పరిక్రమ: మోడి వోటు బ్యాంకుకు రూటు -కార్టూన్

– బి.ఎజే.పి ప్రచార రధ సారధి మోడితో: మన పైలట్ వాహనం దెబ్బతిని కూలిపోయింది! – ఉత్తర ప్రదేశ్ లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన ‘చౌరాసి కోసి పరిక్రమ యాత్ర’ దాదాపు అభాసుపాలయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం వి.హెచ్.పి యాత్రపై విరుచుకుపడడంతో యాత్ర లాంఛనప్రాయంగా ప్రారంభం అయినట్లు ప్రకటించి ఊరుకున్నారు. అసలు పరిక్రమ యాత్ర ఇప్పటికే సాంప్రదాయ బద్ధంగా నిర్దిష్ట కాలంలో తాము పూర్తి చేయగా వి.హెచ్.పి తలపెట్టిన యాత్ర…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…

అవినీతికి హక్కు లేదా? -కార్టూన్

– “మా సొంత ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా మాకు లేదా?” – సమాచార హక్కును ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ చట్టానికి తూట్లు పెట్టే కృషిలో నిమగ్నం అయింది. సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను అభినందించుకుంటుంది. ప్రజాస్వామ్య సూత్రాలకు తాను గొప్పగా కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి ఆర్.టి.ఐ చట్టాన్ని ఆ పార్టీ తరచుగా ఉదహరిస్తుంది. కానీ ఆ చట్టం ద్వారా పాలకుల అవినీతి వెల్లడి అవుతుండేసరికి…

అయోధ్య రాజకీయం పట్ల వి.హెచ్.పిపై సాధువుల విమర్శలు

రామ మందిరం సమస్యను రాజకీయం చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ పై అయోధ్య సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఇప్పటికే తామందరమూ కలిసి పరిక్రమను ఇప్పటికే పూర్తిచేయగా పరిక్రమ పేరుతో మళ్ళీ కొత్త కార్యక్రమం చేపట్టం రాజకీయ లబ్ది పొందేందుకేనని వారు తీవ్రంగా విమర్శించారు. పరిక్రమ యాత్ర అంటూ కరపత్రాలు పంచి ఇప్పుడేమో పరిక్రమ కాదు పధ యాత్ర అంటూ మాట మార్చడంపైన వారు విరుచుకుపడ్డారు. భారత దేశ హిందువులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు…

రూపాయి-పార్లమెంటు: పతనం దేనిది? -కార్టూన్

నాయకుడు: అది పార్లమెంటే! సామాన్యుడు: కాదది రూపాయే! ఒక పక్క రూపాయి విలువ పతనం అవుతుండగా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను చర్చించి సవరించవలసిన చట్ట సభల సభ్యులు మాత్రం సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రకరకాల సర్కస్ ఫీట్లు సాగిస్తున్నారు. ‘ఆహార భద్రతా బిల్లు,’ ‘ఇన్సూరెన్స్ ఎఫ్.డి.ఐ బిల్లు,’ తదితర ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందడానికి పాలక పక్షం చిత్రవిచిత్రమైన ఎత్తుగడలు వేస్తుండగా, పాలక పక్షం పరువు తీసి వీలైనన్ని ఓట్ల మార్కులు తమ ఖాతాలో…

ఫైళ్ళు ఇక్కడితో మాయం అవుతాయి -కార్టూన్

కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో ఆణిముత్యం ఈ కార్టూన్. తొమ్మిదేళ్ల ప్రధాన మంత్రి ఈ కార్టూన్ చూస్తే సిగ్గుతో చితికిపోవాలి! “The buck stops here” అనేది ఆంగ్లంలో ఓ సామెత లాంటిది. బాధ్యత మోయాల్సి వచ్చినప్పుడు పక్కవాడి మీదికి నెట్టివేయడం మామూలుగా జరుగుతుంటుంది. ‘అలా పక్కవాడి మీదకు నేను తోసివేయను. నేనే స్వీకరిస్తాను’ అని ఈ వాక్యం చెబుతున్నవారు చెబుతున్నట్లు దీని అర్ధం. అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ బల్ల మీద ఈ…

పాత పేపర్ కాదయ్యా బాబూ! -కార్టూన్

“నేను మీకు పాత పేపర్ ఏమీ అమ్మలేదు. కావాలంటే తేదీ చెక్ చేసుకోండి!” – సాధారణంగా వార్తా పత్రికలు ఒక వార్తను తామే ముందు ఇవ్వడానికి పోటీ పడుతుంటాయి. ఫలానా వార్త మేమే ముందు ఇచ్చాం అని కొన్నిసార్లు చెప్పుకుంటుంటాయి. తద్వారా వేగంగా వార్తలు అందించే యంత్రాంగం తమ వద్ద ఉన్నదని చెప్పుకుని సర్క్యులేషన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో పత్రికలకు అలాంటి అవకాశం లేకుండా పోతోంది. ఫ్రంట్ పేజీ వార్తలన్నీ చద్ది వార్తలుగానే…

వెళ్ళి ఫైళ్ళు తవ్వుకు రండి, ఫోండి! -కార్టూన్

దాదాపు 80,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వికారమైన మలుపు తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుంభకోణాన్ని విచారిస్తున్న సి.బి.ఐకి అవసరమైన ఫైళ్ళు బొగ్గు శాఖ ఇవ్వనే లేదు. ఈ విషయాన్ని సి.బి.ఐ కోర్టుకి ఫిర్యాదు చేస్తే కోర్టు తీసిన ఆరాలో ప్రభుత్వంగా చల్లగా చెప్పిన సంగతి ఏమిటంటే సంబంధిత ఫైళ్ళు కనపడడం లేదట. ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ విషయంపైన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఈ అఫిడవిట్ సమర్పించగా అందులో…

ఉపాధి హామీ పధకం ఛారిటీ, దాన్ని ఆపాలి -మోడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ…

అమెరికాకు తలొగ్గిన అలీన నెహ్రూ -కత్తిరింపు

భారత పత్రికల్లో చాలా అరుదుగా కనిపించే వార్త ఇది. తెలుగు పత్రికల్లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. నిజానికి దీనిని వార్త అనడం కంటే చరిత్ర అనడం సముచితం. ఇంకా చెప్పాలంటే వాస్తవ చరిత్ర అనడం ఇంకా సముచితం. అలీన దేశాల కూటమి ఏర్పాటు చేయడంలో మన ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి మామూలుది కాదు. అలాంటి నెహ్రూ చైనా దాడితో ఎటూ పాలుపోక అమెరికా శరణు జొచ్చాడని ఈ ‘వాస్తవ చరిత్ర’…

సరిహద్దులో పాక్ దాగుడుమూతలు! -కార్టూన్

సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే…

ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో! ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే…

పార్లమెంటు పొయ్యిపై ఆహార బిల్లు వంటకం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండీ ఈ బిల్లు గురించి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నిరసనల హోరు మధ్య నిన్ననే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ నిరసనలు ఆహార భద్రతా బిల్లుపై కాకుండా వేరే అంశాలపైన కావడం గమనార్హం. కొంతమంది తెలంగాణ వద్దని నినాదాలు చేస్తుంటే, మరి కొంతమంది కాశ్మీరులో జవాన్ల హత్యలపై ఆందోళన చేస్తుండగా ఈ బిల్లుని హడావుడిగా ప్రవేశపెట్టారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి తొందర…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…

కదల్పూర్ లో దుర్గాశక్తి నాగపాల్ -ఫోటోలు

ఈ ఫోటోలను ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఐ.ఏ.ఎస్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన దుర్గాశక్తి మసీదు కూల్చివేత సమయంలో అక్కడ లేరని లీక్ అయిన లోకల్ ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక చెబుతోందని, వాస్తవానికి ఆమె అక్కడే ఉన్నారని ఈ ఫోటోల ద్వారా తెలుస్తోందని సదరు పత్రిక అట్టహాసంగా ప్రకటించింది. సంఘటన స్ధలంలో ఉన్న స్ధానికులు తమ సెల్ ఫోన్ ద్వారా ఈ ఫోటోలు తీశారనీ, వారి వద్ద నుండి తాము ఫోటోలు సంపాదించామని ఫస్ట్…