ప్రశ్న: UNSC శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగం?

వి లక్ష్మి నారాయణ: ఐక్యరాజ్య సమితి బద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇండియాకి ఎందుకు మెంబర్ షిప్ ఇవ్వలేదు, సభ్యత్వం కోసం వేరే సభ్య దేశాలు రికమెండ్ చేయాలా? ఈ టాపిక్ గురించి తెలియ చేయగలరు. ఇంతకుముందు చర్చించి ఉంటె ఆ లింక్ షేర్ చేయండి. సమాధానం: ఈ టాపిక్ ఇంతకు ముందు ప్రత్యేకంగా కవర్ చేయలేదు. అయితే, ఇతర ఆర్టికల్స్ లో భాగంగా కొంత రాశాను. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి…

సి.బి.ఐ విచారణలో గూగుల్ మ్యాప్స్

గూగుల్ ఇండియా కంపెనీపై పోలీసులు వేసిన కేసు సి.బి.ఐ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత పౌరులకు గూగుల్ నిర్వహించిన మేపధాన్-2013  పోటీ వల్ల దేశ భద్రతకు ప్రమాదం అని బి.జె.పి ఎం.పి లు గత సం. ఫిర్యాదు చేయడంతో గూగుల్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదును సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు గత సం. ఏప్రిల్ లో పత్రికలు తెలిపాయి. ఈ కేసును స్వీకరించిన సి.బి.ఐ ‘ప్రాధమిక విచారణ’…

పాక్ ఉల్లంఘన కూడా చర్చిస్తార్ట!

త్వరలో జరగబోయే పాక్-భారత్ చర్చల్లో పాకిస్ధాన్ ఒప్పందం ఉల్లంఘన గురించి కూడా చర్చిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్ధాన్ తో చర్చలు అంటేనే అంతెత్తున ఎగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే సో కాల్డ్ సెక్యులరిజాన్ని బూటకపు సెక్యులరిజంగా తిట్టిపోసే బి.జె.పి నేతలు ఇప్పుడు అదే పాకిస్ధాన్ తో చర్చలు చేయబోతున్నారు. చర్చలు జరపడమే ఆశ్చర్యం అనుకుంటే గత కొంత కాలంగా పాకిస్ధాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను కూడా చర్చిస్తామని చెప్పడాన్ని…

కురువృద్ధ కాంగ్రెస్ ను తీరానికి చేర్చేదిలాగేనా! -కార్టూన్

వందకు మించిన పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహించడానికి అలవాటుపడిన నెహ్రూ-గాంధీ కుటుంబం 44 మందికి కుదించుకుపోయిన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడానికి సిగ్గుపడిందో ఏమో గానీ మొదటిసారి లోక్ సభ నాయకత్వాన్ని కుటుంబేతరుడు మల్లిఖార్జున్ ఖార్గే కు అప్పజెప్పింది. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో కనీసం 10 శాతం సీట్లన్నా గెలుచుకోలేక ప్రతిపక్ష హోదా కోసం కూడా పాలక కూటమిని బతిమాలుకునే పరిస్ధితిలో ఉన్న కాంగ్రెస్, తెలివిగా దళితుడిని లోక్ సభ నేతగా ఎన్నుకోవడం ద్వారా ప్రతిపక్ష నాయకత్వాన్ని…

శివసేన పులి స్వారీ -కార్టూన్

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ఒక ముస్లిం ఉద్యోగి చేత శివసేన ఎం.పిలు బలవంతంగా చపాతీ తినిపించిన సంఘటన చుట్టూ ప్రస్తుతం రాజకీయ పార్టీలు చర్చను నడుపుతున్నాయి. సదరు చర్చకు పత్రికలు యధా శక్తి సహకరిస్తున్నాయి. ముంబై లోని మహా రాష్ట్ర సదన్ లో వడ్డిస్తున్న భోజనం క్వాలిటీ నాసిరకంగా ఉందని శివసేన ఎం.పి లు చెప్పదలిచారట. ప్రజా ప్రతినిధుల స్ధానంలో ఉన్నవారికి ఆ విషయాన్ని చెప్పడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. నాగరిక సమాజంలో…

డి.ఎం.కె కోసం అవినీతి జడ్జిని యు.పి.ఏ పొడిగించింది -కట్జు

యు.పి.ఏ హయాంలో ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితుడయిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు కేంద్ర ప్రభుత్వం మార్పుతో కొత్త ప్రభుత్వాన్ని కాకా పట్టే పనిలో పడ్డారా? ఎప్పుడో పదేళ్ళ నాటి జడ్జి నియామకపు అవకతవకల్ని ఆయన ఇప్పుడు తవ్వి తీస్తుండడంతో ఈ అనుమానం కలుగుతోంది. డి.ఎం.కె ఒత్తిడికి లొంగిన యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి జడ్జికి మూడుసార్లు పొడిగింపు ఇచ్చిందని కట్జు తాజాగా ఆరోపించారు. పనిలో పనిగా తాజా తమిళనాడు ముఖ్యమంత్రి ఏనాడూ కోర్టు…

నన్ను పి.ఎంని చెయ్యి, నిన్ను అధ్యక్షుడ్ని చేస్తా -కార్టూన్

మనకిక్కడ ఒకప్పుడు ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఒకరి హఠాన్మరణం వలన ఆ రెండో పెద్దాయన కూడా హఠాత్తుగా ఒంటరి అయ్యారు. (తెలంగాణ ఆందోళన పుణ్యామని ఆ తర్వాత కూడా ఆయన కింగ్ మేకర్ గా కొనసాగారని కొన్ని పత్రికలు చెవులు కొరుకుతాయి.) గుజరాత్ లో కూడా ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఈ జంటకి ప్రమోషన్ వచ్చి రాష్ట్ర స్ధాయి నుండి కేంద్ర స్ధాయికి ఎగబాకింది. వారు…

కాప్టర్ కుంభకోణం: ఎ.పి గవర్నర్ ని విచారించిన సి.బి.ఐ

హెలికాప్టర్ల కుంభకోణంలో సి.బి.ఐ విచారణకు నోచుకున్న గవర్నర్ల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కూడా చేరిపోయారు. కుంభకోణానికి దారి తీసిన నిర్ణయం జరిగిన కీలక సమావేశంలో అప్పటి ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ కూడా పాల్గొనడంతో సి.బి.ఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ మేరకు సి.బి.ఐ బృందం ఒకటి హైద్రాబాద్ వచ్చి గవర్నర్ కు విచారించింది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యు.పి.ఎ నియమించిన ఇద్దరు…

మంచి రోజులు కాదు యు.పి.ఏ రోజులే తిరిగొచ్చాయ్

“అచ్ఛే దిన్ ఆనేవాలా హై” (మంచి రోజులు వస్తున్నాయ్)… ఇది బి.జె.పి/ఎన్.డి.ఏ/నరేంద్ర మోడి ఎన్నికల నినాదం. ఇవ్వడానికి ఈ నినాదమే ఇచ్చినా తాము అమలు చేస్తున్నది మాత్రం యు.పి.ఏ విధానాలే అని పార్లమెంటు సాక్షిగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆహార ధరలు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం ఊర్ధ్వ స్ధాయిలో కొనసాగుతుండడంతో స్వల్ప కాల చర్చకు సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. యు.పి.ఏ చేసిన నిర్ణయాలనే తాము అమలు చేస్తున్నామని ఆయన…

ఇండియా-అమెరికా సంబంధాల్లో షాడో బాక్సింగ్ -ది హిందూ ఎడిటోరియల్

(ఈ సంపాదకీయం ది హిందూ పత్రిక ఎప్పటి అవగానలో భాగంగా కనిపించడం లేదు. మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ బి.జె.పి నూతన హయాంలో సానుకూల అంశాలను కనిపెట్టడానికి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తున్న ది హిందూ ధోరణిలోనే ఈ సంపాదకీయం సాగింది. లేదంటే తెలిసి తెలిసీ అమెరికాతో సత్సంబంధాలను కోరే దుస్సాహసానికి పత్రిక ఎందుకు పూనుకుందో అంతుబట్టని విషయం. కోరి దృత రాష్ట్ర కౌగిలిలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తున్న ఇటువంటి సంపాదకీయం ది హిందూ నుండి వెలువడడం ఒకింత ఆశ్చర్యకరమే…

హెలికాప్టర్ కుంభకోణం: గవర్నర్ల తొలగింపు బి.జె.పి మెడకు!

యు.పి.ఏ నియమించిన గవర్నర్లను తప్పించడానికి హెలికాప్టర్ల కుంభకోణాన్ని వేగవంతం చేసిన బి.జె.పి ప్రభుత్వం చివరికి సదరు కుంభకోణం ఎన్.డి.ఏ మెడకు చుట్టుకునే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి సలహా మేరకు పదవిలో కొనసాగుతున్న కాంగ్రెస్/యు.పి.ఏ గవర్నర్లు ఇద్దరినీ సి.బి.ఐ సాక్షుల హోదాలో ప్రశ్నించింది. తీరా విచారణ సందర్భంగా గవర్నర్లిద్దరూ ఎన్.డి.ఏ మొదటి పాలనలోనే హెలికాప్టర్ కుంభకోణానికి బీజం పడిన సంగతిని బైటికి తీయడంతో పరిస్ధితి తారుమారయింది. అగస్టా వెస్ట్ లాండ్ వి.వి.ఐ.పి హెలికాప్టర్ల…

రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…

సునంద పుష్కర్ పోస్ట్ మార్టంలో యు.పి.ఏ ఒత్తిడి?

కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ భార్య హఠాన్మరణం విషయంలో తాజాగా వివాదం రగులుతోంది. ఆమె మరణానికి కారణాలు తెలియజేసే పోస్ట్ మార్టం నివేదిక తయారీలో తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ ఆరోపించడంతో సంచలనం రేగుతోంది. డాక్టర్ ఆరోపణలను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడంతో మరిన్ని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్…

ఫుట్ బాల్ వీరుడు మోడి -కార్టూన్

నడుస్తున్నది ప్రపంచ ఫుట్ బాల్ సీజన్. కాబట్టి బంతిని రెండు స్తంభాల నడుమకు నెట్టేస్తే సరిపోతుంది. కానీ రానున్నది అసలు పందెం. ఈ పందెంలో స్తంబాల మధ్య నెట్టడానికి బంతీ ఉండదు. ఆట ఆడితే మోగే చప్పట్లూ ఉండవు. ఎందుకంటే ఆ అసలు పందెంలో అన్నీ దాటి తీరవలసిన ఆటంకాలే. 30 రోజుల ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడానికి ఏమీ ఉండదని కార్టూనిస్టు ఇలా చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభ రోజులను అధికార పార్టీకి హానీ మూన్…

స్విస్ నల్ల ధనం అను ఒక ప్రహసనం -కార్టూన్

“ఆగండాగండి, ఇదిగో లేఖ జారవిడుస్తున్నా, ఇక తెరుచుకోవడమే తరువాయి.” *** అధికారంలోకి వచ్చీ రావడంతోనే విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బును వెనక్కి తేవడానికి అని చెబుతూ మోడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ వాస్తవానికి సుప్రీం కోర్టు ఆదేశాలకు ఏర్పాటు చేశారన్న వాస్తవాన్ని చెప్పిన పత్రికలు చాలా తక్కువ. ఈ కమిటీ పని ఎంతవరకు వచ్చిందో తెలియదు గానీ కొద్ది రోజుల తేడాలోనే పరస్పర…