గ్రెక్సిట్: కార్మికవర్గ ఉద్యమాలు, మెటాక్సస్ నియంతృత్వం -5

4వ భాగం తరువాత…………………. 1929 నుండి ప్రబలంగా ఉనికిలోకి వచ్చిన ‘గ్రేట్ డిప్రెషన్’ రెండో ప్రపంచ యుద్ధానికి తగిన ఆర్ధిక భూమికను ఏర్పరిచింది. 2008 నాటి ‘గ్రేట్ రిసెషన్’ (ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం) లాగానే ఆనాటి ‘గ్రేట్ డిప్రెషన్’ కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం గమనించవలసిన విషయం. మొన్నటి గ్రేట్ రిసెషన్ వాల్ స్ట్రీట్ లోని బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ‘లేమాన్ బ్రదర్స్’ కుప్పకూలిన దరిమిలా ఉనికిలోకి రాగా ఆనాటి గ్రేట్ డిప్రెషన్ అమెరికా స్టాక్…

గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4

మూడో భాగం తరువాయి………………… – గ్రీసు పెట్టుబడిదారుల దుస్సాహసం 20వ శతాబ్దం ఆరంభంలో టర్కీ సామ్రాజ్యం బలహీనపడడం, మార్కెట్ల పంపిణీలో వైరుధ్యాలు తలెత్తిన ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య కుమ్ములాటలు తీవ్రం కావడంతో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తనను తాను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ బూర్జువాల మద్దతుతో టర్కీ ఆర్మీలోని రెండవ శ్రేణి సైనికాధికారులు ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ఆరంభించి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వారి చర్యలు టర్కీ జాతీయవాదాన్ని…

గ్రెక్సిట్: ఆంగ్లో-అమెరికన్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో పావు, గ్రీసు -3

రెండో భాగం తర్వాత…………………………. పశ్చిమ పెట్టుబడిదారీ వ్యవస్ధ గ్రీసును అభివృద్ధి చెందిన దేశంగా 1961 నుండి పరిగణిస్తోంది. (అభివృద్ధి చెందిన దేశాల క్లబ్ గా చెప్పే ఓ.ఇ.సి.డి కూటమిలో గ్రీసు సభ్య దేశం.) కానీ అక్కడి ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు ఎన్నడూ ఆ అభివృద్ధిని అనుభవించలేదు. ఆధునిక గ్రీసు చరిత్రను ప్రజల దృక్కోణంలో పరిశీలిస్తే పాలకవర్గాల అణచివేతలతో పాటు, ప్రజల తిరుగుబాటు పోరాటాలు కూడా సమృద్ధిగా కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ హిట్లర్…

గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2

మొదటి భాగం తరువాత……………… గ్రీసు అబద్ధాలు?! గ్రీసు 2001లో తన జాతీయ కరెన్సీ ‘డ్రాక్మా’ను రద్దు చేసుకుని ‘యూరో’ను స్వీకరించింది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘యూరో జోన్’ లో చేరింది. ఆనాటి గ్రీసు ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్ధితి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందని పశ్చిమ పత్రికలు, ఈ.యు, ఇ.సి.బి అధికారులు ఇప్పటికీ చెబుతారు. గ్రీసు దాచిపెట్టిన ఆర్ధిక సమస్యల వల్ల గ్రీసు అప్పు పెరుగుతూ పోయిందని, అది తడిసి…

గ్రెక్సిట్: జర్మనీ సామ్రాజ్యవాదం ఉక్కు కౌగిలిలో ఐరోపా -1

మొదటి భాగం………………. గత అయిదేళ్లుగా అంతర్జాతీయ స్ధాయిలో పతాక శీర్షికలలో నానుతున్న వార్త గ్రెక్సిట్! గత రెండేళ్లుగా గ్రెక్సిట్ వార్తల మధ్య వ్యవధి తగ్గుతూ వచ్చింది. ఈ యేడు జనవరిలో ‘రాడికల్ లెఫ్ట్’ గా పిలువపడుతున్న సిరిజా కూటమి అధికారం చేపట్టాక గ్రెక్సిట్ క్రమం తప్పని రోజువారీ వార్త అయింది. గ్రీక్ + ఎక్సిట్ కలిసి గ్రెక్సిట్ అయింది. ఎక్సిట్ అంటే బయటకు వెళ్లిపోవడం. గ్రీసు యూరో జోన్ నుండి బైటికి వెళ్లిపోయే పరిస్ధితులను గ్రెక్సిట్ అని…

వ్యాపం: సమాచారాన్ని తొక్కిపెట్టిన సి.ఎం చౌహాన్

సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో హడావుడిగా సి.బి.ఐ విచారణను కోరి ‘ఆ క్రెడిట్ నాదే’ అని చెప్పుకుంటున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండారం క్రమంగా బయిటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా మధ్య ప్రదేశ్ శాసన సభకు నాయకత్వం వహించే చౌహాన్ తన శాఖలో జరిగిన కుంభకోణం గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అసలు కుంభకోణాన్ని వెలికి తీసిందే తానని డంబాలు పలుకుతున్న చౌహాన్ సభను తప్పుదారి…

వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2

మొదటి భాగం తరువాత…… . సాక్షులు, నిందితుల హత్యలు కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. సాక్షులను మాయం చేస్తే కేసు అనుకున్న విధంగా తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. కానీ వ్యాపం కుంభకోణంలోని సాక్షులు, నిందితులు ఇరువురూ డజన్ల సంఖ్యలో అనుమానాస్పద రీతిలో మరణించడం -కనీసం సమీప గతంలో- ఎన్నడూ ఎరుగనిది. సంఘటిత నేరస్ధ ముఠాలు పధకం ప్రకారం పని చేస్తే తప్ప ఇలాంటి మరణాలు సాధ్యం కావు. అత్యున్నత స్ధాయిలో ఉన్న సాక్షులు,…

వ్యాపం: మోడి అవినీతి పాలనలో ఓ మైలు రాయి -1

తమది నీతిమంతమైన పాలన అంటూ ప్రధాని నరేంద్ర మోడి చెప్పుకునే గొప్పలను నిలువునా చీరేస్తూ బి.జె.పి ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. యు.పి.ఏ పాలనలో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసేందుకు మూడు నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంది. యు.పి.ఏ రికార్డును ఎన్.డి.ఏ-2 తిరగరాసింది. యు.పి.ఏ/కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని కుంభకోణాలే పెట్టుబడిగా అధికార లాభం సంపాదించిన ఎన్.డి.ఏ-2/బి.జె.పి సంవత్సరం తిరక్కుండానే తనకు, కాంగ్రెస్ కు ఎంతమాత్రం తేడా లేదని వేగంగా రుజువు చేసుకుంటోంది. కాంగ్రెస్ అవినీతిపై…

వ్యాపం దర్యాప్తు ముగుస్తోందిట! -కార్టూన్

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్: దర్యాప్తు ఇక ముగింపుకు వస్తోంది! ****************** ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’ అన్నది మధ్య ప్రదేశ్ లో వివిధ కోర్సులకు, ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో ఎం.పి.పి.ఇ.బి గా దీన్ని పిలుస్తారు. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ, టీచింగ్, పోలీస్ తదితర కోర్సులు, ఉద్యోగాల అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని. ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు…

వ్యాపం స్కాం విచారణ -ది హిందు ఎడిటోరియల్

[జులై 4 తేదీన ది హిందు పత్రిక ‘The Vyapam scam trail’ శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] మధ్య ప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం 2007 సంవత్సరం నాటిది. 2013లో కొన్ని వివరాలు వెలుగు చూసిన తర్వాతనే కుంభకోణంపై నేర పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (వ్యవసాయిక్ పరీక్షా మండల్ లేదా వ్యాపం) కు చెందిన అధికారులు వివిధ కోర్సులకు జరిగే అర్హత పరీక్షలను, ఉద్యోగాల నియామకాలను 6 సంవత్సరాలుగా…

‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్

చూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కార్టూన్ లో లోతైన అర్ధం దాగి ఉంది. ప్రధాన మంత్రి పదవి లాంటి ముళ్ళ కుర్చీని యోగాసనాల సహాయంతో నరేంద్ర మోడి అవలీలగా నిర్వహిస్తున్నారని ఈ కార్టూన్ చెబుతున్నట్లు మొదటి చూపులో అనిపిస్తుంది. కానీ ‘డెవిల్ ఇన్ ద డీటైల్స్’ అన్నట్లుగా కార్టూన్ అంతరార్ధం అంతా ఆ నాలుగు పదాల కార్టూన్ వ్యాఖ్యానంలో దాగి ఉంది. ఆ నాలుగు పదాల వ్యాఖ్య: THE YOGA OF POLITICS: ఏమిటి ఈ వ్యాఖ్య…

హవాలా స్కాంలో నేను రాజీనామా చేశా -అద్వానీ

బి.జె.పి పితామహుడు మనసులో మాట కక్కేశారు. లలిత్ మోడి అవినీతి కుంభకోణం నుండి బైటపడే మార్గం ఏమిటో తన పార్టీ నాయకులకు చూపారు. వివిధ అవినీతి మరియు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితర బి.జె.పి మంత్రులు తక్షణమే తొక్కవలసిన బాట ఏమిటో ఆయన స్పష్టంగా చూపారు. వీరందరికీ మార్గం చూపడం అంటే…

రాజే: అసెంబ్లీ క్లీన్ చిట్ అక్కరకు వచ్చేనా! -కార్టూన్

  ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది. లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి…

ట్విట్టరై వెళ్ళి కాకిలా తిరిగొచ్చింది -కార్టూన్

జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించాలని మోడి ప్రభుత్వం కోరడం వెనుక యోగాను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ఉద్దేశ్యం మాత్రమే ఉన్నదని ఆర్.ఎస్.ఎస్ మాజీ ప్రతినిధి (spoksperson), బి.జె.పి జనరల్ సెక్రటరీ ప్రచురించిన ట్వీట్ తో స్పష్టం అయింది. జూన్ 21 తేదీన రాజ్ పధ్ లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య అతిధిగా హాజరై యోగాసనాలు వేశారు. “ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హమీద్ అన్సారీ పాల్గొనకపోవడం వెనుక…

బి.జె.పి సొంత క్విడ్-ప్రో-కో యే లలిత్ గేట్! -2

మానవతా సాయం? అయితే ‘మానవతా సాయం’ వాదనలోని డొల్లతనం త్వరలోనే బైటపడింది. లలిత్ మోడీ ‘ఇన్ స్టా గ్రామ్’ అనే ఫోటో షేరింగ్ సోషల్ వెబ్ సైట్ లో అప్పటి తేదీలలో ప్రచురించిన ఫోటోలు లలిత్ మోడీ విందు, విలాసాలలో తేలియాడుతున్న సంగతినే వెల్లడించాయి తప్ప ఆయన భార్య కేన్సర్ చికిత్స పొందుతున్న సంగతిని చూచాయగా నైనా తెలియజేయలేదు. బ్రిటిష్ పాస్ పోర్ట్ జారీ అయ్యేలా సాయం చేసిన బ్రిటన్, ఇండియా రాజకీయ పెద్దలకు తాను ఎంత…