అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా మూడు వారాలుగా ఆందోళన చేస్తున్న టర్కీ ప్రజలు సోమవారం నుండి వినూత్న నిరసన చేపట్టారు. ప్రముఖ టర్కీ నాట్య కళాకారుడు ఎర్దెమ్ గుండుజ్ ప్రారంభించిన ఈ నిరసన రూపం కొద్ది గంటల్లోనే దేశ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందడమే కాక అనేకమంది ఆయనను అనుసరించడానికి దారి తీసింది. ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే శరవేగంగా ఆదరణ పొందిన ఈ నిరసన…

రెండు నివేదికలు -కార్టూన్

కార్టూనిస్టు శ్రీధర్ ని తెలియనివారు తెలుగు దేశంలో ఎవరైనా ఉంటారా అన్నది అనుమానమే. నాకైతే ఈనాడు పత్రిక తెలిసినప్పటి నుండీ ఆయన తెలుసు. సాదాసీదా మాటల్లో రాష్ట్ర, జాతీయ నాయకులకు చురకలు అంటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కార్టూన్ లలో ఇది ఒకటి. నివేదికలు ఇచ్చే హక్కు, పరిజ్ఞానం ఒక్క ప్రభుత్వాలకు మాత్రమే సొంతమైన హక్కు కాదు. అది ప్రజలు కూడా చేయగలరు. కాకపోతే ప్రజల తరపున ఒక ఆర్.కె.లక్ష్మణ్, ఒక శ్రీధర్… ఇలాంటివారు…

టర్కీ: సిరియా తిరుగుబాటు ఎగదోస్తూ, సొంత ప్రజలపై ఉక్కుపాదం

సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అసద్ ను గద్దె దింపడానికి టర్కీ మతతత్వ పాలకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేయని ప్రయత్నం లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పశ్చిమ రాజ్యాలతో కుమ్మక్కై సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు తమ భూభాగం పైనే శిక్షణా శిబిరాలు నెలకొల్పి సిరియాకు పంపుతున్న ఘనత ఎర్డోగాన్ సొంతం. సిరియాలో ప్రజలపైనా, ప్రభుత్వ వ్యవస్ధల పైనా మారణ హోమం సృష్టిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు టర్కీ ద్వారా పశ్చిమ దేశాలు అనేక మారణాయుధాలు సరఫరా…

దేనికైనా సిద్ధపడే లీక్ చేశాను -స్నోడెన్ ఇంటర్వ్యూ

మొదటి భాగం తరువాయి…………. – మీరు దీనికోసం పధకం వేస్తున్నారని మీ కుటుంబానికి తెలుసా? లేదు. ఏం జరుగుతోందో నా కుటుంబానికి తెలియదు. ప్రధానంగా నా భయం ఏమిటంటే వారు కుటుంబం వెంటపడతారు. నా మిత్రులు, నా భాగస్వామి… ఇలా నా సంబంధీకులను అందర్నీ వేధిస్తారు… నా మిగిలిన జీవితంలో ఈ వాస్తవంతో నేను బతకాల్సి ఉంటుంది. వారితో సంభాషించే అవకాశం నాకు ఇక ఉండదు. వాళ్ళు (అధికార వర్గాలు) నేను తెలిసిన ప్రతి ఒక్కరిపైనా తీవ్ర…

ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం. బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు,…

వాళ్ళు నా కుటుంబాన్ని సాధిస్తారు, అదే నా భయం -స్నోడెన్ ఇంటర్వ్యూ

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ‘నేషనల్ ఇన్వేస్టిగేటివ్ ఏజన్సీ’ (ఎన్.ఐ.ఎ) అక్రమాల గుట్టు విప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్ ది గార్డియన్ పత్రిక విలేఖరులు గ్లెన్ గ్రీన్ వాల్డ్, ఎవెన్ మకాస్కిల్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ది హిందు పత్రిక మూడు రోజుల క్రితం దీనిని పునర్ముద్రించింది. తాను ఎందుకు ఎన్.ఎస్.ఎ అక్రమాలను బైటపెట్టవలసి వచ్చింది, ఆర్ధికంగా ఉన్నతమైన తన ప్రామిసింగ్ కెరీర్ ని ఎందుకు వదులుకున్నదీ ఆయన ఇందులో వివరించారు. ఉగ్రవాదం కొత్తగా పుట్టిందేమీ కాదనీ,…

ఎడ్వర్డ్ స్నోడెన్: ప్రిజం లీక్ చేసింది సి.ఐ.ఎ కాంట్రాక్టరే

అమెరికన్ మిలటరీ గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ, ప్రపంచ ప్రజల రోజువారీ ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లపై నిఘా పెట్టడానికి అభివృద్ధి చేసిన ‘ప్రిజం’ కార్యకలాపాల గురించి ‘ది గార్డియన్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలకు వెల్లడి చేసింది సి.ఐ.ఎ మాజీ కాంట్రాక్టరేనని గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది. సి.ఐ.ఎ కాంట్రాక్టర్ గా పని చేసి, అనంతరం ఎన్.ఎస్.ఎ మిలట్రీ కాంట్రాక్టర్ బూజ్ అలెన్ వద్ద ఉద్యోగిగా పని చేస్తున్న ఎడ్వర్డ్ స్నోడెన్ తమకు ‘ప్రిజం’ గురించి సమాచారం ఇచ్చాడని…

సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్,…

హింస కాదు ప్రతి హింస: అరుంధతీ రాయ్ -3

రెండో భాగం తరువాయి………….. సాగరికా ఘోష్: మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి మీరు ఇష్టపడతారా? ఎందుకంటే కబీర్ సుమన్ తో పాటు మీ పేరు కూడా వారు (మావోయిస్టులు) మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదించారు. అయితే మీరు తిరస్కరించారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు కదా? అరుంధతీ రాయ్: నేను నాకే భయపడుతున్నాను. అలాంటి నిపుణుతలు నాకు లేవు. నాపైన నాకు నమ్మకం లేదు. మీరు బాస్కెట్ బాల్ ఆటగాళ్లయితే మీరు ఈతగాళ్ళు…

అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు. ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల…

సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు. పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు…

గాంధేయవాదులూ బహిష్కృతులే -రెండో భాగం

(జస్టిన్ పొదుర్ టొరొంటో నగరంలో ఒక రచయిత. యార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్మాలియాలో విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఆయన బ్లాగ్: http://www.killingtrain.com ట్విట్టర్: @JustinPodur) మొదటి భాగం తరువాయి………………… జె.పి: ఆశ్రమ్ కూల్చివేత కూడా ఒక ఉదాహరణ అనుకుంటాను. హెచ్.కె: ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ భూమిలోనే మా ఆశ్రమ్ ని ప్రారంభించామని గుర్తుంచుకోండి. సల్వాజుడుం సాగిస్తున్న దాడులు, లైంగిక అత్యాచారాలు, హత్యలు, గ్రామ దహనాలు మొదలైన వాటిని మేము ప్రశ్నించడం ప్రారంభించాక…

గాంధేయవాదులు కూడా బహిష్కృతులే -గాంధియన్ హిమాంషుతో ఇంటర్వ్యూ

హిమాంషు కుమార్ గాంధీయన్ కార్యకర్త. మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు భావించే దంతెవాడ జిల్లాలో ‘వనవాసి చేతన్ ఆశ్రమ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధను 22 సంవత్సరాల పాటు తన భార్యతో కలిసి నిర్వహించారాయన. స్ధానిక ఆదివాసీల భాష ‘గోండి’ నేర్చుకుని చట్టబద్ధంగా ఆదివాసీలకు హక్కులు దక్కేలా చేయడానికి ఆశ్రమ్ ద్వారా ప్రయత్నించారు. 2005 మొదలుకుని ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వాజుడుం పేరుతో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్.పి.ఓ) నిర్వహించిన దారుణ హంతక దాడులతో కకావికలై అడవి వదిలి వెళ్ళిపోయిన గిరిజనులను…

కనీస వేతనాలకు ప్రధాన మంత్రే అడ్డం!

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై…