తెలంగాణ: జి.ఓ.ఎం ఆమోదం, వచ్చేవారం పార్లమెంటులో
“ఎ.పి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా చేపడతారు?” ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అట్టహాసంగా, వంది మాగధులు చప్పట్లు చరుస్తుండగా వేసిన ప్రశ్న! ఈ ప్రశ్నకు మొదటి సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై నియమించిన మంత్రుల కమిటీ (గ్రూప్ ఆవ్ మినిష్టర్స్) ఈ సమాధానం ఇచ్చింది. మాటలతో కాదు, చేతలతో. ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు –2013’ ముసాయిదాకు జి.ఓ.ఎం ఆమోదం తెలిపిందని పత్రికలు తెలిపాయి. “తెలంగాణ ముసాయిదా బిల్లుకు జి.ఓ.ఎం…














