పౌరుల రక్షణ పేరుతో ఐవరీకోస్ట్ అధ్యక్షుడి నివాసంపై దాడి చేసిన సమితి, ఫ్రాన్సు సైన్యాలు

ప్రతి సభ్య దేశం పట్ల నిష్పాక్షింగా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి నిజానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాల జేబు సంస్ధ అని మరో సారి రుజువయ్యింది. ఐవరీ కోస్టు దేశ అధ్యక్షుడి భవనంపై ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి స్ధాపనా సైనికులు, ఫ్రాన్సుకి చెందిన సైనికులు సోమవారం బాంబు దాడులు నిర్వహించాయి. అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో నివాస భవనం, ప్రభుత్వ టెలివిజన్ ప్రధాన కార్యాలయం, రిపబ్లికన్ గార్డుల భవనం, పారామిలిటరీ కార్యాలయం లపై ఫ్రాన్సు, సమితి సైన్యాలు…

తూర్పు ఆయిల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు

ఆదివారం, మార్చి 13న గడ్డాఫీ బలగాల చేతిలోకి వెళ్ళిన ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుగుబాటుదారులు పత్రికలకు తెలిపినప్పటికీ అధికారికంగా ఇంకా ధృవపడ లేదు. ‘బ్రెగా’ ను కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటుదారులు తెలిపారు. ఆహారం, నిత్యవసరాల సరఫరాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవడంతొ పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం కూడా అవసరం. తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఉన్న…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

అల్జీరియా, యెమెన్ లలో ప్రదర్శకులను చెదరగొట్టిన ప్రభుత్వాలు

ఈజిప్టులో ప్రజాందోళనల ధాటికి తలొగ్గి ముబారక్ అధికారం త్యజించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అల్జీరియా, యెమన్ ల పౌరులు తమ నియంతృత్వ ప్రభువులు సైతం దిగి పోవాలని డిమాండ్ చేస్తూ ఆయా రాజధానుల్లో శనివారం  ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ముందునుండే అప్రమత్తతతో ఉన్న అక్కడి ప్రభుత్వాలు పోలీసులు, సైన్యాలతొ పాటు తమ మద్దతుదారులను కూడా ఉసిగొల్పి ప్రదర్శనలు పురోగమించకుండా నిరోధించ గలిగింది. “బౌటెఫ్లికా వెళ్ళిపో” -అల్జీరియా ప్రదర్శకులు అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో మొహరించి ఉన్న పోలీసులకు భయపడకుండా…

సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ఎట్టకేలకు ముబారక్ రాజీనామా, ఆనందోత్సాహాల్లో ఈజిప్టు ప్రజలు

  కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు…

ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్రెజిల్ పొదుపు ప్రయత్నాలు

  ద్రవ్యోల్బణం అదుపు, కోశాగార స్ధిరీకరణ (ఫిస్కల్ కన్సాలిడేషన్) పేరుతో ప్రజల సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో కోతలు విధించడానికి బ్రెజిల్ ప్రభుత్వం కూడా సిద్ధపడినట్లు కనిపిస్టోంది. పెరిగి పోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి 50 బిలియన్ల రియళ్ళ (రియల్ అనేది బ్రెజిల్ కరెన్సీ) మేరకు ఖర్చులు తగ్గిస్తామని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పొదుపు మొత్తం  30 బిలియన్ డాలర్లకు సమానం.   ఆర్ధిక సంక్షోభం పుణ్యాన అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనా, బ్రెజిల్,…

పదవిని వీడని ముబారక్, అమెరికా సూచన బేఖాతరు

గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు.…

ట్యునీషియా ఆపద్ధర్మ అధ్యక్షునికి మరిన్ని అధికారాలు

ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన పాత అధ్యక్షుడి స్ధానంలో తాత్కాలిక (ఆపద్ధర్మ) అధ్యక్షునిగా అధికారాన్ని చేపట్టిన ఫోద్ మెబజాకి ఇప్పుడు పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీతో పాలించే అధికారాలను సంక్రమింపజేశారు. మెబాజా పదవీచ్యుతుడైన పాత అధ్యక్షుడు బెన్ ఆలీకి సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి. బెన్ ఆలీ పాలనలో దాదాపు పదకొండు సంవత్సరాలపాటు  ప్రధానిగా పని చేశాడు. పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీ ద్వారా పాలించ వచ్చు. సెనేట్ ఓటింగ్ ద్వారా అటువంటి అధికారాలను దఖలు…

ముబారక్ దిగిపోవాలన్న అమెరికాపై ఈజిప్టు మంత్రి ఆగ్రహం

అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు. జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో…

నిజమే నేను తప్పు చేశాను -ఫ్రాన్స్ విదేశీ మంత్రి మేరీ

“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ…

ట్యునీషియా పోలీసుల కాల్పుల్లో ఇద్ధరు పౌరుల మృతి

ట్యునీషియాలో పోలీసు కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. వాయవ్య ప్రాంతంలో ఉన్న కెఫ్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల పెత్తనానికి వ్యతిరేకంగా స్ధానికులు పోలీసు స్టేషన్ ముందు గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడి పోలీస్ చీఫ్ నిరసనకారులలోని ఒక మహిళను చెంపపై కొట్టాటంతో పరిస్ధితి విషమించినట్లు బి.బి.సి తెలిపింది. మహిళపై చేయి చేసుకున్నాక ప్రజలు కోపంతో స్టేషన్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసరటంతో పోలీసులు కాల్పులు…

భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…

ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు

ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి. Muslim Brotherhood Leader Mohammed Badie అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం…