శవాల దిబ్బ టాక్లోబన్, హైయన్ ముందూ తర్వాతా

ఇటీవల ఫిలిప్పైన్స్ లో సభవించిన సూపర్ టైఫూన్ హైయన్ ధాటికి అతలాకుతులం అయిన సమర్, లేటే రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య పూర్తిగా అంచనా వేయడం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. బడా మాల్స్ నుండి జనం లూటీలకు పాల్పడకుండా భారీ భద్రత అయితే ఇచ్చారు గానీ జనం ఆకలి, అవసరాలు తీర్చడంలో మాత్రం ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఇంకా వెనుకబడే ఉంది. హైయాన్ ధాటికి బాగా దెబ్బ తిన్న నగరం టాక్లోబన్. 220,000 మంది నివసించే…

ఫిలిప్పైన్స్: హైయన్ మరణాలు పది వేలు?

రాక్షస తుఫాను హైయన్ ధాటికి ఫిలిప్పైన్స్ విలవిలలాడింది. మహా పెను తుఫాను ధాటికి 10,000 మందికి పైగా మరణించి ఉంటారని భయపడుతున్నారు. ఒక్క లేటి ద్వీప రాష్ట్రంలోనే 10,000 మందికి పైగా మరణించారని, సమర్ ద్వీపంలో మరణాలు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఫిలిప్పైన్స్ అధికారులు చెబుతున్నారు. లేటే రాష్ట్రం మొత్తం దాదాపు నాశనం అయిందని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ రష్యా టుడే తెలిపింది. లేటి రాష్ట్రంలో 80 శాతం భాగం పూర్తిగా ధ్వంసం…

ఫిలిప్పైన్స్ ని ఊపేసిన రాక్షస తుఫాను ‘హైయాన్’

ఈ సంవత్సరం ఇప్పటికే అనేక ప్రకృతి విలయాలతో డస్సిపోయిన ఫిలిప్పైన్స్ ను శుక్రవారం మరో భారీ తుఫాను ఊపేసింది. ‘చరిత్రలోనే అది అతి పెద్ద తుఫాను’ అని పత్రికలు చెబుతున్నాయి. సూపర్ టైఫూన్ గా చెబుతున్న ఈ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారనీ, ఈ సంఖ్య ఇంకా అనేక రెట్లు పెరగవచ్చని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెబుతోంది. గంటకు 315 కి.మీ వేగంగా గాలులు వీస్తున్నట్లు రష్యా టుడే తెలిపింది. బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్, గాలుల…

ఫుకుషిమా: అణువు చిదిమేసిన జ్ఞాపకం -ఫోటోలు

అణువు ఎంతని? కంటికి సైతం కనపడని అణువు ‘ఇంతింతై, వటుడింతింతై’ అన్నట్లుగా విశ్వరూపం దాల్చింది. ఫుకుషిమా జనానికి జ్ఞాపకాన్ని కూడా భయపెట్టే భూతంలా మార్చివేసింది. అలా పొద్దున్నే నడిచి వెళ్ళిన రోడ్డూ, పెరట్లో ఇష్టంగా పెంచుకున్న మొక్కా, జీవిత పర్యంతం కష్టించి ఆర్జించుకున్న ఇల్లూ, చివరికి తనను తాకిన పాదానికి ధరణీ మాత ఇష్టంతో అద్దిన ధూళీ అన్నీ ఇప్పుడు అణు రక్కసి కోరల్లో చిక్కి పెను భూతాలుగా మారాయి. 2011 మార్చి 11 తేదీన మానవుడి…

ఆ చల్లని సముద్ర గర్భం -శ్రామికుడి నోటి పాట

ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు. కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న…

అమెరికన్ ఉత్తరాఖండ్? కనీవినీ ఎరగని కొలరాడో వరదలు -ఫోటోలు

మెరుపులాంటి ఉధృతితో వానలు కురిస్తే, అందునా కొండల వెంబడి బండలను కిందికి తోసుకుంటూ పోయే ప్రవాహాల్ని సృష్టించే వానలు కురిస్తే ఆ ఉత్పాతం ఎలాంటిదో ఉత్తరాఖండ్ వరదలు మనకి రుచి చూపించాయి. సరిగ్గా అదే నైసర్గిక స్వరూపం కలిగి ఉన్న కొలరాడో రాష్ట్రంలో వారం రోజుల పాటు కురిసిన వానలు కనీవినీ ఎరుగని మహోత్పాతాన్ని సృష్టించాయి. ఎప్పటిలానే కొలరాడో వరదలకు కూడా గ్లోబల్ వార్మింగే కారణం అని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. కొలరాడో వరదల్లో ఇప్పటివరకూ 6గురు చనిపోయారని…

అమెరికాకు చట్టవిరుద్ధ రాయితీ ఇవ్వడానికి ప్రధాని రెడీ?

భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు…

కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి

భారత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని పక్కకు నెట్టి విదేశాలకు మేలు చేసే నిర్ణయాలను అంతర్జాతీయ వేదికలపై ఒప్పుకుని వచ్చే దేశాధినేతలు ఎక్కడయినా ఉంటారా? మనం ఆ అదృష్టం చేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న వాయువుల విడుదలను అరికట్టే విషయంలో ‘అంతర్జాతీయ ధరిత్రి వేదిక’లపై అమెరికా, ఐరోపాల పెత్తనాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించే ప్రధాని మన్మోహన్ తీరా ఆచరణలోకి వచ్చేసరికి అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను గంగలో కలిపే ఒప్పందంపైన సంతకం చేసిన దారుణానికి ఒడిగట్టారు.…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….

(ఇది రామ్మోహన్ గారి వ్యాఖ్య. కొంచెమే అయినా విలువైన సమాచారం!) అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ సంయుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి. లక్షలాది జలచరాశులు మరణించాయి. కొరియా మీదా వెదజల్లింది. దీనివల్ల లక్షలాది మంది ప్లేగు, ఆంత్రాక్స్, మెదడు వాపు వ్యాధి వగైరా రోగాలు ప్రబలి జనం మరణించారు. 1967-69లో ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాల మీద స్ప్రే చేసింది…

ఈ ప్రాకృతిక జీవ సౌందర్యం చూసి తీరాలి -ఫోటోలు

అందంగా కనిపించడానికి మనుషులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్ధాలతో అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న మనిషి క్రమ క్రమంగా వాటిని వదిలేసి కంపెనీలు తయారు చేసే సౌందర్య ఉత్పత్తులపై ఆధారపడడం ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులు తాత్కాలిక అందాన్నిచ్చినా దానితో పాటు సరికొత్త అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. నిజానికి మనిషి ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని కాపాడుతూ బతికితే అతనికి/ఆమెకు మించిన అందం మరెక్కడా ఉండదేమో! ప్రకృతి ఒడిని వీడని జంతుజాలం,…

‘తీవ్ర’ ప్రమాద స్ధాయిలో ఫుకుషిమా రేడియేషన్ లీకేజి

జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ కలుషిత నీటి లీకేజి ‘తీవ్ర’ (serious) స్ధాయికి చేరిందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక లీటర్ నీటిలో రేడియేషన్ కు సాధారణ అనుమతి స్ధాయి 150 బెక్యూరల్స్ కాగా ఫుకుషిమా వద్ద లీటర్ నీటిలో 30 మిలియన్ బెక్యూరల్స్ రేడియేషన్ తో కలుషితం అయిన నీరు నిరంతరం లీక్ అవుతూ సముద్రంలో కలుస్తోంది. అంతర్జాతీయ రేడియేషన్ ప్రమాద స్కేలు పైన దీని తీవ్రతను 3 కు జపాన్ ప్రభుత్వం…

భారత ‘అవతార్’ నివాసులకు మోడి మద్దతు ఇవ్వగలరా?

హాలీవుడ్ సినిమా ‘అవతార్’ గుర్తుందా? అందులో అవతార్ అనే ఒక గ్రహం ఉంటుంది. విస్తారమైన సహజ వనరులతో ఆ గ్రహం అలరారుతుంటుంది. దానిపైన భూగ్రహం పైన ఉండే కంపెనీల కన్ను పడుతుంది. అక్కడి వనరులను కొల్లగొట్టడానికి వీలుగా దానిని ఆక్రమించుకోడానికి సైన్యాన్ని పంపుతుంది. అలా వెళ్ళిన సైన్యంలోని కొంతమంది ‘అవతార్’ గ్రహవాసులతో కలిసిపోయి సైన్యాన్ని ఓడించి తరిమివేయడంతో సినిమా ముగుస్తుంది. ఒరిస్సాలోని నియమగిరి కొండ, దాని చుట్టూ ఉన్న అడవుల్ని భారత దేశ ‘అవతార్’ గా ఆ…

కొండలే రగిలే వడగాలి… … -ఫోటోలు

అమెరికాలో ఈ మధ్య దావనలాలు ఎక్కువైనాయి. మే మొదటివారంలో లాస్ ఏంజిలిస్ సమీపంలో భారీ దావానలంతో పోరాడి అదుపులోకి తెచ్చిన అమెరికన్ అగ్నిమాపక దళం ఈసారి ఆ నగరానికి 140 కి.మీ దూరంలోని రివర్ సైడ్ కౌంటీ వద్ద మరో భారీ దావానలంతో తలపడుతున్నారు. ‘సిల్వర్ ఫైర్’ గా పిలుస్తున్న ఈ దావానలాన్ని అదుపు చేయడానికి దాదాపు 1500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఆగస్టు 7 తేదీన మొదలయిన మంటలు ఇక్కడి కొండాల్ని ఆసాంతం రగిలిస్తున్నాయి.…

ఫుకుషిమా డ్రైనేజి నీటిలో ప్రమాదకర రేడియేషన్ -కంపెనీ

ఫుకుషిమా అణు కర్మాగారం చల్లబరచడానికి నిర్మించిన డ్రైనేజి వ్యవస్ధ మొత్తం తీవ్రస్ధాయి రేడియేషన్ తో కూడిన నీటితో నిండిపోయిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ‘టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ’ (టెప్కో) ప్రకటించింది. డ్రైనేజీలో ఇప్పుడు 20,000 టన్నుల నీరు నిలవ ఉన్నదనీ ఇందులో అణు ధార్మికత అత్యంత ప్రమాద స్ధాయిలో ఉన్నదని కంపెనీ తెలిపింది. భూమి అడుగున నిర్మించిన పైపుల్లో ఉన్న ఒక లీటర్ నీటిలో 2.35 బిలియన్ బెక్యూరల్స్ పరిమాణంలో సీసియం రేడియేషన్ (అణు ధార్మికత) ఉన్నట్లు…

తెలంగాణ ఖాయమేనట!

శుక్రవారం ది హిందూ పత్రిక ఓ ఎక్స్ ప్లోజీవ్ కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలింది సి.డబ్ల్యూ.సి నిర్ణయమే. బహుశా కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయి దానిని ఫార్మలైజ్ చేయడానికి సి.డబ్ల్యూ.సి కి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలోని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక ఈ కధనం ప్రచురించింది. హైద్రాబాద్ పరిస్ధితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చల్లో ఉన్న అంశం తప్ప తెలంగాణా ఇవ్వాలా, వద్దా అన్నది…