కోడ్ పాటించని నేతలు దేశ గతి మారుస్తారా? -కార్టూన్

“నీ ఓటు నాకివ్వు” “నీ తలరాత మార్చేస్తా” “ఈ దేశ గతిని కూడా మార్చేస్తా” “చట్టాన్ని ఉల్లంఘించకుండా ఓటు వెయ్యడం ఎలాగో ముందు నీకు నేర్పి చూపిస్తా పద!” — “అరవై యేళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. నాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడండి! దేశం గతినే మార్చి చూపిస్తాను.” ఇది నరేంద్ర మోడి అదే పనిగా భారత జనానికి చెబుతున్న మాట! నరేంద్ర మోడీకి నిజంగానే అవకాశం ఇస్తే అది మొదటి అవకాశం మాత్రం…

ఓటెయ్యడానికి వచ్చి చిరంజీవికి పాఠం చెప్పిన ఎన్.ఆర్.ఐ

పలు సినిమాల్లో విలన్లకు సంస్కారం, పౌర బాధ్యత తదితర సుగుణాల గురించి పాఠాలు చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి నిజ జీవితంలో తానే ఓ పౌరుడితో పాఠం చెప్పించుకున్నారు. పాఠం చెప్పింది కేంబ్రిడ్జిలో ఉద్యోగం చేస్తున్న ఎన్.ఆర్.ఐ కావడం విశేషం. కేవలం ఓటు వేయడం కోసమే లండన్ నుండి వచ్చిన కార్తీక్ గంటన్నర నుండి క్యూలో నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చిరంజీవి కుటుంబం నేరుగా బూత్ లోకి వెళ్ళడం సహించలేకపోయారు. ఫలితంగా ఓ కేంద్ర మంత్రి…

ఎవరి (ఎన్ని)కలలు వారివి -కార్టూన్

ఎన్నికల ఫలితాలపై వివిధ పార్టీల నేతలు చెప్పిన జోస్యాలు, వ్యక్తపరిచిన ఆశలు, అన్నీ కలిపి ఒక చోట కుప్ప పోసి ఇదిగో ఈ నాలుగు గీతల్లో చెప్పెయ్యడం ఒక్క కార్టూనిస్టుల వల్లే సాధ్యం. వీటిలో మొదటి కల వెనుక స్వదేశీ, విదేశీ కంపెనీల ఆశలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత రెండింటిలో ఏది నిజమైనా వారికి ఫర్వాలేదు. కాకపోతే మొదట్లో కాస్త షేర్ మార్కెట్లు పడిపోతాయంతే. ఆ తర్వాత అంతా మామూలే! వారికి కావలసినవి యధావిధిగా…

లక్ష్మణ రేఖా…, అదెక్కడ? -కార్టూన్

సీన్ 1: @*@ (తిట్లు…) సీన్ 2: $?#@?& (మరిన్ని తిట్లు….) సీన్ 3: చెప్పు తెగుద్ది, చంపుతా, పొడుస్తా, చీ(పు)రేస్తా… సీన్ 4: లక్ష్మణ రేఖా? అదెక్కడ?  ఎన్నికలను అవినీతి రహితంగా, ప్రలోభాల రహితంగా, కుల-మతాలకు అతీతంగా, పారదర్శకంగా, నిస్పాక్షికంగా, ప్రజాస్వామికంగా జరుపుతున్నామని చెప్పుకోవడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పడరాని పాట్లు పడుతోంది. విద్వేష ప్రసంగం చేసారంటూ వరుస కేసులు పెడుతున్నా ఆ మరుసటి రోజే మరొక నేత తయారవుతున్నాడు. సి.ఇ.సి మందలింపులు, హెచ్చరికలు, కేసులు ఎదుర్కొంటున్నవారి…

దళితులతో రాహుల్ హానీమూన్, రాందేవ్ వెకిలి వ్యాఖ్యలు

స్వయం ప్రకటిత యోగా గురువు బాబా రాందేవ్ రాహుల్ గాంధీపై విమర్శల పేరుతో వెకిలి వ్యాఖ్యలు చేసి తన మకిలి బుద్ధిని చాటుకున్నాడు. హానీమూన్, పిక్ నిక్ లు జరుపుకోవడం కోసమే రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తున్నాడని కు వ్యాఖ్యలకు దిగాడు. ఆనక దళితులు బాధపడితే క్షమించాలని విన్నవించుకున్నాడు. ఆలోచించి చేసే వ్యాఖ్యలు బహుశా ఆయా వ్యక్తుల అసలు బుద్ధిని బైటపెట్టలేకపోవచ్చు. ఉద్దేశించిన లక్ష్యానికి మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అన్న విచికిత్స చేసుకున్నాక…

ఇది మోడి వానరుల కిష్కింధకాండ -కార్టూన్

రామాయణంలో నాలుగో కాండం కిష్కింధ కాండ. తెలుగు వికీపీడియా ప్రకారం కిష్కింధ కాండలోని ప్రధాన కధాంశాలు: రాముని దుఃఖము, హనుమంతుడు రామనకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ. వాలి వధ కోసం రాముడు చెట్టు వెనక నక్కి బాణం వదులుతాడు. ఎదురు వెళ్తే తనలోని సగం బలం వాలికి వెళ్లిపోతుంది. అందువలన వాలిని చంపడం కష్టం మరి! రామ బాణం దెబ్బ తిన్న వాలి మూర్ఛపోయి, మేలుకున్నాక రాముడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తాడు.…

ఇంకొచ్చి వోటర్ ని వెక్కిరించినట్టు… -కార్టూన్

“సిరా తడి ఆరకముందే…” అంటుంటాం కదా. అలాంటిదే ఇది కూడా. ఆ ఒక్క ముద్ర కోసమే కదా రాజకీయులకు ఇన్ని పాట్లు. ఈ.వి.ఎంల రోజులు కాబట్టి, ఆ ఒక్క నొక్కుడు కోసమే కదా అనాలేమో! రోశయ్య లాంటి తలపండిన నాయకులు కూడా “నువ్వు నాకు ఓటేశావా నీకు సమాధానం చెప్పడానికి?” అని చీరాలలో తనను నిలదీస్తున్న ఒక మహిళను ఎదురు నిలదీశారు. ఇక మద్యం, చికెన్ బిర్యానీ, చీరలు, ఉంగరాలు, వెయ్యి నోట్లు, క్రికెట్ కిట్లు… ఇత్యాదిగా…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

మోడి గెలుపు ఆలోచనే భయం గొలుపుతోంది

“మోడి అధికారంలోకి వస్తారన్న ఆలోచనే భయం గొలుపుతోంది” అని విదేశాల్లోని భారతీయ మేధావులు ఒక సంయుక్త ప్రకటనలే పేర్కొన్నారు. బ్రిటన్ లోనే అనేక ప్రసిద్ధి చెందిన యూనివర్సీటీలకు చెందిన బోధకులు ఈ ప్రకటన జారీ చేసినవారిలో ఉన్నారు. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని, ముఖ్యంగా మహిళలు అనేక నిర్బంధాలకు గురవుతారని వారు అంచనా వేస్తున్నారు. హిందూత్వ గ్రూపులు రెచ్చిపోతాయని, పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన…

మోడి గాలి ఉన్నట్టా లేనట్టా? -కార్టూన్

“హుర్రే… ‘మోడి గాలి లేదు’ గాలి వీస్తోందోచ్…” – గాలి పలు విధాలు. తూర్పు గాలి, పడమటి గాలి… ఇలా వీచే దిశ, కాలాల్ని బట్టి గాలి కలిగించే ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. పడమటి గాలిని మనం భరించలేం. సముద్రం మీది నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుందనుకుంటాం. కానీ అది మోసుకొచ్చే ఉప్పు నీటియావిరి జిడ్డుని అంటగడుతుంది.  దానితో చల్లదనం అటుంచి దేహం చిరచిరలాడుతుంది. ఈ గాలి లాగానే ఎన్నికల గాలులు కూడా పలు…

అద్వానీజీ, హామీలు మరిస్తే నిషేధం వద్దా?

బి.జె.పి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రజాస్వామ్యంపై హఠాత్తుగా బెంగ పట్టుకుంది. జనం ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నందుకు ఆయనకు కోపం వచ్చింది. ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని జనం ఇక భవిష్యత్తులో ఎప్పటికీ ఓటు వేయకుండా నిషేధం విధించాలని ఆయన ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నారు. జనం కోసం జరిగే ఎన్నికల్లో జనమే ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతికేను అన్నది అద్వానీ భయం! “ఓటు వేయని ప్రజలపైన అపరాధ రుసుము…

ఎఎపి: నోట్లు ఊడ్చినట్లే ఎన్నికలూ ఊడ్చాల! -కార్టూన్

“ఎన్నికలను కూడా ఇలాగే ఊడ్చేయగలిగితే బాగుడ్ను!” – ఎన్నికలలో ఖర్చు కోసం పరిశుభ్రమైన డబ్బు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ ద్వారా పిలుపు ఇవ్వడంతోనే రెండు రోజుల్లో 1.15 కోట్ల రూపాయలు వసూలయ్యాయట. అత్యంత పెద్ద మొత్తం తమిళనాడు నుండి అందిన రు. 1 లక్ష కాగా, అత్యంత చిన్న మొత్తం రు. 10 అని ఎఎపి నేతలు చెప్పారు. అరవింద్ ట్విట్టర్ లో చేసిన విన్నపం ఇది: “Reached Varanasi. Will go to…

కాశ్మీర్ వేర్పాటువాది జిలానీకి మోడి రాయబారం

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్నది సంఘ్ పరివార్ చిరకాల డిమాండ్. సంఘ్ పరివార్ సంస్ధల్లోనూ, కేడర్ లోనూ హిందూత్వ హార్డ్ లైనర్ గా ప్రసిద్ధి చెందిన నరేంద్ర మోడి కాశ్మీరు వేర్పాటు వాదులతో అందునా హార్డ్ లైనర్ నేతలతో రాయబారం నడుపుతారని ఊహించగలమా? ఊహించలేం. కానీ మోడి ఆ పని చేశారని కాశ్మీరు వేర్పాటువాద నేతల్లో హార్డ్ లైనర్ గా పేరు పొందిన సయ్యద్ ఆలీ…

ప్రమాదవశాత్తు ప్రధాని, ప్రమాదాల ప్రధాని -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ కు మొదటి పదవీ కాలంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ప్రత్యర్ధుల ప్రయోజనాలకే అన్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈ పుస్తకాన్ని బి.జె.పి వినియోగించదలుచుకుందని ఆ పార్టీ విమర్శలు చెబుతున్నాయి. బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి సైతం ఆ అవకాశాన్ని వదల్లేదు. మన్మోహన్ సింగ్…