మాకూ హక్కుంది

——రచన: రమాసుందరి 10/12/2013. వరండాలో, వాలు కుర్చీలో… శూన్యానికి చూపులు వేలాడదీసి అంతర్ముఖులైన మీ ఆలోచనల ఆనవాళ్లను మమ్మల్ని స్పృజించనివ్వండి యౌవనాశ్వానికి ముకుతాడు బిగించి విముక్తి బాటపై దౌడు తీయించిన ఉద్విగ్న జ్నాపకాలా? కష్టకాలంలో కంటికి రెప్పలైన ప్రేమమూర్తుల కారుణ్య రూపాలా? ఉద్యమాల అలజడులే జీవితం ఐనందుకు దరిచేరని వ్యష్టితత్వం ఆస్తుల్ని పెంచనందుకు విస్మృత కుటుంబాన్ని శిధిల గతంలో ఏరుకుంటున్నారా? మసకబారిన కంటిచూపు తొట్రుపడుతున్న గంభీర స్వరం మీ మెదడు పదును తగ్గించలేదు సుమా! శిశిర వృక్షాలకు…

జనం చస్తే మాకేం? నాగాలాండ్ లో AFSPA పొడిగింపు

నాగాలాండ్ ప్రజలు ఏమి కోరుకున్నా తాము మాత్రం తాము అనుకున్నదే అమలు చేస్తామని మోడి ప్రభుత్వం చాటి చెప్పింది. రాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వ విచక్షణపై నాగాలాండ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం పటాపంచలైంది. నాగాలాండ్ రాష్ట్రంలో AFSPA చట్టం అమలు చేయాల్సిన అవసరం…

మోడీ కుట్ర విప్పి చెప్పిన సాహసికి లేఖ

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ. (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి) – హర్ష్ మందర్, IAS (తెలుగు: ఎన్ వేణుగోపాల్) ప్రియమైన సంజీవ్, ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి…

జులియన్ అసాంజేని అమెరికికాకు ఇచ్చేస్తారట! -కార్టూన్

బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది. అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది. డిప్లొమాటిక్ కేబుల్స్ తో…

నాగాలాండ్ కూలీల హత్య: పార్లమెంటును తప్పుదారి పట్టించిన హోం మంత్రి?

14 మంది నాగాలాండ్ కూలీలను భారత భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయంలో హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కూలీలు వారు ప్రయాణిస్తున్న వాహనంలో భద్రతా బలగాల సంకేతాలను లెక్క చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనే సైనికులు కాల్పులు జరపవలసి వచ్చిందని మంత్రి రాజ్య సభలో చెప్పారు. దుర్ఘటనలో ప్రాణాలతో బైటపడిన కూలీలు చెబుతున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి…

రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…

మహిళలు ఒకరి సొంత ఆస్తి కాదు! -తాలిబాన్ డిక్రీ

ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త! మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. “స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ…

చనిపోయిన రైతుల లెక్కల్లేవు, పరిహారం ఇవ్వలేం -కేంద్రం

మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల దీన పరిస్ధితితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. తమ నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఏడాది పాటు చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో నానుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనడం వలన అర్ధాంతరంగా చనిపోయిన రైతులకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేనందున వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే తలెత్తదని స్పష్టం చేసింది. అసలు కనీస తర్కం కూడా…

ఎం‌ఎస్‌పి గ్యారంటీ కోసం ఆందోళన కొనసాగుతుంది -రైతు సంఘాలు

ఇతర ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆపాలజీ వల్ల తమ డిమాండ్లు నెరవేరవనీ, క్షమాపణ కోరడానికి బదులు ‘కనీస మద్దతు ధర’ (Minimum Support Price) ను గ్యారంటీ చేసేందుకు చట్టం తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. “మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు” అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల్లో ఒకరు, బి‌కే‌యూ నాయకులూ అయిన రాకేశ్ తికాయత్ స్పష్టం చేశాడు. నరేంద్ర…

క్షమించండి! వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తాను! -మోడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల వంచాడు. కాదు, కాదు. భారత రైతులే ఆయన తల వంచారు. మోడి నేతృత్వం లోని బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు సంవత్సర కాలంగా ఎండనకా, వాననకా జాతీయ రహదారులపై ఆందోళన చేస్తున్న రైతాంగం ఎట్టకేలకు అపూర్వ విజయం సాధించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టినాక కూడా పత్రికలతో ఏనాడూ మాట్లాడి…

కంగనా రనౌత్ తెలిసి మాట్లాడతారా లేక…!?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మరో వివాదంలో కేంద్ర బిందువుగా నిలిచారు. ఏకంగా భారత దేశ స్వాతత్ర్య దినం పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఆర్ణబ్ గోస్వామి కేకలకు, పెడబొబ్బలకు గతంలో అవకాశం ఇచ్చిన టైమ్స్ నౌ చానెల్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.కొందరు బి‌జే‌పి నేతలు కూడా ఆమె అవగాహనా రాహిత్యాన్ని తిట్టిపోస్తున్నారు. గురువారం జరిగిన ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం…

రక్షణ మంత్రి గారూ మీరు చెప్పింది నిజం కాదు. ఇదిగో సాక్ష్యం!

భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆర్‌ఎస్‌ఎస్-బి‌జే‌పి సంస్ధల తరపున, జరిగిన చరిత్రను తిరగ రాసే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడి మంత్రివర్గంలో కాస్తంత మౌనంగా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల ప్రచారాలకు, అబద్ధపు ఉల్లేఖనలకు దూరంగా ఉన్నట్లు కనిపించే ఆయన తాను సెపరేట్ కాదనీ, ఆ తానులో ముక్కనేనని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ పితామహుల్లో ఒకరైన వీర సావర్కార్ భారత దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి కృషి చేసిన తొలి తరం యువకుల్లో ఒకరు.…

లఖింపూర్ ఖేరా హత్యాకాండ: హత్యకేసు ఇలాగే విచారిస్తారా?

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం తలంటు పోసింది. పోలీసులు విచారణ సాగిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం “మాటలు చెప్పడం వరకే పరిమితం అయింది. చేతల్లో చూపడం లేదు” అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పరుషంగా వ్యాఖ్యానించారు. “రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల మేము సంతృప్తి చెందలేదు” అని ఆయన కుండ బద్దలు కొట్టారు. మోడి కేబినెట్ లోని సహాయ మంత్రి, బి‌జే‌పి…

అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు

తాలిబాన్ పాలనపై అమెరికా పాల్పడుతున్న ప్రతీకార చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఆఫ్ఘన్ దేశానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు రిజర్వు నిధులను కూడా అందకుండా నిషేధం విధించడంతో ఉన్నత స్ధాయీ ప్రభుత్వాధికారుల నుండి అత్యంత కడపటి పౌరుడు సైతం తిండికి, ఇతర కనీస సౌకర్యాలకు కటకటలాడుతున్నారు. తాలిబాన్ డబ్బు సమస్య ప్రధానంగా అమెరికా ట్రెజరీ విభాగం స్తంభింపజేసిన ఆఫ్ఘన్…

జింబాబ్వేలో మిలట్రీ కుట్ర: ముగాబే హౌస్ అరెస్ట్!

పశ్చిమ సామ్రాజ్యవాదులు మరోసారి ప్రచ్చన్న యుద్ధం నాటి మిలట్రీ కుట్రలకు తెర తీశారు. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (97) ను, ఆయన కుటుంబాన్ని ఆ దేశ మిలట్రీ గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో సైనికులు కవాతు తొక్కుతున్నారు. పలు ప్రభుత్వ భవనాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆఫీసులకు వెళ్లకుండా రోడ్లపైనే ఆపి వెనక్కి పంపేశారు. “దేశాధ్యక్షుడు క్షేమమే” అంటూ మొదట ప్రకటించిన సైన్యం ఆ తర్వాత ఆధికారాలను చేపట్టినట్లు ప్రకటించింది.…