క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…

సి.బి.ఐ అటానమీ -కార్టూన్

బొగ్గు కుంభకోణం దర్యాప్తు నేపధ్యంలో సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి గ్యారంటీ చేసేలా చట్టం చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బొగ్గు కుంభకోణం విషయమై జులైలో తదుపరి హియరింగ్ జరగనుంది. ఆ లోపు చట్టాన్ని తెస్తే తాము సంతోషిస్తామని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్/ కేంద్ర ప్రభుత్వం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. “పంజరంలో చిలక” లాగా మారిన సి.బి.ఐ తమ యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతోందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బహుళ…

దొంగ-గజదొంగ : నేరము-శిక్ష -కార్టూన్

– ఖైదీ నెం. 1: వాల్ స్ట్రీట్ లో బిలియన్లు దొంగిలించినందుకు నాకు 3 నెలలు వేసారు! కేడీ నెం. 1: కొన్ని జాయింట్లు నా దగ్గర దొరికాయని నాకు 3 సంవత్సరాలు వేశారు!! – అమెరికాలో వాల్ స్ట్రీట్, బ్రిటన్ లో ‘ద సిటీ (ఆఫ్ లండన్)’, ఇండియాలో దలాల్ స్ట్రీట్… ఇత్యాది బజార్లలో సామాన్యులకు ప్రవేశం దుర్లభం. గోల్డ్ మెన్ గజదొంగలకే ఇక్కడ ప్రవేశం.  సెకన్ల వ్యవధిలోనే షేర్ల కదలికల్ని ప్రభావితం చేసి మిలియన్ల…

పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…

కర్ణాటక: కష్టం ఒకరిది, పేరు మరొకరిది -కార్టూన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారి బి.జె.పి పార్టీ ఖాతాలో ఒక రాష్ట్ర అసెంబ్లీని చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న యెడ్యూరప్ప ఈసారి కూడా గెలుపును, ఓటమిని కూడా ప్రభావితం చేశాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యెడ్యూరప్ప ప్రత్యేక పార్టీయే పెట్టకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ బహుశా సీట్ల…

అబద్ధాన్ని పదే పదే చెబితే అది…. -మొగుల్ స్ట్రిట్ ఆర్ట్

బేంక్సీ అంత కాకపోయినా ఆ తరహాలో చిత్రకళను అభ్యసిస్తున్న వీధి చిత్రకారుల్లో మొగుల్ ఒకరు. స్వీడ దేశస్ధుడయిన మొగుల్ గీసిన ఈ వీధి చిత్రం స్టాక్ హోం నగరంలొని ఒక గోడ మీద గీసినది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని మనకు తెలిసిన సామెత. రాజకీయ నాయకులు అబద్ధాని నిజం చేసే కళను తమ వ్రుత్తిగా స్వీకరించారని మొగుల్ వీధి చిత్రం సూచిస్తోంది. అదెంత నిజమో ఎల్లరకు తెలిసిందే కదా.  నాలుగుకోట్ల కుతుంబాలకు ఉపాధి కల్పించే చిల్లరవర్తకంలో…

బలి పశువులు కావలెను -కార్టూన్

ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…

యు.పి.ఎ జవాబుదారీతనం ఇలా తగలడింది -కార్టూన్

భారత రాజకీయ వ్యవస్ధ ఎన్నడూ లేనంతగా గబ్బు పట్టిపోయింది. రాజకీయానికి, ఆరాచకానికి సరిహద్దులు చెరిగిపోయాయి. ఎన్ని పరిమితులున్నా, ఒకప్పుడు ఎంత నీతిగా ఉంటే అంత గొప్ప. ఇప్పుడు ఎంత దిగజారి అవినీతికి పాల్పడినా అంత సంపాదిస్తే అంత గొప్ప!  కాగ్ ఛీ అంటుంది. సుప్రీం కోర్టు ఛీ ఛీ అంటుంది. అయినా మంత్రులు, ప్రధాన మంత్రి దగ్గర్నుండి రాష్ట్రాల మంత్రుల వరకూ దులుపుకుని పోయేవారే తప్ప జనానికి తాము జవాబు చెప్పాల్సి ఉంటుందన్న ధ్యాసే లేదు.  జనానికి…

బి.జె.పి కుమ్ములాటలే కాంగ్రెస్ గెలుపు కిరీటం -కార్టూన్

కర్ణాటకలో బి.జె.పి సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయింది. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్నట్లు ఫోజు పెడుతున్న బి.జె.పి పార్టీకి కర్ణాటకలో సొంత నాయకుల అవినీతిని నెత్తిన పెట్టుకోలేకపోయింది. జాతీయ స్ధాయిలో పరువు ప్రతిష్టలు నిలుపుకోవాలంటే కార్ణాటకలో అవినీతి నాయకుడు యెడ్యూరప్పను దూరం పెట్టక తప్పని పరిస్ధితి. ఫలితంగా బి.జె.పి ఓటు బ్యాంకు చీలిపోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది. సొంత కుంపటి పెట్టుకుని తగిన సీట్లు తెచ్కుకుని ప్రభుత్వాల్ని శాసించవచ్చు అనుకున్న కర్ణాటక జనతా…

బంగ్లాదేశ్ ఫ్యాషన్ విధ్వంసం -4 కార్టూన్లు

ప్రపంచం నలుమూలలకి ఫ్యాషన్ దుస్తుల్ని అందించే బంగ్లాదేశ్ బట్టల ఫ్యాక్టరీ కార్మికుడి వేతనం నెలకి 38 డాలర్లు. అంటే దాదాపు 2 వేల రూపాయలు. దుస్తుల తయారీకి వినియోగించే శ్రమలో అతి కొద్ది భాగం మాత్రమే దాని సొంతదారుకు దక్కగా మిగిలినదంతా ఫ్యాక్టరీ ఓనరు, ఆ ఫ్యాక్టరీ నడిచే భవనం ఓనరు. తయారైన దుస్తుల్ని అద్దాల ఎ.సి గదుల్లో పెట్టి అమ్మే ఫ్యాషన్ దుకాణం ఓనరు, వీళ్ళకు ఫైనాన్స్ అందించే వడ్డీ వ్యాపారి…. ఇలాంటివారంతా పంచుకు తింటున్నారు.…

వడ్డించేవారు కొట్టుకుంటే… -కార్టూన్

‘అదిగో, ఇదిగో’ అంటూ యు.పి.ఏ ప్రభుత్వం ఊరిస్తూ వచ్చిన ‘ఆహార భద్రతా బిల్లు’, ‘భూముల స్వాధీనం  బిల్లు’ ఆమోదానికి నోచుకోకుండానే పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ లు రాజీనామా చేయడమో, లేదా పదవుల నుండి తప్పించడమో జరిగేదాకా పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని బి.జె.పి ప్రకటించడంతో ఈ పరిస్ధితి వచ్చింది. బుధవారం సభ ముగిశాక పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడుతుందని…

కోతికి పదవిచ్చి, ఆనక కళ్ళూ నోరు మూసుకుని…. కార్టూన్

బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రధాన నేతలను చుట్టుముట్టినా ఏ ఉపద్రవమూ జరగని విపరీత పరిస్ధితి దేశంలో రాజ్యమేలుతోంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను గట్టెక్కించడానికి న్యాయ మంత్రి అశ్వని కుమార్ కోతి తరహాలో చేసిన ప్రయత్నం చివరికి వారికే ఎదురు తిరిగింది. అశ్వని కుమార్ అహంకార ధోరణితో గాయపడిన సి.బి.ఐ అధికారి ద్వారా కోర్టుకు సి.బి.ఐ సమర్పించిన నివేదికను కోర్టు కంటే ముందు ప్రభుత్వమే చూసి మార్పులు కూడా చేసిందని పత్రికలకు లీక్ కావడంతో యు.పి.ఏ…

సీతాకోకచిలకలా ఎగరాలి, తేనెటీగలా కుట్టాలి… -కార్టూన్

“Float like a butterfly, sting like a bee” అనేది ఒక పాట. బ్రిటిష్ పాప్ సింగర్ ఫిల్ మార్షల్ రాసి పాడిన పాట ఇది. ఆ పాటని భారత విదేశాంగ విధానానికి అన్వయించారు కార్టూనిస్టు కేశవ్. ఆయన సెన్సిబుల్ కార్టూనిస్టు అనడానికి ఈ కార్టూన్ మరొక మచ్చుతునక. ఇటీవల కాలంలో రెండు (స్వ)విదేశీ సమస్యలు భారత విదేశాంగ విధానానికి పరీక్ష పెట్టాయి. అమెరికా ‘ఆసియా పివోట్’ వ్యూహంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మిత్రుడుగా…

శవ పేటికలే చర్చల బల్లలుగా… -కార్టూన్

మొట్ట మొదటి బి.జె.పి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి కాలంలోనే భారత్-పాకిస్ధాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్మాణాత్మక దృష్టితో ప్రారంభం అయ్యాయని పత్రికలు తరచూ చెబుతుంటాయి. అక్కడ మిలట్రీ పాలకుడు ముషార్రాఫ్, ఇక్కడ మొట్టమొదటి మితవాద ప్రభుత్వం రెండు దేశాల్ని నడుపుతుండగా ప్రారంభమైన చర్చలు వాణిజ్య సంబంధాల్లోకి ప్రవేశించి ఊపందుకుంటున్న సమయంలోనే ముంబై టెర్రరిస్టు దాడుల ఫలితంగా అటకెక్కాయి. అప్పటి నుండి వివిధ సంఘటనలు, దుర్ఘటనల సాకు చూపుతూ రెండు దేశాలు దూరం జరుగుతూ…

సూటు, బూటు బడాబాబు దర్జాల మర్మమేమి? -కార్టూన్

(కార్టూనిస్టు: ఎనెకో లాస్ హెరాస్. వెనిజులా రాజధాని కారకాస్ లో పుట్టిన ఎనెకో ఇప్పుడు స్పెయిన్ లో నివసిస్తున్నారు. ఆయన కార్టూన్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.) వ్యవస్ధని మోస్తున్నదెవరు? కష్టపడి వ్యవస్ధని నడిపేది మేమే అని బానిస వ్యవస్ధల కాలంలో బానిసల యజమానులు అన్నారు. ఫ్యూడల్ ప్రభువుల కాలంలో రాజులు, మంత్రులు, సైన్యాధిపతులు, భూస్వాములు, జమీందార్లు… ఇత్యాదిగా గల ప్రభు వర్గాలు తాము లేకపోతే సామాజిక వ్యవస్ధ ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. పండితులు ‘ఔను కదా!’…