తెలంగాణ: జి.ఓ.ఎం ఆమోదం, వచ్చేవారం పార్లమెంటులో

“ఎ.పి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా చేపడతారు?” ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అట్టహాసంగా, వంది మాగధులు చప్పట్లు చరుస్తుండగా వేసిన ప్రశ్న! ఈ ప్రశ్నకు మొదటి సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై నియమించిన మంత్రుల కమిటీ (గ్రూప్ ఆవ్ మినిష్టర్స్) ఈ సమాధానం ఇచ్చింది. మాటలతో కాదు, చేతలతో. ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు –2013’ ముసాయిదాకు జి.ఓ.ఎం ఆమోదం తెలిపిందని పత్రికలు తెలిపాయి. “తెలంగాణ ముసాయిదా బిల్లుకు జి.ఓ.ఎం…

ఎఎపి పాలన: అంబానీ లైసెన్స్ రద్దుకు సిఫారసు

ఢిల్లీ ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. జనానికి సబ్సిడీ ధరలకు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయించిన ఎఎపి ప్రభుత్వం వాస్తవ విద్యుత్ పంపిణీ ఖర్చులను నిర్ధారించుకోడానికి ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించాలని నిర్ణయించడంతో అంబానీ, టాటా కంపెనీలు సహాయ నిరాకరణకు దిగిన సంగతి తెలిసిందే. తొండి కారణాలు చెప్పి విద్యుత్ సరఫరా బంద్ చేయడానికి వీలు లేదనీ, అలా చేస్తే డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయడానికి కూడా వెనుకాబడబోమని సి.ఎం ఎ.కె హెచ్చరించినట్లుగానే మొదటి వేటు…

ఓ యువరాణి, ఓ బఠాణి -అద్భుతమైన కార్టూన్

అవును! నిజంగా ఈ కార్టూన్ చాలా అద్భుతమైంది. దీన్ని అర్ధం చేసుకోవాలంటే మొదట ఒక చిన్న స్వీడిష్ కధ తెలుసుకోవాలి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక యువరాజు. ఆయనకి పెళ్లి వయసు వచ్చేసింది. కానీ ఆయనకి ఎంతకీ వధువు నచ్చడం లేదు. కారణం ఆయనకి ఉన్న షరతులు. పెళ్లంటూ చేసుకుంటే మరో యువరాణినే చేసుకోవాలని ఆయనగారి ఖచ్చితమైన కోరిక. ఆ యువరాణి కూడా అత్యంత సున్నితంగా ఉండాలి. కాలనేది కింద పెట్టకుండా పట్టుపరుపుల మీద…

ఎం.ఎన్.ఎస్: పోలిటికల్ టోల్ గేట్ -కార్టూన్

టోల్ గేట్ అంటేనే బాదుడుకి ప్రతిరూపం. ప్రజల కోసం అని చెప్పి రోడ్లు వేసి, ఆ రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి జనాన్ని బాదే అధికారాన్ని సైతం వారికి ఇవ్వడం పచ్చి ప్రజా వ్యతిరేక చర్య. వాహనాలు కొన్నపుడు రోడ్ టాక్స్ వేస్తారు. బస్సుల్లో తిరిగితే టిక్కెట్ డబ్బులు వసూలు చేస్తారు. పెట్రోల్ కొన్నప్పుడు కూడా దానిపైన సవాలక్షా పన్నులు వేసి సామాన్యులకు అందకుండా చేస్తారు. ఇవన్నీ పోను మళ్ళీ టోల్ గేట్ రుసుము వసూలు చేయడం,…

ఢిల్లీ విద్యుత్: కాగ్ ఆడిట్ పితలాటకం

ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.…

విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ…

ఎఎపి చేతిలో అవినీతి నాయకుల చిట్టా

అవినీతిపరులయిన రాజకీయ నాయకుల జాబితాను తయారు చేశామని ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహా నాయకులని భావిస్తున్నవారి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకుల పేర్లతో కూడిన ఈ చిట్టాలో స్ధానం సంపాదించినవారికి వ్యతిరేకంగా ఎఎపి తన అభ్యర్ధులను నిలుపుతుందని కేజ్రీవాల్ తెలిపారు. తమ జాబితాలో రాహుల్ గాంధీ ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడని ఆయనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం…

రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్

“తప్పు! పూర్తిగా తప్పు! మేము ఇదంతా చేయడానికి ఈ వ్యవస్ధ ఎలా అనుమతిస్తుందసలు?” ఎఎపి పుణ్యమాని రాజకీయ పార్టీలు అవినీతి వ్యతిరేక ఫోజు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిన దగ్గర్నుండే ఈ ఫోజులు మొదలయినప్పటికీ ఎఎపి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచడంతో ఈ ఫోజులు బాగా పెరిగాయి. ‘అవినీతి వ్యతిరేకత’కు ఓట్లు రాల్చే గుణం కూడా ఉందని తెలిసాక ఇక రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా?…

తెలంగాణ బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ను తిరస్కరించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ గత బి.ఎ.సి సమావేశంలోనే చెప్పడంతో తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయం అయింది. అయితే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు సభా కార్యక్రమాలకు అడ్డు పడడంతో తీర్మానం ఎలా ప్రవేశపెడతారన్న ప్రశ్న ఉదయించింది. ఈ సమస్యను అధిగమించడానికి…

‘పాపులిస్టు అనార్కి పాలనకు ప్రత్యామ్నాయం కాదు’ అంటే?

రాకేష్: Hi Sir, ”Populist anarchy no substitute for governance”, “rising trend of hypocrisy in public life” ఈ రెండు స్టేట్ మెంట్స్ ని స్పష్టంగా వివరించగలరా? సమాధానం: (ఇది వాస్తవానికి రాకేష్ అనే పాఠకుడికి, నాకూ జరిగిన సంభాషణ. ఈ ప్రశ్నలో మోదటి భాగం వరకు మా మధ్య చర్చ జరిగింది. అందులో నా సమాధానం వరకూ కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) “POPULIST ANARCHY IS NO SUSTITUTE…

బీహార్: జె.డి(యు)కు కాంగ్రెస్ మొండి చెయ్యి -కార్టూన్

మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది. ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు…

ఫ్రాన్స్ లో హింసాత్మక ఆందోళనలు

ఉక్రెయిన్ లో ఆందోళనలను అణచివేస్తున్నారంటూ ఆరోపిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండేకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం ప్యారిస్ వీధుల్లో కదం తొక్కారు. ఒలాండే అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ‘ఆగ్రహ దినం’ పాటిస్తున్నామని ప్రకటించారు. పోలీసులతో వీధి యుద్ధాలకు తలపడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారని, 250 మంది వరకు అరెస్టు చేశారని పత్రికలు తెలిపాయి. ఆందోళనకారులు కొందరు ఇ.యు నుండి ఫ్రాన్స్ బైటికి రావాలని డిమాండ్ చేయడం…

మోడి ఇమేజ్: కమలమా? టీ కప్పా? -కార్టూన్

“ఇదయితే మీ ఇమేజ్ కి బాగా సరిపోతుంది కదా, సార్?” పార్టీలోని వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని అందరూ అంగీకరించే సూత్రం. ఈ సూత్రం పార్టీలోని సామాన్య కార్యకర్తల నుండి అత్యున్నత నాయకులకు అందరికీ వర్తిస్తుందని ప్రతి పార్టీ చెప్పుకుంటుంది. తద్వారా పార్టీ సిద్ధాంతాలకు, నిర్మాణానికి పెద్ద పీట వేయడానికి పార్టీలు ప్రయత్నిస్తాయి. వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకుని పార్టీకి నష్టం కలిగించకుండా జాగ్రత్త పాటిస్తాయి. కానీ బి.జె.పి వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. “నరేంద్ర మోడి…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ వీరాలాపాలు వల్లిస్తూ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఒంటరి యోధుడిలా జనం ముందు నిలబడ్డ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన అప్పజెప్పడానికి సిద్ధపడుతున్న వైనం ఇది. ముఖ్యమంత్రి చర్యలను ఆర్ధిక శాఖ అభ్యంతరం చెబుతున్నా వినకుండా 15 నుండి 20 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసే సమావేశం సోమవారం…

బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని…