ఇండియాలో అమెరికా పోస్టల్ సేవల సస్పెన్షన్

ఇండియా నుండి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా, ఆగస్టు 27 తేదీ నుండి 50% పైగా కస్టమ్స్ సుంకాలు అమెరికా ప్రకటించిన నేపధ్యంలో అమెరికాకు వెళ్ళే పోస్టల్ సేవలను భారత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తాత్కాలికం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సస్పెన్షన్ ఆగస్టు 25 తేదీ నుండి అనగా రేపు సోమవారం నుండి అమలు లోకి రానున్నట్లు ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. ఇప్పటి వరకు భారత సరుకులను అమెరికా తన కస్టమ్ సుంకాల నుండి…

బిజెపి గెలవటానికి ఇతర రాష్ట్రాల నుండి వోటర్లను తరలించాం -బిజెపి

బిజెపి గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందో ఆ పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడి చేశాడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కి చెందిన సురేశ్ గోపి (సినీ నటుడు) త్రిస్సూర్ నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. సురేశ్ గోపి ని గెలిపించటానికి తాము ఇతర రాష్ట్రాల నుండి ఓటర్లను త్రిస్సూరు పార్లమెంటు నియోజక వర్గానికి తరలించామని కేరళ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాల కృష్ణన్ వెల్లడి చేశాడు. తాము…

మర్రి చెట్టు నీడ నుండి రావి చెట్టు నీడ లోకి ఇండియా!

India NSA Ajit Doval with Russian President Vladimir Putin ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న సామెత అందరికీ తెలిసిందే. 1947 నుండి భారత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆయుధ సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన మరియు అభివృద్ధి, మిసైళ్ల సరఫరా మరియు అభివృద్ధి, ఆధునిక నౌకల సరఫరా మరియు అభివృద్ధి మొదలైన రంగాలలో మునుపటి సోవియట్ రష్యా, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ భారత దేశానికి…

చద్దన్నం తినటం వొంటికి ఆరోగ్యమేనా?

మన తండ్రులు తాతలు ఉదయాన్నే లేచి చద్దన్నం తినేవాళ్ళు. మన చేత కూడా తినిపించే వాళ్ళు. పట్టణాల్లో కాదు గానీ పల్లెల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో, పేద-మధ్య తరగతి రైతు కుటుంబాల్లో ఇది ఎక్కువగా జరిగేది. బహుశా పట్టణాల్లో ఫ్యాక్టరీల కార్మికుల కుటుంబాల్లో కూడా ఇది జరిగి ఉండవచ్చు. మా అమ్మ నాన్న ఇద్దరూ టీచర్స్. అయినా రాత్రి వండిన అన్నం మిగిలి పోతే ఉదయాన్నే మా చేత చద్దన్నం తినిపించే వాళ్ళు. ముఖ్యంగా వేసవి కాలం…

బీహార్ ఎస్.ఐ.ఆర్: అసలేం జరుగుతోంది?

బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా! బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను…

తొలగించిన ఓటర్ల జాబితా ఇచ్చే బాధ్యత మాది కాదు -ఇసిఐ

Special Intensive Revision in Bihar బీహార్ లో భారత ఎన్నికల కమిషన్ (లేదా భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దరిమిలా, కమిషన్, ఆగస్టు 1వ తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించింది. ఈ జాబితాలో గతంలో చోటు చేసుకున్న వోటర్లలో మొత్తం సుమారు 65 లక్షల మంది వోటర్లను తొలగించి మిగిలిన వారితో ముసాయిదాను కమిషన్ ప్రచురించింది. తొలగించిన 65 లక్షల మంది జాబితాను బూత్ ల వారీగా తమకు కూడా…

బీహార్ ఎస్ఐఆర్ చట్ట వ్యతిరేకం అని రుజువు చేస్తే, రద్దు చేసేస్తాం! -సుప్రీం కోర్టు

“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (ఎస్ఐఆర్) పేరుతో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగ రాసేందుకు తెగబడ్డ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ), సుప్రీం కోర్టులో అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్నది. బీహార్ ఎస్ఐఆర్ చట్ట విరుద్ధం అంటూ యోగేంద్ర యాదవ్ లాంటి స్వతంత్ర పరిశీలకులు, ఏడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) లాంటి ఎన్.జి.ఓ లు, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా లాంటి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా…

ఐఎంఎఫ్ నిర్దేశిత కఠిన ఆర్థిక సంస్కరణలు: అంగోలా ప్రజల నిరసనోద్యమం

ఆంగ్లం: విజయశేఖర్ అనువాదం: రమాసుందరి అంగోలా ఇటీవలి కాలంలో ఆర్థిక సంస్కరణలు, సామాజిక కలహాల కూడలిలో చిక్కుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సూచనలతో మొదలైన కఠిన ఆర్థిక (పొదుపు) సంస్కరణల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదరికంతో అలమటిస్తున్న ప్రజలు తమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం మీద ప్రభుత్వం ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించటం అత్యంత విషాదానికి దారితీసింది. 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తదుపరి…

యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించదు?

———-రచన: డాక్టర్ దేవరాజు మహారాజు (ప్రముఖ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త) కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. వడ్లు దంచడం, పిండి విసరడం వంటివన్నీ శారీరక శ్రమలే! అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి. ప్రత్యేకంగా వ్యాయామం చేయడం…

ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!

ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి? ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు…

పహల్గామ్ దాడి గురించి ప్రధానికి ముందే తెలుసు! -ఖార్గే సంచలనం

పహల్గామ్ టెర్రరిస్టు దాడి, అనంతరం ఇండియా – పాకిస్థాన్ దేశాల 4 రోజుల యుద్ధం అంశాలపై పార్లమెంటులో రెండు రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ప్రశ్నలతో నిలదీస్తుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే ప్రధాన మంత్రి మోడి పైన విరుచుకు పడ్డారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడి తదనంతరం జరిగిన నాలుగు రోజుల…

యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం

ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025 ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన                                       పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని…

యుద్ధం – వాణిజ్యం: బట్టబయలైన మోడి, ఆయన వంధిమాగధుల దళారి స్వభావం

————-ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి: తేదీ: 03-06-2025 ఆర్టికల్ 370ని రద్దు చేయటం వలన కశ్మీరీ లోయలో శాంతి పునః స్థాపన జరిగిందనీ, ఉగ్రవాదం సమూలంగా నాశనం అయిందనీ, కశ్మీరీలలో అసంతృప్తి తగ్గిపోతోందని -మోడీ, అతని పరివారాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కథ మాత్రం వేరుగా ఉంది. కశ్మీర్ లో పర్యాటకులు సేద తీరే పట్టణం పహల్గామ్ లో జరిగిన ఒకానొక దిగ్బ్రాంతికర సంఘటనలో నలుగురు ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండా…

విమానం తోలటానికి నువ్వు పనికి రావు, వెళ్లి చెప్పులు కుట్టుకో ఫో!

చాతుర్వర్ణాల హైందవ నాగు భారత దేశ సామాజిక వ్యవస్థను తన విష కౌగిలిలో బంధించి ఉంచడం కొనసాగుతున్నదన్న సంగతిని దేశంలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న ఘటనలు చాచి కొట్టినట్లు చెబుతూనే ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన 35 యేళ్ల వ్యక్తి పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ డ్యూటీలో చేరేందుకు గురుగ్రాంలో ఉన్న కార్పొరేట్ ఆఫీసుకి వెళ్ళడం తోనే మరే ఇతర కొత్త పైలట్ కు ఎదురు కాని కష్టాలు మొదలయ్యాయి.…

ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!

Deportees entering the U.S. military plane అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత…