మోడి: చీపురే ఓట్ల మంత్రదండంగా… -కార్టూన్

ఎన్నికల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ బి.జె.పికి అచ్చివస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. చీపురు చేతబట్టి ఢిల్లీ వీధులను శుభ్రం చేస్తున్న ప్రధాని మోడి ఫోటోలు ఇప్పుడు భారత దేశంలో ఒక ప్రాచుర్య దృశ్యం. ఈ దృశ్య ప్రాచుర్యాన్ని సొమ్ము చేసుకునేందుకు మోడి నడుం బిగించారని కార్టూన్ సూచిస్తోంది. లేదంటే ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచాయో లేదో అప్పుడే కూటమి పాలనా రోజులకు కాలం చెల్లిందని మోడి ప్రకటించగలరా?…

చీపురు వెనక సందేశం -ది హిందూ ఎడిట్

(ఆం ఆద్మీ చేతిలోని చీపురు కాస్తా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడి చేతిలోకి వచ్చేసింది. స్వయంగా చీపురు చేతబట్టి ఒక సెంట్రల్ ఢిల్లీలో ఒక పోలీసు స్టేషన్ ఆవరణను శుభ్రం చేయడం ద్వారా ప్రధాని దేశం దృష్టిని గొప్పగా ఆకర్షించారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక రోజు ఆర్భాటంతో ముగియడం భారత దేశానికి అనుభవమే. చంద్రబాబు నాయుడు గారి ‘ప్రజల వద్దకు పాలన’ అధికారులను జనం వద్దకు తేవడం తప్ప సాధించిందేమీ లేదు. వై.ఎస్.ఆర్ ప్రవేశపెట్టిన అనేక…

ఇండియా, అమెరికాలు సహజ మిత్రులు! -కార్టూన్

అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి తన అదృష్టానికి తాను ఎంతో మురిసిపోయినట్లు ఆయన ప్రకటనల ద్వారా తెలిసింది. ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడిని కలిసే అవకాశం తనకు వచ్చిందని మోడి చెప్పుకున్నారు. తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికాయే ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే, తనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికిందని ఈ మాటల ద్వారా మోడి ఎత్తి చూపారని చెబుతున్నవారూ లేకపోలేదు. అమెరికా…

తమిళనాడా, జయలలితా? -కార్టూన్

తమిళనాడు ప్రజల పురచ్చి తలైవి జైలు పాలు కావడంతో ఆమె నియమించిన మంత్రివర్గం రాజీనామా చేసింది. జయలలితకు నమ్మినబంటుగా పేరు పడి సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకసారి అధిష్టించి జయలలిత విడుదల కాగానే తిరిగి ఆమె పీఠాన్ని ఆమెకు అప్పగించిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గమూ కొలువుతీరింది. పేరుకు కొత్త మంత్రివర్గమే గానీ పాత మంత్రివర్గాన్నే పన్నీర్ సెల్వం కొనసాగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు,…

హాంగ్ కాగ్ ట్రబుల్డ్ వాటర్స్ లో పశ్చిమ చేపలవేట -ఫోటోలు

ఏదో ముతక సామెత చెప్పినట్లు హాంగ్ కాంగ్ లో కొనసాగుతున్న ‘ఆక్యుపై సెంట్రల్’ ఉద్యమం చూసి పశ్చిమ దేశాలు, పత్రికలు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాయి. చైనాలో ప్రజాస్వామ్యం(!) కోసం జనం ఏ కాస్త ఆందోళన చేసినా పశ్చిమ పత్రికల్లో రంగురంగుల ఊహాలు, అల్లికలు ప్రత్యక్షం అవుతాయి. అదే అమెరికాలో నల్లవారిపై పోలీసుల దాష్టీకంపై ఆందోళనలు జరిగినా, ఐరోపాలో పొదుపు విధానాలకు వ్యతిరేకంగా నెలలతరబడి ఆందోళనలు జరుగుతున్నా, ప్రభుత్వాల తీవ్ర అణచివేతలపై దృష్టి పెట్టడం అటుంచి ప్రజల ఆందోళనలే ప్రజాస్వామ్య…

గుజరాత్ లో మత కొట్లాటలు, 140 మంది అరెస్టు -ఫోటోలు

గుజరాత్ లో మరోసారి మత పరమైన అల్లర్లు చెలరేగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడి పోటీ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిచి, అనంతరం వదులుకున్న వదోదర నగరంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ‘వసుధైక కుటుంబం’ భారత దేశ సిద్ధాంతం అని న్యూయార్క్, వాషింగ్టన్ డి.సిలలో ప్రధాని చెప్పుకుంటున్న సమయంలోనే ఆయన పోటీ చేసిన వదోదరలో మత కొట్లాటలు చెలరేగడం గమనార్హమైన విషయం. గత గురువారం నుండి వదోదరలో అల్లర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఫేస్…

విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు. తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం.…

జయలలిత: అల్లంత శిఖరాన… దభేల్! -కార్టూన్

జయలలిత కెరీర్ ఇక ముగిసినట్లేనా? ముగిసినట్లే అని ఆమె వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ శోక హృదయులై ఉన్నా, మించిపోయింది ఏమీ లేదన్న ధైర్యంతో ఉన్నారు. చో రామస్వామి లాంటి తమిళ రాజకీయ విశ్లేషకులు ఆమెకు ఇంకా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. జయలలిత తన కెరీర్ లో పీక్ దశలో ఉండగా కోర్టు తీర్పు ఆమెకు ఆశనిపాతం అయిందని ది హిందూ లాంటి పత్రికలు సైతం విశ్లేషించాయి. పీక్ దశ అంటే…

న్యాయానికి సుదూర రహదారి -ది హిందు ఎడిట్

(అక్రమ ఆస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది 4 సం.ల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. సహ నిందితులకు 4 సం.ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఫలితంగా అవినీతి కేసులో శిక్ష పడిన మొదటి ఉన్నత స్ధాయి నేతగా జయలలిత చరిత్ర పుటలకు ఎక్కారు. అవినీతి కేసుల్లో నేతలు తప్పించుకుపోకుండా ఇటీవల చేసిన చట్టం ఫలితంగా ఎం.ఎల్.ఏ పదవి, తద్వారా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన…

మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు. భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు…

కేజ్రీవాల్ చీపురు మోడి చేతికి! -కార్టూన్

కాంగ్రెస్ పాలనలో భారత దేశం సర్వ రంగాలలోనూ భ్రష్టు పట్టిపోయిందని బి.జె.పి తరచుగా చేసే ఆరోపణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఎంతో ఇష్టమైన విమర్శ. తాము అధికారంలోకి వచ్చాము గనక ఇక నిశ్చింతగా నిద్రపోండి, మిగిలింది మేము చూసుకుంటాం అని వీరు చెప్పబోతారు. ఆలి పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా అన్నట్లు దేశాన్ని ఐదేళ్ల పాటు, రాష్ట్రాన్ని 9 సం.ల పాటు ఏలిన నేతల సంగతి జనానికి తెలియకనా,…

రిఫరెండం పూర్తైనా స్కాట్లండ్ భారమే -కార్టూన్

సెప్టెంబర్ 18 తేదీన జరిగిన రిఫరెండంలో యు.కెలో భాగంగా ఉండడానికే మెజార్టీ స్కాట్లండ్ ప్రజలు (55%)నిర్ణయించారు. రిఫరెండంలో విడిపోవడానికే స్కాట్ లు నిర్ణయిస్తారని భయపడిన యు.కె రాజకీయ పార్టీలు ఫలితాలతో ఊపిరి పీల్చుకున్నారు. యు.కెలో కొనసాగడానికే స్కాట్ ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ యునైటెడ్ కింగ్ డమ్ స్కాట్లండ్ భారం కొనసాగుతూనే ఉందని కార్టూన్ సూచిస్తోంది. అది నిజమే. ఎందుకంటే స్కాట్లండ్ రిఫరెండం దగ్గరపడే కొద్దీ స్కాట్లండ్ స్వతంత్రానికి ఆదరణ పెరుగుతూ పోయింది. చివరి రోజుల్లో ఇరు పక్షాలు సమాన…

(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్…

అజిత్ సింగ్: ఎడారి సేద్యగాడు -కార్టూన్

– “సారవంతమైన రాజకీయ వారసత్వం ఇంతగా సాగుకు వీలు కానిదిగా ఎలా మారిపోయింది చెప్మా?” ********* ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును! ఈ సామెతలోని మొదటి అర్ధ భాగానికి మరో చక్కని ఉదాహరణ ఉత్తర ప్రదేశ్ రాజకీయ నేత అజిత్ సింగ్. ఒకప్పటి లోక్ దళ్ పార్టీ నేత, జనతా హయాంలో చక్రం తిప్పిన చౌదరి చరణ్ సింగ్ తనయుడు అయిన అజిత్ సింగ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో నిన్నటి వరకు తిరుగులేని నేత. జాట్…

మహారాష్ట్ర: కూటమి కుమ్ములాటల్లో బి.జె.పి-సేన హవా -కార్టూన్

బి.జె.పి, శివ సేనల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరిందిట. ఇరు పార్టీలూ కలిసి తమ కూటమిలోని మిగిలిన పక్షాలకు సీట్లు కత్తిరించడం ద్వారా తమ తగాదా పరిష్కరించుకున్నారు. బి.జె.పి 130 సీట్లకూ, శివసేన 151 సీట్లకూ పోటీ చేస్తాయట. కూటమిలోని ఇతర పార్టీలకు 18 సీట్లు కేటాయించాల్సి ఉండగా ఇప్పుడు 7 మాత్రమే ఇస్తున్నారు. శివసేన తన డిమాండ్ కు ఒక్క సీటూ తగ్గించుకోలేదు. దానితో బి.జె.పి ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో 11 సీట్లను ఆక్రమించింది.…