క్లుప్తంగా… 09/06/2016

చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్ రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్ చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బ్రిటన్ సెంట్రల్/రిజర్వ్ బ్యాంక్) మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్ చేసిన హెచ్చరిక! “భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ తమ విదేశీ ఆస్తులు అన్నీ అమెరికాపైనే ఆధారపడి ఉండటం చైనా తదితర…

క్లుప్తంగా …8/6/2016

తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! పోరాటం కొనసాగుతుంది -శాండర్స్ సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు కేరళను తాకిన నైరుతి ఋతుపవనం రాజన్ భారతీయుడే -ఆర్‌బి‌ఐ తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ…

క్లుప్తంగా… 9/4/15

మూడు దేశాల పర్యటనకు మోడి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు మూడు పశ్చిమ దేశాల పర్యటనకు పయనమై వెళ్లారు. మొదటి విడతగా ఫ్రాన్స్ లో నాలుగు రోజులు పర్యటించే ప్రధాని అనంతరం మూడు రోజుల పాటు ఏంజెలా మెర్కల్ అతిధిగా జర్మనీ పర్యటిస్తారు. తదనంతరం ప్రధాని కెనడా సందర్శించడం ఒక విశేషం. భారత ప్రధాన మంత్రులు కెనడా వెళ్ళడం చాలా తక్కువ. వెళ్తే రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, వారి కుటుంబ సభ్యులు వెల్లడమే గానీ…

క్లుప్తంగా… 8/4/15

గుజరాత్ లో ముస్లిం తరిమివేత హిందూత్వ కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న వార్తలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో భావనగర్ జిల్లాలోని ఒక చోట 60 హిందూ కుటుంబాల మధ్య నివశిస్తున్న ఒకే ఒక్క ముస్లిం కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా తన్ని తగలేశారు. ముస్లిం కుటుంబాన్ని బలవంతంగా తరిమి కొట్టాలని గత సం. ఏప్రిల్ లో హిందూత్వ గణానికి ఉద్భోదించిన కేసులో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఇప్పటికీ కోర్టు, ఎలక్షన్ కమిషన్…

క్లుప్తంగా… 21.11.2013

అమెరికా-ఆఫ్ఘన్ ఒప్పందం కుదిరింది ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ను దారికి తెచ్చుకోడంలో అమెరికా సఫలం అయింది. 2024 వరకు అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ఒక అంగీకారం కుదిరిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించాడు. గత 24 గంటల్లో జాన్ కెర్రీ రెండు సార్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ కు ఫోన్ చేశారని, కర్జాయ్ అనుమానాలను కెర్రీ నివృత్తి చేసిన ఫలితంగా ఒప్పందం సాధ్యమయిందని తెలుస్తోంది. అమెరికా…

ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013

అమెరికాలో యు.పి మంత్రి డిటెన్షన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘కుంభమేళా’ గురించి వివరించడానికి యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమెరికా వెళ్ళాడు. ఆయనకి తోడుగా వెళ్ళిన ఆ రాష్ట్ర మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనకి రాయబార హోదా ఉన్నప్పటికీ ‘మరింతగా ప్రశ్నించడానికి’ మంత్రిని పది నిమిషాల సేపు నిర్బంధించారని ది హిందు తెలిపింది. తాను ముస్లిం అయినందునే అక్రమంగా…

క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య…

క్లుప్తంగా… 12.05.2012

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ -ఐ.ఐ.పి) మరో సారి నిరాశ కలిగించింది. మార్చి 2012 నెలలో పెరగకపోగా తగ్గిపోయింది. -3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, రూపాయి…

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్…

క్లుప్తంగా… 10.05.2012

జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం పాకిస్ధాన్ మైనారిటీలను కాపాడండి -విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ అణచివేతపై ‘గాంధీ మార్గం’లో తిరుగుబాటు చేస్తున్న పాలస్టీనియన్లు   జాతీయం జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం జీన్స్, టీ షర్ట్ లు అసభ్య దుస్తులనీ వాటిని వేసుకొని ఆఫీసుకి రావద్దని హర్యానా ‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ’ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నా అందుకు…

క్లుప్తంగా… 09.05.2012

జాతీయం పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు…

క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

క్లుప్తంగా… 07.05.2012

జాతీయం మోడిని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చు -అమికస్ క్యూరీ 2002 గుజరాత్ మారణకాండ కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయదగ్గ సాక్ష్యాలున్నాయని సుప్రీం కోర్టు నియమించిన ‘అమికస్ క్యూరీ’ (కోర్టు సహాయకుడు) రాజు రామచంద్రన్ కోర్టుకి తెలియజేశాడు. ఇరు మతాల ప్రజల మధ్య ‘శతృత్వాన్ని ప్రోత్సహించినందుకు’ గాను మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ అల్లర్లపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటయింది. దశాబ్దం…

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి…