ఫుకుషిమా అణు రియాక్టర్ల వద్ద మరింత పెరిగిన అణు ధార్మికత

మానవ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రమాదంగా పేరు తెచ్చుకున్న జపాన అణు ప్రమాదం మరింత తీవ్రమవుతోంది. దైచి అణు విద్యుత్ కర్మాగారం లోని రియాక్టర్ల నీటిలో రేడియేషన్ మామూలు స్ధాయి కంటే 10 మిలియన్ల రెట్లు రేడియేషన్ నమోదైనట్లు అణు కర్మాగారాల ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెని (టెప్కో) తెలిపింది. ప్రమాద సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపకుండా దాపరికంతో వ్యవహరిస్తున్నందుకు టెప్కో పై విమర్శలు వస్తున్నాయి. కర్మాగారంలో రియాక్టర్లను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్న వర్కర్లకు సరైన దుస్తులు ఇవ్వలేదని…

అమెరికా లోనూ వినాశనానికి దగ్గరైన అణువిద్యుత్ కర్మాగారాలు

జపాన్లో మార్చి 11 తేదీన సంభవించిన అతి పెద్ద భూకంపం, అది సృష్టించిన సునామీల దెబ్బకు ఫుకుషిమాలో గల దైచి అణు విద్యుత్ ప్లాంటులో అణు రియాక్టర్లు పేలిపోవడంతో అక్కడ ప్రజలు, ప్రభుత్వం నరక యాతనలు పడటం చూస్తూనే ఉన్నాము. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత, ఆ స్ధాయిలో తలెత్తిన అణు ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక జపాన్ ప్రభుత్వం నిస్సహాయ స్ధితిలో పడిపోయింది. జపాన్ ప్రభుత్వం అణు ప్రమాదం వలన తలెత్తిన ప్రమాదకర పరిణామాలను అరికట్టడంలో…

జపాన్ లో అణువిద్యుత్ ప్లాంటులను చల్లబరిచే యత్నాలు ముమ్మరం

జపాన్ ప్రభుత్వం ఫుకుషిమా లోని దైచి అణు విద్యుత్ ప్లాంటులో పేలిపోయిన రియాక్టర్లను చల్లబరిచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మిలట్రీ హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని ప్లాంటుపై జారవిడుస్తున్నది. ఈ ప్రక్రియను బుధవారం మొదలు పెట్టినప్పటికీ రేడియేషన్ స్ధాయి ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నారు. హెలికాప్టర్లతో పాటు ప్లాంటు వద్ద వాటర్ కెనాన్ లను ఉపయోగించి నీళ్ళు వెదజల్లుతున్నారు. మొదట పోలిసులు ప్రయత్నించినా వారు రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం ఉండడంతో వారిని వెనక్కి రప్పించారు. మిలట్రీ…

అణువిద్యుత్ ప్లాంటుల నిర్మాణంపై పునరాలోచనలో చైనా

జపాన్ లోని ఫుకుషిమా ‘దాయిచి’ అణువిద్యుత్ ప్లాంటు లో అణు రియాక్టర్లు పేలిపోయి పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల కావడం, రేడియేషన్ నియంత్రణకు జపాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుండడం, జపాన్ నుండి రేడియేషన్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుండడం కారణాలతో పెద్ద ఎత్తున అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణం తలపెట్టిన చైనా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ భద్రతా వ్యవస్ధలను సమీక్షిస్తున్నట్లు…

మూడో రియాక్టర్ పేలుడు, జపాన్ లో అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న అణు ధార్మికత

జపాన్ భూకంపం, సునామీల కారణంగా సోమవారం వరకు రియాక్టర్ నెం. 1, 3 లలో పేలుళ్ళు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం నెం. 2 రియాక్టరు కూడా పేలిపోయింది. దానితో పాటు భూకంపం రావడానికి చాలా రోజుల ముందే నిర్వహణ నిమిత్తం మూసివేసిన నెం.4 రియాక్టరులో కొద్ది సేపు మంటలు ఎగసిపడ్డాయి. నాల్గవ రియాక్టరు పనిలో లేనప్పటికీ వాడిన ఇంధన రాడ్లను అక్కడే ఉంచడం వలన అక్కడ కూడా అణు ధార్మికత వెలువడే ప్రమాదం తలెత్తింది. రెండో…

రెండో అణు రియాక్టర్ పేలుడు, అణు ప్రమాదం అంచున జపాన్

8.9 పాయింట్ల భూకంపం, ఆ తర్వాత ఏళ్ళూ, ఊళ్ళూ ఏకం చేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడిన సునామీ, అటు పిమ్మట ఫుకుషిమా దాయీచి నెం.1 అణు రియాక్టర్ పేలుడు, ఇప్పుడు దాయీచి నెం.3 అణు రియాక్టర్ పేలుడు… ఒకదాని వెంట మరొకటి వచ్చిపడుతున్న కష్టాలతో జపాన్ ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో మునిగి ఉన్నారు. ఒకదాని నుండి తేరుకునే లోగానే మరొక కష్టం విరుచుకు పడుతోంది. నెం.1, నెం.3 అణు రియాక్టర్లు ఇప్పటికే పేలిపోగా నెం.2 రియాక్టర్లో నీటి…

కందుకూరు పట్టణంలో పి.డి.ఎస్.యు విద్యార్ధుల ధర్నా -ఫొటో

పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘం ప్రకాశం జిల్లా శాఖ 2010 జులై నెలలో హైస్కూల్  విద్యార్ధుల సమస్యలపై ఆందోళన నిర్వహించింది. కందుకూరు పట్టణంలోని హైస్కూల్ భవనం కూలిపోయే దశలో ఉంది. క్లాస్ రూమ్ లు చాలావాటికి పై కప్పులు లేవు. పెంకులతో నిర్మించిన పైకప్పు కొన్ని క్లాసుల్లో ఏ క్షణంలోనైనా కూలిపోయేటట్లు ఉన్నాయి. స్కూల భవనానికి మరమ్మతులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్ధులు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అప్పటి…

బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…

తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వ ఆర్ధిక సర్వే

  2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల…