బడ్జెట్ 2014-15: సామాన్యుడు కాదు సంస్కరణలే లక్ష్యం

ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ జి.డి.పి వృద్ధి-ఆర్ధిక క్రమశిక్షణ-కోశాగార మెలకువ తదితర పదాడంబరాల మాటున సంస్కరణలలు ఉధృతం చేయడమే లక్ష్యంగా చేసుకుంది. రైల్వేలతో పాటు రక్షణ రంగం, భీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులను 26 శాతం నుండి 49 శాతానికి పెంచారు. పన్ను ఆదాయాన్ని పెంచే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలుకు డిసెంబర్ లోపల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లగ్జరీ సరుకులను ప్రజలకు అందుబాటులో తేవడానికి, తద్వారా కంపెనీల అమ్మకాలు,…

రైల్వే బడ్జెట్: ఎఫ్.డి.ఐతో సేవల మెరుగు(ట)

నరేంద్ర మోడి/ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్, ఇంతదాకా రైల్వేరంగంలో లేని ఎఫ్.డి.ఐలకు స్వాగతం పలకడంతో మొదలయింది. బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల వల్ల భారతీయుల ఉపాధి పోతుందని వాదించిన బి.జె.పి అదే ఎఫ్.డి.ఐలకు రైల్వేల్లో రెడ్ కార్పెట్ పరవడానికి సిద్ధం అయింది. కేవలం రైల్వేల అభివృద్ధి కోసమే మౌలిక నిర్మాణాలలో (ఇన్ఫ్రా స్ట్రక్చర్) ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తాం తప్ప రైల్వేల నిర్వహణలో కాదని హామీ ఇచ్చింది. ఎక్కడికి పిలిచినా ఎఫ్.డి.ఐ, ఎఫ్.డి.ఐ యే. అదేమీ భారత…

రు. 70 వేల కోట్ల ఆస్తుల అమ్మకానికి మోడి రెడీ

కోశాగార క్రమ శిక్షణ గురించి ఈ సరికే విడతలు విడతలుగా లెక్చర్లు దంచిన మోడి ప్రభుత్వం రు. 70 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ ఆస్తులను స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీల విందు భోజనం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోశాగార క్రమ శిక్షణ (Fiscal Discipline) లేదా కోశాగార స్ఢిరీకరణ (Fiscal Consolidation), ఆర్ధిక క్రమ శిక్షణ, ఆర్ధిక పొదుపు… ఈ పదజాలాలన్నీ ఒకే ఆర్ధిక ప్రక్రియకు వివిధ రూపాలు. అన్నింటి అర్ధం ఒకటే…

సామాన్యుడి ఎద్దు పరుగు -కార్టూన్

ధూ, దీనెమ్మ, జీవితం! అని జీవితంలో ఒక్కసారన్నా విసుక్కోని సామాన్యుడు ఈ భూమి మీద ఉంటాడా? నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి మెజారిటీ సీట్లు వచ్చింది లగాయితు భారత స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతూ దూసుకుపోతున్న వార్తాలే రోజూ. స్టాక్ మార్కెట్ సూచీ పెరుగుతూ పోతుంటే బుల్ మార్కెట్ అనీ, తగ్గుతూ పోతుంటే బేర్ (ఎలుగుబంటి) మార్కెట్ అనీ సంకేతాలు పెట్టుకున్నారు. షేర్ మార్కెట్లలో మధ్యతరగతి బడుగు జీవులు కూడా మదుపు చేస్తున్నప్పటికీ వారి…

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐల నిర్వచనం: సిఫారసులు ఆమోదం

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల నిర్వచనానికి సంబంధించి మాయారాం కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ)… ఈ పదబంధాల నిర్వచనాలను హేతుబద్ధం చేయడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో ఒక కమిటీని నియమించగా అది శనివారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సదరు నివేదిక చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం ఈ రోజు (సోమవారం, జూన్ 23) ప్రకటించింది. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లను…

కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి. “ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి…

రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన

బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను పరోక్షంగా ప్రవేశపెట్టనున్న మోడి ప్రభుత్వం అదే ఊపుతో రైతులకు నేరుగానే వాత పెట్టేందుకు యోచిస్తోంది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు తగిన విధంగా రుణం తీర్చుకోవడానికి మోడి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మేలు చేయడం కోసం గ్యాస్ ధరలను రెట్టింపు చేసినందున పెరగనున్న సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి యూరియా ఎరువు ధరను కనీసం 10 శాతం పెంచేందుకు యోచిస్తోంది. ఈ…

సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాలను చుట్టుముట్టిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఇంకా ఆ దేశాల్ని పీడిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) ప్రకటించిన తాజా ఉద్దీపన చర్యలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సున్న శాతానికి దగ్గరగా ఉన్న వడ్డీ రేటును మరింతగా తగ్గించడం ద్వారా మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించడానికి ఇ.సి.బి నిర్ణయం తీసుకుంది. బహుశా మరే దేశమూ ఇంతవరకు చరిత్రలో ఎరగని చర్యలను కూడా…

యూరప్ స్టిములస్: ఆకాశ వీధుల్లో భారత స్టాక్ మార్కెట్లు!

ప్రతి ద్రవ్యోల్బణం భయంతో వణికిపోతున్న యూరోపియన్ దేశాలను బైటపడేయడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరో ఉద్దీపన పధకం ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వ్యాపించడంతో భారత స్టాక్ మార్కెట్లు పరవళ్ళు తొక్కాయి. ఆర్ధిక గమనాన్ని వేగవంతం చేయడానికి మరింత లిక్విడిటీని ఇ.సి.బి ప్రవేశపెడుతుందని నమ్మకమైన సంకేతాలు అందాయి. దాని ప్రభుత్వం భారత స్టాక్ మార్కెట్లకూ విస్తరించి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ మొట్టమొదటిసారి 25,000 మార్కు దాటగా, నిఫ్టీ సైతం కొత్త రికార్డు నెలకొల్పింది. గురువారం మెటల్,…

మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు) మోడి: మనం మిత్రులమే కదా? *** స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి,…

ఈ.యుకు సమాధానం యూరేసియన్ యూనియన్ రెడీ!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దశాబ్దం నాటి కల నెరవేరుతోంది. చరిత్రాత్మక ఒప్పందం కుదరడంతో రష్యా మీది మీదికి వస్తున్న నాటో-ఇ.యు-అమెరికా కు గట్టి సమాధానంగా యూరేసియన్ యూనియన్ ప్రపంచ భౌగోళిక-రాజకీయ చిత్రపటం పైకి దూసుకొస్తోంది. రష్యా, కజకిస్తాన్, బెలారస్ దేశాల నేతలు ఆస్తానాలో సమావేశమై పూర్తిస్ధాయి ఆర్ధిక కూటమి (యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ -ఇ.ఇ.యు) ఏర్పాటు చేస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు ఇప్పటిదాకా ఉన్న కస్టమ్స్ యూనియన్, జనవరి 1, 2015 నుండి యూరేసియన్…

మంత్రివర్గం పొందిక మార్కెట్లకు నచ్చలేదుట!

నరేంద్ర మోడి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆగమనంతో మురిసిపోయిన విదేశీ (and hence స్వదేశీ) కంపెనీలు మంత్రి వర్గ నియామకాలు చూసి జావగారిపోయాయి. మార్కెట్ లకు ఈ మంత్రివర్గ పొందిక నచ్చలేదని మార్కెట్ విశ్లేషణ సంస్ధలు తేల్చిపారేశాయి. ఏనుగు మీద అదేదో ముతక సామెత చెప్పినట్లు అయిందే అని మార్కెట్లు వాపోతున్నాయిట. స్విట్జర్లాండ్ కి చెందిన బహుళజాతి ఆర్ధిక, ద్రవ్య సేవల సంస్ధ క్రెడిట్ సుసి, రాయిటర్స్ వార్తా సంస్ధ నిర్వహించే ‘మార్కెట్ ఐ’ శీర్షికలు సంయుక్తంగా…

మోడి గెలుపు: ఇక ఎఫ్.డి.ఐల వరదే -ఆసోఛామ్

నరేంద్ర మోడి ప్రచార సారధ్యంలో బి.జె.పి/ఎన్.డి.ఏ సాధించిన విజయం ధనిక వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడి అభివర్ణించిన ‘మంచి రోజులు’ తమకే అని వారికి బాగానే అర్ధం అయింది మరి! గుజరాత్ నమూనాను దేశం అంతా అమలు చేయడం అంటే స్వదేశీ-విదేశీ  కంపెనీలకు, పరిశ్రమలకు, దళారులకు మేలు చేస్తూ ప్రజల వనరులను వారికి కట్టబెట్టడమే అని కాంగ్రెస్ సైతం చెప్పే మాట! ఈ నేపధ్యంలో మోడి అనుసరించే విధానాల వల్ల దేశంలోకి ఈ యేడు రికార్డు స్ధాయిలో…

పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్) భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త…

ఎగ్జిట్ పోల్స్: ఎగిరెగిరి పడుతున్న స్టాక్ మార్కెట్లు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్.డి.ఏ/బి.జె.పి/నరేంద్ర మోడి ప్రభుత్వం రాకను సూచించడంతో స్టాక్ మార్కెట్లు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్.డి.ఏ కి అనుకూలంగా ఉండవచ్చన్న అంచనాతో సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన జాతీయ స్టాక్ మార్కెట్లు తమ అంచనా నిజం కావడంతో మంగళవారం కూడా అదే ఊపు కొనసాగించాయి. దానితో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కాగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ధనిక వర్గాలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభకరం అని స్టాక్…