
ఒక్క ఆగస్టు 17, 18 తేదీలలో మాత్రమే ఎన్.డి.టి.వి అనే ఒక వార్తా పత్రిక దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లపై జరిగిన ఆరు అత్యాచారాల గురించి రిపోర్ట్ చేసింది.
- బెంగుళూరులో పార్టీ నుండి తిరిగి వస్తూ తనకు లిఫ్ట్ ఇచ్చిన మృగాడి చేత అత్యాచారానికి గురైన విద్యార్ధిని.
- డెహ్రాడూన్ లో ప్రభుత్వ బస్సు లోనే ఒక పంజాబీ అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. రోడ్ వేస్ సిబ్బంది అరెస్టు.
- యుపిలో ఒక మృగాడు మతి స్థిమితం లేని మహిళను అన్నం పెడతానని పిలిచి అత్యాచారం: పోలీసులు
- యూపీలో స్కూల్ బాలిక (14), టీచర్ చేత అత్యాచారానికి గురై కొన్ని నెలలుగా వైద్యం చేయించుకుంటూ ఈ రోజు మృతి
- టీనేజి కూతురిపై సంవత్సరానికి పైగా అత్యాచారం చేస్తున్న తండ్రి అరెస్టు -యుపి పోలీసులు
- మధ్య ప్రదేశ్ లో 69 యేళ్ళ వ్యక్తి టీనేజి అమ్మాయిపై అత్యాచారం, అరెస్టు
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ పరిపాలిస్తుంటే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను బిజెపి పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ప్రభుత్వ వైఫల్యం గురించి బిజెపి నేతలు విమర్శిస్తున్నారు, ఆడ పిల్లల రక్షణ గురించి ఆందోళన ప్రకటిస్తున్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపి ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శిస్తున్నారు, ఆడ పిల్లల రక్షణ గురించి ఆందోళన ప్రకటిస్తున్నారు.

ఏ పార్టీ నిజంగా ఆడ పిల్లలు, మహిళల రక్షణ కోసం కట్టుబడి ఉన్నట్లు? ఏ పార్టీ నేతలు నిజంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వాల వైఫల్యాల పట్ల ఆందోళనగా ఉన్నట్లు? ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారైతే ఆడ పిల్లలు, మహిళల రక్షణ గురించి మాట్లాడినా సందర్భాలు లేవు లేదా అతి తక్కువ.
