హర్యానాలో మరో దాద్రి!

ఆవును చంపి తిన్నారని ఆరోపిస్తూ మతోన్మాద మూకలు దాద్రి (ఉత్తర ప్రదేశ్) లో ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని చంపిన ఘటనపై పార్లమెంటులో, దేశం అంతటా చర్చ జరుగుతుండగానే బి.జె.పి పాలిత హర్యానా రాష్ట్రంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాధితులకు ప్రాణాలు దక్కడం ఒక్కటే తేడా. హర్యానా రాష్ట్రం, పాల్వాల్ లో గురువారం జరిగిన ఘటనలో ఆవు మాంసం తరలిస్తున్నారన్న ఆరోపణతో ఒక వ్యాన్ డ్రైవర్, సహాయకుడిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు.…

అనుపమ్ ఖేర్ తిక్క లాజిక్!

అనుపమ్ ఖేర్ తో సహా హిందూత్వ (హిందూ మతావలంబకులు కాదు) గణాలు చెబుతున్న మాట, అమీర్ ఖాన్ దేశాన్ని అవమానించాడని. తన (భార్య) వ్యాఖ్యల ద్వారా అమీర్ కుటుంబం దేశం పరువు తీశారని, సిగ్గుపడేలా చేశారని విమర్శించారు. విచిత్రం ఏమిటంటే ఒక పక్క అమీర్ ఖాన్ భార్య అన్న మాటల్ని తప్పు పడుతూనే మరో పక్క ఆ మాటలు ఖండించే హక్కు మాకూ ఉందని వాదనలు చేయడం. ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. అమీర్ ఖాన్ భార్య…

కాస్త అసహనం ఉన్నది నిజమే -వెంకయ్య

‘ఎక్కడ అసహనం, ఆయ్?’ అని దబాయించిన వారికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు సమాధానం ఇచ్చారు. అసహనంపై రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన “మన సమాజంలో ‘కొంత మొత్తంలో’ అసహనం ఉన్నమాట నిజమే. దానిని గుర్తించి దానితో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది” అని వెంకయ్య అంగీకరించారు. తన ఒప్పుకోలు -పాక్షికంగానే అయినా- ద్వారా  ఆయన దేశంలో అసహనమే లేదు పొమ్మని నిరాకరించిన హిందూత్వ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు.…

లౌకికవాదం మరియు రాజ్యాంగం -ది హిందు ఎడిట్..

[‘Secularism and the Constitution’ శీర్షికన నవంబర్ 30 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] ************ దేశంలో సహనం లేదా సహన రాహిత్యంపై  ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయమై ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు (తమదంటూ) ఓ స్పష్టతను చేర్చాలని భావించబడుతోంది. కానీ ఈ అంశాన్ని చేపట్టక మునుపే బిజెపి నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం, రాజ్యాంగం ప్రబోధించిన విలువలను ఈ రోజు ఏ మేరకు అర్ధం చేసుకున్నారన్న అంశంపై చర్చ…

మేము దేశం వదిలి వెళ్ళేది లేదు -అమీర్ ఖాన్

రామ్ నాధ్ గోయెంకా జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవంలో అమీర్ ఖాన్ చెప్పిన మాటలపై రేగిన రగడ కొనసాగుతోంది. కేంద్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి ఖండన మండనలు జారీ చేస్తూ అమీర్ ప్రకటనకు పెడార్ధాలు తీస్తున్న నేపధ్యంలో అమీర్ ఖాన్ మరోసారి స్పందించాడు. తాను చెప్పిందేమిటో పూర్తిగా చదివి మాట్లాడాలని కోరారు. తనకు గానీ, తన భార్యకు గానీ భారత దేశం వదిలి వెళ్ళే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. తప్పుడు అర్ధాలు తీస్తున్నవారు తాను చెప్పిందేమిటో…

భళా అరుణ్ కె. సింగ్!

బ్రిటన్ కేంద్రంగా పని చేసే బహుళజాతి మీడియా కార్పొరేట్ సంస్ధ రాయిటర్స్ ఈ రోజు ఓ వార్తా కధనాన్ని ప్రచురించింది. మోడి పాలనలో ఇండియాను సందర్శించే అమెరికా అధికారుల పరిస్ధితి ఏమిటో విశ్లేషించడానికి ప్రయత్నించిన కధనం అది. భారత రాయబారి దేవయాని ఖోబ్రగాదేను అక్రమంగా అరెస్టు చేసి జైలుపాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో తేడా ఏమన్నా వచ్చిందా అని ఈ కధనం విశ్లేషించేందుకు ప్రయత్నించింది. దేవయాని ఖోబ్రగాదే వ్యవహారం గురించి మర్చిపోతే గనక…

మద్యపానం: కనీస వయసు తగ్గించిన బి.జె.పి ప్రభుత్వం

వ్యాపారాలు చేసుకోవడానికి బ్రహ్మాండమైన సానుకూల వాతావరణం ఏర్పరుస్తామని ఎన్నికలకు ముందు బి.జె.పి వాగ్దానం చేసింది. ఆ సంగతి చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడి దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. గతంలో ఏ ప్రధానీ తిరగనన్ని దేశాలు అతి తక్కువ కాలంలోనే పర్యటిస్తూ ఆయన కొత్త రికార్డుల్ని స్ధాపిస్తున్నారు కూడా. ఇలా వ్యాపారులకు సంపూర్ణ సహకారం ఇవ్వడంలో బి.జె.పి ఏలుబడిలోకి వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు పాత్రను ఘనంగా పోషిస్తున్నాయి. ముంబై నగరపు ఉత్సాహకరమైన రాత్రి…

పొన్ను కర్రా, మోడి షా కోటను కూల్చునది? -కార్టూన్

బీహార్ ఎన్నికల ఫలితాలు బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలకు గట్టి షాకే ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటమి ఎరగని జగజ్జేతగా హిందూత్వ గణాల చేత అదే పనిగా పొగడ్తలు అందుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడి మొఖంపై నెత్తురు చుక్క లేకుండా చేశాయి. పాచిక విసిరితే తిరుగే ఉండని గొప్ప వ్యూహకర్తగా మన్ననలు అందుకుంటున్న అమిత్ షా అవాక్కై నెత్తి గోక్కునేలా చేశాయి. పుండు మీద కారం అన్నట్లుగా ఇప్పుడు నితీశ్ కుమార్ జాతీయ స్ధాయిలో మోడిని…

బి.జె.పి భారీ సమీక్ష -ది హిందు సంపాదకీయం

(నవంబర్ 14 తేదీన ‘ది హిందు’ పత్రిక ప్రచురించిన “BJP’s larger stock-taking” సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.) భారతీయ జనతా పార్టీ ప్రస్తుత నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ వృద్ధ నాయకులు చేసిన దాడి శబ్దరహిత మధనాన్ని పార్టీపై రుద్దడం కొనసాగుతోంది. అది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందన్నదే ఇంకా స్పష్టం కాలేదు. బుధవారం నలుగురు బి.జె.పి పెద్దలు -ఎల్.కె.అద్వానీ, ఎం.ఎం.జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హా- బీహార్ లో పార్టీ ఓటమికి ప్రధాన…

వ్యాపం: సమాచారాన్ని తొక్కిపెట్టిన సి.ఎం చౌహాన్

సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో హడావుడిగా సి.బి.ఐ విచారణను కోరి ‘ఆ క్రెడిట్ నాదే’ అని చెప్పుకుంటున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండారం క్రమంగా బయిటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా మధ్య ప్రదేశ్ శాసన సభకు నాయకత్వం వహించే చౌహాన్ తన శాఖలో జరిగిన కుంభకోణం గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అసలు కుంభకోణాన్ని వెలికి తీసిందే తానని డంబాలు పలుకుతున్న చౌహాన్ సభను తప్పుదారి…

వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2

మొదటి భాగం తరువాత…… . సాక్షులు, నిందితుల హత్యలు కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. సాక్షులను మాయం చేస్తే కేసు అనుకున్న విధంగా తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. కానీ వ్యాపం కుంభకోణంలోని సాక్షులు, నిందితులు ఇరువురూ డజన్ల సంఖ్యలో అనుమానాస్పద రీతిలో మరణించడం -కనీసం సమీప గతంలో- ఎన్నడూ ఎరుగనిది. సంఘటిత నేరస్ధ ముఠాలు పధకం ప్రకారం పని చేస్తే తప్ప ఇలాంటి మరణాలు సాధ్యం కావు. అత్యున్నత స్ధాయిలో ఉన్న సాక్షులు,…

వ్యాపం దర్యాప్తు ముగుస్తోందిట! -కార్టూన్

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్: దర్యాప్తు ఇక ముగింపుకు వస్తోంది! ****************** ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’ అన్నది మధ్య ప్రదేశ్ లో వివిధ కోర్సులకు, ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో ఎం.పి.పి.ఇ.బి గా దీన్ని పిలుస్తారు. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ, టీచింగ్, పోలీస్ తదితర కోర్సులు, ఉద్యోగాల అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని. ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు…

వ్యాపం స్కాం విచారణ -ది హిందు ఎడిటోరియల్

[జులై 4 తేదీన ది హిందు పత్రిక ‘The Vyapam scam trail’ శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] మధ్య ప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం 2007 సంవత్సరం నాటిది. 2013లో కొన్ని వివరాలు వెలుగు చూసిన తర్వాతనే కుంభకోణంపై నేర పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (వ్యవసాయిక్ పరీక్షా మండల్ లేదా వ్యాపం) కు చెందిన అధికారులు వివిధ కోర్సులకు జరిగే అర్హత పరీక్షలను, ఉద్యోగాల నియామకాలను 6 సంవత్సరాలుగా…

‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్

చూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కార్టూన్ లో లోతైన అర్ధం దాగి ఉంది. ప్రధాన మంత్రి పదవి లాంటి ముళ్ళ కుర్చీని యోగాసనాల సహాయంతో నరేంద్ర మోడి అవలీలగా నిర్వహిస్తున్నారని ఈ కార్టూన్ చెబుతున్నట్లు మొదటి చూపులో అనిపిస్తుంది. కానీ ‘డెవిల్ ఇన్ ద డీటైల్స్’ అన్నట్లుగా కార్టూన్ అంతరార్ధం అంతా ఆ నాలుగు పదాల కార్టూన్ వ్యాఖ్యానంలో దాగి ఉంది. ఆ నాలుగు పదాల వ్యాఖ్య: THE YOGA OF POLITICS: ఏమిటి ఈ వ్యాఖ్య…

హవాలా స్కాంలో నేను రాజీనామా చేశా -అద్వానీ

బి.జె.పి పితామహుడు మనసులో మాట కక్కేశారు. లలిత్ మోడి అవినీతి కుంభకోణం నుండి బైటపడే మార్గం ఏమిటో తన పార్టీ నాయకులకు చూపారు. వివిధ అవినీతి మరియు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితర బి.జె.పి మంత్రులు తక్షణమే తొక్కవలసిన బాట ఏమిటో ఆయన స్పష్టంగా చూపారు. వీరందరికీ మార్గం చూపడం అంటే…