కమలమే హస్తమా? -కార్టూన్

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) నేత అరవింద్ కేజ్రీవాల్, రాబర్ట్ వాద్రా అక్రమాస్తులపై ఆరోపణలు సంధించాక కాంగ్రెస్, బి.జె.పి ప్రతినిధుల మాటల్లో తేడా మసకబారింది. డి.ఎల్.ఎఫ్, వాద్రా కంపెనీల లావాదేవీల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వెనకేసుకొస్తుంటే, వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు సాక్షాలు లేవని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వారికి వంతపాడాడు. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు వాద్రా అవినీతిపై అసలు గొంతే ఎత్తలేదు. బి.జె.పి అధికార ప్రతినిధులు విలేఖరుల సమావేశాల్లో…

కాంగ్రెస్ పడవ మునిగేదే, మరి బి.జె.పి పడవ? -కార్టూన్

‘కాంగ్రెస్ (యు.పి.ఎ) ప్రభుత్వం మునిగిపోతున్న పడవ’ అని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఉవాచ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని కూడా గడ్కారీ ప్రకటించాడు.  బి.జె.పి జాతీయ కార్యవర్గంలో మాట్లాడుతూ గడ్కారీ చెప్పిన ఈ మాటలు వాస్తవంలో నిజం కాదని పత్రికల ఏకాభిప్రాయం. బి.జె.పి నిజంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ వరుస ప్రజావ్యతిరేక సంస్కరణలతో బరితెగించేదేనా అన్నది పత్రికల వాదన. ఆ మాట కొంత నిజమే అయినా సంస్కరణల పట్ల బి.జె.పి…

కేజ్రీవాల్ కి గ్యాస్ కట్ చేసిన అన్నా -కార్టూన్

“నా పేరు వాడుకోవద్దు, నా ఫోటో పెట్టొద్దు” అని అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ ని హెచ్చరించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి సన్నిహిత సహచరుడుగా పేరుపడిన అరవింద్ కేజ్రీవాల్ కి అన్నా హెచ్చరిక శరాఘాతం లాంటిది. ‘అన్నా బృందం’ పేరుతో ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ సంస్ధ కింద సాగిన ఉద్యమానికి అన్నా ముందు నిలబడినప్పటికీ ఉద్యమానికి అవసరమైన రోజువారీ వ్యవహారాలను చూసింది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాలే నని అప్పట్లో పత్రికలు ఘోషించాయి. అదే నిజమయితే…

భారత విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ తీర్చేనా? -కార్టూన్

విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు భారత దేశం చేసే ప్రయాణంలో అణు విద్యుత్ కర్మాగారాలు సహాయపడతాయా?  లేక ఆటంకం కలిగిస్తాయా? ‘ది హిందూ’ కార్టూనిస్టు ‘కేశవ్’ కాసిన్ని గీతలు గీసి, మరి కాసిన్ని రంగులు అద్ది వివరించారు. అమెరికన్ అణు పరిశ్రమ వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికే భారత్-అమెరికాల మధ్య ‘అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామని అణు నియంత్రణ సంస్ధ ఎ.ఇ.ఆర్.బి మాజీ అధిపతి గోపాల కృష్ణన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టాడు. గతంలో అణు…

నిన్నటి వరకు మమత, ఇపుడు ములాయం కూడా… -కార్టూన్

యు.పి.ఏ కి కష్టాలు ముమ్మరం అయినట్లు కనిపిస్తోంది. ‘మద్దతు ఉపసంహరిస్తా’ అంటూ మమతా బెనర్జీ తరచుగా బెదిరించే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కూడా ఆమెకు జత చేరినట్లు కనిపిస్తోంది. యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి తో పంకిలమయిందని ఆయన చేసిన వ్యాఖ్య గురువారం పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించింది. రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే నిర్ణయాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ వచ్చింది. ఆమెను మేనేజ్ చెయ్యడానికి అమెరికా విదేశాంగ…

కాంగ్రెస్ మార్కు అవినీతి వ్యతిరేక పోరాటం -కార్టూన్

అన్నా హజారే, ఆయన బృందం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాక వాళ్ళకి మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీ లేదు. జాతీయ పార్టీలతో పాటు అనేకానేక ప్రాంతీయ పార్టీలు కూడా అన్నా పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు క్యూలు కట్టారు. బి.జె.పి లాంటి పార్టీలు కార్యకర్తలను సరఫరా చేసి తెరవెనుక మద్దతు అందించాయి. అవినీతి సామ్రాట్టులుగా పేరుబడ్డవారు కూడా పత్రికా ప్రకటనలతో యధాశక్తి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా పార్లమెంటులోనే అన్నాకి మద్దతుగా గొప్ప గొప్ప…

పెట్రోల్ వాతలు ఈ వారంలోనే -కార్టూన్

పెట్రోల్, డీజెల్ ధరలు మళ్ళీ వార్తలకు ఎక్కుతున్నాయి. ‘ఇప్పటికయితే పెంచే ఉద్దేశ్యం ఏమీ లేదు’ అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్నాడని పత్రికలు చెప్పాయి. మళ్ళీ అదే నోటితో “అత్యవసరం అయినపుడు కఠిన నిర్ణయాలు తప్పవు. ఎంత బాధ ఉన్నా సరే” అన్నాడాయన. వచ్చే వారం పెట్రోల్, డీజెల్, కిరోసిన్, గ్యాస్ ల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని మరుసటి రోజే ‘ది పత్రిక’ తెలిపింది. ఎంతో బాధ…

శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్

నేను చెప్పానా? తమిళనాడు పైన ఎగరకపోతేనే మంచిదని….! శ్రీలంక తో భారత దేశానికి ఉన్న ప్రతి సంబంధాన్నీ రాక్షసీకరించే ప్రయత్నాలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమిళ జాతీయవాదంలో తామే నిఖార్సయినవారమని చెప్పడానికి అసలు సమస్యే కానీ అంశాలని పెద్ద సమస్యలుగా చేస్తున్నారు. ఎల్.టి.టి.ఇ తో పోరులో చివరి రోజుల్లో శ్రీలంక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమిళ పౌరులపై సాగిన నరమేధం గురించి నిర్దిష్ట అవగానను ఇంతవరకూ ఈ పార్టీలేవీ…

లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్

 “విన్నావా? నిలబడి కలబడదాం అని అంటున్నారామే”     “ఆత్మ రక్షణలో పడవలసిన అవసరం మనకేమీ లేదు. లేచి నిలబడి కలబడదాం. లక్ష్య శుద్ధితో దూకుడుగా పోరాడుదాం. బ్లాక్ మెయిల్ చెయ్యడం బి.జె.పి కి అలవాటుగా మారింది.” డీలా పడిన కాంగ్రెస్ నాయకులకు స్ధైర్యాన్నివ్వడం కోసం సోనియా గాంధీ అన్న మాటలివి.  బొగ్గు కుంభకోణం వల్ల కేంద్ర ఖజానాకి 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడి చేసిన దరిమిలా పార్లమెంటు సమావేశాలను వారం రోజులుగా…

బొగ్గు కుంభకోణం: ప్రధాని నోట ‘జీరో లాస్’ -కార్టూన్

2జి స్పెక్ట్రం కుంభకోణంలో అసలు నష్టమే లేదని చెప్పి ‘జీరో లాస్’ వాదనతో టెలికాం మంత్రి కపిల్ సిబాల్ అప్రతిష్టపాలయ్యాడు. ‘వొళ్ళు దగ్గర పెట్టుకోమం’టూ సుప్రీం కోర్టు చేత చీవాట్లు కూడా తిన్నాడు. సిబాల్ అనుభవం నుండి ప్రధాని పాఠాలు నేర్చుకోనట్లు కనిపిస్తున్నది. అత్యంత కనిష్ట స్ధాయిలో నష్టాన్ని అంచనా వేసినప్పటికీ 1,87,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని చెప్పిన కాగ్ లెక్కలు వివాదాస్పదమని ప్రధాని వ్యాఖ్యానించాడు. ‘జీరో లాస్’ వాదనకు మద్దతుగా వివిధ అంశాలను…

నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం

నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో…

కేంద్ర మంత్రికి ద్రవ్యోల్బణం సంతోషమేనట!–కార్టూన్

రైతుతో: ఎక్కువ అడగొద్దయ్యా! రేటు ఎక్కువైతే మళ్ళీ సగటు మనిషికి భారం కదా!        జనంతో: ధరలు పెరిగాయని గొణక్కండి. రైతులకి అదే లాభం. —————————————— ప్రజల అవసరాలతో పరాచికాలాడడం కేంద్ర మంత్రులకు ఆటగా మారినట్లుంది. ‘వాటర్ బాటిల్ కి 15/- ఖర్చు పెడతారు గానీ బియ్యం ధర రూపాయి పెరిగినా సహించలేరు’ అంటూ మధ్య తరగతి జనంపై ఏవగింపుని చాటుకున్న చిదంబరం సరసన, కేంద్ర ఉక్కు మంత్రి బేణీ ప్రసాద్ వర్మ చేరిపోయాడు. బియ్యం, గోధుమలు,…

రాహుల్ పట్టాభిషేకం సమస్య ఎవరిది? -కార్టూన్

భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో,…

రాజకీయం దృష్టిలో ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ -కార్టూన్

సంవత్సరం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం  దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయనకి మద్దతు ఇవ్వడానికి రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా సీనియర్ల నుండి ఛోటా మోటా నాయకుల వరకూ అవినీతిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప లాంటి వారు సైతం అప్పట్లో ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లాంటివారేనని…

‘టీం అన్నా’ ఇక లేదు -కార్టూన్

ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండానే నిరాహార దీక్ష ముగించిన అన్నా హజారే, తర్వాత మూడు రోజులకే ‘అన్నా బృందం’ రద్దు అయినట్లు ప్రకటించి ఒకింత సంచలనం సృష్టించాడు. రాజకీయ పార్టీ ఏర్పాటుని సుగమం చేయడానికే అన్నా హాజరే తన బృందాన్ని రద్దు చేసినట్లు ‘ది హిందూ’ వార్త రాసింది. అంటే ఆ వార్తలో సానుకూలత ఉందే తప్ప సంచలన కారకం ఏమీ లేదు. ఒకటో రెండో ఇతర పత్రికలు కూడా అన్నా అభిప్రాయాన్ని ఇదే విధంగా…