యూపి ఎన్నికలు : దళిత ఓట్లు  -కార్టూన్ 

2017లో  జరిగే  యూపి ఎన్నికలలో దళితుల ఓట్లు కీలకం అవనున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. దానితో దళితులను ప్రసన్నం చేసుకుని లబ్ది పొందడానికి వివిధ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. బిజెపి మామూలుగానే దళిత వ్యతిరేక  పార్టీ . రోహిత్ ఆత్మహత్య  దరిమిలా ఆ ముద్రను థ్రువపరుచుకుంది. జెఎన్యూలో కొందరు బ్రాహ్మణ వాద ప్రొఫెసర్లు తయారుచేసిన డొజియర్ లో  “యూనివర్సిటీలో జాతీయ వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ దళితులు, ముస్లింలే” అని పేర్కొన్న నేపథ్యంలో…

పనామా పేపర్స్: పుతిన్ ఎందుకు కేంద్రం అయ్యాడు? -2

(మొదటి భాగం తరువాత……….) అసలు ఐ‌సి‌ఐ‌జే ఎక్కడిది? సంవత్సరం క్రితం వరకూ దీనిని గురించి తలచుకున్నవారు లేరు. 1997లో స్థాపించినట్లు చెబుతున్న దీని మాతృ సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటీ (సి‌పి‌ఐ). సి‌పి‌ఐకి నిధులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మొత్తం విషయంలో సగం అర్ధం అయిపోతుంది. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) మాజీ రాయబారి క్రెయిగ్ ముర్రే తన వెబ్ సైట్ లో ఇలా తెలిపాడు. “మొస్సాక్ ఫన్సెకా సమాచారాన్ని వడ కట్టిన…

ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…

మృత జవాన్లకు సానుభూతికూడా ట్విట్టర్ తోనేనా?

“మహారాష్ట్ర, పులగావ్ వద్ద సెంట్రల్ ఆమ్యూనిషన్ డిపోలో మంటలకు ప్రాణాలు నష్టపోవడం బాధ కలిగిస్తోంది. నా ఆలోచనలు బాధితులతో ఉన్నాయి.” అని ఒక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆర్‌ఎం మనోహర పరికర్ ఘటనా స్ధలిని సందర్శించి పరిస్ధితిని సమీక్షించాలని కోరాను” అని మరో ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా కాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ప్రకటన వెలువడినట్లుగానీ, అందినట్లుగానీ ఏ పత్రికా…

ఆర్మీ మందుగుండు డిపోలో పేలుడు, 17గురు సైనికులు ఆహుతి

మహారాష్ట్రలో భారత రక్షణ బలగాల ఆయుధాలకు మందుగుండు సరఫరా చేసే అతి పెద్ద మందుగుండు డిపోలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంగా చెబుతున్న దుర్ఘటనలో 17 మంది సైనికులు దుర్మరణం చెందారని పత్రికలు తెలిపాయి. మరణాల సంఖ్య 20 కి పెరిగిందని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రధాన మంత్రి యధావిధిగా ‘ట్విట్టర్’ ద్వారా తన ఆందోళన ప్రకటించారు. తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని తెలిపారు. మృతులలో ఇద్దరు అధికారులు కాగా 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీ…

కోల్డ్ వార్ మనస్తత్వం వదలండి, అమెరికాతో చైనా

అమెరికా హెచ్చరికలకు చైనా ఘాటుగా బదులు ఇచ్చింది. రక్షణ కార్యదర్శి (మన రక్షణ మంత్రికి సమానం) ఎష్టన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలు కోల్డ్ వార్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోల్డ్ వార్ మెంటాలిటీ నుండి బైటికి వస్తే మంచిదని హెచ్చరించింది. అమెరికా మిలట్రీ అధికారులు డైరెక్ట్ చేసే హాలీవుడ్ కోల్డ్ వార్ సినిమాలో తాము ఎలాంటి పాత్ర పోషించబోమని అపహాస్యం చేసింది. “కార్టర్ వ్యాఖ్యలు అమెరికా స్టీరియోటైప్ ఆలోచనా విధానాన్ని, అమెరికా ఆధిపత్య భావనని నగ్నంగా ఆరబోశాయి” అని…

రష్యా సదస్సుకు ఈ‌యూ నేత, అమెరికా అభ్యంతరం!

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య లుకలుకలు మెల్లగానే అయినా పెరుగుతున్నాయి. రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రతి యేటా జరిగే “సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం” (SPIEF) సమావేశాలకు ఈ యేడు యూరోపియన్ కమిషన్ (ఈ‌సి) అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ హాజరు కానున్నాడు. ఆయన రష్యా వెళ్లడానికి అమెరికా అభ్యంతరం చెబుతోంది. ఒక పక్క రష్యాపై అమెరికా-ఈ‌యూల ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతుండగా రష్యా జరిపే ఆర్ధిక సదస్సుకు ఈ‌సి…

రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా

అమెరికా నేతృత్వం లోని మిలటరీ గూండా కూటమి నాటో (North Atantic Treaty Organisation) కు తమ దేశంలో మిసైల్ స్ధావరం కల్పించడంపై రష్యా నోరు విప్పింది. అనవసరంగా నాటో యుద్ధోన్మాదంలో బలి పశువు కావొద్దని హితవు పలికింది. అమెరికన్ యాంటీ మిసైల్ వ్యవస్ధను తమ దేశంలో నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడం తగదని, తమ రక్షణ కోసం అమెరికా మిసైల్ వ్యవస్ధపై చేసే దాడి రుమేనియాపై దాడిగా మారుతుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరురుపరుచుకునే…

మళ్ళీ రేప్: ఒకినావాలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు

జపాన్ దక్షిణ ద్వీప రాష్ట్రం ఒకినావాలో అమెరికా సైనికులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో అమెరికా సైనిక స్ధావరం సమీపంలో వాకింగ్ కి వెళ్ళిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆ మహిళను గొంతు పిసికి చంపేశారు. మే 26-27 తేదీలలో టోక్యోలో G7 దేశాల సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఈ దారుణానికి వ్యతిరేకంగా జపాన్ ప్రజలు ఆందోళనలను తీవ్రం చేశారు. ఒకినావా రాష్ట్రంలోను ఫుటెన్మా సైనిక స్ధావరాన్ని పూర్తిగా…

కోల్డ్ వార్ 2.0: కజకిస్తాన్ లో ప్రేరేపిత ఆందోళనలు

కోల్డ్ వార్ వర్షన్ 2.0 లో కజకిస్తాన్ ఒక భాగం అయింది. రష్యా పొరుగు దేశం కజకిస్తాన్ లో సో-కాల్డ్ ప్రజాందోళనలు చెలరేగడంతో రష్యా వ్యతిరేక కోల్డ్ వార్ లో మరో ఫ్రంట్ ను అమెరికా తెరిచినట్లయింది. సిరియాను అస్తవ్యస్తం కావించి రష్యాను సిరియా యుద్ధంలో కూరుకుపోయేలా చేయడానికి శత విధాలుగా ప్రయత్నించి విఫలం అయిన అమెరికా మరో దుస్సాహసానికి ఒడిగడుతోంది. మే 21 తేదీన కజకిస్తాన్ లో వివిధ నగరాలలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలలో…

గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…

పోలండ్ పాఠం: అమ్మ నాన్న, ఒక నాటో -కార్టూన్

నాటో అంటే తెలిసిందేగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్! దీనికి అమెరికా నేత. నాటో కూటమిలో పేరుకు 28 సభ్య దేశాలు ఉన్నా, అమెరికా ఒక్కటే ఒకటి (1). మిగిలిన 27 దేశాలన్నీ ఆ ఒకటి పక్క సున్నాలే. అంటే ఏ రష్యాతో యుద్ధం అంటూ వస్తే బాంబులు అవీ తీసుకుని అమెరికా రావాలే తప్ప ఇతర దేశాలు రష్యా ముందు నిలవలేవు.  1990ల ఆరంభంలో సోవియట్ రష్యా కూలిన తర్వాత రోజుల్లో అమెరికా, రష్యాల మధ్య…

రాష్ట్రాలకు కేంద్రం 81 వేల కోట్ల ఎగవేత!

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి‌ఏ‌జి) చేసిన పరిశోధనలో ఈ వాస్తవం వెల్లడి అయింది. ఈ పాపంలో కాంగ్రెస్, బి‌జే‌పిలు రెండూ భాగం పంచుకోగా కాంగ్రెస్ కంటే బి‌జే‌పి నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని సి‌ఏ‌జి గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1996-97, 1997-98, 2006-07, 2007-08, 2014-15 సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని కేంద్రం పంపిణీ చేసిందని సి‌ఏ‌జి…

ముగింపు: భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం -22

(21వ భాగం తరువాత………….) భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ మార్పులపై ఒక నోట్ – పార్ట్ 22 – చాప్టర్ VII – ఎక్కడ నిలబడి ఉన్నాం? భారత వ్యవసాయానికి సంబంధించి ఈ లక్షణాలను పరిశీలించిన దరిమిలా మనం ఎక్కడ నిలబడి ఉన్నట్లు? అంబికా ఘోష్ పేర్కొన్నట్లుగా “ఈ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పడ్డ స్ధూల ప్రభావం ఏమిటంటే రైతాంగ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావటం; భూస్వామ్య విధానం లేదా ధనిక రైతాంగ ఆర్ధిక…

మార్క్స్ ‘వర్తక పెట్టుబడి’ మన ‘వడ్డీ పెట్టుబడి’ -21

(20వ భాగం తరువాత…………..) భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానంపై ఒక నోట్ – పార్ట్ 21 – పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలలో అధిక వడ్డీ గురించి చర్చిస్తూ కారల్ మార్క్స్ ఇలా చెప్పారు: “తన బాధితుడి నుండి అదనపు శ్రమను పిండుకోవడంతో సంతృప్తి చెందని అధిక వడ్డీదారుడు (usurer) అతని శ్రమ పరిస్ధితులనూ, భూమి,ఇల్లు మొ.న సాధనాలనూ కూడా క్రమ క్రమంగా స్వాధీనం చేసుకుంటాడు. ఆ విధంగా అతనిని స్వాయత్తం చేసుకునే కృషిలో నిరంతరాయంగా నిమగ్నమై ఉంటాడు.…