గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

ఢిల్లీలో రైతు ఆత్మహత్య, పాలకుల మొసలి కన్నీళ్లు -ఫోటోలు

బుధవారం ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన కిసాన్ ర్యాలీ సందర్భంగా రాజస్ధాన్ నుండి వచ్చిన రైతు (గజేంద్ర సింగ్) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య లేఖ రాసి మరీ చనిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నెపాన్ని ఢిల్లీ ప్రభుత్వం పైకి నేట్టేందుకు చట్ట సభల సాక్షిగా ఆసక్తి ప్రదర్శించింది. కాగా అనంతరం జరిగిన, జరుతున్న తంతు ఈ దేశ పాలకవర్గాల కపటత్వాన్ని పచ్చిగా వెల్లడి చేసింది. భారత దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త కాదు. కాంగ్రెస్, టి.డి.పి, బి.జె.పి,…

పనికి(మాలిన)రాని కీచులాట! -కార్టూన్

రైతుల సమస్యల పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలు ఇరువురికీ చిత్తశుద్ధి కొరవడిందని శక్తివంతంగా చెబుతున్న కార్టూన్ ఇది. రాహుల్ గాంధీ తన పునరాగమనానికి భూసేకరణ చట్టం – 2013 కు మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఆలంబనగా చేసుకున్నారు. తాము రైతులకు అనుకూలమైన చట్టం తెస్తే మోడి దానికి చిల్లులు పొడుస్తున్నారని ఆయన ఆక్రందన! విచిత్రంగా బి.జె.పి, మోడిలు సైతం తమ సవరణలు రైతుల కోసమే అని చెబుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని తమ సవరణలపై దుష్ప్రచారం చేస్తున్నారని…

భూతద్దం పరిశీలనలో గూగుల్ -ది హిందు ఎడిట్..

అయిదేళ్ళ పాటు కొనసాగిన ప్రక్రియ అనంతరం, గూగుల్ కంపెనీ అనుచిత (వ్యాపార) పద్ధతులను పాటిస్తున్న ఆరోపణలపై విచారణ చేయనున్నట్లు యూరోపియన్ కమిషన్ లాంఛనంగా ప్రకటించింది. యూరప్ లో ఇంటర్నెట్ శోధన సేవల మార్కెట్ లో తనకున్న గుత్తస్వామ్యాన్ని తన స్వార్ధ ప్రయోజనాలకు గూగుల్ కంపెనీ వాడుకుంటోందన్నది ఆరోపణ. ప్రధాన ఆరోపణల్లో ఒకటి, గూగుల్ లో పోలిక కొనుగోళ్ళ (comparison shopping) పని పద్ధతికి సంబంధించినది. ‘ఉత్పత్తుల పోలిక కొనుగోలు’ విధానం, వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ వెబ్…

కోకోకోలాపై పెరుందురై ప్రజల విజయం

ప్రజలు ఎక్కడ తిరగబడుతున్నారు అని ప్రశ్నిస్తున్న అమాయక బుద్ధి జీవులకు తమిళనాడులోని పెరుందురై ప్రజలు సమయానుకూల సమాధానం ఇచ్చారు. నీటి వనరులను పీల్చి పంటల్ని పిప్పి చేసే కోకోకోలా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడడంతో కోకోకోలాకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కోకోకోలాకు భూములపై ఇచ్చిన లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పెరుందురై ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక సంస్ధ…

రాహుల్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

[ఏప్రిల్ 21 తేదీన ది హిందూలో ప్రచురించిన ‘Return of Rahul’ సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] దాదాపు రెండు నెలల పాటు సెలవు రాహుల్ గాంధీ సెలవులో వెళ్లిపోవడం సరైన సమయంలో జరిగిన పరిణామమో ఏమో గానీ ఆదివారం నాడు ఢిల్లీలో భూ సేకరణ చట్టం (సవరణలు) కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత చురుకైన ప్రతిపక్షంగా నిలబెట్టినట్లు కనిపిస్తోంది. నిరసనలకు ప్రారంభ ఊపు ఇచ్చింది రైతుల గ్రూపులు, పౌర…

రైతుల భూములపై రాహుల్ కి అంత ప్రేమ ఏల? -కార్టూన్

రాహుల్ గాంధీ సెలవు కాలం ముగించుకుని కలుగులోంచి వెలికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రైతుల (కోసం) ర్యాలీ నిర్వహించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు (లేదా చాటానని ఆయన అనుకున్నారు). ఆయన మాట్లాడినంత సేపూ జనం (ఎలాగో) ఉన్నారని, ఆయన ముగించి సోనియా గాంధీ మాట్లాడడం ప్రారంభించగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారని పత్రికలు గుస గుస రాశాయి. పునరాగమనం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన నిప్పులు…

చైనా రియల్ రాబందుల భూదాహానికి ప్రతిఘటన ఈ మేకు ఇళ్ళు -ఫోటోలు

చైనా అత్యంత వేగంగా అమెరికా జి.డి.పి పరిమాణాన్ని సమీపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వార్షిక జి.డి.పి 16.8 ట్రిలియన్ డాలర్లు ఉంటే చైనా జి.డి.పి 9.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మూడేళ్ళ క్రితం జపాన్ ను మూడో స్ధానానికి నెట్టి రెండో స్ధానానికి చేరేనాటికి చైనా జి.డి.పి 4.5 ట్రిలియన్లు. ఇప్పుడు అంతకు అంతా జి.డి.పి ని పెంచుకుని అమెరికాని వెనక్కి నేట్టేందుకు దూసుకుపోతోంది. చైనా విశృంఖల అభివృద్ధిలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.…

అంబేద్కర్ విగ్రహ పూజా పందెం -కార్టూన్

ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకైనా తెగించేలా చేస్తాయి. రాజకీయ, ఆర్ధిక అవినీతికి వ్యతిరేకంగా జన్మించిన పార్టీ ఎఎపి. ఆ పార్టీ కూడా గెలవడం కోసం తన స్ధాపనా సూత్రాలను కూడా వదిలిపెట్టి అభ్యర్ధులను నిలబెట్టిందని మాజీ అన్నా బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్ బహిరంగంగా పత్రికలకు ఎక్కవలసిన పరిస్ధితి! అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ గా జరిపేందుకు కాంగ్రెస్, బి.జె.పి లు శాయశక్తుల ఎలా కృషి చేస్తున్నాయో మొన్నటి ది హిందు సంపాదకీయం “Admiration…

ఎన్ కౌంటర్లు ఎందుకు చట్టవిరుద్ధం?

‘నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తా’ ఇది పోలీసు సినిమాల్లో తరచుగా వినపడే పదం. ఎన్ కౌంటర్ చేయడాన్ని వీరోచితకార్యంగా సినిమాలు వాడుకలోకి తెచ్చాయి. ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’ అనే బిరుదు కొందరు పోలీసులకు పత్రికలు తగిలించడం మొదలై చాలాకాలమే అయింది. వీటన్నింటి మూలంగా ఎన్ కౌంటర్ చెయ్యడం పోలీసుల విధి, కర్తవ్యం, బాధ్యత… ఇత్యాదిలాగా పరిస్ధితి తయారయింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దాదాపు పోలీసులు, సైన్యంలకు ఆధిపత్యం అప్పగించి పాలన సాగించే ప్రతి చోటా ఈ…

అనుసరణ లేని ఆరాధన -ది హిందు ఎడిటోరియల్

రాజకీయ శాస్త్రవేత్త, ఆర్ధికవేత్త, న్యాయ నిపుణులు, సామాజిక సంస్కరణవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, ఓ పురుష నేత (a leader of men): డా. బి.ఆర్.అంబేద్కర్  వైవిధ్యభరిత ఆసక్తులతో, బహుళముఖ వ్యక్తిత్వంతో వర్గీకరణవాద మరియు విభజనవాద ప్రయత్నాలను ధిక్కరిస్తారు. అయితే పేద, బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించేందుకు ఒంటి చేతితో కృషి చేయడం ద్వారా ఆయన తన జీవితకాలంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా, జీవితానంతర దశాబ్దాలలో జాతీయ ఆదర్శ ప్రతిమగా అవతరించారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో అనంతర…

పశ్చిమ అమెరికా కరువు విభ్రాంత దృశ్యం -ఫోటోలు

అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎప్పటిలాగానే లాభాలు నమోదు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం ముగిసిందని ప్రభుత్వాలు తీర్మానిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వృద్ధి రేటు కూడా పెరుగుద్దంటున్నారు. జనం మాత్రం కరువు బారిన పడి విలాపిస్తున్నారు. పశ్చిమ అమెరికా తీర రాష్ట్రాలను ఎన్నడూ ఎరగని కరువు పట్టి పీడిస్తోంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రమే కాదు, నెవాడా, ఆరిజోనా, ఉటా తదితర రాష్ట్రాలన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. ప్రతి యెడూ సాధారణంగా ఈ…

సత్యంకు పడింది పెద్ద శిక్షేనా? -కార్టూన్

రామలింగ రాజు సోదరులు, ఇతర పెద్ద మనుషులకు అవినీతికి పాల్పడినందుకు గాను హై కోర్టు శిక్షలు ప్రకటించింది. అత్యధికంగా 7 సం.ల జైలు శిక్ష + 5.5 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ శిక్షలను చూసి అందరూ సంతోషిస్తున్నారు. తగిన శిక్ష పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సత్యం కంపెనీ అధిపతి రామలింగ రాజు బృందం పాల్పడిన అవినీతికి పడిన శిక్ష మొత్తం కార్పొరేట్ అవినీతికి పడవలసిన శిక్షతో పోల్చితే ఎంత చిన్న దెబ్బతో సమానమో…

స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

ప్రశ్న: బోసుపై నెహ్రూ గూఢచర్యం; నేతాజీ మరణించారా?

ప్రశ్న (రవిచంద్ర): నేతాజీ మరణం నిజమేనా? ఆయన కుటుంబంపై మన ప్రభుత్వమే గూఢచర్యం నిర్వహించడం ఎందుకు? ఆయన దేశ భక్తుడు కారా? సమాధానం: యు.పి.ఏ, ఎన్.డి.ఏ ల కింద చేరిన పాలక వర్గ గ్రూపుల మధ్య వైరుధ్యం, వైరం కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నడో స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నాటి గూఢచార కార్యకలాపాలను పనిగట్టుకుని మరీ ఇప్పుడు వెల్లడి చేయడం, అది కూడా ఎంచుకున్నవి మాత్రమే వెల్లడి చేయడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా…