అధికారుల సస్పెన్షన్: ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ ల సామూహిక సెలవు

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ అధికారులు ఏ‌ఏ‌పి ప్రభుత్వంపై సమ్మె ప్రకటించారు. వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లారు. కొందరు రోజంతా సెలవు తీసుకోగా మరికొందరు ఒక పూట సెలవులో వెళ్లారు. ఇదంతా తమలో ఇద్దరు అధికారులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు! అధికారుల సెలవు వల్ల ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తలపెట్టిన బేసి-సరి సంఖ్యల (నంబర్ ప్లేట్లు) వాహన పధకం అమలుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించే కౌన్సెళ్ళకూ పబ్లిక్…

కొత్త పార్లమెంటు… స్వేచ్ఛగా కొట్లాడ్డానికి! -కార్టూన్

“నిజమే సుమా. ఇప్పుడు మరీ ఇరుకై పోయింది -ముఖ్యంగా వెల్ ఆఫ్ ద హౌస్ లో…” ____________________________ పార్లమెంటు కోసం కొత్త భవనం కావాలని స్పీకర్ కోరారు. ************ పార్లమెంటు కార్యకలాపాల కోసం కొత్త భవనం కావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు ఆమె రెండు ఆప్షన్ లను ప్రభుత్వం ముందు పెడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారికి లేఖ కూడా రాశారు. ఇపుడున్న పార్లమెంటు కాంప్లెక్స్…

కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల మద్దతు

కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లుగా కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల నుండి మద్దతు వస్తోంది. బి.జె.పి సైద్ధాంతిక మార్గదర్శక సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్ సైతం కీర్తి ఆజాద్ విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎం.పిని మొదట వివరణ కోరుతూ షో-కాజ్ నోటీసు ఇవ్వకుండా ఎకాఎకిన సస్పెండ్ చెయ్యడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. చూడబోతే ఏ‌ఏ‌పి ఒత్తిడికి తలొగ్గి ఆదరాబాదరాగా కీర్తి ఆజాద్ ను సస్పెండ్…

డి‌డి‌సి‌ఏ స్కాం: అబ్బే పిచ్ లో స్వల్ప మార్పులు!

Keshav strikes again! డి‌డి‌సి‌ఏ స్కాంలో తన అవినీతిని అరుణ్ జైట్లీ ఎలా సమర్ధించుకుంటున్నారో ఈ కార్టూన్ విశ్లేషిస్తున్నది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో కొన్ని భాగాల్ని ఆధునికరించడానికి 24 కోట్ల అంచనాతో కాంట్రాక్టు అప్పగించగా పనులు ముగిసే నాటికి 114 కోట్లు చెల్లించడం ప్రధాన కుంభకోణం. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ మునిసిపాలిటీ అనుమతి లేకుండానే కొన్ని బాక్స్ లను నిర్మించారు. స్టేడియం స్ధలంలో అక్రమ నిర్మాణాలు చేసి వాటిని అక్రమంగా లీజులకి ఇచ్చేశారు. అదనంగా…

జైట్లీ విచారణకు హాకీ ఫెడ్ మాజీ అధికారి డిమాండ్

అరుణ్ జైట్లీ బీరువాలో దాచిపెట్టిన అవినీతి కంకాళాలు ఒక్కొక్కటిగా బైటికి వస్తున్నాయి. ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జైట్లీ సాగించిన అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్లు ఓ పక్క మిన్నంటుతుండగా మరో పక్క హాకీ ఇండియా ఫెడరేషన్ బోర్డు సభ్యుడుగా ఆయన పాల్పడిన అవినీతిaపై కూడా విచారణ చేయాలంటూ డిమాండ్లు చేసే గొంతులు పెరుగుతున్నాయి. ఈసారి ఏకంగా హాకీ ఫెడరేషన్ మాజీ అధికారి స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాస్తూ…

జైట్లీకి కీర్తి ఆజాద్ 52 ప్రశ్నలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైట్లీ అవినీతిపై 5 ప్రశ్నలతో సరిపెడితే బి.జె.పి ఎం.పి కీర్తి ఆజాద్ ఏకంగా 52 ప్రశ్నలను సంధించారు. సోమవారం మాజీ టెస్ట్ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కీర్తి ఆజాద్, ఒక వ్యక్తిపై ఎక్కుపెట్టిన దాడి కాదని చెబుతూనే జైట్లీకి 52 ప్రశ్నాస్త్రాలను సంధించాడు. ప్రశ్నలను సంధించడంతోనే కీర్తి ఆజాద్ సరిపెట్టుకోలేదు. Wikileaks4India అనే వెబ్ సైట్, సన్ స్టార్ అనే పత్రికా విడుదల…

రాజీనామా చేయమని జైట్లీకి మోడి సంకేతం?!

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డి‌డి‌సి‌ఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా? బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. “ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం…

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

డి‌డి‌సి‌ఏ-జైట్లీ అవినీతి ఇదే!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ)…

ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ…

నేషనల్ హెరాల్డ్ కధా కమామీషు!

‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ…

చెన్నై వరదలు: ఇదీ అమ్మ సాయం! -కార్టూన్

తమిళనాట వ్యక్తి పూజ జాస్తి. అభిమాన నటుడికి గుడి కట్టి పూజించేవరకూ ‘వ్యక్తి పూజ’ వెళ్తుందని తమిళులు ఇప్పటికే అనేక తడవలు చాటుకున్నారు. ‘అమ్మ పూజ’ ఇప్పుడు అన్ని పాత రికార్డులను దాటుకుని విపరీత స్దాయికి చేరుకుందని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. ‘అమ్మ పూజ’ ఎంత వికృత స్ధాయికి చేరిందో చెన్నై వరదలు వెల్లడి చేశాయి. ‘అమ్మ’కి జైలు శిక్ష పడినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ సహా మంత్రివర్గం మొత్తం టి.వి కెమెరాల ముందు కుమిలి…

హర్యానాలో మరో దాద్రి!

ఆవును చంపి తిన్నారని ఆరోపిస్తూ మతోన్మాద మూకలు దాద్రి (ఉత్తర ప్రదేశ్) లో ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని చంపిన ఘటనపై పార్లమెంటులో, దేశం అంతటా చర్చ జరుగుతుండగానే బి.జె.పి పాలిత హర్యానా రాష్ట్రంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాధితులకు ప్రాణాలు దక్కడం ఒక్కటే తేడా. హర్యానా రాష్ట్రం, పాల్వాల్ లో గురువారం జరిగిన ఘటనలో ఆవు మాంసం తరలిస్తున్నారన్న ఆరోపణతో ఒక వ్యాన్ డ్రైవర్, సహాయకుడిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు.…

అనుపమ్ ఖేర్ తిక్క లాజిక్!

అనుపమ్ ఖేర్ తో సహా హిందూత్వ (హిందూ మతావలంబకులు కాదు) గణాలు చెబుతున్న మాట, అమీర్ ఖాన్ దేశాన్ని అవమానించాడని. తన (భార్య) వ్యాఖ్యల ద్వారా అమీర్ కుటుంబం దేశం పరువు తీశారని, సిగ్గుపడేలా చేశారని విమర్శించారు. విచిత్రం ఏమిటంటే ఒక పక్క అమీర్ ఖాన్ భార్య అన్న మాటల్ని తప్పు పడుతూనే మరో పక్క ఆ మాటలు ఖండించే హక్కు మాకూ ఉందని వాదనలు చేయడం. ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. అమీర్ ఖాన్ భార్య…

కాస్త అసహనం ఉన్నది నిజమే -వెంకయ్య

‘ఎక్కడ అసహనం, ఆయ్?’ అని దబాయించిన వారికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు సమాధానం ఇచ్చారు. అసహనంపై రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన “మన సమాజంలో ‘కొంత మొత్తంలో’ అసహనం ఉన్నమాట నిజమే. దానిని గుర్తించి దానితో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది” అని వెంకయ్య అంగీకరించారు. తన ఒప్పుకోలు -పాక్షికంగానే అయినా- ద్వారా  ఆయన దేశంలో అసహనమే లేదు పొమ్మని నిరాకరించిన హిందూత్వ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు.…