హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1

అమెరికా నీతిమాలిన గూఢచర్యం గురించి కళ్ళు తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా తనకు ఎంతో కావలసిన మిత్రుడు అని ప్రపంచానికి చాటే అమెరికా, తన గడ్డపై (వాస్తవానికి అది రెడ్ ఇండియన్ల గడ్డ)  ఇండియాకు సంబంధించి ఏ కార్యాలయాన్నీ గూఢచర్యం నుంచి మినహాయించలేదు. చివరికి, భారత దేశం యొక్క ప్రపంచ స్ధాయి దౌత్య కార్యకలాపాలకు గుండెకాయ లాంటివి అయిన న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీ…

ఆ చల్లని సముద్ర గర్భం -శ్రామికుడి నోటి పాట

ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు. కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న…

పాలస్తీనా: ఐరోపా రాయబారులపై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాలో యూదు ప్రభుత్వ దాష్టీకానికి బలైన పాలస్తీనీయులకు సహాయం అందించడానికి పూనుకోవడమే నేరమయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం బెడోవిన్ పాలస్తీనీయుల ఇళ్లను కూల్చివేయడంతో వారికి సహాయ కార్యక్రమాలు అందించడానికి వివిధ ఐరోపా దేశాల రాయబారులు సహాయ సామాగ్రితో సహా అక్కడికి వెళ్లారు. నిరాశ్రయులైన పాలస్తీనీయులకు సహాయం చేస్తే ఒప్పుకునేది లేదంటూ ఇజ్రాయెల్ సైనికులు ఐరోపా రాయబారులపై దాడి చేసి వారు తెచ్చిన సామాగ్రిని లాక్కున్నారు. ఆక్రమిత పాలస్తీనాలో పాలస్తీనీయుల ఇళ్లను కూల్చివేసి యూదు సెటిల్మెంట్లను నిర్మిస్తున్న…

తీవ్రమైన ది హిందు, డిజిపిల వివాదం

పాత బస్తీలోని ఒక బాబాను రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి రాసిన వార్తపై రేగిన రగడ తీవ్రరూపం దాల్చుతోంది. పాతబస్తీలో నివసించే ముస్లిం మత బాబా హబీబ్ ముస్తఫా ఇద్రాస్ బాబాను డిజిపి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి ది హిందు పత్రిక వార్త ప్రచురించగా ఈ వార్తను దురుద్దేశంతో ప్రచురించారని డిజిపి ఆరోపిస్తున్నారు. ఇతర పత్రికలన్నీ ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీల్లో వేయగా ది హిందు…

రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త…

యువరాజా నాయకత్వ విలువ! -కార్టూన్

ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే…

సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత

(రచన: అవ్వారి నాగరాజు) ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి అంటోంది ప్రేమించవేం ప్రియా ? “సమైక్యం” గా ఉందామని ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక- చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి…

నిర్భయ: నిందితులందరికీ ఉరి

నిర్భయ హంతకులు నలుగురుకి సత్వర న్యాయస్ధానం (fast-track court) ఉరిశిక్ష విధించింది. జరిగిన ఘోరం ఖచ్చితంగా అరుదయిన కేసుల్లోకెల్లా అరుదైనదేనని కనుక నిందితులకు మరణ శిక్షే సరైనదనీ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తీర్పు విన్న వెంటనే నిర్భయ తల్లిదండ్రులు, సోదరులు హర్షాతిరేకాలు ప్రకటించారు. తమ కూతురికి న్యాయం దక్కిందని చెబుతూ, తమ వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు ప్రకటించిన తర్వాత నిందితుల్లో ఒకరు ఏడుపు మొదలు పెట్టగా, ఇతరులు తమ పాపాన్ని…

సీమాంధ్ర ఉద్యమానిది కేవలం సెంటిమెంటు కాదు

(ఇది అవ్వారి నాగరాజు గారి వ్యాఖ్య.) తెలంగాణాకు అనుకూలంగా నేనూ, వ్యతిరేకంగా నా మిత్రులూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను. నా మిత్రుల వాదనలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినవి నదీ జలాలను పంచుకోవడం, కొత్త రాష్ట్రాన్నీ, కొత్త రాజధానినీ నిర్మించుకోవడానికి కావలసిన నిధులు, ఆదాయాలూ- ఆస్తులూ వాటి పంపకాలూ ప్రస్తావనకు వచ్చాయి. నదీ జలాల విషయం ఒక్కొక్క నదినీ సోదాహరణంగా తీసుకొని అవి కేవలం ఒక్క…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…

భారత ‘అవతార్’ నివాసులకు మోడి మద్దతు ఇవ్వగలరా?

హాలీవుడ్ సినిమా ‘అవతార్’ గుర్తుందా? అందులో అవతార్ అనే ఒక గ్రహం ఉంటుంది. విస్తారమైన సహజ వనరులతో ఆ గ్రహం అలరారుతుంటుంది. దానిపైన భూగ్రహం పైన ఉండే కంపెనీల కన్ను పడుతుంది. అక్కడి వనరులను కొల్లగొట్టడానికి వీలుగా దానిని ఆక్రమించుకోడానికి సైన్యాన్ని పంపుతుంది. అలా వెళ్ళిన సైన్యంలోని కొంతమంది ‘అవతార్’ గ్రహవాసులతో కలిసిపోయి సైన్యాన్ని ఓడించి తరిమివేయడంతో సినిమా ముగుస్తుంది. ఒరిస్సాలోని నియమగిరి కొండ, దాని చుట్టూ ఉన్న అడవుల్ని భారత దేశ ‘అవతార్’ గా ఆ…

ఈజిప్టు: మరో రక్తం ఓడుతున్న గాయమా? -ఫోటోలు

ఆఫ్ఘనిస్ధాన్ ని ‘రక్తం ఓడుతున్న గాయం’ గా అభివర్ణించాడు చివరి సోవియట్ రష్యా నేత మిఖాయిల్ గోర్బచెవ్. ఈ భూమండలం పైన రక్తం ఓడుతున్న గాయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాశ్మీరు, పాలస్తీనా, సిరియా, సోమాలియా…. ఇప్పుడు ఈజిప్టు. రెండేళ్ల క్రితం ముబారక్ ను పదవీచ్యుతుడ్ని చేసినప్పటి నుండి ఈజిప్టు వీధులు రక్తంతో తడవని రోజంటూ లేదు. ముబారక్ ఏలిన 30 సంవత్సరాలు ఈజిప్టులో నిరవధిక ఎమర్జెన్సీ అమలు చేశారు. కమ్యూనిస్టులను, ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలను……

ఉపాధి హామీ పధకం ఛారిటీ, దాన్ని ఆపాలి -మోడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ…

ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ

ఈజిప్టు మళ్ళీ రక్తం ఓడుతోంది. వదిలిందనుకున్న మిలట్రీ పిశాచం మళ్ళీ ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రెండేళ్ల క్రితం 2011లో సంభవించిన ప్రజా తిరుగుబాటులో హోస్ని ముబారక్ పదవీచ్యుతుడయిన సంగతి తెలిసిందే. దరిమిలా అధికార పగ్గాలను తాత్కాలికంగా కోల్పోయిన ఈజిప్టు మిలట్రీ, ప్రజాస్వామిక ఎన్నికల్లో అధ్యక్ష పదవి చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహమ్మద్ మోర్శి ని గత జులై మొదటివారంలో కుట్ర చేసి కూల్చివేసింది. మోర్శికి మళ్ళీ అధికారం అప్పజెప్పాలని దేశవ్యాపితంగా బైఠాయింపులు, ప్రదర్శనలతో…