పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్) భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త…

కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…

రోడ్ షోలు సాధించింది ఇదీ -కార్టూన్

“ఆ రోడ్ షోల వల్ల కంటికి బాగా కనిపిస్తున్న ప్రభావం ఇదే…” *** గతంలో ఎన్నికల ప్రచారాలు జనానికి కాస్త అర్ధం అయ్యేలా ఉండేవి. కరపత్రాలు వేసి పంచేవాళ్లు. తాము ఏమి చేస్తామో అందులో చెప్పేవాళ్లు. మీటింగులు పెట్టినా, కనీసం ఇందిరా గాంధీ కాలం వరకైనా, జనాలు స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్లు. ఇందిరా వ్యతిరేక నాయకులు వచ్చి మీటింగు పెడితే ఇందిరా అనుకూలురు కూడా వెళ్ళి వినేవాళ్ళు. అలాగే ఇతర నాయకుల విషయంలోనూ జరిగేది. నాయకుల సభలకు పార్టీల…

ఎగ్జిట్ పోల్స్: ఎగిరెగిరి పడుతున్న స్టాక్ మార్కెట్లు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్.డి.ఏ/బి.జె.పి/నరేంద్ర మోడి ప్రభుత్వం రాకను సూచించడంతో స్టాక్ మార్కెట్లు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్.డి.ఏ కి అనుకూలంగా ఉండవచ్చన్న అంచనాతో సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన జాతీయ స్టాక్ మార్కెట్లు తమ అంచనా నిజం కావడంతో మంగళవారం కూడా అదే ఊపు కొనసాగించాయి. దానితో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కాగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ధనిక వర్గాలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభకరం అని స్టాక్…

ట్విట్టర్ లో విజేతలు మోడి, ఎఎపి -ది హిందు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఇంటర్నెట్ లోని ఐ.టి కంపెనీలు భారత సాధారణ ఎన్నికల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాయి. బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఇంటర్నెట్ ను కూడా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రతిభావంతంగా వినియోగించు కోవడం మొదలు పెట్టిన ఈ ధోరణిని ఇతర పార్టీల నేతలు కూడా అనుసరించడంతో ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఎన్నికల పోరాటానికి వర్చువల్ వేదికలుగా…

ఇక పునర్దర్శనం టి.విలోనే -కార్టూన్

ఓ.కె, బై-బై. మళ్ళీ టీ.వి తెరపైన కలుద్దాం! ఈ రోజుతో చివరి విడత ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కమిషన్ విధించిన గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి కూటమి మెజారిటీ సాధిస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయినట్లు పత్రికలు నివేదించాయి కూడాను. మళ్ళీ నాయకులు ప్రజలకు కనిపించేది ఎప్పటికి? విజయం సాధించినందుకు స్వీట్లు ఒకరి నోట్లో మరొకరు పెట్టుకుంటూనో లేదా ఓటమిని అంగీకరిస్తున్నట్లు గంభీర…

ధర్డ్ ఫ్రంట్: మద్దతిస్తాం… అబ్బే, ఇవ్వం… -ఎఎపి

ఆం ఆద్మీ పార్టీ విధాన పరమైన లోపభూయిష్టత, అయోమయం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి అవసరమైతే ధర్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అంశాల వారీ మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఆదివారం (మే 11) వారణాసిలో ప్రకటించారు. కానీ అంతలోనే పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదని స్పష్టం చేశారు. అవినీతి నాయకులతో నిండిన నాయకులకు తమ పార్టీ ఎలాంటి మద్దతూ ఇవ్వదని ఆయన స్పష్టం…

డబ్బు, మద్యం లేని ఎన్నికలు సాధ్యం కాదా?

ప్రశ్న (ఎ.మనోహర్): మన దేశంలో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా? సమాధానం: ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఎన్నికలు నీతివంతంగా జరిగితే ఆ వచ్చే నాయకులు నీతివంతంగా ఉంటారన్న ఆశ ఈ ప్రశ్నలో ఇమిడి ఉంటుంది. లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ లాంటి నాయకులు సైతం ఎన్నికల్లో సరైన అభ్యర్ధులను ఎన్నుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుందని ప్రబోధిస్తున్నారు. కానీ అది నిజమేనా? చెట్టు ముందా, విత్తు ముందా అని ప్రశ్నిస్తే ఏమిటి…

మా తలుపులు తెరిచే ఉన్నాయి -కార్టూన్

“చర్చల కోసం మన తలుపులు తెరిచే ఉన్నాయని మనల్ని హీనపరిచేవారందరికీ తెలియజెప్పడానికి ఇది చిన్న సూచన మాత్రమే” *** నిన్నటిదాకా 300 సీట్లు గ్యారంటీ అని ప్రకటించుకున్న పార్టీకి వాస్తవ పరిస్ధితి తెలుస్తోందని ఆ పార్టీ నేతల ప్రకటనలు చెబుతున్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పకపోతే తెరిచి ఉన్న మరో ద్వారం వైపు చూస్తారని భయం మరి! మరో వారం రోజుల వరకూ ఈ కఠోరమైన ఎదురు చూపులు తప్పవు కదా!

ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిందని వివిధ పత్రికలు, ఛానెళ్లు తమ తమ విశ్లేషణల్లో పేర్కొన్నాయి. నరేంద్ర మోడి, అమిత్ షా లు చేసిన తాజా ప్రకటనలతో ఫలితాలకు ముందే బి.జె.పి తన ఓటమిని అంగీకరిస్తోందని ఇప్పుడు పత్రికలు, ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారం మొదలయిందో లేదో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ నుండి కృష్ణ మీనన్ రోడ్ కు తన నివాసాన్ని మార్చేసుకున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్…

మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్

2014 సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే నరేంద్ర మోడి ‘సద్భావనా మిషన్’ పేరుతో తాను అందరివాడినని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ప్రకటించాక ‘అభివృద్ధి’ మంత్రం అందుకున్నారు. గుజరాత్ లో తాను చేసిన అభివృద్ధి దేశం అంతా అమలు చేస్తానని ప్రచారం చేస్తారు. తాను ప్రసంగించిన చోటల్లా ఉద్యోగాల ప్రస్తావన తేవడం ద్వారా ఓటర్లలో సగం వరకూ ఉన్న యువతను ఆకర్శించేందుకు ఎర వేశారు. తాను ప్రధాని అయితే ‘ఉద్యోగాలే ఉద్యోగాలు’ అన్నారు. తీరా ఎన్నికలతో పాటు…

మోడి పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండదు -రష్దీ

మోడి నేతృత్వంలోని ప్రభుత్వం అధికరంలోకి వస్తే భారత దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా అడుగంటడం ఖాయం అని ప్రముఖ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సల్మాన్ రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మోడి అధికారంలోకి రాక మునుపే ఆయన పాలన ఎలా ఉండబోతోందో చాటే ఘటనలు జరుగుతున్నాయని, ఏం రాస్తే ఏమవుతుందో అని భావిస్తూ అనేకమంది సొంతగా సెన్సార్ షిప్ పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ‘పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్…

ఇది సెల్ఫీ రాజకీయాల యుగం! -కార్టూన్

“మీ సెల్ఫీకి ఊహించలేనంత బ్రహ్మాండమైన స్పందన వస్తోంది సార్ – ఇక చూస్కోండి, బంపర్ మెజారిటీతో గెలవడమే మిగిలింది…” *** ఊహించనంత వేగంగా కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాజకీయాల్లోనూ తన హవా చాటుతోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వార్తా ఛానెళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి ఇల్లూ ఒక శబ్ద కాలుష్య కర్మాగారం అయిపోయింది. ఛానెళ్లలో వివిధ రాజకీయ నాయకుల సొంత డబ్బాలు వినలేక పత్రికల వైపు మళ్లుదామంటే అక్కడా అదే గోల. ఒక్కో పత్రికా ఒక్కో…

అస్సాం మత హింసకు మోడీయే కారణం -ఒమర్

జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అస్సాం మతోన్మాద దాడులపై నోరు విప్పారు. ఎన్నికల సమయంలో మతోన్మాద దాడులు చెలరేగడానికి కారణం నరేంద్ర మోడియే అని ఆయన ఆరోపించారు. మూడు రోజుల క్రితం అస్సాంలో ఎన్నికల ప్రచారం చేసిన మోడి అస్సాంలో నివశిస్తున్న ముస్లింలు అందరూ విదేశీయులే అని స్ధానికులను రెచ్చగొట్టారని దాని ఫలితమే దాడులు జరిగి డజన్ల మంది మరణించారని ఆరోపించారు. “అస్సాంలో 30 మంది ముస్లింలను చంపేశారు. ఎందుకు? ఎందుకంటే బి.జె.పి ప్రధాన…