రమ్మన లేక… పొమ్మన లేక… -కార్టూన్

మహారాష్ట్రలో శివసేన పరిస్ధితి మరీ దిగజారిపోయింది. ప్రభుత్వంలో చేరాలని ఉంది, కానీ ఎన్నికల్లో బి.జె.పి సాధించిన ఆధిక్యం ద్వారా సంక్రమించిన  ఆధిపత్యాన్ని తట్టుకోలేరు. కనీసం 2 మంత్రి పదవులైనా దక్కుతాయనుకుంటే అవీ ఇచ్చే ఉద్దేశ్యం లేదని బి.జె.పి నిర్మొహమాటంగా స్పష్టం చేసింది.  అలాగని అధికారానికి దూరంగానూ ఉండలేరు. సహజ మిత్రులుగా మొన్ననే తమను తాము అభివర్ణించుకుంటిరి. అలాంటి మిత్ర పార్టీ మొట్ట మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే అందులో భాగస్వామ్యం లేకపోవడం వారికి అవమానం. బి.జె.పి దూరం…

బి.జె.పి అచ్ఛే దిన్ కింది వరకూ చేరేనా! -కార్టూన్

“బి.జె.పి వాళ్ళ అచ్ఛే దిన్, బొట్టు బొట్టుగా మన వరకూ కారుతాయా, లేదా?” ********** మోడి/బి.జె.పి ప్రభుత్వం హానీ మూన్ రోజులు గడిచిపోయాయి. వారే పెట్టుకున్న వంద రోజుల గడువు కూడా పూర్తయింది. కానీ వారు అట్టహాసంగా ప్రకటించిన అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రం ఇంతవరకూ లేశామాత్రమైనా పత్తా లేవు. పల్లెల్లో కూలీ/రైతు ఇల్లాలికి ‘ట్రికిల్ డౌన్ సిద్ధాంతం‘ తెలుసని కాదు. కానీ బొట్లు బొట్లుగా రాలి పడడం అంటే ఏమిటో వారికి తెలుసు. గొప్పోళ్లకు లభిస్తున్న ‘మంచి…

రహస్య చట్టంతో నల్ల డబ్బు ఖాతాలను దాయొద్దు! -సుప్రీం

మంగళవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. నల్ల డబ్బు ఖాతాల వివరాలను దాచి పెట్టడానికి గోప్యతా నిబంధనలను (confidentiality clause) అడ్డం పెట్టవద్దని ఘాటుగా సూచించింది. నల్ల డబ్బు యాజమానుల వివరాలను వెల్లడించకుండా ఉండడానికి గోప్యతా నిబంధనలను శరణు వేడడం తగదని, ఎన్ని రహస్య నిబంధనలు ఉన్నప్పటికీ నల్ల డబ్బు ఖాతాల పేర్లన్నీ తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారిని ఏంచేయాలో తాము చూసుకుంటామని ప్రభుత్వానికి హైరానా అవసరం లేదని స్పష్టం చేసింది.…

రౌసెఫ్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

(బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేత దిల్మా రౌసెఫ్ రెండో సారి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపధ్యంలో ఆమెకు ప్రత్యర్ధుల నుండి గట్టి సవాలు ఎదురయింది. అయినప్పటికీ రనాఫ్ ఎన్నికల్లో కొద్ది తేడాతో గట్టెక్కారు. మొదటిసారి జరిగే ఎన్నికల్లో ఎవరికీ సాధారణ మెజారిటీ రాకపోతే, ముందు నిలిచిన ఇద్దరు అభ్యర్ధుల మధ్య రెండో సారి తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఇలా రెండో సారి జరిగే ఎన్నికలను రనాఫ్ ఎన్నికలు అంటారు. బ్రెజిల్ ఎన్నికల ఫలితంపై…

మోడి, అమిత్ జైత్రయాత్ర -కార్టూన్ కవిత

ఏయే శక్తులు చేతులు కలిపెనో… ఏయే సామ్రాజ్యాలు ఆశీర్వదించేనో… ఏయే వర్గాలు వైరుధ్యముల బాపెనో… ఏయే రాజకీయ వైరులు వెన్నుజూపెనో… ఏయే కంపెనీలు నిధులను పరిచెనో… ఏయే (హిందూ) దేవతలు ఓటు వర్షముల కురిపించెనో… ఏయే ముజఫర్ నగర్ లు ఆత్మహనన ఓట్లు గుమ్మరించెనో… ఏయే కుల సమీకరణలు తిరుగబడెనో… ఏయే పేలుళ్లు రక్త తిలకం దిద్దెనో… ఏయే మిత్రులు శత్రు నాటకంబాడెనో… ఏయే శత్రులు సలాము చేసెనో… నేర చట్టముల పదును విరిగెను! న్యాయ స్ధానములు…

అది దాడి బాణమా? కాదు.. కాజాలదు…! -కార్టూన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై శివ సేన చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఇక రెండు పార్టీల స్నేహానికి తెరపడినట్లే అన్నంతగా శివసేన దాడి చేసింది. బి.జె.పి మాత్రం వ్యూహాత్మకంగా ‘ధాకరే పైన మాకు ఎనలేని గౌరవం. అందుకే మేము శివసేనను పల్లెత్తు మాట అనం” అంటూ ప్రతి విమర్శకు పూనుకోలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక గాని శివ సేన దాడి అసలు స్వరూపం ఏమిటో వ్యక్తం కాలేదు. ఫలితాలు వెలువడుతున్న కాలంలో ఎన్నికల ముందరి…

హిట్లర్ ఎలా చనిపోయాడు?

హిట్లర్ ఎలా చనిపోయాడన్న విషయంపై చాలా కాలం వరకు చర్చోపచర్చలు నడిచాయి. అసలు ఆయన అందరూ చెబుతున్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్నది ఒక అనుమానం. ఆత్మహత్య చేసుకుంటే విషం మింగి చనిపోయాడా లేక తుపాకితో కాల్చుకుని చనిపోయాడా అన్నది మరో అనుమానం. బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నది సోవియట్ సేనలే. హిట్లర్ సామ్రాజ్య పతనం గ్యారంటీ అని అర్ధం అయ్యాక పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ మధ్య హిట్లర్ సామ్రాజ్యంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని…

మహారాష్ట్ర: దివాలి బాంబు, రెండు వత్తులు -కార్టూన్

అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన ఒక కోణాన్ని ఈ కార్టూన్ అద్దం పడుతోంది. ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై దాడి చేసేందుకు ఏ ఒక్క రాయినీ వృధా పోనీయని శివ సేన, ఎన్నికల అనంతరం ఆ పార్టీతోనే జట్టు కట్టి అధికారం పంచుకునేందుకు ఆత్రపడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం చూపుతూనే ప్రభుత్వంలో చేరేందుకు తహతహలాడుతోంది. ఇక ఎన్.సి.పి సంగతి సరే సరి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బి.జె.పి కి సైగలు…

ప్రయోజనాల సమతూకం -ది హిందు ఎడిట్

(మోడి ఇటీవల ప్రకటించిన కార్మిక వ్యతిరేక కార్మిక సంస్కరణలకు ది హిందు మద్దతుగా వస్తూ ఈ సంపాదకీయం వెలువరించింది. నిస్పక్షపాత ముద్రను కాపాడుకోవడానికి ఈ సంపాదకీయంలో పత్రిక చాలా ప్రయాసపడింది. అనునయ మాటలతో, నచ్చజెప్పే ధోరణితో పాఠకుల చేత చేదు మాత్రను మింగించడానికి కృషి చేసింది. తనిఖీల లోపం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని నామమాత్రంగా చెబుతూ అంతిమంగా భారత దేశ శ్రామిక ప్రజల హక్కులకు భంగం కలిగించే కార్మిక సంస్కరణలను నిండు మనసుతో పత్రిక ఆహ్వానించడం…

కాంగ్రెస్ తిరిగి ఎప్పటికీ లేచేను? -కార్టూన్

నాయకుడు: “లే, లే! మనం పోరాడాలి!” కురువృద్ధ పార్టీ: “నన్ను కూలదోసింది ఎవరూ!? (నువ్వు కాదూ?)” *** మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు, పత్రికలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని తీర్మానిస్తున్నారు. కానీ పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగించే పరిస్ధితుల మధ్య ఆ పార్టీని కొట్టిపారేయడం తొందరపాటుతనమే కాగలదు. అయితే అందుకు ఒక…

లవ్ జిహాద్: మీరట్ అమ్మాయి కాదన్నా పంతం వీడని హిందూత్వ

  భారత దేశంలో ఇస్లామిస్టు సంస్ధలు ‘లవ్ జిహాద్’ కు కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి మీరట్ అమ్మాయి కేసు పాఠ్య గ్రంధం లాంటి ఉదాహరణగా ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలు కోడై కూశాయి. తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసుకుని, అత్యాచారం చేశారని ఆ అమ్మాయి మొదట్లో ఆరోపించింది. ఆ తర్వాత అసలు సంగతి వెల్లడిస్తూ రాజకీయ పార్టీలు, సంస్ధల ఒత్తిడితో, తన తండ్రి బలవంతం చేయడంతో తాను ఆ విధంగా చెప్పానని, తన తల్లిదండ్రుల…

మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం…

కుర్చీలేని మహారాణి -కార్టూన్

  భారత దేశంలో మహా రాజులకు, మహా రాణులకు, యువరాజు, యువరాణిలకు కొదవలేదు. ఒకప్పడు రాజ్యాలు యేలి ప్రజలను పీడించుకు తిని సంపదలు కూడబెట్టిన రాజ్యాధీశులే నేడు ఆధునిక రాచరికం వెలగబెట్టడం కళ్ల ముందు కనపడుతున్న నగ్న సత్యం. ఆనాడు వారసత్వంగా రాచరిక ఆధిపత్యం సంక్రమించినట్లే నేడూ వారసత్వంగా రాజకీయ ఆధిపత్యం సంక్రమిస్తోంది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను పడదిట్టిపోసే పార్టీలు కూడా తమ తమ వారసత్వాలను కాపాడుకుంటూ ప్రజల నెత్తిన గుడిబండల్ని మోపుతున్నారు. ఒకనాటి రాచరికాలు కొనసాగుతుండగానే…

ప్రధాన స్రవంతి పార్టీలకు సవాలు -ది హిందూ ఎడిట్

  (ఐరోపా దేశాల్లో మితవాద శక్తుల ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ శక్తులు వలస ప్రజలకు వ్యతిరేకంగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కు కూడా వీరు వ్యతిరేకం. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు తీవ్రం అయ్యేకొద్దీ వాటినుండి బైటపడేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలు తిరుగుబాటు భావజాలం వైపుకి మరలకుండా ఉండేందుకు ప్రస్తుత పాలక వర్గాల పార్టీలు తామే ఒక తీవ్రవాద ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తెస్తారు. ప్రజలు తమలో తాము ఘర్షణ…

నల్లడబ్బు వివరాలన్నీ చెప్పలేరట!

నల్ల డబ్బు కధ మరో చుట్టు తిరిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లడబ్బు వివరాలను దాచి ఉంచడానికి ఏయే కతలు చెప్పారో సరిగ్గా అవే కధల్ని మన అవినీతి వ్యతిరేక ఛాంపియన్ అయిన నరేంద్ర మోడీగారి ప్రభుత్వం వినిపిస్తోంది. దేశం దాటి పోయి అనేక రహస్య స్విస్ ఖాతాల బంకర్లలో శత్రు దుర్భేద్యమై నక్కిన నల్లడబ్బుని మెడపట్టి లాక్కొచ్చి జనానికి అప్పజెపుతామని వీరాలాపాలు పలికిన మోడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిన మాటల్నే చిలక పలుకుల్లా వల్లిస్తోంది. ఎన్.డి.ఏ…